Political News

ప్ర‌తిప‌క్షంలోనూ భ‌య‌పెడుతోన్న జ‌గ‌న్‌..

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు.. జగన్ ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు చాలామందిని భయపెట్టాయి. అందుకే మొన్నటి ఎన్నికలలో వైసీపీ అంత దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబు ఇచ్చిన హామీల కంటే జగన్ పాలన వద్దు అనుకుని ఓట్లు వేసిన వాళ్లే ఎక్కువమంది ఉన్నారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా వైసిపి అదే మోడల్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత …

Read More »

జ‌గ‌న్ త‌ప్పు చేశారు: ఎస్పీ

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంట‌పాళ్ల‌లో ఈ నెల 18న ప‌ర్య‌టించిన స‌మ‌యంలో మాజీ సీఎం జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని గుంటూరు ఎస్పీ స‌తీష్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రం 10 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆనాడు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో మృతి చెందిన సింగ‌మ‌య్య వ్య‌వ‌హారాన్ని వివ‌రించారు. తొలుత తాము జ‌గ‌న్ కాన్వాయ్ ఢీ కొన‌లేద‌ని భావించామ‌ని.. ప్రైవేటు వాహ‌నం ఒక‌టి ఢీ …

Read More »

సర్కారీ హైస్కూల్లోనూ ‘అడ్మిషన్స్ క్లోజ్డ్’ బోర్డు

ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంతకంతకూ బలోపేతం అవుతోంది. నాణ్యమైన విద్యతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలకు దీటుగా సర్కారీ విద్యాలయాలను కూటమి సర్కారు ఎంతో అభివృద్ధి చేస్తోంది. ఫలితంగా ఏడాది వ్యవధిలోనే ఏపీలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పాలి. మొన్నటికి మొన్న టెక్కలి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ‘నో మోర్ సీట్స్’ అని బోర్డు పెడితే… ఇప్పుడు నెల్లూరులోని ప్రభుత్వ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో కూడా ‘అడ్మిషన్స్ క్లోజ్డ్’ అనే బోర్డు …

Read More »

‘ఉచిత’మే అయినా.. మ‌న‌సు పెడుతున్నారుగా!

ఉచితంగా ఇచ్చే పథకాలకు సంబంధించి ప్రభుత్వాలు పెద్దగా మనసు పెట్టవు. ఉదాహరణకు రేషన్ బియ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు. ఎలాంటి నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం, వాటి తూకం ఎలా ఉంది అనేవి కూడా ప్రత్యేకంగా పట్టించుకోవు. కానీ మారుతున్న ప్రజల ఆలోచనలు, మారుతున్న ప్రజల అంచనాలు ప్రభుత్వాలను చైతన్య దిశగా నడిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉచితంగా ఇచ్చే పథకాలకు కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి …

Read More »

మోడీ-లోకేష్… పెరుగుతున్న బాండింగ్ ..!

మంత్రి నారా లోకేష్- ప్రధానమంత్రి నరేంద్ర మోడీల మధ్య బాండింగ్ మరింత పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కొన్నాళ్ల కిందట అమరావతిలో జరిగిన పున ప్రారంభ పనుల ఘట్టంలోనూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నారా లోకేష్ ను కొనియాడారు. ఒకసారి తన వద్దకు రావాలని ఆతిధ్యం స్వీకరించాలని కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత నారా లోకేష్ కుటుంబంతో సహా …

Read More »

సింగయ్య హత్య కేసులో జగన్ పై కేసు

వైసీపీ అధినేత జగన్ పై మరో కేసు నమోదు అయ్యింది. మొన్నటి జగన్ రెంటపాళ్ల పర్యటనలో భాగంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఏటుకూరు బైపాస్ వద్ద చనిపోయిన సింగయ్య.. సాక్షాత్తు జగన్ వాహనం కింద పడి నగిలిపోయినట్లుగా తాజాగా వీడియోలు విడుదలయ్యాయి. జగన్ ఓ వైపు పార్టీ శ్రేణులకు అబివాదం చేస్తుంటే…అదే సమయంలో సింగయ్య ఆయన కారు కిందే నలిగిపోయారు. ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయిన …

Read More »

ఆర్.కృష్ణయ్యతో కవిత భేటీ… మ్యాటరేంటి?

తెలంగాణ రాజకీయాల్లో సెలవు దినం ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమతి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న ఆర్.కృష్ణయ్య ఇంటికి వెళ్లారు. విద్యానగర్ లోని కృష్ణయ్య ఇంటికి నేరుగా వెళ్లిన కవిత ఆయనతో గంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చినట్లుగా సమాచారం. …

Read More »

పవన్ ఫ్లైట్ లో టెక్నికల్ ప్రాబ్లెమ్!

అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన దగ్గర నుంచి అసలు విమాన ప్రయాణాలంటేనే జనం హడలెత్తిపోతున్నారు. అయితే బిజినెస్ మెన్, పొలిటీషియన్లు, ఇతరత్రా అత్యవసర పనులు ఉన్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలను ఎంచుకోక తప్పడం లేదు. అయినా కూడా వారిలో ఎక్కడో భయం బిక్కుబిక్కుమంటూనే ఉంది. తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రయాణించిన విమానం లోనూ సాంకేతిక …

Read More »

సింగయ్యను తొక్కి చంపింది జగన్ కారే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నటి రెంటపాళ్ల పర్యటనలో వైసీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో సింగయ్య అనే వ్యక్తి జగన్ కాన్వాయ్ లోని వాహనం కింద పడి నలిగాడని నాడు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు ప్రకటించారు. తాజాగా సింగయ్య మృతికి సంబంధించిన అసలు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు …

Read More »

పాక్‌పై ట్రంప్ ప్రేమ.. తెరవెనక స్టోరీ ఇదా!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల పాకిస్తాన్‌పై ప్రేమ ప్రవచనాలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ లంచ్‌కి పిలిచాడని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ గంతులేసుకుంటూ వెళ్ళాడు. ట్రంప్ మునీర్‌ను లంచ్‌కి పిలవడానికి… పాకిస్తాన్‌పై ప్రేమ ప్రవచనాలు కురిపించడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడికి సిద్ధమవుతోంది. పాకిస్తాన్–ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా ఇరాన్‌కు పాకిస్తాన్ సరిహద్దు దేశం కూడా..! తాము ఇరాన్‌పై దాడి …

Read More »

టీడీపీలోకి గుంటూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌?

లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీలు వేరు అయిన వరుసగా రెండుసార్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎంపీగా గెలిచిన నాయకుడు. విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య వారసుడిగా రాజకీయాలలోకి వచ్చిన శ్రీకృష్ణదేవరాయులు 2019లో తొలిసారి వైసీపీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపి కండువా కప్పుకున్న …

Read More »

యొగా చేయకుంటే వైజాగ్ రావద్దన్నారు బాబు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖ వేదికగా జరిగిన యోగా డేలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 3 లక్షల మందికి పైగా జనంతో యోగాసనాలు వేయించిన ఏపీ సర్కారు అత్యధిక జనంతో యోగాసనాలు వేయించిన విషయంలో గిన్నిస్ రికార్డు సాదించింది. ఇక యోగా అంటే అప్పటిదాకా ఎంతమాత్రం అలవాటు గానీ, ప్రాక్టీస్ గానీ లేని భారీకాయులు కూడా ఉత్సాహంగా తమ మేనిని వంచి మరీ యోగాసనాలు వేశారు. …

Read More »