Political News

ఆ పాకిస్థాన్ ఫ్యామిలీకి సుప్రీంకోర్టులో ఊరట

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు ముగిసిన వీసాలపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యుల అహ్మద్ తారిక్ భట్ కుటుంబానికి శుక్రవారం సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. వీసా గడువు ముగిసినా వారు ఇంకా భారత్‌లో ఉన్నారని కేంద్రం తెలిపిన నేపథ్యంలో, ఈ కుటుంబం అరెస్ట్‌కు గురికావాల్సిన పరిస్థితి …

Read More »

అమ‌రావ‌తిలో మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 18 కీల‌క ప్రాజెక్టుల‌కు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. వీటిలో అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులు స‌హా.. ఏపీలో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే ప్రాజ‌క్టులు కూడా ఉన్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధానిలో 58 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుట్టారు. 7 జాతీయ ర‌హ‌దారుల‌కు సంబంధించిన ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేశారు(ఇవి ఏపీని ఇత‌ర …

Read More »

వైసీపీ లిక్క‌ర్ స్కాం.. వారికి బెయిల్ ఇవ్వ‌లేం: హైకోర్టు

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో దాదాపు 3500 కోట్ల రూపాయ‌ల మేర‌కు మేసేశార‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. విచార‌ణ చేయిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే రాజ్ క‌సిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయ‌డం.. విచార‌ణ సాగిస్తుండ‌డం తెలిసిందే. ఇక‌, తాజాగా.. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, జ‌గ‌న్ స‌తీమ‌ణి …

Read More »

నేను చంద్ర‌బాబును చూసి నేర్చుకున్నాను: మోడీ

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి. ఇది దేవేంద్రుడి రాజ‌ధాని న‌గ‌రం పేరు. దీనిని రాజ‌ధానిగా పెట్టుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. మ‌రింత అభివృద్దిని సాధించాలి. ఈ రాజ‌ధానిని మ‌నమే పూర్తి చేయాలి. ప‌వ‌న్ క‌ల్యాణ్, చంద్ర‌బాబు.. దీనిని మ‌న‌మే పూర్తి చేయాలి అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప‌దే ప‌దే నొక్కి చెప్పారు. రాజ‌ధాని పనుల పున‌ర్నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాని.. అనంత‌రం స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. దాదాపు 60 వేల కోట్ల …

Read More »

మ‌ళ్లీ సైకిలేసుకుని వ‌చ్చేసిన ఎంపీ!

పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఎన్నికైన త‌ర్వాత‌.. నాయ‌కుల్లో మార్పు వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ఎంపీ గా ఉండే ద‌ర్పం, అధికారం వంటివి స‌హ‌జంగానే నాయ‌కుల‌ను పెద్ద‌ల‌ను చేస్తాయి. దీంతోవారిలో చాలా మార్పు వ‌చ్చేస్తుంది. కానీ..ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌న్న సూత్రంతో ముందుకు సాగుతున్నా రు.. టీడీపీకి చెందిన ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం న‌గ‌రం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న అప్ప‌ల‌నాయుడు.. త‌న …

Read More »

రీస్టార్ట్ కాదు..అమరావతి స్టార్ట్ చేసేదీ మోదీనే: చంద్రబాబు

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని, అమరావతి రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ మళ్లీ వస్తారని చంద్రబాబు అన్నారు. అమరావతి మా రాజధాని అని అందరూ గర్వంగా చెప్పుకునేలా నిర్మిస్తామని చెప్పారు. అమరలింగేశ్వర స్వామి ఆలయం …

Read More »

ధర్మయుద్ధంలో అమరావతి రైతులదే విజయం: పవన్ కల్యాణ్

ఐధేళ్ల పాటు యుద్ధం కొనసాగితే… ధర్మం పక్షాన నిలిచి అలుపెరగని పోరాటం చేసిన అమరావతి రైతులను విజయం వరించిందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభా వేదిక మీద ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఆసీనులై ఉన్న వేదిక మీద పనవ్ కల్యాణ్ తనదైన శైలి ప్రసంగం చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన మోదీనో, లేదంటే.. తనకంటే …

Read More »

మోదీని మంత్రముగ్ధుడిని చేసిన లోకేశ్ స్పీచ్

అమరావతి పునర్నిర్మాణ వేదిక మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ అదిరిపోయే ప్రసంగం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముగ్గురు కేంద్ర మంత్రులు, మరో ముగ్గురు రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఆసీనులు అయిన వేదిక మీద నుంచి లోకేశ్ కీలక ప్రసంగం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నమోగా అభివర్ణించిన …

Read More »

జగన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే!

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అంగరంగ వైభవంగా, ఓ వేడుకలా, ఓ పండుగలా జరుగుతున్న ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న జగన్ ఓ మంచి అవకాశాన్ని తన చేజేతులారా మిస్ చేసుకున్నారనే చెప్పాలి. అమరావతిలో కన్నులపండువగా జరుగుతున్న ఈ వేడుకకు హాజరు కావాలంటూ కూటమి సర్కారు స్వయంగా ఆహ్వానించినా జగన్ ఆ ఆహ్వానాన్ని మన్నించలేదు. శుక్రవారం జరుగుతున్న …

Read More »

చింత‌మ‌నేనా.. మ‌జాకా.. 100 బ‌స్సులు.. వెయ్యి బైకులతో అమ‌రావ‌తికి!

ఏంచేసినా త‌న‌కంటూ స్పెష‌ల్‌గా ఉండే.. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. తాజాగా ఏపీ రాజధాని అమ‌రావ‌తి ప‌నుల పునః ప్రారంభ ఘ‌ట్టానికి కూడా త‌న‌దైన శైలిలో స్పందించారు. ఒక్క ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచే 100 బ‌స్సుల‌ను అమరావ‌తికి త‌ర‌లించారు. అదేవిధంగా యువ‌త ముందుకు రావ‌డంతో దాదాపు వెయ్యికి పైగా బైకుల‌ను కూడా..అమ‌రావ‌తికి పంపించారు. బ‌స్సుల్లో ఒక్కొక్క బ‌స్సుకు 30 మంది చొప్పున 3 …

Read More »

అమరావతి పండుగ!… అన్ని దారులూ అటువైపే!

ఏపీకి శుక్రవారం నిజంగా ఓ పండుగే. రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను పున:ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం అమరావతి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఏపీలోని కూటమి సర్కారు మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అమరావతి రాజధాని కళ ఉట్టిపడేలా ఏర్పాట్లను కూడా ఘనంగా చేసింది. మునుపెన్నడూ లేనంత అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల …

Read More »

‘అమరావతి రీస్టార్ట్’ కు మోదీ అదిరేటి గిఫ్ట్!

ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగవైభవంగా జరగనుంది. ఏపీ ప్రజలు పండుగలా భావిస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్న మోదీ… తాను అమరావతిలో అడుగుపెట్టడానికి ఓ రోజు ముందుగానే అమరావతి రిస్టార్ట్ కు ఇదో చిన్న గిఫ్ట్ అంటూ కేంద్రం నుంచి ఓ కీలక ప్రకటనను చేయించారు. అమరావతి చుట్టూరా ఏర్పాటు కానున్న అవుటర్ రింగ్ రోడ్డును గతంలో ప్రకటించినట్లుగా …

Read More »