వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైనా సమావేశంలో పాల్గొన్నారంటే.. అందులో వైరివర్గాలపై తనదైన శైలి ఆరోపణలు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని సజ్జల ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల చేసిన ప్రసంగాన్ని వింటూ ఉంటే… నిజంగానే కేసులు ఇలాంటి కారణాలతో కూడా పెడతారా? అంటూ నవ్వుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాస్తవ …
Read More »జగన్…. రెడ్డి మంత్రం ..!
రెడ్డి సామాజిక వర్గాన్ని సమీకరించడంలో వైసిపి తర్జనభర్జన పడుతోందన్న మాట వినిపిస్తోంది. నిజానికి కులం లేదు మతం లేదు అని చెప్పుకున్న జనసేనలో సామాజిక వర్గాల సమీకరణ బాగుంటే.. రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీలో ఇప్పుడు వారే దూరంగా ఉన్నారు. వాస్తవానికి పైకి జనసేన మతం లేదు కులం లేదు అని చెప్పుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కాపుల్లో నెలకొన్న బలమైన సింపతీని ఒడిసి పట్టుకుని గత ఎన్నికల్లో క్షేత్రస్థాయి రాజకీయాలను సామాజిక …
Read More »“వైసీపీ పిల్ల కాల్వ.. ఏనాటికైనా..”
వైసీపీని పిల్ల కాల్వతో పోలుస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్లో ఆ పార్టీ కూడా కలుస్తుందని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన పార్టీ కార్యక్రమం లో షర్మిల మాట్లాడారు. “కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. అనేక పిల్లకాల్వలు.. ఈ సముద్రంలో కలిసిపోవాల్సిందే. వైసీపీ కూడా అలాంటిదే. ఏదో ఒకరోజు ఆ పార్టీ కూడా కాంగ్రెస్లో కలిసి పోవాల్సిందే” …
Read More »వార్నింగుల బాబు… సీబీఎన్లో కొత్త కోణం!
ఏపీ సీఎం చంద్రబాబులో కొత్త కోణం కనిపిస్తోందా? వార్నింగుల బాబుగా సీబీఎన్ మారుతున్నారా? అంటే.. వరుసగా ఆయన విరుచుకుపడుతున్న తీరు.. ఇస్తున్న వార్నింగులు.. చూస్తున్నవారు ఔననే అంటున్నారు. గురువారం, శుక్రవారం రెండు రోజులు కూడా సీఎం చంద్రబాబు నోటి నుంచి వార్నింగులే వచ్చాయి. గురువారం అంతర్జాతీయ డ్రగ్స్ నిరోధక దినోత్సవం కావడంతో గంజాయి ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు, విక్రయదారులకు కూడా చంద్రబాబు గట్టివార్నింగే ఇచ్చారు. అంతేకాదు.. గంజాయి బ్యాచ్కు మద్దతు పలుకుతున్న …
Read More »కూటమి మాదిరే విశాఖ ఉక్కు!.. ఫుల్ స్వింగ్ లోకి!
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఇక మళ్లీ వైసీపీనే వస్తోందని ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు ఊదరగొట్టారు. అదే సమయంలో మూడు పార్టీలు కలిసి కట్ట కట్టుకుని వచ్చాయని అయినా ఫలితం ఉండబోదని కూడా పరాచికాలు ఆడాయి. ఈ లెక్కన వైసీపీ దృష్టిలో కూటమి దయనీయ స్థితిలో ఉన్నట్టే. అదే సమయంలో ఆంధ్రుల హక్కుగా పరిగణిస్తున్న విశాఖ ఉక్కు పరిస్థితి కూడా అదే …
Read More »గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం.. మ్యాటరేంటి?
వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని హఠాత్తుగా శుక్రవారం తన సొంతూరు గుడివాడలో ప్రత్యక్షం అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు గుడివాడ ముఖమే చూడని నాని… హైదరాబాద్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసి అప్పుడే ఏడాది అయిపోయింది. అంటే.. నాని ఏడాది తర్వాత తన సొంతూరులో అడుగుపెట్టారన్న మాట. సరే… సొంతూరు అన్న తర్వాత …
Read More »సాయిరెడ్డి సీటు ఖాళీగానే ఉంచారే.. విషయం ఏంటో ..!
విజయసాయి రెడ్డి. వైసీపీ కీలక నాయకుడు.అయితే.. ఇప్పుడు ఆయన లేని లోటు వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అన్ని తానే వ్యవహరించి, పార్టీని ముందుకు నడిపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా వైసిపి వ్యవహారాలను భుజాన వేసుకుని చక్కదిద్దారు. జగన్ తర్వాత వైసీపీలో ఒకప్పుడు విజయసాయి రెడ్డి పేరు బాగా వినిపించేది. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ 2014 -19 …
Read More »వారివ్వకపోతే.. మనమే ఇద్దాం: రేవంత్ రెడ్డి
తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందే వచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లు వ్యవహారం.. ఎటూ తేలకపోవడం, పార్టీ నాయకులు, కార్యకర్తలు దీనిపై ఎక్కువగా ఆశలు పెట్టుకోవడంతో దీనిపై ఏం చేయాలన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకోలేక పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయించిన కుల గణనలో రాష్ట్రంలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారని తేలింది. దీంతో వారికి ప్రాధాన్యం పెంచుతూ.. బీసీలకు 42 శాతం …
Read More »నిజమా?.. సీతక్కకు మావోల వార్నింగ్ లెటరా?
తెలంగాణ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ధనసిరి అనసూయా అలియాస్ సీతక్కకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. నిషేధిత మావోయిస్టుల నుంచి ఆమెకు బెదిరింపుల లేఖ వచ్చిందని, అందులో ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ముందుకు సాగితే తగిన మూల్యం చెల్లించక తప్పదని మావోలు సీతక్కను హెచ్చరించారట. ఈ విషయాన్ని సీతక్క కూడా ధృవీకరించారు. తనకు మావోయిస్టుల నుంచి లేఖ వచ్చిన మాట వాస్తవమేనని చెప్పిన …
Read More »ఫోన్ ట్యాపింగ్ విచారణలో ఏబీఎన్ రాధాకృష్ణ ఎం చెప్పారు?
తెలంగాణలో పెను కలకలమే రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఇలా బయటకు వస్తున్న విషయాలను చూస్తుంటే… సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని కూడా నిందితులు వదలలేదని చెప్పక తప్పదు. తాజాగా శుక్రవారం వెలుగు చూసిన అంశంలో మీడియా సంస్థల అధినేతలను కూడా నిందితులు వదలలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రముఖ మీడియా సంస్థగా కొనసాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ …
Read More »జగన్ పై ఇంకా సింపతీ రాలేదు
వైసిపి అధినేత జగన్ చేపట్టిన రెండు కార్యక్రమాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇవి రెండూ ఈ నెలలోనే జరగడం, రెండు ఘటనల్లోనూ పోలీసులు స్పందించిన తీరు వంటివి చర్చకు దారి తీశాయి. ఈ నేపద్యంలో సింపతి వస్తోందని, ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నారని వైసీపీ చెబుతుంటే, ప్రభుత్వం మాత్రం ఇది సింపతి కాదు, ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారంగా భావిస్తోంది. ఈ క్రమంలో ఈ రెండు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్న …
Read More »అన్నింటా పెట్టుబడులే.. ఏపీపై మొగ్గెందుకు?
ఏపీలో పెట్టుబడుల వరద ప్రవహిస్తోంది. ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా.. దాదాపు అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలే కాకుండా.. ఐటీ రంగ దిగ్గజ కంపెనీలు కూడా వస్తున్నాయి. 500 కోట్ల నుంచి వేల కోట్ల వరకు కూడా కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయి. ప్రభుత్వం కోరుతున్న కంపెనీలే కాకుండా.. కూటమి పాలనను చూసి.. పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని గమనించి చాలా కంపెనీలు ఏపీపై మక్కువ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates