ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా నిజామాబాద్ లో ఇందూరు గిరిజన కళాశాల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే, ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాన్ని వెల్లడిస్తున్నానని అన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి ఎక్కువ స్థానాలు గెలిచిన ఆ తర్వాత కేసీఆర్ తనని కలిశారని మోడీ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఎన్డీఏలో చేరతానని కేసీఆర్ …
Read More »పవన్ కు అస్వస్థత..పెడన సభ వాయిదా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగులు, బధిరులను చూసి పవన్ కంటతడి పెట్టారు. జనసేన-టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్న సమయంలో తీవ్ర వెన్ను నొప్పికి గురయ్యారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో జనవాణి కార్యక్రమాన్ని …
Read More »అంగళ్లు కేసులో టీడీపీకి ఊరట
అంగళ్లు అల్లర్ల కేసులో సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు…హైకోర్టు తీర్పును సమర్థించింది. ఆ బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమని, హైకోర్టు తీర్పును కొనసాగించాలని తేల్చి చెప్పింది. అయితే, ఈ కేసులో ఒక పోలీసు అధికారి గాయపడ్డారని …
Read More »సుప్రీం కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తీవ్ర ఉత్కంఠ నడుమ ఈ కేసును ఈ రోజు విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, అనూహ్యంగా ఈ రోజు కూడా చంద్రబాబుకు సుప్రీంలో చుక్కెదురైంది. ఆ పిటిషన్ విచారణను సోమవారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన …
Read More »పవన్ బీజేపీకి గుడ్ బై చెప్పేసినట్లేనా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రకటన చూసిన తర్వాత అందరికీ ఈ విషయం అర్ధమైపోయింది. కృష్ణా జిల్లాలో మొదలైన నాలుగో విడత వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ రాబోయే తెలంగాణా ఎన్నికల్లో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. తెలంగాణా ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఒంటరిగానే జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించటంలో అర్ధమేంటి ? అనే చర్చ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే ఏపీలో బీజేపీతో …
Read More »ఎంఐఎం అడ్డాపై కాంగ్రెస్ కన్ను ?
చాలా సంవత్సరాలుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓల్డ్ సిటిపై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదిలేసుకున్నది. అప్పుడెప్పుడో ఓల్డ్ సిటీ లోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎప్పుడైతే ఎంఐఎం బాగా పుంజుకున్నదో అప్పటినుండే కాంగ్రెస్ కు డౌన్ ఫాల్ మొదలైంది. సుమారుగా నాలుగు ఎన్నికలుగా ఓల్డ్ సిటి అన్నది ఎంఐఎం పార్టీ అడ్డాగా మారిపోయింది. ఇలాంటి ఓల్డ్ సిటిలోని ఏడు నియోజకవర్గాల్లో పోయిన ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ …
Read More »తెలంగాణలో జనసేన ప్రభావం ఎంత ?
తెలంగాణా ఎన్నికల్లో 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీచేయాలనే విషయాన్ని ఐదురోజుల క్రితమే డిసైడ్ అయ్యింది. పార్టీ పోటీచేయబోయే నియోజకవర్గాలను పార్టీ తెలంగాణా ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తెలంగాణా ఇన్చార్జి శంకరగౌడ్ మీడియాలో ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నియోజకవర్గాలను వీళ్ళు ప్రకటించారు కానీ జనాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది అసలైన పాయింట్. ఎందుకంటే తెలంగాణా జనసేన …
Read More »వైసీపీలో నలుగురు ఖాయమయ్యారు
అధికారం దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపిక విషయంలో సీరియస్ దృష్టిపెట్టాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒకపుడు రాష్ట్రంలో పర్యటించటంతో పాటు నియోజకవర్గాల సమీక్షలు చేస్తు కొందరు అభ్యర్ధులను ఫైనల్ చేశారు. గడచిన 24 రోజులుగా ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇదే సమయంలో వైసీపీలో క్యాండిడేట్లను ఫైనల్ చేసే ప్రక్రియ మొదలైంది. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాయలసీమ జిల్లాల పర్యటన …
Read More »పవన్తో టీడీపీ నేతలు.. వాట్ ఏ కాంబినేషన్
2019 ఎన్నికలలో ఏపీలో ఎవరి దారిన వారు సాగిపోయారు. జనసేన, టీడీపీ వేర్వేరుగా పోటీ చేశాయి. ఆ దెబ్బకు వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కానీ, నాలుగేళ్లు తిరిగేసరికి మొత్తం మారిపోయింది. పాలక వైసీపీ విపరీతమైన వ్యతిరేకత మూటగట్టుకుంది. విపక్ష నేత చంద్రబాబును జైల్లో పెట్టి మరింత అపఖ్యాతి పాలైంది. పొత్తుల్లేకుండా కేవలం సానుకూల వైఖరితో మాత్రమే ఉన్న జనసేన, టీడీపీ అధినేతలకు రాజకీయ సంబంధాలు అంటగట్టి చివరికి …
Read More »ఐసీయూలో వైసీపీ: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లో పాలక వైసీపీ అత్యంత క్లిష్ట దశలో ఉంది… ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఐసీయూలో ఉంది.. ఇదీ లేటెస్ట్ పరిస్థితి. ఆ సంగతి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో జనానికి క్లియర్గా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ ఎలాంటివాడో కూడా చెప్పారు. జగన్ రక్తం రుచి మరిగిన నాయకుడని, ఆ రక్తం పేరు రాజ్యాధికారమని పవన్ అన్నారు. జగన్, వైసీపీ ఎన్ని కుయుక్తులు …
Read More »కేసీఆర్ బ్రహ్మస్త్రం .. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్
తెల్లవారితే… రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండి, లక్షలాది ఓట్లను ప్రభావితం చేసే పే రివిజన్ కమిషన్ పై గుడ్ న్యూస్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం నూతన వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నివేదిక వచ్చే వరకు 5 శాతం ‘మధ్యంతర …
Read More »బ్రేకింగ్ః మైనంపల్లి ఎఫెక్ట్తో నందికంటి రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా రోజు రోజుకు రసకందాయంలో పడుతోంది. మల్కాజ్గిరి సిటింగ్ ఎమ్మెల్యే, ఇటీవలే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు కారణంగా మరో ముఖ్యనేత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మొదటి నుంచి మైనంపల్లి చేరికను వ్యతిరేకిస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఈరోజు తన అనుచరులతో సమావేశం తర్వాత …
Read More »