Political News

అమ‌రావ‌తి మ‌రింత దూకుడు.. ప్ర‌తి ప‌నికీ ప‌క్కా లెక్క‌..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులు మ‌రింత దూకుడుగా ముందుకు సాగ‌నున్నాయా? వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌ను సైతం త‌ట్టుకునే టెక్నాల‌జీతో ప‌నులు చేయాల‌ని భావిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. నిజానికి చిన్న‌పాటి వ‌ర్షానికే ప‌నులు ఆగిపోయే ప‌రిస్థితి ఉంది. ఇది ఎక్క‌డైనా స‌హ‌జ‌మే. పైగా.. అమ‌రావతి విష‌యంల అయితే మ‌రింత ఎక్కువ‌గా ఇబ్బందులు వ‌స్తున్నాయి. ప‌క్క‌నే కృష్ణాన‌ది ప్ర‌వ‌హిస్తుండడంతో నీటి ఊట‌లు పెరిగి.. ప‌ది అడుగుల‌కే నీరు చిమ్ముతోంది. దీంతో గ‌తంలో …

Read More »

ఓట్ చోరీపై రాహుల్ ప్ర‌భంజ‌నం.. మ‌రింత దూకుడు!

‘ఓట్ చోరీ’ అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ.. మ‌రింత దూకుడుగా ముందుకు సాగ‌నున్నారు. ఒక‌ర‌కంగా ఆయ‌న ప్ర‌భంజ‌నం సృష్టించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ‘ఓట్ అధికార్ యాత్ర‌’ పేరుతో రాహుల్‌గాంధీ ఆదివారం నుంచి 16 రోజుల పాటు యాత్ర చేయ‌నున్నారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న బీహార్‌లో దాదాపు 65ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌ను తొల‌గించార‌ని.. పేర్కొంటున్న రాహుల్ గాంధీ ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో దీనిపై పెద్ద చ‌ర్చే పెట్టారు. ఓ వారం …

Read More »

కాళేశ్వ‌రం వ‌ర్సెస్ పోల‌వరం: కేటీఆర్ కొత్త ర‌గ‌డ‌

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ జ‌ల ప్రాజెక్టుల‌కు సంబంధించి మ‌రో కొత్త వివాదాన్ని తెర‌మీదికి తెచ్చారు. ఏపీ అంటే ఒక‌లాగా, తెలంగాణ అంటే మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. అంటూ కేంద్రంలోని బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మ హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో యాగీ చేస్తున్న వారు.. పొరుగున ఉన్న పోల‌వ‌రం విష‌యంలో క‌ళ్లు మూసుకున్నార‌ని అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు కాఫ‌ర్ డ్యామ్ ఇప్ప‌టికి రెండు సార్లు డ్యామేజీ …

Read More »

ధర్మవరం అబ్బాయి పాకిస్తాన్ కు ఎందుకు ఫోన్ చేశాడు

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం.. ఫ్యాక్షన్ జోన్ లోనే ఉన్నప్పటికీ కొన్నాళ్లుగా ఇక్కడ పరిస్థితులు సజావుగానే ఉన్నాయి. రాజకీయ వివాదాలు తప్ప వ్యక్తిగత కక్షలు హత్యలు లేవు. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో వచ్చిన మార్పుల కారణంగా ధర్మవరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా శనివారం ధర్మవరం ఒక్కసారిగా దడ దడలాడింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీనికి కారణం ధర్మవరం యువకుడు ఒకరు పాకిస్థాన్ లోని ఉగ్రవాదులతో నేరుగా ఫోన్లో …

Read More »

బాబు, జగన్ పార్టీలు పరస్పరం భుజం భుజం రాసుకుంటూన్నాయి

కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ ఏపీ రాజకీయాలపై సునిశిత విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబుకు, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌కు కూడా ప్రజల కంటే ప్రధాని మోడీనే ఎక్కువనని విమర్శించారు. దీంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఓట్ చోరీ అంశంపై దేశవ్యాప్తంగా చర్చకు వస్తే ఏపీలో మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉన్నారని, కేంద్రం కనుసన్నల్లో బాబు, జగన్ పార్టీలు నడుస్తున్నాయన్నారు. బాబు పార్టీ …

Read More »

ఎంత ఎదిగిపోయావ‌య్యా.. బాబుకు కోట్లాది ఆశీస్సులు ..!

టీడీపీ అధినేత, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మ‌హిళ‌ల నుంచి ఆశీస్సులు ద‌క్కుతున్నాయి. ఎంత ఎదిగిపోయావ‌య్యా.. అంటూ వంద‌లాది మంది మ‌హిళ‌లు ఆయ‌న‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. తాజాగా అమ‌ల్లోకి తీసుకువ‌చ్చిన ‘స్త్రీ శ‌క్తి’ ప‌థ‌కం.. ఏపీకి సంబంధించినంత వ‌ర‌కు చాలా కొత్త‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌భుత్వ‌మూ ఈ ప‌థ‌కాన్ని ఏపీలో అమ‌లు చేయ‌లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల్లో భాగంగా మ‌హిళ‌ల‌కు ఉచితంగా ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించేందుకు అవ‌కాశం …

Read More »

ఇక‌, దారులు మూసుకుపోయాయ్‌: త‌మ్ముడి ఆవేద‌న‌

పార్టీ కోసం వీర‌విధేయుడిగా క‌ష్ట‌ప‌డ్డారు. చంద్ర‌బాబును త‌న తండ్రిగా పేర్కొన్నారు. వైసీపీపైనా.. ఆ పార్టీ నాయ‌కుల‌పైనా నిప్పులు చెరిగారు. ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే.. అప్పుడు త‌న త‌డాఖా చూపించారు. బ‌లమైన గ‌ళం కూడా వినిపించారు. కానీ, చిన్న లోపం.. ఒకే ఒక్క‌ చిన్న పొర‌పాటు.. స‌ద‌రు త‌మ్ముడిని దేనికీ కొర‌గాకుండా చేసేసింది. ఆయ‌నే విజ‌య‌వాడ‌కు చెందిన బుద్దా వెంక‌న్న‌. ఇప్ప‌టికే ఆయ‌నను పార్టీ ప‌క్కన పెట్టింద‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. …

Read More »

ఉచిత బస్సు: కూటమి గ్రాఫ్ 360 డిగ్రీస్

ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం సర్కారు గ్రాఫ్‌ను అమాంతం పైకి లేపేసింది. 360 డిగ్రీస్ స్థాయిలో కూటమి ప్రభుత్వానికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సంతోషంలో మునిగి పోయారు. కూటమి ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ శనివారం ఉదయం నాటికి స్త్రీ శక్తి పథకం సంపూర్ణంగా అమల్లోకి వచ్చింది. మహిళలు ఎక్కడ …

Read More »

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ఈ నియోజ‌క‌వ‌ర్గం బిగ్ హాట్ ..!

కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి నాయ‌కుల మ‌ధ్య వివాదాలు భ‌గ్గుమంటున్నాయి. కొన్ని కొన్ని చోట్ల మాత్రం స‌ర్దుకు పోతున్నారు. ఇలాంటి వాటిలో పాల‌కొండ ఒక‌టి. మన్యం జిల్లా పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన మ‌ధ్య వివాదాలు పెరుగుతున్నాయి. వాస్త‌వానికి ప్ర‌స్తుత ఎమ్మెల్యే నిమ్మక జ‌య‌కృష్ణ‌.. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీడీపీ నాయ‌కుడే. కానీ.. ఆయ‌న‌కు అనూహ్యంగా జ‌న‌సేన టికెట్ ఇవ్వ‌డం.. ఆయ‌న పార్టీ మారిపోవ‌డం …

Read More »

ప‌వ‌ర్‌లో లేక‌పోయినా.. అక్క‌డ ఆయ‌నే ‘ప‌వ‌ర్‌’.. !

ప్ర‌స్తుతం వైసీపీ 11 స్థానాల‌కు ప‌రిమిత‌మై.. దిక్కులు చూస్తోంది. అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేదు. ఇక‌, ప్ర‌జ‌ల్లోనూ పెద్ద‌గా పుంజుకుంటున్న దాఖలాలు కూడా క‌నిపించ‌డం లేదు. అయినా.. కొన్ని కొన్ని చోట్ల మాత్రం.. వైసీపీ నేత‌లే… ప‌వ‌ర్ కేంద్రాలుగా మారిపోయారు. వారే అధికారుల‌ను ఆడిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. ఇక్క‌డ తిరుప‌తి నియోజ‌కవ‌ర్గంలో జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, టీడీపీకి కూడా మెజారిటీ …

Read More »

అవినాష్ వ‌ల్ల కాలేదు.. వైసీపీ వాట్ నెక్ట్స్..!

వైసీపీలో చూసి ర‌మ్మంటే.. కాల్చుకువ‌చ్చే నాయ‌కులు చాలా మంది ఉన్నారు. అయితే.. ఒక్కొక్క సారి ఇవి వివాదాల‌కు దారి తీసినా.. పార్టీకి మేలు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు కుప్పం ముని సిప‌ల్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ను పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి అప్ప‌ట్లో అప్ప‌గించారు. ఆయ‌న మిగిలిన వారిని తోడు తీసుకుని ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. తిరుప‌తి ఎన్నిక‌ల‌ను భూమ‌న‌తో పాటు.. చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి కూడా అప్ప‌గించారు. ఇద్ద‌రూ స‌మ‌న్వ‌యంతో …

Read More »

బీటెక్ ర‌వి ( మారెడ్డి ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి ) .. నాడు – నేడు ..!

మారెడ్డి ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి.. ఉర‌ఫ్ బీటెక్ ర‌వి. టీడీపీలో ఇప్పుడు ఈ పేరు హాట్ హాట్‌. ఏ బాధ్య‌త అప్ప‌గించినా.. ఆయ‌న నెగ్గుకు రావ‌డ‌మే ప్ర‌స్తుతం ఈ పేరును చ‌ర్చ‌కు వ‌చ్చేలా చేసింది. 2017-18 మ‌ధ్య‌, త‌ర్వాత .. ఇప్పుడు కూడా.. బీటెక్ ర‌వికి పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు అప్ప‌గించిన బాధ్య‌త‌ను సంపూర్ణంగా విజ‌యం ద‌క్కించుకునేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌ట్లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో వైసీపీ అభ్య‌ర్థి వివేకానంద‌రెడ్డిని ఓడించే …

Read More »