Political News

బాబుపై వ్య‌తిరేకత పెరిగింది.. ఇక‌, మ‌న‌మే: జ‌గ‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అసెంబ్లీకి రాకుండా.. తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో పార్టీ నాయ‌కులు, జిల్లాల ఇంచార్జుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఆయ‌న ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. తాజాగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రారంభ‌మైన వైసీపీ నేత‌ల విస్తృత స్థాయి సమావేశం రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు నిర‌వ‌ధికంగా సాగింది. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై జ‌గ‌న్ స్పందించారు. త‌న పార్టీ వారికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ప్ర‌భుత్వ …

Read More »

టార్గెట్ వైసీపీ.. ఎథిక్స్ క‌మిటీ ఏం చేస్తుంది.. ?

వైసీపీ ఎమ్మెల్యేల ల‌క్ష్యంగా అసెంబ్లీ నైతిక విలువ‌ల క‌మిటీ(ఎథిక్స్‌) దృష్టి పెట్టింది. రెండు కీల‌క అంశా లపై చ‌ర్చించిన క‌మిటీ.. నిర్ణ‌యాన్ని మాత్రం వాయిదా వేసింది. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ 11 స్తానాల‌కు ప‌రిమితం అయింది. దీంతో స‌భ్యులు స‌భ‌కు రాకుండా.. డుమ్మా కొడుతున్నారు. అయితే.. స‌భ్యులు రావాలంటూ.. ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయి. కానీ, త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. వ‌చ్చేది …

Read More »

చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల‌కు చాలా న‌మ్మ‌కం ఉంది: ఉప‌రాష్ట్ర‌ప‌తి

భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. చంద్ర‌బాబుపై ఏపీ ప్ర‌జ‌ల‌కు చాలా న‌మ్మ‌కం ఉంద‌ని.. ఆయ‌న విజ‌న్‌ప‌ట్ల ఎంతో మందికి మ‌క్కువ ఉంద‌ని అన్నారు. భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఈ నెల 9న ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న సీపీ రాధాకృష్ణ‌న్‌.. తొలిసారి బుధ‌వారం ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. సీఎం చంద్ర‌బాబు స‌హా మంత్రి నారా లోకేష్ ఆయ‌న‌కు విజ‌య‌వాడ విమానాశ్ర‌యంలో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. …

Read More »

షాకింగ్‌: ఫ‌స్ట్ టైమ్ భారీగా మావోయిస్టుల లొంగుబాటు!

కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ క‌గార్‌.. సుదీర్ఘ కాలంగా కొన‌సాగుతున్న మావోయిస్టు ఉద్య‌మాన్ని క‌కావిక‌లం చేస్తోంది. మావోయిస్టులకు గ‌ట్టి ప‌ట్టున్న రాష్ట్రాల్లో నిరంత‌రాయంగా జ‌రుగుతున్న కూంబింగ్‌తో మావోయిస్టులు హ‌డ‌లి పోతున్నారు. చ‌ర్చ‌ల‌కు తావులేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసిన ద‌రిమిలా.. మావోయిస్టులు పుట్ట‌కొక‌రు.. చెట్టుకొక‌రుగా మారారు. మ‌రీముఖ్యంగా మావోయిస్టు కేంద్ర క‌మిటీపై దృష్టి పెట్టిన భ‌ద్ర‌తా ద‌ళాలు.. కీల‌క నాయ‌కుల‌ను మ‌ట్టుబెడుతున్నాయి. దీంతో క్షేత్ర‌స్థాయిలో మావోయిస్టులు మ‌రింత భీతిల్లుతున్నారు. మ‌రోవైపు.. మావోయిస్టుల్లో …

Read More »

ప్రజాసేవలో మద్దిపాటి వెంకటరాజు జోరు

ప్రజా ప్రతినిధి అంటే…ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా ఎన్నో పదవులను ఆశిస్తూ ప్రస్తుత యువత అప్పటిదాకా చేస్తున్న ఉద్యోగాలను వదిలి రాజకీయాల్లోకి వస్తున్నారు. అదృష్టం బాగుంటే… ప్రజా ప్రతినిధులు అవుతున్నారు. లేదంటే ఒక్కసారికే వెనుదిరిగిపోతున్నారు. ఇక ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వారు కూడా ఏదో నామ్ కే వాస్తేలా పర్యటనలు చేస్తూ తమ పని అయిపోయిందని భావిస్తున్నారు. ఇలాంటి రెండు వర్గాలకు చెందని వారే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే …

Read More »

చంద్ర‌బాబుకు స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ నోటీసులు!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు పోలీసు శాఖ‌లో తృతీయ శ్రేణి ఉద్యోగిగా వ్య‌వ‌హ‌రించే స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్(సీఐ) శంక‌ర‌య్య నోటీసులు పంపించిన వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపుతోంది. క‌డ‌ప జిల్లా పులివెందుల‌కు చెందిన శంక‌ర‌య్య ఈ నెల 18న సీఎం చంద్ర‌బాబుకు నోటీసులు పంపించారు. దీనిలో ఆయ‌న మూడు కీల‌క డిమాండ్లు చేయ‌డం గ‌మ‌నార్హం. 1) త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పడం. 2) త‌న‌ను మాన‌సిక‌క్షోభ‌కు గురిచేసి.. డిపార్ట్‌మెంటులో …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ‘ఉప్పాడ’ తిప్ప‌లు.. విష‌యం ఏంటి?

ఉప్పాడ‌… ఈ పేరు విన‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది చీర‌లు(ఉప్పాడ చీర‌లు). అదేస‌మ‌యంలో స‌ముద్ర ఉత్ప‌త్తులు కూడా. ఏపీలోని కాకినాడ తీర గ్రామ‌మైన ఈ ఉప్పాడ తాజాగా.. వార్త‌ల్లోకి ఎక్కింది. పెద్ద ఎత్తున ఇక్క‌డి మ‌త్స్య‌కారులు ఉద్య‌మానికి దిగారు. ర‌హ‌దారులు దిగ్భందించారు. ఒక‌రోజు కాదు..రెండు రోజులు కాదు.. గ‌త నాలుగు రోజులుగా నివురుగ‌ప్పిన నిప్పులా ఉద్య‌మిస్తున్న మ‌త్స్య‌కార కుటుంబాలు బుధ‌వారం తమ ఆందోళ‌న‌ను జాతీయ ర‌హ‌దారిపైకి ఎక్కించాయి. అంతేకాదు.. ఏపీ …

Read More »

ఎనిమీ డ్రోన్ ఎంట్రీ: మావోయిస్టుల ఫ్యూచర్ ఏంటి?

పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఆయుధంతోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మిన సాయుధ పోరు చరమాంకానికి చేరుకుంటోంది. అన్నలకు తొలిసారి వెన్నులో వణుకు పుట్టించేలా కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ కగార్”ను ఈ నెల 25 నుంచి మరింత విస్తరించనుంది. మరింత పటిష్టం చేయనుంది. మరింత వేగంగా కూడా చేపట్టనుంది. అంతేకాదు, మావోయిస్టులు గతానికి భిన్నంగా చర్చలకు వస్తామని చెబుతున్నా కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. “మాటల్లేవ్… తూటాలే!” అంటూ తేల్చి చెబుతోంది. …

Read More »

‘మీరు ఆమోదించ‌కపోతే.. ఢిల్లీ నుంచి ఫోన్ వ‌స్తుంది’

ఏపీ శాస‌న మండ‌లిలో మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. జీఎస్టీ 2.0 సంస్క‌ర‌ణ‌ల‌కు ఏపీ అసెంబ్లీ ఇటీవ‌ల ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. దీనిపై తీర్మానం కూడా చేశారు. తాజాగా దీనిని మండ‌లిలో మంగ‌ళ‌వారం ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్భంగా అధికార పార్టీ స‌భ్యులు ఏక‌గ్రీవంగా ఆమోదించారు. అయితే దీనిపై వైసీపీ స‌భ్యులు మాట్లాడే స‌మయంలో వారు తీర్మానాన్ని ఆమోదిస్తున్నారో లేదో చెప్పాల‌ని ఆర్థిక మంత్రి ప‌య్యావుల …

Read More »

విశాఖ స్టీల్ ప్లాంటుతో…. వైసీపీ పొలిటిక‌ల్ గేమ్‌: లోకేష్‌

విశాఖప‌ట్నంలో ఆంధ్రుల హక్కుగా ఏర్ప‌డిన స్టీల్ ప్లాంటును త‌మ రాజ‌కీయ విన్యాసాల‌కు.. ఆట‌ల‌కు వైసీపీ నాయ‌కులు వేదిక‌గా చేసుకున్నార‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీ శాస‌న మండ‌లిలో మంగ‌ళ‌వారం సాయంత్రం.. వైసీపీ స‌భ్యురాలు వ‌రుదు క‌ల్యాణి.. విశాఖ ప‌ట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటీక‌రిస్తున్నారా? లేక నిలుపుద‌ల చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. కూట‌మి ప్ర‌భుత్వం దీనిని నిలుపుద‌ల చేసేందుకు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌ని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు …

Read More »

ప‌వ‌న్ కల్యాణ్‌కు జ్వ‌రం… అందుకే సభకు గైర్హాజకు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని.. అయితే నీర‌సంగా ఉన్నార‌ని వైద్యులు తెలిపారు. వైర‌ల్ ఫీవ‌ర్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ‌ప‌డుతున్న‌ట్టు చెప్పారు. గ‌త రెండు రోజులుగా ఆయ‌న అనారోగ్యంతోనే ఉన్నార‌ని, అయితే.. కొన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నార‌ని, దీంతో మ‌రింత నీర‌సించార‌ని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆయ‌న వ‌చ్చే నాలుగు రోజుల పాటు రెస్టు తీసుకోవాల‌ని సూచించిన‌ట్టు చెప్పారు. ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి …

Read More »

కాలుష్యం తగ్గాలి.. పెట్టుబడులూ రావాలి: పవన్

ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత వారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. నగరంలో కాలుష్యకారక పరిశ్రమల వల్ల తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని బొండా అంటే.. కాలుష్యంపై ఉక్కుపాదం మోపితే పెట్టుబడుల మాటేమిటి? అంటూ పవన్ బదులిచ్చారు. పవన్ నుంచి వెలువడ్డ ఈ మాట చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత ఆయన …

Read More »