ఎన్నికల్లో విజయం కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా అభ్యర్థులు సాగుతున్నారు. అన్ని పార్టీల నాయకులు విజయం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఎన్నికల్లో తమ గెలుపునకు అడ్డు వచ్చే సమస్యలను పరిష్కరించుకుంటూ సాగుతున్నారు. అయితే నామినేషన్ల ఉప సంహరణ ముగిసి, అభ్యర్థుల లెక్క తేలడంతో కొంతమంది అభ్యర్థులకు ఇప్పుడు మరో తలనొప్పి మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేస్తుండటమే …
Read More »వయసు 70 పైనే.. అయినా పోటీకి సై
ఆ నాయకులందరూ రాజకీయాల్లో ఎంతో సీనియర్లు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా చాలా పదవులు అనుభవించారు. పార్టీలోనూ కీలక నేతలుగా ఎదిగారు. ఇప్పుడు 70 ఏళ్లు దాటినా చివరి అవకాశంగా మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. రాజకీయ మత్తు అంత సులభంగా వదలదని చెబుతుంటారు. ఇప్పుడు ఈ వయసులోనూ ఎన్నికల సమరానికి సై అంటున్న వీళ్లను చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్ఎస్ లో ప్రస్తుతం …
Read More »చంద్రబాబు బెయిల్ తీర్పు రిజర్వ్!
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్పై గురువారం నాడు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా..ఏపీ సీఐఢీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు …
Read More »పవన్, నేను సేమ్ టు సేమ్: బాలకృష్ణ
టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని అధికారికంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హిందూపురం ఎమ్మెల్యేతోపాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పవన్ కల్యాణ్ భేటీ అయి భవిష్యత్ కార్యచరణపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ వరుస సమావేశాలు నిర్వహించి ఉమ్మడి కార్యచరణతో ముందుకు పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే హిందూపురంలో నిర్వహించిన టీడీపీ-జనసేన …
Read More »19 స్థానాలు.. 2290 మంది అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. స్వతంత్రులు, రెబల్స్ బెడద జోరుగా ఉంది. 2018 ఎన్నికల్లో 119 స్థానాలకు 1057 మంది పోటీ చేయగా.. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపైంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం.. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి(ఈ నెల 15, బుధవారం) మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా చోట్ల పదుల సంఖ్యలో నామినేషన్లను వెనక్కి తీసుకున్నా..గత ఎన్నికలతో …
Read More »బాలయ్య నోట ‘జై జనసేన’.. మెడలో కండువా
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారై నెల రోజులు కావస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పట్లాగే ఈ రెండు పార్టీల మద్దతుదారులు వాదోపవాదాలు, గొడవలతో గడిపేస్తున్నారు కానీ.. గ్రౌండ్ లెవెల్లో కొంత సమన్వయంతోనే సాగిపోతున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. రెండు పార్టీల మధ్య వివిధ నియోజకవర్గాల్లో సమన్వయ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పిఠాపురంలో జరిగిన ఈ కార్యక్రమం కొంత రసాభాసగా జరిగింది కానీ.. తాజాగా హిందూపురంలో మాత్రం టీడీపీ, …
Read More »కాంగ్రెస్ అభ్యర్థులకు “బీఆర్ ఎస్” మొహమాటం
అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. ఎన్నికల వేళ.. టికెట్ దక్కలేదని అలిగి కొందరు నాయకులు బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఆ వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ టికెట్ సొంతం చేసుకున్నారు. మొత్తానికి టికెట్ అయితే దక్కింది. ప్రచారం కూడా ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. ఎటొచ్చీ ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేసుకుని కామెంట్లు చేయలేకపోతున్నారట. అంతేకాదు.. బీఆర్ …
Read More »బాలయ్య కారుపై వైసీపీ కార్యకర్త దాడి!
టీడీపీ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న కారుపై వైసీపీ కార్యకర్త దాడికి యత్నించాడు. అయితే.. ఈ ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన పోలీసులు కార్యకర్తను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. చేతిలోని కర్రను బాలయ్య కారుపై విసిరేసి.. సదరు కార్యకర్త అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటన టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. ఏం జరిగిందంటే.. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ మండలస్థాయి నాయకుడు, గత ఎన్నికల్లో …
Read More »కేసీయార్లో అయోమయం పెరిగిపోతోందా ?
కేసీయార్లో అయోమయం పెరిగిపోతున్నట్లుంది. ఎన్నికల బహిరంగసభల్లో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్ధమవుతున్నట్లు లేదు. నిజామాబాద్, మెదక్, బోధ్ బహిరంగసభల్లో మాట్లాడుతు జాతీయ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. భవిష్యత్తంతా ప్రాంతీయపార్టీలదే అని బల్లగుద్ది మరీ చెప్పారు. తొందరలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికల తర్వాత జోష్ అంతా ప్రాంతీయపార్టీలదే అని పదేపదే చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇదే నిజమైతే మరి కేసీయార్ జాతీయపార్టీని ఎందుకు పెట్టినట్లు ? ప్రాంతీయపార్టీగా …
Read More »సంక్రాంతికి మ్యానిఫెస్టో ?
అధికారపార్టీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యిందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే మినీ మ్యానిఫెస్టోను రెండుపార్టీల సమన్వయ కమిటి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో టీడీపీ ఇచ్చిన 6 హామీలుండగా జనసేన ఇచ్చిన 5 హామీలున్నాయి. ఈ రెండింటిని కలిపి 11 హామీలతో మినీ మ్యానిఫెస్టోను సమన్వయ కమిటి ఖాయం …
Read More »రేవంత్ అంటే భయపడుతున్న కేసీఆర్?
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ పై కన్నేశారు. ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. కానీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ కేసీఆర్ లో ఆందోళన పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపుపై సందేహాలు పెరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమ దారికి కాంగ్రెస్ అడ్డు వస్తుందనే కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అందుకే …
Read More »కేటీఆర్ సీఎం అవుతారనే బీఆర్ఎస్ లో ఉన్నా: పొంగులేటి
మరికొద్ది రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార జోరు పెంచారు అన్ని పార్టీల నేతలు. ఈ క్రమంలోనే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటిపై ఐటీ సోదాలు జరిగిన నేపథ్యంలో ఓ మీడియా చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పొంగులేటి…కేసీఆర్, కేటీఆర్ ల పై షాకింగ్ కామెంట్లు చేశారు. త్వరలో తాను సీఎం అవుతానని, అప్పటివరకు ఓపిక పట్టాలని …
Read More »