Political News

కాంగ్రెస్ ఆక‌స్మిక నిర్ణ‌యం.. జూబ్లీహిల్స్ కోసమేనా?!

రాజ‌కీయ పార్టీలు తీసుకునే నిర్ణ‌యాల వెనుక చాలా నిగూఢ‌మైన అర్ధం ఉంటుంది. అందునా.. అధికారంలో ఉన్న పార్టీలు తీసుకునే నిర్ణ‌యాల‌కు మ‌రింత అర్ధం-ప‌ర‌మార్థం రెండూ ఉంటాయి. తాజాగా తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ తీసుకున్న ఆక‌స్మిక నిర్ణ‌యం కూడా.. ఈ త‌ర‌హాలోదేన‌న్న వాద‌న వినిపిస్తోంది. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని పార్టీ అధిష్టానం నిర్ణ‌యించింద‌ని తెలిసింది. పార్టీ వ‌ర్గాలు కూడా ఇదే ప్ర‌చారం …

Read More »

సీఎం లంచాలు తీసుకున్నారు విచారించండి: డీజీపీకి ఈడీ లేఖ

త‌మిళ‌నాడులో మ‌రో నాలుగు నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్‌ను విచారించాల‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌ (ఈడీ) తాజాగా త‌మిళ‌నాడు డీజీపీకి లేఖ రాసింది. ఈ లేఖ‌కు 232 పేజీల నివేదిక‌ను కూడా జ‌త చేసింది. సీఎంతో పాటు మంత్రి నెహ్రూ, ఆయ‌న సెక్ర‌ట‌రీలు, సోద‌రుడిని కూడా విచారించాల‌ని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో తీవ్ర రాజ‌కీయ అల‌జ‌డి రేగింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మ‌ను ఇబ్బంది పెట్టేందుకే …

Read More »

బాబు ఫిదా: ఔను.. అంద‌రూ ముందుకొచ్చారు

ఏపీ సీఎం చంద్ర‌బాబు తొలిసారి ఫిదా అయ్యారు. అది కూడా ఆయ‌న ఇటీవ‌ల కాలంలో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న రెండు విష‌యాల‌పై సంతోషం వ్యక్తం చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అంతేకాదు, అంద‌రూ చంద్ర‌బాబుతో స‌హా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. విష‌యం ఏంటంటే, తాజాగా మొంథా తుఫాను ప్ర‌భావంతో 22 జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు దోబూచులాడిన ఈ మొంథా మంగళ‌వారం అర్థ‌రాత్రి …

Read More »

మొంథా తుఫాన్… ఏపీకి ఎన్ని వేల కోట్ల నష్టమో తెలుసా?

అటు ప్ర‌భుత్వాన్ని, ఇటు ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన మొంథా.. తీవ్ర తుఫాను మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి 11 -12 గంట‌ల 30 నిమిషాల మ‌ధ్య మ‌చిలీప‌ట్నం-క‌ళింగ ప‌ట్నం మ‌ధ్య కాకినాడ‌కు దక్షిణంగా న‌ర‌సాపురం ప‌రిధిలో తీరం దాటిన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్ర‌భావం మ‌రో రెండు రోజులు కొన‌సాగుతుంద‌న్నారు. మ‌రోవైపు.. తీరం దాటిన త‌ర్వాత కూడా మొంథా తీవ్ర తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల‌పై …

Read More »

చంద్ర‌బాబు 12 గంట‌ల వ‌ర‌కు, కానీ లోకేష్ మాత్రం…

మొంథా తుఫాను.. ప‌లు ప్ర‌భావిత జిల్లాల ప్ర‌జ‌ల‌కు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. కానీ, ఇదే స‌మయంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి, మంత్రి నారా లోకేష్‌ల‌కు కూడా నిద్ర‌లేకుండా చేస్తోంద‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. గ‌త రెండు రోజులుగా సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఉద‌యం 10 నుంచి రాత్రి 11-12 గంట‌ల వ‌ర‌కు గ‌డిపారు. మంగ‌ళ‌వారం రాత్రి అయితే.. ఆయ‌న అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత‌.. కూడా ఆర్టీజీఎస్‌లోనే ఉన్నారు. …

Read More »

ఎన్డీయే కూటమికి ధీటుగా వైసీపీ కూటమి, జగన్ ఒప్పుకుంటారా?

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. రాష్ట్రంలో రాజ‌కీయాలు మారుతాయా?  బీజేపీ-జ‌న‌సేన‌- టీడీపీ కూట‌మి మాదిరిగా మ‌రో కూటమి ఆవిర్భ‌వించే అవ‌కాశం ఉందా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు ప‌రిశీల‌కులు. చిన్నా చిత‌కా పార్టీల‌ను క‌లుపుకొని.. మ‌రో మ‌హాకూట‌మి ఏర్పాట‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. అయితే.. ఈ కూట‌మి విష‌యంపై అనేక చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ వైపు కొన్ని పార్టీలు చూస్తున్నాయ‌న్న‌ది వాస్త‌వ‌మ‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం వైసీపీతో చేతులు క‌లిపేందుకు కాదు.. …

Read More »

ఫ్లైట్ లేకపోతే ఏం… కారు ఉందిగా జగన్

ఏపీలో మొంథా తుఫాను ప్ర‌భావం భారీ ఉంటుంద‌న్న వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం అలెర్ట‌యింది. సీఎం చంద్ర‌బాబు త‌న వ‌య‌సును ప‌క్క‌న పెట్టి.. 24 గంట‌లూ గ‌త రెండు రోజులుగా సమీక్షిస్తున్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు, ఆస్తుల‌కు న‌ష్టం క‌లిగించ‌కుండా క్షేత్ర‌స్థాయిలో చ‌ర్య‌లు చేప‌ట్టారు. తుఫాను ప్ర‌భావం ఏ రేంజ్‌లో ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు న‌ష్టం క‌ల‌గ‌కూ డ‌ద‌న్న సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నారు. అధికారుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇక‌, డిప్యూటీసీఎం ప‌వ‌న్ …

Read More »

విప‌త్తుల‌తోనూ చ‌లికాచుకుంటున్నారు: చంద్ర‌బాబు

వైసీపీ నేత‌ల‌పై సీఎం చంద్ర‌బాబు ప‌రోక్షంగా స్పందించారు. రాష్ట్రంలో మొంథా తుఫాను ప్ర‌భావం క‌నిపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలోనే తిష్ఠ వేశారు. అధికారులు, మంత్రుల‌తో స‌మీక్ష‌లు చేస్తున్నారు. ఏ జిల్లాలో ఎక్కడ ఎలాంటి ప‌రిస్థితి నెల‌కొందో తెలుసుకుని రెమెడీ సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం నుంచి కూడా స‌మాచారం సేక‌రించేందుకు స‌చివాల‌యంలో ప్ర‌త్యేకంగా సీనియ‌ర్ ఐఏఎస్ ఆధ్వ‌ర్యంలో ఓ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు వారిని కూడా …

Read More »

20 శాతం సొమ్ము వారికి ఇస్తామంటేనే టికెట్ ధ‌ర‌లు పెంచుకోండి: సీఎం రేవంత్

సినీ రంగానికి సంబంధించిన కీల‌క అంశం కొత్త సినిమాలు ఎప్పుడు విడుద‌లైనా టికెట్ ధ‌ర‌లు పెంచుకునే విష‌యం. ఇది ఎప్ప‌టిక‌ప్పుడు సినీ రంగానికి కొంత ఇబ్బందిక‌రంగానే ఉంది. టికెట్ ధ‌ర‌ల పెంపు కోర‌డం, ప్ర‌భుత్వాల నుంచి ఒక్కోసారి అనుకూలంగా, కొన్ని సార్లు వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు రావ‌డం తెలిసిందే. ఈ విష‌యంలో ఏపీలో అయితే వైసీపీ హ‌యాంలో సినీ రంగ ప్ర‌ముఖులు స‌ర్కారును బ్ర‌తిమాలుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక ఇప్పుడు కూట‌మి …

Read More »

హుద్ హుద్ ప్లాన్‌ను అప్ల‌య్ చేస్తున్న చంద్ర‌బాబు!

హుద్ హుద్ తుఫాను గుర్తుందా? విశాఖ‌ను ఈ తుఫాను అత‌లాకుత‌లం చేసిన విష‌యం తెలిసిందే క‌దా! 2015లో వ‌చ్చిన హుద్ హుద్ తుఫాను తీవ్ర‌స్థాయిలో విశాఖ స‌హా ఉత్త‌రాంధ్ర జిల్లాల‌ను దెబ్బ‌తీసింది. ముఖ్యంగా విశాఖ‌ను చాలా తీవ్రంగా దెబ్బ‌తీసింది. అయితే ఆ స‌మ‌యంలో సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండేలా ప్ర‌త్యేక స్ట్రాట‌జీ అనుస‌రించారు. దీంతో తీవ్ర‌స్థాయిలో గాలులు, తుఫాను వ‌ర్షాలు వ‌చ్చినా ఒక్క ప్రాణం కూడా …

Read More »

జగన్ పార్ట్ టైం – బాబు ఫుల్ టైమ్

ముఖ్య‌మంత్రి అంటే ఒక రాష్ట్రానికి రాజ్యాంగ‌ప‌ర‌మైన కీల‌క నాయ‌కుడు. బాధ్యుడు కూడా. అయిన‌ప్ప‌టికీ .. వారికి కూడా విశ్రాంతి, కుటుంబం వంటివి ఉంటాయి. దీంతో నిర్దిష్ట స‌మ‌యం వ‌ర‌కు ప‌నిచేసిన త‌ర్వాత‌.. ఇంటికి వెళ్లిపోవ‌డం.. అనేది ముఖ్య‌మంత్రుల విష‌యంలో కామ‌నే. గ‌తంలో వైసీపీ అధినేత, అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. టైం బౌండ్ పెట్టుకుని ప‌నిచేశారు. ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 వ‌ర‌కు ప‌నిచేశార‌న్న వాద‌న బ‌లంగా వినిపించింది. మ‌ధ్య‌లో …

Read More »

మూడు రాష్ట్రాల‌కు కునుకు క‌రువు: ఏంటీ `మొంథా`?

మూడు రాష్ట్రాల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న తుఫాను.. మొంథా!. ఏపీ, త‌మిళ‌నాడు, ఒడిశా రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యాయి. ఆదివారం రాత్రి నుంచే ప్ర‌భుత్వాలు అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్నాయి. ఇక‌, సోమ‌వారం.. ఉద‌యం నుంచి మ‌రింత‌గా అలెర్ట్ అయ్యాయి. తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులోని చెన్నై తీర ప్రాంతంలో వేలాది మందిని పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఇక‌, ఏపీలోనూ తీర ప్రాంత జిల్లాల‌కు చెందిన వేల …

Read More »