హైదరాబాదులోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 13 నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇక్కడ పాగా వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాలని ప్రజల్లో తమకు ఉన్న సానుకూలతను ప్రచారం చేసుకోవాలని పెద్ద ఎత్తున వ్యూహం రచించింది. దీంతో ఈ నియోజకవర్గంలో లెక్కకు మిక్కిలిగా నాయకులను దింపి ప్రచారం చేయాలని …
Read More »టార్గెట్ 2028: విశాఖపై బాబు స్ట్రాటజీ.. !
సీఎం చంద్రబాబు లక్ష్యం ఎప్పటికప్పుడు పదును పెరుగుతోంది. రోజురోజుకు ఆయన తన లక్ష్యాలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా విశాఖ పట్నంపై మరిన్ని ఆశలు, ఆశయాలతో సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గతంలో వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్.. విశాఖను రాజధానిని చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఎంత లేదన్నా.. చాలా మంది ఈ ప్రకటనను స్వాగతించారు. తమ నగరం బాగుపడుతుందని కూడా అనుకున్నారు. ఈ క్రమంలో అదేస్థాయిలో …
Read More »బాలయ్య ఎఫెక్ట్: జనసేన కూల్ అయిందా..!
టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఇటీవలి కాలంలో అంతర్గతంగా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బాలయ్య సభలో చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో కలకలం రేపాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. దీంతో బాలయ్యపై మీమ్స్, కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, …
Read More »`అమరావతి` పనులా.. ఇక, చిటెకలో!
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన పనులు పూర్తవ్వాలంటే.. ఇప్పటివరకు ప్రయాసలు పడాల్సి వస్తోందన్నది వాస్తవం. ప్రధాన కార్యాలయాలన్నీ.. తలా ఒకచోట ఉండడంతో అమరావతిలో భూములు కొనాలన్నా.. విక్రయించాలన్నా.. ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. దీంతో పనులు సకాలంలో పూర్తి కావడం లేదన్నది కూడా వాస్తవం. ఈ నేపథ్యంలో సర్కారు కొన్నాళ్లుగా.. చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా అమరావతిలోనే అన్నీ అయ్యేట్టుగా కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఏపీ పురపాలక, …
Read More »ఆత్మ విమర్శ లేదా జగన్ సర్!
ఎదుటి వారిపై ఒక వేలు చూపించేముందు నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలి. అది వ్యక్తిగతమైనా.. రాజకీయాలైనా అంతే!. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఏపీలో వెలుగు చూసిన నకిలీ మద్యంపై వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. ఒక ప్రతిపక్షం(ప్రధాన కాదు)గా వైసీపీ ప్రశ్నించడం తప్పుకాదు. కానీ, గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని.. …
Read More »మీరే చెప్పండి: ఆ ప్యాలెస్ను ఏం చేయమంటారు?!
“మీరే చెప్పండి: ఆ ప్యాలెస్ను ఏం చేయమంటారు?!“- అంటూ.. ఏపీ ప్రజలకు రాష్ట్రప్రభుత్వం బిగ్ ఆఫర్ ఇచ్చింది. అంతేకాదు.. “మీ సూచనలు, సలహాలు మాకు అత్యంత కీలకం. ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరుతున్నాం. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కీలక నిర్ణయం తీసుకుంటాం.“ అని పేర్కొంది. ఈ మేరకు పర్యాటక శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. సలహాలు.. సూచనలను కేవలం ఈ-మెయిల్ రూపంలో మాత్రమే …
Read More »అవే నా ప్రపంచం: పవన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అవే నా ప్రపంచం.. నేను వాటితో స్నేహం చేయడానికి ఇష్టపడతా. అందుకే.. ఆ రూమ్ నుంచి వాటితో నింపేసుకుంటా“ అని వ్యాఖ్యానించారు. దీంతో సభికులు తొలుత విస్మయం వ్యక్తం చేసినా.. చివరకు ముసిముసి నవ్వులు చిందించారు. తాజాగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో “ఆమె సూర్యుడిని కబళించింది!.“ అని పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ …
Read More »పొంగులేటి పెత్తనం చేస్తాడా?: కొండా మురళి ఫైర్
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఉన్న మంత్రి సురేఖ భర్త కొండా మురళి.. మరోసారి తెరమీదికి వచ్చారు. గతంలో ఇదే జిల్లాకు చెందిన కడియం శ్రీహరిపై విమర్శలు, ప్రతి విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మురళి.. అధిష్టానం ముందు వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై నిప్పులు చెరిగారు. “పొంగులేటి మాపై పెత్తనం చేస్తాడా? అంత.. మొగోడా?!“ …
Read More »రెండు రోజులే గడువు.. తేలని బీజేపీ లెక్క!
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఘట్టం తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. మరో రెండురోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ(ఈ నెల 13) ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. బీఆర్ ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలో నిలిచారు. ఇక, కాంగ్రెస్ తరఫున యువ నేత …
Read More »అణచివేతపై అలుపెరుగని పోరుకు.. `శాంతి` సత్కారం: ఎవరీ మరియా?
ప్రపంచ శాంతి దూతగా.. వెనుజువెలా దేశానికి చెందిన 58 ఏళ్ల మరియా కొరీనా మచాడో ఎంపికయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే `నోబెల్ శాంతి` పురస్కారానికి ఈ ఏడాది మొత్తం 16 అప్లికేషన్లు రాగా.. వీటిలో అందరినీ తోసిరాజని మరియా ఎంపికయ్యారు. ఉన్నత విద్యను అభ్యసించిన మరియా.. వెనుజువెలా సహా చుట్టుపక్కల దేశాల్లోని నియంతృత్వం, పేదరికం, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు …
Read More »మిథున్ రెడ్డి మెలిక.. వైసీపీ ఇరుక్కుపోతుందా ..!
వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తెచ్చిన కొత్త డిమాండ్ కూటమి పార్టీలకు ఎలా ఉన్నప్పటికీ.. వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏపీలో తెరమీదికి వచ్చిన.. నకిలీ మద్యం కుంభకోణం కేసులో .. అనేక మంది టీడీపీ నాయకుల పాత్ర ఉందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఇద్దరు కీలక నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరింత మంది ప్రమేయం ఉందన్న …
Read More »నారా వారి రికార్డు : సీఎంగా 15 ఏళ్ల రికార్డు ..!
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మరో రికార్డును సొంతం చేసుకున్నారు. 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా ఆయన మరో శిఖరాన్ని అందుకున్నారు. వాస్తవానికి దేశంలో 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఒకరిద్దరు ఉన్నా.. చంద్రబాబు ప్రత్యేకత వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే వ్యక్తి.. అందునా ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ తరఫున 15సంవత్సరాల పాటు ఆయన ముఖ్య మంత్రిగా పనిచేయడం రికార్డేనని అంటున్నారు విశ్లేషకులు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates