ఏపీ రాజధాని అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు పండగ చేసుకునే వాతావరణం ఇది. ఇప్పటి వరకు ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించినా, వాటిని వారికి అప్పగించే విషయంలో తాత్సారం జరుగుతూనే ఉంది. అదేవిధంగా వారికి కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. తాజాగా ఈ గ్రామాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని …
Read More »తమ్ముళ్లో.. తమ్ముళ్లు.. మారండయ్యా బాబూ..!
సీఎం చంద్రబాబుకు తమ్ముళ్ల వ్యవహారం చెవిలో జోరీగలా మారుతోంది. “జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దు. పార్టీ పరువు తీయొద్దు. మీరు జాగ్రత్తగా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటా” అని టీడీపీ అధినేతగా పార్టీ ఎమ్మెల్యేలలో దారి తప్పిన కొందరిని చంద్రబాబు హెచ్చరించారు. అయితే ఆయన అలా హెచ్చరించి 24 గంటలు కూడా గడవకముందే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వ్యవహారం పెను దుమారం రేపింది. అటవీ శాఖ ఉద్యోగులను …
Read More »అధికారులూ.. బాబు చెప్పింది వినిపిస్తోందా?
నాయకులు, ప్రజాప్రతినిధులు ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను పెడచెవిన పెడుతున్నారు. వీరి సంగతి ఎలా ఉన్నా, ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు కూడా కొందరు సీఎం చంద్రబాబు చెప్పింది ఒకటైతే, వారు అర్థం చేసుకుంటున్నది మరొకటి. దీంతో సీఎం చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీఎం కూడా దృష్టి పెట్టారు. గతంలో ఇసుక, తర్వాత మద్యం, ఇప్పుడు పీ-4 విషయంలోనూ …
Read More »అన్న ఇంటికి షర్మిల వెళ్తారా?
వైసీపీ అధినేత జగన్ ఇంటికి ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రానున్నారా? ఆయనతో ప్రత్యేకంగా చర్చించనన్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డిని నామినేట్ చేసింది. గురువారం ఆయన నామినేషన్ కూడా వేయనున్నారు. అయితే రాజకీయాలతో సంబంధం లేని సుదర్శన్ రెడ్డిని కేవలం …
Read More »కసిరెడ్డి ఆస్తుల జప్తు: ప్రభుత్వం కొరడా
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఉరఫ్ రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే లిక్కర్ కుంభకోణం ద్వారా …
Read More »మరోసారి కవిత సంచలన ఆరోపణలు
సొంత పార్టీలోని కొందరు నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై కవిత అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇక ఆ లేఖలో కవిత పేర్కొన్న విషయాలు పార్టీలోని అంతర్గత కలహాలకు అద్దంలా మారాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించేలా ఉన్న ఆ లేఖ బీఆర్ఎస్ వర్గాల్లో …
Read More »యువనేత హోటల్కు రమ్మన్నాడు.. నటి ఆరోపణలు
మలయాళ నటి, జర్నలిస్ట్గా కూడా పనిచేసిన రినీ ఆన్ జార్జ్ సంచలన ఆరోపణలు చేసి కేరళ రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. ఒక ప్రముఖ పార్టీకి చెందిన యువ నేత తనకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని, హోటల్కు రావాలని ఆహ్వానించాడని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి చెప్పినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అంతేకాక ఆ నేతకు మరిన్ని అవకాశాలు ఇచ్చారని రినీ వాపోయారు. రినీ మాట్లాడుతూ, “తమ …
Read More »ఇక నుంచి బంగారపు అన్వేషణలో సింగరేణి
సింగరేణి సంస్థకు కొత్త బంగారు అవకాశం దక్కింది. ఇప్పటి వరకు బొగ్గు గనులకే పరిమితమైన ఈ సంస్థ ఇప్పుడు బంగారం, రాగి ఖనిజ అన్వేషణలోకి అడుగుపెట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్లో గనుల అన్వేషణకు లైసెన్స్ పొందడం ద్వారా సింగరేణి చరిత్రలో కొత్త ఆదాయం మొదలైంది. కేంద్రం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీ కోట్ చేసి ఎల్-1 బిడ్డర్గా నిలిచింది. ఇది సంస్థకు పెద్ద గౌరవమే కాకుండా భవిష్యత్లో …
Read More »కోకాపేట రియల్ ఎస్టేట్ జోరు.. గజం ధరలు ఆకాశమే హద్దు!
హైదరాబాద్ నగరంలో భూముల ధరలు మళ్లీ చర్చకు తెరలేపాయి. హెచ్ఎండీఏ తాజాగా ఆన్లైన్ వేలానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ కనీస ధరలను భారీగా పెంచింది. ముఖ్యంగా కోకాపేట నియోపొలిస్ ప్రాంతంలో చ.గజం రూ.1.75 లక్షలుగా ధర నిర్ణయించడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో షాక్ ఇచ్చింది. గతంలో ఇదే ధర రూ.65 వేలుగా ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా రెండింతలు కంటే ఎక్కువ పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. కోకాపేటలో ప్రభుత్వ భూములు …
Read More »గోవింద గోవింద: ఉదయం టికెట్.. సాయంత్రానికే శ్రీవారి దర్శనం!
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం.. తిరుమల శ్రీవారి ఈషణ్మాత్ర దర్శనం కోసం రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితికి తిరుమల తిరుపతి దేవస్థానం చెక్ పెట్టనుంది. ఇప్పటి వరకు శ్రీవారి దర్శనం.. వివిద ఆర్జిత సేవలు చేసుకోవాలని పరి తపించిపోయే భక్తులకు.. దర్శనం నుంచి సేవల వరకు వేచిచూడాల్సిన పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. తిరుమల దేవదేవుని దర్శనం.. దుర్లభమనే మాట కూడా నానుడిగా మారిపోయింది. అలాంటి …
Read More »రష్యా, ఇండియా బాండింగ్ ఎంత బలంగా ఉందంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్యంలో కలకలం రేపింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్హౌస్ స్పష్టంచేయడం మరింత వివాదాస్పదమైంది. అయితే దీనిపై రష్యా ఘాటుగా స్పందించింది. భారతదేశానికి వ్యతిరేకంగా సుంకాలు విధించడం అన్యాయమని, ఏకపక్ష ఒత్తిడి సరైంది కాదని రష్యా ఉపమిషన్ చీఫ్ రోమన్ బబుష్కిన్ తెలిపారు. మాస్కో అధికారులు భారత్కు ధైర్యం చెబుతూ, అమెరికా …
Read More »‘శ్రీవారి ప్రసాదాలు తిని మాట్లాడండి జగన్, భారతి’
తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత తగ్గిపోయిందని, అన్న ప్రసాదాల్లో అసలు నాణ్యత కొరవడిందని వైసీపీ అధినేత జగన్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. భక్తులు శ్రీవారి ప్రసాదాలను ఎంతో భక్తి ప్రపత్తులతో స్వీకరిస్తున్నారు. నాణ్యత బాగుందని కూడా చెబుతున్నారు. మీరు ఏనాడైనా తిరుమలకు వచ్చారా? నిత్యాన్నదాన సత్రంలో కూర్చుని తిరుమల శ్రీవారి ప్రసాదాలు తీసుకున్నారా? చెప్పండి. ఇప్పుడు చెబుతున్నా, జగన్, భారతి లు స్వయంగా తిరుమలకు రండి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates