Political News

151 అడుగులో గోతిలో వైసీపీని పాతేస్తాం: లోకేష్

విజయనగరం జిల్లాలోని పోలిపల్లి నిర్వహించిన ‘యువగళం-నవశకం’ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజనరీ అంటే చంద్రబాబు అని, ప్రిజనరీ అంటే జగన్ అని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ అరెస్ట్ అయిన తర్వాత రోజుకో స్కాం బయటపడిందని, 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును అరెస్టు చేస్తే ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం బయటకు వచ్చిందని అన్నారు. …

Read More »

ఏం ఉద్ధరించాడని జగన్ కు ఓటేయాలి?: బాలకృష్ణ

యువగళం-నవశకం సభలో ఏపీ సీఎం జగన్ పై హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కనకపు సింహాసనంపై శునకం అన్న రీతిలో సైకో పెత్తనం సాగిస్తున్నారని బాలయ్య బాబు సంచలన కామెంట్లు చేశారు. ఈ చెత్త ప్రభుత్వం చేతకాని ప్రభుత్వ ఉండటం మన ఖర్మ అని మండిపడ్డారు. జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం..అప్పులు మాత్రం 5 లక్షల కోట్లు అని బాలకృష్ణ ఆరోపించారు. నిత్యావసర …

Read More »

మెదక్ ఎంపీగా కేసీయార్ ?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేసీయార్ పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. మెదక్ పార్లమెంటు నుండి పోటీచేస్తే గెలుపు ఖాయమని అనుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్సే గెలిచింది. అందుకనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయాలని కేసీయార్ అనుకుంటున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎల్పీగా కేసీయార్ ఎన్నికైన విషయం …

Read More »

28 పార్టీలకు ఇష్టమైన వ్యక్తి ఎవరు?

28 పార్టీలు కలిసి ఏర్పాటుచేసుకున్న ‘ఇండియా కూటమి’ తరపున ప్రధానమంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు తెరమీదకు వచ్చింది. ఖర్గే పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతిచ్చారు. ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఖర్గే పేరును మమత ప్రతిపాదించటం, కేజ్రీవాల్ మద్దతివ్వటం ఆశ్చర్యంగా ఉంది. దీనికి మెజారిటి నేతలు అంగీకరించారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ …

Read More »

శ్వేతప్రతానికి పోటీగా ప్రగతి నివేదిక ?

కేసీయార్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు శాఖలవారీగా జరిగిన అవినీతి, అక్రమాలపై లెక్కలు తీస్తోంది. ముఖ్యంగా ఇరిగేషన్ అంటే కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజి లాంటివాటితో పాటు విద్యుత్ శాఖలో జరిగిన వేల కోట్ల రూపాయల అవకతవకలు, ధరణి పోర్టల్ అక్రమాలపైన ప్రధానంగా దృష్టిపెట్టింది. వీటిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి అసెంబ్లీలో బీఆర్ఎస్ ను దుమ్ముదులిపేయాలన్నది రేవంత్ రెడ్డి అండ్ …

Read More »

జగన్ బర్త్ డే థీమ్ ఫొటో వైరల్

ఈ నెల 21న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్ కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేద, బడుగు బలహీన వర్గాలకు జగన్ అండగా నిలుస్తున్న థీమ్ తో రూపొందించిన ఒక ఇల్యూషనల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరి …

Read More »

మెంటల్ గా ప్రిపేర్ అయిపోయిన రోజా

రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కేది అనుమానమే అన్న విషయాన్ని మంత్రి రోజా మెంటల్ గా ప్రిపేర్ అయిపోయినట్లున్నారు. అందుకనే మీడియాతో మాట్లాడుతు నగరిలో టికెట్ ఎవరికి ఇచ్చినా ఓకేనే వాళ్ళ గెలుపుకు పనిచేస్తానని ప్రకటించారు. టికెట్ అయితే తనకే వస్తుందని తనకు కాకుండా ఎవరికిచ్చినా అభ్యంతరంలేదన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో మాటలకు ఇప్పటి మాటలకు చాలా తేడావచ్చేసింది. నగరిలో తాను తప్ప ఇంకెవరు పోటీచేయరని గతంలో చెప్పేవారు. …

Read More »

పాత కేసులను తిరగ తోడుతున్నారా ?

సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్ కు విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులకు ఏదో రకంగా డ్రగ్స్ తో గట్టి బంధముందన్న విషయం చాలాసార్లు బయటపడింది. కేసీయార్ హయాంలో టాలివుడ్-డ్రాగ్స్ బంధంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవరిమీదా సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. సినిమా పరిశ్రమలోని కొందరు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారనే ఆరోపణలు ఎంతగా వినిపించినా అప్పట్లో కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ బాధితులుగా …

Read More »

ఫిబ్రవరి 10న ముహూర్తం ఫిక్సయ్యిందా ?

సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయ్యిందా ? అవుననే అంటున్నాయి ఎన్నికల కమీషన్ వర్గాలు. ఫిబ్రవరి 10 వ తేదీన నోటిఫికేషన్ ప్రకటనకు కేంద్ర ఎన్నికల కమీషన్ రెడీ అయినట్లు సమాచారం. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ వర్గాలు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు సమాచారం కూడా అందించిందంట. ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల కమీషన్ నుండి ఉన్నతాధికారులు రాష్ట్రంలో మూడురోజుల పాటు పర్యటించబోతున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవబోతున్నట్లు …

Read More »

మంగళగిరిలో ఓటమికి కారణం చెప్పిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిన్నటితో దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబరు 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర పూర్తయిన తర్వాత తన భవిష్యత్ కార్యచరణపై లోకేష్ ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో తన ఓటమికి …

Read More »

టికెట్ ద‌క్క‌క‌పోతే.. ఒంట‌రిపోరుకు రెడీ..

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. గ‌తంలో మాదిరిగా కేవ‌లం జెండా మోసి బ‌తికేసే నాయ‌కులు.. అధినేత ఏది ఇస్తే అది తీసుకుని స‌ర్దేసుకునే నాయ‌కులు ఇప్పుడు లేరు. ఇప్పుడంతా.. మా కేంటి? అనే టైపులోనే రాజ‌కీయాలు సాగుతున్నాయి. దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. పాత‌త‌రం నాయ‌కులు అయితే.. ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో వ‌చ్చిన జీతాన్ని కూడా పార్టీకి ఇచ్చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. న‌డుచుకుంటూ చ‌ట్ట స‌భ‌ల‌కు వెళ్లిన వారు …

Read More »

కేటీఆర్ కు సీఎం సిద్ధరామయ్య కౌంటర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే అన్ని హామీలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తదితరులు అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరింటిలో రెండు హామీలను కాంగ్రెస్ అమలు చేస్తోంది. దీంతో, ఆ విషయాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు …

Read More »