Political News

ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు: లోకేష్‌

క‌ర్నూలులో నిర్వ‌హించిన సూప‌ర్ జీఎస్టీ-సూప‌ర్ సేవింగ్స్ భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తొలుత మాట్లాడిన మంత్రి నారా లోకేష్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆద్యంత ప్ర‌ధాని మోడీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన నారా లోకేష్‌.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌, దాయాది దేశం పాకిస్థాన్ వ్య‌వ‌హార శైలిన ప్ర‌స్తావించారు. ఆ రెండు దేశాల‌కు ప్ర‌ధాని మోడీ …

Read More »

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పు

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఈ రిజన్వేషన్లు అమలు చేయాలని రేవంత్ సర్కార్ రెడీ అయింది. అయితే, ఆ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వానికి షాకిస్తూ తాజాగా సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన …

Read More »

బరువు తగ్గావ్..లోకేశ్ కు మోదీ కాంప్లిమెంట్

ఏపీలో ప్రధాని మోదీ నేడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కర్నూలు పర్యటనకు వచ్చిన మోదీకి ఓర్వకల్లు విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ తో మోదీ సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బరువు బాగా తగ్గిపోయావని లోకేశ్ తో మోదీ చేసిన కామెంట్లు …

Read More »

‘కులం సర్వే మాకొద్దు’: ఇన్ఫోసిస్ సుధా మూర్తి

కర్ణాటకలో జరుగుతున్న సామాజిక, విద్యా సర్వే ( జనాలు దీన్నే ‘కులం సర్వే’ అంటున్నారు) లో పాల్గొనడానికి రాజ్యసభ సభ్యురాలు, ప్రముఖ దాత సుధా మూర్తి కుటుంబం నిరాకరించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ఆమె భర్త నారాయణ మూర్తి కూడా ఈ సర్వేకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. తాము ఏ వెనుకబడిన వర్గానికి చెందనందున, ఈ సర్వేలో పాల్గొనడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఈ దంపతులు స్పష్టం …

Read More »

సెక్యూరిటీ గార్డ్ రూ.400 కోట్ల బిజినెస్.. ఇప్పుడు ఎన్నికల బరిలో..

​బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి జీవిత కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతను మరేవరో కాదు, నీరజ్ సింగ్. ఒకప్పుడు ఢిల్లీలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసిన ఈ 38 ఏళ్ల యువకుడు, ఇప్పుడు రూ. 400 కోట్ల టర్నోవర్‌తో కంపెనీని నడుపుతున్నాడు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీ తరఫున శేవహార్ స్థానం నుంచి నీరజ్ సింగ్ బరిలోకి దిగడం, …

Read More »

మంత్రి సురేఖ వ‌ర్సెస్ స‌ర్కారు పెరుగుతున్న ‘గ్యాప్‌’!

తెలంగాణ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కురాలు కొండా సురేఖకు రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య గ్యాప్ పెరుగు తోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్‌లోని సురేఖ ఇంటి ముందు బుధ‌వారం అర్ధ‌రాత్రి తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది. మ‌ఫ్టీలో ఉన్న పోలీసులు న‌లుగురు ఒక్క‌సారిగా ఆమె ఇంట్లోకి ప్ర‌వేశించారు. దీంతో సురేఖ కుమార్తె సుస్మిత పోలీసుల‌ను అడ్డుకున్నారు. వారు పోలీసులు అని తెలియ‌క‌.. అసలు మీరెవ‌రు..? ఎందుకు వ‌చ్చారంటూ.. నిల‌దీశారు. …

Read More »

ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఇంత కీలకం అవుతోందా…?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముందుగా నంద్యాల జిల్లాలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వర్ల దేవాలయంలో పూజా, దర్శనం చేసిన తర్వాత, కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ₹13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాథమిక శిలాన్యాసం చేసి, ప్రారంభిస్తారు – …

Read More »

జ‌గ‌న్ ఫ్యాన్స్.. ఏదో ఒక్క‌టి ఫిక్స‌వ్వండయ్యా

ప్ర‌భుత్వం మీద ప్ర‌తిప‌క్ష పార్టీ విమ‌ర్శ‌లు చేసేట‌పుడు.. ఆ విమ‌ర్శ‌ల్లో లాజిక్ ఎంత‌మేర ఉంది అని చూసుకోవ‌డం కీల‌కం. ఒక స్టాండ్‌కు క‌ట్టుబ‌డి విమ‌ర్శ‌లు చేస్తే.. అవి స‌హేతుకంగా అనిపిస్తేనే జ‌నం నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. ఆ ఇష్యూలో ప్ర‌తిప‌క్షానికి మైలేజీ వ‌స్తుంది. కానీ ప్ర‌తి విష‌యాన్ని రాజ‌కీయం చేద్దామ‌ని, ప్ర‌భుత్వం మీద బుర‌ద‌జ‌ల్లుదామ‌ని చేసే ప్ర‌య‌త్నాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు బొక్క బోర్లా ప‌డుతోంది. విశాఖ‌ప‌ట్నానికి ప్ర‌తిష్టాత్మ‌క‌ …

Read More »

మోడీని మెప్పించిన యువ‌తికి అసెంబ్లీ టికెట్‌!

రాజ‌కీయాల్లో పార్టీల అధినేత‌లు, కీల‌క నాయ‌కులు త‌లుచుకుంటే టికెట్ల‌కు కొద‌వ ఏముంటుంది?. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. గ‌త 2023 జ‌న‌వ‌రిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో రామ‌మందిరం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఆ ప్రారంభ స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి అత్యంత చేరువ‌గా నిలిచిన బీహార్ యువ‌తి, జాన‌ప‌ద గాయ‌కురాలు.. మిథాలీ ఠాకూర్ ఇప్పుడు రాజ‌కీయ నేత‌గా అవ‌త‌రించారు. ఆనాడు ఆమె రామ‌చ‌రిత మాన‌స్‌లోని కొన్ని పంక్తుల‌ను ఆల‌పించి.. ప్ర‌ధానిని మంత్ర …

Read More »

కులాలు-క‌న్నీళ్లు: ‘జూబ్లీహిల్స్’ ర‌చ్చ ర‌చ్చ‌!

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌కు నామినేష‌న్ల ఘ‌ట్టం ప్రారంభ‌మైన 24 గంట‌లు కూడా గ‌డ‌వక ముందే.. పార్టీల మ‌ధ్య ర‌చ్చ రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్యే ఉంద‌న్న చ‌ర్చ నేప‌థ్యంలో ఇరు పార్టీల నాయకులు జోరుగా మాట‌ల మంట‌లు మండిస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ మంత్రులు.. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు ఇక్క‌డ నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మాగంటి …

Read More »

మోడీ వ‌స్తున్నారు.. జాగ్ర‌త్త‌: చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గురువారం రాష్ట్రానికి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు మంత్రుల‌ను హెచ్చ‌రించారు. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. తాజాగా మంత్రులు, అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్సులో మాట్లాడిన చంద్ర‌బాబు.. ప్ర‌ధాన మంత్రి షెడ్యూల్ ఖ‌రారైంద‌ని.. ఆయ‌న ఢిల్లీ నుంచి ఉద‌యం క‌ర్నూలుకు వ‌స్తున్నార‌ని తెలిపారు. ఎక్క‌డా ప్రొటోకాల్ ఇబ్బందులు రాకుండా సంబంధిత మంత్రి చూసుకోవాల‌ని సూచించారు. అదేవిధంగా మంత్రులు అంద‌రూ వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల …

Read More »

మైండ్ లేనేళ్లో అలా మాట్లాడ‌తారు!: లోకేష్‌

రాష్ట్రంలో ఒక్క‌చోట‌కే పెట్టుబడులు తీసుకువ‌స్తున్నార‌ని.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల‌న్నీ.. నిర్ల‌క్ష్యానికి గురి అవుతున్నాయంటూ.. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు మైండ్ లేనోళ్లే.. అలా మాట్లాడ‌తార‌ని వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతానికి మాత్ర‌మే త‌మ అభివృద్ధి ప‌రిమితం కాద‌న్నారు. అన్ని ప్రాంతాల్లోనూ పెట్టుబ‌డులు స‌మీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు చెప్పారు. అదేస‌మ‌యంలో ఉపాధి, ఉద్యోగాల‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు. ఒకే రాజ‌ధానిని అభివృధ్ది చేస్తున్నామ‌న్న నారా లోకేష్‌.. అదేస‌మ‌యంలో …

Read More »