Political News

బాబు మార్క్ సంక్షేమం.. పశువులకూ హాస్టళ్లు

నిజమే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంక్షేమంలో తనదైన ప్రత్యేకతను చాటుతున్నారు. గతంలో పాలనా సంస్కరణలు, పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజల వద్దకే పాలన తదితర అంశాలపై దృష్టి సారించిన చంద్రబాబు… ఈ దఫా కూటమి సర్కారులో సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలను ఇప్పటికే అమలు చేస్తున్న బాబు…పీ4 పేరిట పేదల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించి అందరినీ ఔరా …

Read More »

స్థానిక ఎన్నిక‌ల‌పై రేవంత్ వెన‌క‌డుగు.. రీజ‌నేంటి?

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై నిన్న మొన్న‌టివ‌ర‌కు హడావుడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా యూట‌ర్న్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చే వ‌ర‌కు వేచి చూస్తామ‌న్నారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు తాజా ఎన్నిక‌ల‌కు సంబంధం ఏమిటనేది ప్రశ్న. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను 90 రోజుల్లో పూర్తి చేయాల‌ని హైకోర్టు గ‌డువు ఇచ్చింది. ఈ గ‌డువు ఈ నెల 30తో ముగుస్తుంది. ఇప్పటికే స్థానిక అధికారులు ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఏర్పాట్లు …

Read More »

21 అర్థ‌రాత్రి కల్లా అమెరికా లోకి వెశ్శిపోవాలి

పాలన పరంగా పేరు తెచ్చుకున్న అమెరికా అధ్యక్షులు ఎంతో మంది ఉన్నారు. వారు తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రపంచ దేశాలను మెప్పించిన వారు కూడా ఉన్నారు. కానీ, తమ నిర్ణయాలతో సంచలనాలకు వేదికగా మారిన వారు ఒకరే. జార్జ్ బుష్ తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పాలన ఎలా ఉన్నా, పరిస్థితి ఎలా ఉన్నా, తన నిర్ణయాలు దుందుడుకు చేష్టలతో అమెరికన్లకే కాకుండా ప్రపంచ దేశాలకు …

Read More »

పెద్దిరెడ్డి.. జ‌గ‌న్‌ను ప‌క్క‌న పెట్టేశారా?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి. జగన్ పట్ల అత్యంత గౌరవం, మర్యాదలున్న నేత. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేశారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. అంతేకాదు, వైఎస్ కుటుంబంతోనూ అవినాభావ సంబంధాలు ఉన్న నాయకుడు. జగన్ హయాంకు వచ్చినప్పటికీ ఆయన ప్రభావం ఏమీ తగ్గలేదు. అదే విధంగా కొనసాగింది. జగన్ కూడా తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఐదు సంవత్సరాలు …

Read More »

వారిపై ‘అన‌ర్హ‌త వేటు’ వేయించండి: జ‌గ‌న్

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్సీలుగా ఉండి.. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న ముగ్గురు అభ్య‌ర్థుల‌పై వేటు వేయించాల‌ని ఆయ‌న‌.. మాజీ మంత్రి, శాస‌న మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను ఆదేశించిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని సోమ‌వార‌మే మండ‌లిలో ప్ర‌వేశ పెట్టాల‌ని.. వేటు వేయించే వ‌ర‌కు వ‌దిలి పెట్ట‌వ‌ద్ద‌ని కూడా తేల్చి చెప్పిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి. నిజానికి …

Read More »

ఇంటి ఆడ‌బిడ్డ‌పై న‌లుగురు దాడి చేశారు: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌య‌, ఆ పార్టీకి ఇటీవ‌ల రాజీనామా చేసిన క‌విత విష‌యంపై సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. “ఇంటి ఆడ‌బిడ్డ‌పై న‌లుగురు క‌లిసి దాడి చేశారు” అని అన్నారు. అయినా.. క‌విత వ్య‌వ‌హారం రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యం కాద‌న్న ఆయ‌న‌, కేవ‌లం కుటుంబం, ఆస్తికి సంబంధించిన విష‌య‌మేన‌ని తేల్చి చెప్పారు. కుటుంబ వ్య‌వ‌హారంతో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, ఇత‌ర పార్టీల‌కు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని అన్నారు. …

Read More »

అసెంబ్లీకి వెళ్తే… జ‌గ‌న్‌కు `మూడు` విధాల మేలు..!

రాజకీయాల్లో పట్టుదలలకు, పంతాలకు చోటు ఉండదు. ఎందుకంటే ప్రజా కోణంలో చూసినప్పుడు నాయకులు కొన్ని కొన్ని సందర్భాల్లో అవమానాలను ఎదురుకోవాలి. అదే సమయంలో విమర్శలు కూడా తట్టుకోవాలి. ఈ రెండిటికీ సిద్ధంగా లేనప్పుడు రాజకీయాల్లో ఉండడమే వేస్ట్. ఈ మాట వైసీపీ నాయకుల నుంచే వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ మారం చేయటం. అదే విధంగా తనకు సీఎంతో సమానంగా మైకు ఇవ్వాలని పట్టుబట్టడం. ఈ …

Read More »

మా పార్టీ.. పుష్ప‌క విమానం: చంద్ర‌బాబు ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీ గిరి గీసుకుని కూర్చోద‌ని అన్నారు. “ఇది ప్ర‌జ‌ల పార్టీ. ప్ర‌జ‌ల కోసం పెట్టిన పార్టీ.. పుట్టిన పార్టీ.. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇది పుష్ప‌క విమానం. ఎంత మంది వ‌చ్చినా.. మ‌రొక‌రికి చోటు ఉంటుంది. రాష్ట్రంలో సుప‌రిపాల‌న‌ను చూసి చాలా మంది చేరుతామ‌ని ముందుకు వ‌స్తున్నారు. అంద‌రికీ ఒక్క‌టే చెబుతున్నా.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనుకునేవారు ఎవ‌రైనా …

Read More »

నాకేం తెలీదు.. న‌న్ను ఇరికించారు: మిథున్‌రెడ్డి

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-4 నిందితుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు శుక్ర‌వారం ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు ఏక‌బిగిన విచారించారు. విజ‌య‌వాడ‌లోని సిట్ కార్యాల‌యానికి తీసుకువ‌చ్చిన ఆయ‌న‌ను.. ముగ్గురు అధికారులు ప్ర‌శ్నించారు. ఈ కుంభ‌కోణంలో డిస్టిల‌రీల(మ‌ద్యం త‌యారు చేసే కంపెనీలు)కు మ‌ద్యాన్ని పంపిణీ చేసే విష‌యంలో …

Read More »

వైసీపీ అప్పులే కాదు.. జ‌రిమానాలు కూడా క‌డుతున్నాం: చంద్ర‌బాబు

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల కార‌ణంగా ప్ర‌జాధ‌నం వృథా అవుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ హ‌యాంలో అప్పులు చేశార‌ని, లెక్క ప‌త్రం కూడా లేకుండానే అప్పులు తెచ్చార‌ని ఆరోపించారు. అయితే.. ఈ అప్పుల సొమ్మును దేనికి ఖ‌ర్చు చేశారో కూడాతెలియ‌డం లేద‌న్నారు. ఎంత త‌వ్వినా.. అప్పులు వ‌స్తూనే ఉన్నాయ‌ని తెలిపారు. ఒక‌వైపు సంక్షేమం, మ‌రో వైపు అభివృద్ధిని అమ‌లు చేస్తూనే.. ఇంకోవైపు.. వైసీపీ చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌డుతున్నామ‌ని.. …

Read More »

చెప్ప‌డం తేలిక‌.. చేస్తే తెలుస్తుంది: ప‌వ‌న్ అస‌హ‌నం

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఎమ్మెల్యేల ప్ర‌శ్న‌లు, వారి సూచ‌న‌ల‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. “చెప్ప‌డం తేలిక‌.. చేస్తే తెలుస్తుంది.. అధ్య‌క్షా!” అని వ్యాఖ్యానించారు. సుమారు 4 నిమిషాల త‌న స‌మాధానంలో ఆయ‌న ఆచి తూచి వ్య‌వ‌హ‌రించారు. తీవ్ర కోపాన్ని కూడా ఆయ‌న త‌గ్గించుకున్న‌ట్టు ప‌లు సంద‌ర్భాల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. “స‌భ్యులు అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. అవి ఇప్పుడే వ‌చ్చాయా?” అని ఓ సంద‌ర్భంలో ప్ర‌శ్నించిన …

Read More »

వైసీపీ లేని లోటు తీర్చేస్తున్న త‌మ్ముళ్లు

ఏపీ అసెంబ్లీకి రావాల‌ని.. స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని.. మాట్లాడేందుకు స‌మ‌యం ఇస్తామ‌ని చెప్పినా.. వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ మంకు ప‌ట్టుప‌ట్టి రాకుండా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. విప‌క్షం లేని లోటును మ‌న వాళ్లే తీర్చాల‌న్న సీఎం చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్ర‌జ‌ల త‌ర ఫున గ‌ళం వినిపిస్తున్నారు. అనేక స‌మ‌స్య‌ల‌పై వారు స‌భ‌లో స్పందిస్తున్నారు. మంత్రుల‌ను సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్రమంలో …

Read More »