Political News

మంగ‌ళ‌గిరితో ‘బ్రాహ్మ‌ణి’ బాండింగ్‌.. పెద్ద స్ట్రాట‌జీ!

మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స‌తీమ‌ణి, బాల‌య్య కుమార్తె నారా బ్రాహ్మ‌ణి సంద‌డి చేశారు. ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన ఆమె.. సాయంత్రం 6 వ‌ర‌కు ప‌లు ప్రాంతాల్లో పర్య‌టించారు. ముఖ్యంగా చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప‌రిశీలించారు. నూత‌నంగా తీసుకువ‌చ్చిన డిజైన్ల‌ను ప‌రిశీలించి.. సంతృప్తి వ్య‌క్తం చేశారు. అనంత‌రం.. మ‌హిళ‌ల కోసం తాను స్వ‌యంగా ఏర్పాటు చేసిన ‘స్త్రీ …

Read More »

జ‌గ‌న్‌.. నీకిదే చెబుతున్నా: బాబు వార్నింగ్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌గా స్పందించారు. జ‌గ‌న్ మీడియా స‌మావేశాన్ని చంద్ర‌బాబు టీవీలో ప్ర‌త్య‌క్షంగా వీక్షించినట్టు తెలిసింది. అనంత‌రం.. ఆయ‌న మాట్లాడుతూ.. జ‌గ‌న్ నీకిదే చెబుతున్నా.. అంటూ గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. ముఖ్యంగా త‌న పాల‌న‌ను చంబ‌ల్ లోయ‌తో పోల్చి మాట్లాడ‌డాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌రింత సీరియ‌స్ అయ్యారు. “నేనంటే ఏమ‌నుకున్నావ్‌. మీ నాన్న …

Read More »

జగన్ కు తెలంగాణ ఎంపీ ఇచ్చిపడేశారు!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు హాట్ లైన్ లో ఉంటారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇటు టీడీపీ నేతలతో పాటు అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. కౌంటర్లు ఇవ్వడంలో ఓ రేంజి స్పీడు చూపించే టీ కాంగ్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. జగన్ …

Read More »

అమ‌రావతిలో బాల‌య్య 750 కోట్ల పెట్టుబ‌డి

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో టీడీపీ ఎమ్మెల్యే, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ 750 కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డి పెట్ట‌నున్నారు. పెట్టుబ‌డుల‌కు పెద్ద పీట వేస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం.. రాజ‌ధానిలో బాల‌య్య చైర్మ‌న్‌గా ఉన్న బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరికన్ కేన్స‌ర్ ఆసుప‌త్రికి 21 ఎక‌రాల‌ను కేటాయించింది. దీనిలో స‌మ‌గ్ర కేన్స‌ర్ ఆసుప‌త్రి నిర్మాణం చేప‌ట్టేందుకు బ‌స‌వ తార‌కం సంస్థ ముందుకు వ‌చ్చింది. మొత్తం ప్రాజెక్టును రెండు ద‌శ‌ల్లో పూర్తి చేయ‌నున్నారు. 21 …

Read More »

‘సింహం సింగిల్ గా’ బలం జగన్ కు అర్థమైనట్టే!

ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు ఎప్పుడూ జగన్ ను, వారి పార్టీని సింహం సింగిల్ గా వస్తుంది అంటూ కీర్తిస్తూ ఉంటారు. ఇతర పార్టీల మద్దతు లేకుండానే నెట్టుకు వస్తున్నామని, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మాదిరిగా ఇతర పార్టీల మద్దతు తమకు అవసరం లేదని కూడా చెబుతూ ఉంటారు. అయితే ఆ సింగిల్ సింహం బలమెంతో పార్టీ అధినేత జగన్ కు ఇప్పుడు బాగానే అర్థమైనట్టే ఉందని …

Read More »

సుప్రీం ఎఫెక్ట్‌: ప‌ద‌వులు కోల్పోయిన కోదండ‌రామ్‌, అమీర్

తెలంగాణ శాస‌న మండ‌లి స‌భ్యులుగా ఉన్న ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌, అమీర్ అలీలు త‌మ స‌భ్య‌త్వాల‌ను కోల్పోయారు. వీరిద్ద‌రి శాస‌న మండ‌లి స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు బుధ‌వారం సాయంత్రం సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. త‌క్ష‌ణ‌మే ఇవి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని.. వారికి క‌ల్పించిన అన్నిసౌక‌ర్యాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని, అదేవిధంగా అధికారిక నివాసాల‌ను ఇచ్చి ఉంటే.. వాటిని కూడా త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయించాల‌ని ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఈ ఇద్ద‌రి స‌భ్య‌త్వాలు …

Read More »

ఈ బీజేపీ ఎంపీ రాహుల్ ను మస్తు ఖుషీ చేసిండు!

అసలే ఇప్పుడు బీజేపీ పేరు వినిపిస్తేనే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భగ్గుమంటున్నారు. అలాంటి సమయంలో బీజేపీకి చెందిన ఓ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి మాత్రం రాహుల్ ను మస్తు ఖుషీ చేసిండంటే నమ్మొచ్చా? అంత అనుమానం అక్కర్లేదు. ఆ బీజేపీ ఎంపీ నిజంగానే రాహుల్ ను సంతోషంలో ముంచెత్తారు. మోదీ సర్కారుపై పోరుకు సంబంధించి ఆ …

Read More »

పులివెందులలో రీపోలింగ్.. తాడేపల్లిలో వైసీపీ అభ్యర్థి

ఏపీలో అటు అధికార పక్షం రథసారథి టీడీపీ, ఇటు విపక్షం వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం పోలింగ్ ముగిసిన తర్వాత బుధవారం కూడా ఈ విచిత్రాల పరంపర కొనసాగింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక తీరుపై ఒకింత అనుమానం కలిగిన ఎన్నికల సంఘం… రెండు పోలింగ్ కేంద్రాల్లో బుధవారం రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసింది. …

Read More »

‘అది వైసీపీ ‘ల‌క్కీ’ నెంబ‌రు క‌దా’

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీపై ఎప్పుడూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే చంద్ర‌బాబు తాజాగా జోకులు పేల్చారు. అమ‌రావ‌తిపై స‌మీక్ష చేస్తున్న స‌మ‌యంలో మంత్రి నారాయ‌ణ‌కు ఓ మెసేజ్ వ‌చ్చింది. ‘పులివెందుల‌లో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. మొత్తం 11 మంది పోటీలో ఉన్నారు. అంతా ప్ర‌శాంతంగా జ‌రిగిపోయింది. ప్ర‌జాస్వామ్య యుతంగా ఎన్నిక‌లు నిర్వంహించాం.’ అని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు ఫోన్ నుంచి మంత్రి నారాయ‌ణ‌కు మెసేజ్ వ‌చ్చింది. దీనిని ఆయ‌న …

Read More »

అమరావతి పనుల్లో ఊహించని వేగం: చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతి పనుల్లో ఊహించని వేగం కనిపిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. తాజాగా అమరావతి పనులపై ఆయన సమీక్షించారు. మంత్రి నారాయణ, రాజధాని ప్రాంత సాధికార అథారిటీ (సీఆర్‌డీఏ) అధికారులు, అదేవిధంగా రాజధానిలో పనులు చేస్తున్న వివిధ కాంట్రాక్టర్లు కూడా సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పనుల పురోగతిపై సంతోషం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పనులు చేపట్టారని, అయితే నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని …

Read More »

బాబు కోరకుండానే మోడీ వరం.. ఏపీకి కీలక ప్రాజెక్టు

ఏపీ సీఎం చంద్రబాబు కోరుతున్న పనులను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చకచకా చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతికి రుణం ఇప్పించడంతో పాటు కేంద్రం కూడా గ్రాంట్లు ఇస్తోంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు సమకూరుస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ప్రాజెక్టులకు కూడా నిధులు ఇస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆపేసిన పథకాలను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి అమలు చేస్తోంది. వీటికి సైతం కేంద్రం నిధులు …

Read More »

మేం వస్తే.. మీ ఉద్యోగాలు తీసేస్తాం: పోలీసులపై వైసీపీ నేత ఫైర్

పోలీసులపై వైసీపీ నాయకులు మరోసారి నోరు వేసుకున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా వైసీపీ అధినేత జగన్ పోలీసులను తరచుగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమను పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని, ఎంపీ అయిన అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని రోడ్ల వెంబడి తిప్పారని పేర్కొంటూ ప్రొద్దుటూరు …

Read More »