ఏపీ సీఎం చంద్రబాబు ఏదైనా ప్రాజెక్టు చేపడితే.. దానికి ముందు వెనుక అనేక రూపాల్లో ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఒక నిర్ణయం తీసుకునేందుకు ఆయన వంద సార్లు ఆలోచన చేస్తారు. గతంలో అమరావతి రాజధాని ఏర్పాటు విషయంలోనూ ఆయన అనేక విధాలుగా అధ్యయనం చేశారు. ప్రపంచ స్థాయి నగరంగా రాజధానిని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప్రజలను ఒప్పించి.. మెప్పించి.. ఆయన రాజధానికి శ్రీకారం చుట్టారు. అలానే కర్నూలు జిల్లాలో …
Read More »అరుణమ్మకు ప్రమోషన్.. బీజేపీ స్ట్రాటజీ
తెలంగాణ బీజేపీలో పదవుల పందేరం కొనసాగుతోంది. తాజాగా రామచందర్రావుకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించిన అధిష్టానం.. ఈ పోస్టును ఆశించిన ఒకరిద్దరు నాయకులను సంతృప్తి పరిచేందుకు మరో రూపంలో వారికి ప్రమోషన్ ఇస్తోంది. ఈ జాబితాలో మహబూబ్నగర్ పార్లమెంటు ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణకు కీలక పదవిని ఇచ్చింది. అంతేకాదు.. ఇప్పటికే ఆమెకు రెండు పదవులు ఉన్నా.. ఇప్పుడు మూడో పదవిని కట్టబెట్టడం ద్వారా …
Read More »కవిత వ్యూహాల పదును మామూలుగా లేదుగా!
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత రాజకీయంగా ఓ రేంజిలో ఎదుగుతున్నారు. అసలు కవిత అడుగు ఏ దిశగా పడనుందన్న విషయంపై ముందుగానే అంచనా వేయడం ఏ ఒక్కరికీ సాధ్యం కావడం లేదని చెప్పక తప్పదు. బీఆర్ఎస్ లోనే ఉన్నారా? అన్న ఓ జర్నలిస్టు ప్రశ్నకు… “నేను బీఆర్ఎస్ ను ఓన్ చేసుకున్నా. మరి నన్ను బీఆర్ఎస్ ఓన్ చేసుకుందో, లేదో పార్టీనే …
Read More »‘ఖాకీ’ వదిలేసిన యంగ్ ఐపీఎస్… రీజనేంటి?
ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ వేడెక్కిపోతున్నాయి. విపక్షం వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకున్న ఐపీఎస్, ఐఏఎస్ లు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా బుధవారం ఏపీ పోలీసు శాఖలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. యంగ్ ఐపీఎస్ అదికారి సిద్ధార్థ్ కౌశల్ తన పోలీసు డ్యూటీని వదులుకున్నారు. ఈ మేరకు ఆయన స్వచ్ఛంద పదవీ వివరణ (వాలంటరీ రిటైర్ మెంట్ స్కీమ్-వీఆర్ఎస్)కు …
Read More »బొట్టు పెట్టి మరీ స్వాగతం పలుకుతున్నారు
ఏపీలో అధికార కూటమికి ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ఓ వేడుకను జరపాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అయితే అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం, ఆ తర్వాత వరుసగా కురిసిన వర్షాలు… వెరసి జూన్ 12 తర్వాత గానీ సుపరిపాలనలో తొలి అడుగు సమావేశాన్ని నిర్వహించారు. అయితే తాజాగా బుధవారం నుంచి …
Read More »తెలంగాణ పల్లెల్లో సందడి స్టార్ట్!
తెలంగాణలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ సందడి ప్రారంభమైంది. రైతులు, యువత, స్థానిక నాయకులు కూడా సందడిగా ఉన్నారు. ఇదేదో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేళ్లను చర్చించుకునేందుకు, ముఖ్యంగా రైతు భరోసా వంటి నిధులు విడుదల చేసినందుకు కాదట. ప్యూర్గా.. పూర్తిగా.. స్థానిక ఎన్నికల కోసమేనని తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర హైకోర్టు గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. దీనికిగాను 90 రోజుల పాటు …
Read More »జూబ్లీహిల్స్ ఉప పోరు.. బీఆర్ఎస్ రాయబారం?!
హైదరాబాద్ నడిబొడ్డులోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయమే ఉంది. మాగంటి గోపీనాథ్ మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇదిలావుంటే.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. గత ఎన్నికల్లో తృటిలో తమ అభ్యర్థి ఓడిపోయారని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికలో మాత్రం గెలిచి తీరాలని నిర్ణయించు కుంది. ఇక, అభ్యర్థుల పరంగా కూడా కాంగ్రెస్ పార్టీలో …
Read More »ఆ వైసీపీ నేత పై ‘ఈగ’ వాలట్లేదు..
ఆయన వైసీపీ నాయకుడు. పైగా ఫైర్ బ్రాండ్. మాజీ మంత్రి. నోరు విప్పితే.. టీడీపీ పై విమర్శల పర్వం. జనసేన పై ఘాటు వ్యాఖ్యలు. ఇదీ… గత ఐదేళ్లలో సదరు నాయకుడు చేసిన రాజకీయం. దీంతో కూటమి లో నాయకులకు ఆయనంటే కంటగింపు. అవకాశం-అవసరం కోసం ఎదరు చూశారు. ఎప్పుడెప్పుడు అవకాశం దక్కుతుందా? ఎప్పుడెప్పుడు.. కసి తీర్చుకుందామా? అని కూడా లెక్కలు వేసుకున్నారు. తీరా గత ఏడాదే ఇలాంటి వారికి …
Read More »ప్రజల్లోకి వెళ్లాలని ఉంది.. కానీ
కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను ప్రజల మధ్య ఉండాలని.. ప్రజల వద్దకువెళ్లాని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కీలక దిశానిర్దేశం చేశారు. దీనికి గడువు కూడా వచ్చేసింది. బుధవారం నుంచి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రజల వద్దకు వెళ్లి.. కూటమి ఏడాది పాలనలో చేసిన మంచి పనులను వివ రించారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే ఫీలింగును ప్రజల్లో కల్పించాలి. అంతేకాదు.. చేసిన పనులపై …
Read More »రోజులు మారాయి.. రాజాసింగే మారలేదు!
బలమైన నాయకులే కావొచ్చు.. నియోజకవర్గాల్లో తిరుగులేని ఓటు బ్యాంకు కూడా ఉండొచ్చు.. ప్రజల మధ్య మంచి సానుకూలత కూడా ఉండొచ్చు. కానీ, ఎంత ఉన్నా.. ఒదిగి ఉండడమనే దండలోని దారం వంటి లక్షణమే ఏ నాయకుడికైనా కీలకం. ఒకప్పుడు అంటే.. నాయకులు తక్కువ.. పార్టీల పరిధి ఎక్కువగా ఉండేది. పైగా సామాజిక వర్గాల వారీగా.. ప్రభావితం చేస్తారన్న ఆలోచన కూడా ఉండేది. అందుకే.. ఓ 15 ఏళ్ల కిందట.. నాయకులపై …
Read More »48 గంటల తర్వాత… ప్రమాదం పై సిగాచీ ప్రకటన
ఘోర ప్రమాదం జరిగి కార్మికులు చెల్లాచెదురు అయిపోతే… ప్రభుత్వం, ప్రతిపక్షాలు ప్రమాద స్థలిని సందర్శించి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించి, ఆ మేరకు కొంతమేర సాయం అందించాక గాని అసలు కంపెనీ యాజమాన్యం స్పందించక పోవడం నిజంగానే ఎక్కడ కూడా చూసి ఉండం. తన కంపెనీలో ప్రమాదం జరిగితే… అందరికంటే ముందు ఆ కంపెనీ యాజమాన్యం స్పందిస్తుంది. తన కార్మికులకు అండగా నిలబడుతుంది. అయితే సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక …
Read More »సింగయ్య చుట్టూ రాజకీయాలు..
గత 15 రోజులకుపైగా మీడియాలో హాట్ టాపిక్గా మారిన .. సింగయ్య మృతి కేసు యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా? ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్న వాదన వీగిపోతుందా? అంటే.. ఔననే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా సింగయ్య భార్య లూర్దు మేరి.. మీడియా ముందుకు వచ్చారు. తన భర్త కారు కింద పడడం వల్ల మృతి చెందలేదన్నారు. ఆయన మరణంపై తమకు అనుమానాలున్నాయని తెలిపారు. కావాలనే ఎవరో చంపేసి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates