ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటేనే.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు.. గీతా జయంతినాడు ఆయన ఏకంగా భగవద్గీత పారాయణ కూడా చేస్తారు. ఇటీవల కర్ణాటకలోని శ్రీకృష్ణ మఠానికి వెళ్లినప్పుడు కూడా భగవద్గీత లక్ష గళ పారాయణలోనూ పాల్గొన్నారు. అయోధ్యలో 5 దశాబ్దాల నాటి కలను నిజం చేస్తూ.. రామమందిరాన్ని సాకారం చేశారు. ఇక, ఎక్కడ ఏ అవకాశం చిక్కినా.. ఆయన రాముడు, కృష్ణుడు.. హిందూ పరివార దేవతల …
Read More »‘నేను తెలంగాణ ప్రజల బాణాన్ని..’
తెలంగాణలో రాజకీయ శపథకాలు పెరుగుతున్నాయి. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ను మరోసారి అధికారంలోకి రానివ్వబోనంటూ సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొడతామంటూ కేసీఆర్ శపథం చేశారు. తాజాగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా భీషణ ప్రతిజ్ఞ చేశారు. బీఆర్ ఎస్ పార్టీతో తాను తెగతెంపులు చేసుకున్నానని, మరోసారి ఆ పార్టీ కండువా కప్పుకునే పరిస్థితే లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. …
Read More »ఒక్కొక్కరి ఖాతాలో 60 వేలు: బాబు క్రిస్మస్ బొనాంజా!
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తానని చెబుతున్న ఆయన. ఇప్పటికే పలు పండుగలను రాష్ట్ర అధికారిక పండుగలుగా గుర్తించారు. వాటిని ప్రభుత్వం తరఫున కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారి ఏసు క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ను రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తించారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలను కూడా నిర్వహిస్తోంది. గవర్నర్ సహా మంత్రులు కూడా …
Read More »ఇల్లా మాట్లాడితే నవ్వుకుంటారు బండి
చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు వచ్చాయి. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ మాటలను ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదన్న భావన ఎక్కువగా వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో పైకి చూస్తే త్రికోణ పోటీలా కనిపించినా, అసలు పోరు మాత్రం …
Read More »ఆ ‘స్పీడ్’ ఏంటి బాబు గారు?
టీడీపీ అధినేత. ఏపీ సీఎం చంద్రబాబు విజన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20 ఏళ్ల క్రితమే విజన్ 2020 అంటూ 2020లో ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని ఆనాడే అంచనా వేసిన దార్శనీకుడు చంద్రబాబు. దేశవ్యాప్తంగా విజనరీ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు వినూత్న సంస్కరణలు, ఆలోచనలతో పాలనను పరుగులు పెట్టిస్తుంటారు. ఫైళ్లు, దస్త్రాలతో నిండిన ప్రభుత్వ కార్యాలయాలలో కంప్యూటర్లు, బయోమెట్రిక్ అటెండన్స్ రావడం చంద్రబాబు చలవే. …
Read More »‘కేసీఆర్ అధికారం’పై సీఎం రేవంత్ సంచలన శపథం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన శపథం చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఎట్టిపరిస్థితిలోనూ మరోసారి అధికారం దక్కనివ్వనని.. ఇది తన శపథమని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కోసిగిలో నిర్వహించిన కాంగ్రెస్ మద్దతు దారులైన సర్పంచ్ల సన్మాన సభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో రెండింట మూడు …
Read More »పవన్ వార్నింగులను వైసీపీ లెక్క చేస్తుందా?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీమళ్లీ వైసిపికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. నాలుగు రోజుల కిందట నిర్వహించిన కార్యక్రమంలో వైసిపి నాయకులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప లైన్లోకి రారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి కొనసాగింపుగా మరోసారి సోమవారం నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసిపి నాయకుల …
Read More »ఏపీలో ఇకపై టికెట్ రేట్లు అలా పెంచరు
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు టికెట్ రేట్లు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా చిత్రాల నిర్మాతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం, వారం లేదా పది రోజులపాటు స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వాలు ఆమోద ముద్ర వేయడం పరిపాటి. అయితే, ఈ రకంగా సినిమా టికెట్ల రేట్లు పెంచడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల అఖండ-2 చిత్రానికి …
Read More »ఢిల్లీలో మూడు రోజులు… కేంద్ర మంత్రికి ఎలర్జీలు
ఢిల్లీ కాలుష్యం గురించి రోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. సామాన్యులే కాదు, ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా దీని బారిన పడుతున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ పొల్యూషన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీలో కేవలం మూడు రోజులు ఉన్నా సరే, ఈ కాలుష్యం వల్ల తనకు అలర్జీలు వస్తున్నాయని ఆయన వాపోయారు. ఒక బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న …
Read More »పవన్ 5 సార్లు సీఎం కావాలన్నదే ఆవిడ కోరిక
ఇప్పటం….జనసేన నేతలు, కార్యకర్తలకు ఈ పేరు బాగా గుర్తుంటుంది. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో ఆ గ్రామంపై అప్పటి వైసీపీ ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపణలు వచ్చాయి. రోడ్డు విస్తరణ పేరు చెప్పి జనసేన కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేసి మరీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిందని జనసేన నేతలు ఆరోపించారు. అయితే, 2024 ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని, గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పటం రావాలని ఇండ్ల …
Read More »‘ప్రియాంక గాంధీ ప్రధాని పదవికి అర్హురాలు’
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఆయన సొంత బావ, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పేరు ఎత్తకుండానే కీలక కుంపటి రాజేశారు. పార్టీలో ప్రధాన మంత్రి పదవికి తన భార్య, వయనాడ్(కేరళ) ఎంపీ ప్రియాంక గాంధీ అర్హురాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో బలమైన గళం వినిపించారని చెబుతూ.. కాంగ్రెస్ పార్టీని ఆమె బలంగా లోక్సలో ముందుకు …
Read More »విధేయతకు వీరతాడు: టీడీపీ నేతకు ఊహించని పదవి!
టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్కు ఊహించని పదవి లభించింది. అది కూడా రాజ్యాంగబద్ధమైన పదవి కావడం గమనార్హం. సుప్రీంకోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వాదనలు వినిపించేందుకు సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ పదవులు ఉన్నాయి. ఇవి రాజ్యాంగబద్ధమైన పదవులు. వీటిలో తాజాగా అదనపు సొలిసిటర్ జనరల్ పదవికి కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపికయ్యారు. న్యాయవాద వృత్తిలో సుదీర్ఘ అనుభవం ఉండడం.. రాజ్యసభ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates