ప్రస్తుత కూటమి ప్రభుత్వ దూకుడు, అమలు చేస్తున్న సంక్షేమం, బలమైన గళం వినిపిస్తున్న నాయకులు ఒకవైపు. సైలెంట్గా వ్యవహరిస్తున్న నేతలు, అధినేతపైనే విమర్శలు చేస్తున్న నాయకులు, పార్టీ కార్యక్రమాలకు కడుదూరంగా ఉంటున్న సీనియర్లు మరోవైపు. ఇదే ఇప్పుడు ఏపీలో టీడీపీ, వైసీపీల్లో స్పష్టంగా కనిపిస్తున్న రాజకీయం. చంద్రబాబు చెబుతున్న మాటను కొందరు పక్కన పెట్టేస్తున్నా, చాలా మంది మాత్రం ఫాలో అవుతున్నారు. స్థానికంగా పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మెజారిటీ నియోజకవర్గాల్లో …
Read More »తమ్ముళ్లూ పారాహుషార్: ‘తొలి అడుగు’పై బాబు నిఘా
లూజుగా వ్యవహరించే, ఇష్టానుసారంగా వ్యవహరించే నాయకులకు ఎక్కడికక్కడ నట్లు బిగించే కార్యక్ర మం రాష్ట్రంలో కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆయన నిఘాను పెడుతూనే ఉన్నారు. తప్పులు చేస్తున్నవారిని హెచ్చరిస్తూ నే ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటూ.. వాటికి అనుగుణంగా నాయకుల ను మలుస్తున్నారు. తాజాగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. …
Read More »ఆర్టీసీ ఫ్రీ: వైసీపీ అష్ట దిగ్బంధనం!
పార్టీని నడిపించేందుకే కాదు.. పార్టీని బలోపేతం చేసేందుకు కూడా సలహాలు కావాలి. కేవలం ప్రజల్లో ఏర్పడే సానుభూతిని నమ్ముకుని.. ముందుకు సాగే పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో నాయకులకు, పార్టీలకు కూడా లేదు. ఎందుకంటే.. ప్రజల మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో పట్టుకోవడం.. అంత ఈజీ కాదు. ఇప్పుడున్నట్టుగా.. వచ్చే రెండేళ్ల తర్వాత రాజకీయాలు ఉండవు. ప్రజల మూడ్ కూడా ఉండదు. నిన్న మొన్నటి వరకు వైసీపీ మాత్రమే.. సంక్షేమం అమలు …
Read More »పయ్యావుల సరిగ్గా పని చేయలేకపొతున్నారా?
పయ్యావుల కేశవ్.. రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో తొలిసారి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. నిజానికి సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా… ఆయనకు ఇప్పుడే.. ఫస్ట్ టైమ్ మంత్రి పదవి దక్కింది. అది కూడా కీలక మైన ఆర్థిక శాఖను ఆయన భుజాన మోస్తున్నారు. దీనికి ఉన్న ఏకైక కారణం.. వైసీపీ హయాంలో ప్రజా పద్దుల కమిటీకి చైర్మన్(పబ్లిక్ అకౌంట్స్)గా ఆయన వ్యవహరించారు. దీంతో ఆర్థిక వ్యవహారాలు ఆయన కు బాగా …
Read More »జగన్, కేటీఆర్లకు ‘రాఖీ’ మిస్ చేసిన రాజకీయం
దేశవ్యాప్తంగా రాఖీ పండుగను అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, ఇరు తెలుగు రాష్ట్రాలలోని రెండు హై ప్రొఫైల్ కుటుంబాలలో మాత్రం రాఖీ పండుగ సందడి కనిపించడం లేదు. రాజకీయ వైరంతో ఒకరు… రాజకీయంగా అంతర్గత విభేదాలతో మరొకరు రాఖీ పండుగ జరుపుకోలేదు. ఏపీ మాజీ సీఎం జగన్కు వైఎస్ షర్మిల రాఖీ కట్టకపోవడం… కవిత రాఖీ కట్టేందుకు సిద్ధంగా ఉన్నా కేటీఆర్ అందుబాటులో లేకపోవడం హాట్ టాపిక్గా మారాయి. …
Read More »ఆ ఒక్క మాటతో మంగళగిరి మనసు దోచేసిన లోకేష్!
రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. అయితే.. ఈ సెంటిమెంటు వ్యవహారం ఒక్కొక్క పార్టీకి, ఒక్కొక్క నేతకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ విషయంలో టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. మరో అడుగు ముందుకు వేశారు. శనివారం రాఖీ పండుగను పురస్కరించుకుని ఆయన మంగళగిరి కార్యాలయంలోనే అందుబాటులో ఉన్నారు. వాస్తవానికి సీఎం చంద్రబాబు వెంట ఆయన కూడా.. మన్యం జిల్లాకు వెళ్లి.. జన జాతీయ ఆదివాసీ …
Read More »బాబూ ఇది చాలా మంచి పని
గిరిజనులు, ఆదివాసీలను వైసీపీ ఓటు బ్యాంకుగా మార్చిందని.. వారిని ఓటు బ్యాంకుగానే చూసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. శనివారం.. జన జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో ఆయన ముచ్చటించారు. తొలుత గిరిజనుల సంప్రదాయ నృత్యాలను తిలకించారు. కొమ్ములతో చేసిన తలపాగాను ధరించారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు …
Read More »ఈసీ వర్సెస్ రాహుల్.. మరింత హీటెక్కింది
కేంద్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల మధ్య నెలకొన్నవివాదం అంతకంతకూ ముదురుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం సహకారంతోనే విజయం సాధించిందని రాహుల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాహుల్ ఈసీపై సంచలన ఆరోపణలను గుప్పించారు. ఈ ఆరోపణలపై ఈసీ కూడా …
Read More »రెండు రాష్ట్రాల్లో.. రాజకీయ రాఖీలు.. !
రాఖీ పండుగ అంటే.. అన్న, తమ్ముళ్ల మేలు కోరి.. మహిళలు కట్టే రాఖీ అన్న విషయం తెలిసిందే. ఇక, తమ తోబుట్టువు మేలు కోరి.. అన్నదమ్ములు కూడా.. కానుకలు ఇస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దక్షిణాదిలో ఈ పండుగ జోరుగా సాగుతోంది. అయితే.. సాధారణ రాఖీ పండుగ ఎలా ఉన్నప్పటికీ.. రాజకీయ రాఖీ పండుగ మాత్రం జోరుగా సాగుతుండడం గమనార్హం. అంటే.. ఇరుగు పొరుగు పార్టీలకు చెందిన నాయకులు …
Read More »గువ్వలతో వెళ్లే ఆ ఐదుగురు ఎవరు?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో పొలిటికల్ జంపింగ్ లు మొదలైపోయాయి. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోతున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బీజేపీ కార్యాలయానికి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాంచందర్ ఓ సంచలన వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ కు చెందిన ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరుతున్నారని ఆయన తెలిపారు. …
Read More »మోడీ అర్జెంట్ కేబినెట్ భేటీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫస్ట్ టైమ్ అర్జెంటుగా కేబినెట్ భేటీ నిర్వహించారు. వాస్తవానికి కేబినెట్ భేటీ అంటే బుధవారం నిర్వహిస్తున్నారు. ప్రతి బుధవారం కేబినెట్ మంత్రులతో ప్రధాన మంత్రి చర్చిస్తారు. ఆయన దేశంలో లేకపోయినప్పుడు మాత్రమే వాయిదా పడుతూ ఉంటుంది. ఈ దఫా మాత్రం శుక్రవారం మధ్యాహ్నం అనూహ్యంగా కేబినెట్ భేటీ నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులకు స్వయంగా ఫోన్లు చేసిన ప్రధాన మంత్రి మీటింగ్కు అర్జెంటుగా రావాలని …
Read More »‘పడకగది ముచ్చట్లు కూడా విన్నారు’
తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఘటనపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పలు వివరాలను అధికారులకు అందించారు. ఆధారాలను కూడా సమర్పించారు. సుమారు 4 గంటలకు పైగానే ఆయన విచారణ ఎదుర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ హయాంలో పడకగది ముచ్చట్లు కూడా విన్నారని అన్నారు. ఈ కేసును …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates