Political News

మ‌రోసారి రెచ్చిపోయిన బండి

తెలంగాణ బీజేపీ సార‌థి బండి సంజ‌య్ మ‌రోసారి రెచ్చిపోయారు. కేసీఆర్‌కు వార్నింగుల‌పై వార్నింగులు సంధించారు. అధికారంలో ఉన్నామని సీఎం కేసీఆర్ విర్రవీగుతున్నారని, కొమ్ములు విరిచేస్తామ‌ని హెచ్చ‌రించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామేనని ఈ విష‌యం గుర్తుంచుకోవాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. జైలుకు వెళ్లడం తమకు కొత్తేమీ కాదన్నారు. హనుమకొండలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై బీజేపీ నిరసన సభ నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, …

Read More »

ఏపీ స‌ర్కారుకు మ‌రో సెగ‌

Jagan

ఏపీ స‌ర్కారుకు కొత్త సెగ తగిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు తాము ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చామం టూ.. ప‌దే ప‌దే చెప్పుకొంటున్న వైసీపీ స‌ర్కారుకు పెద్ద ఇబ్బందే వ‌చ్చింది. అదే స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌. గ‌త ఏడాదిన్న‌ర కింద‌ట‌.. ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన స‌ర్కారు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల పేరిట‌.. ఏర్పాటు చేసింది. దీనికి గాను ఉద్యోగుల‌ను కొత్త‌గా నియ‌మించారు. తాజాగా సీఎం జ‌గ‌న్ చేసిన పీఆర్సీ ప్రకటనతో స‌చివాల‌య ఉద్యోగులు.. …

Read More »

డిపాజిట్లు కూడా రాని పార్టీ బీజేపీ: క‌విత

తెలంగాణ బీజేపీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు తెలిసిన‌వే. పార్టీ చీఫ్ బండి సంజ‌య్ నుంచి నాయ‌కులు అంద‌రూ కూడా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు  అధికార టీఆర్ ఎస్ నుంచి కీల‌క నేత‌లు ఎవ‌రూ పెద్ద‌గా కౌంట‌ర్ ఇవ్వ‌లేదు. బండి వ్యాఖ్య‌ల‌పై కొన్నాళ్ల కింద‌ట సీఎం కేసీఆర్ రియాక్ట్ అయ్యారు త‌ప్ప‌.. మిగిలిన నాయ‌కులు ఎవ‌రూ స్పందించ‌లేదు. కానీ, తాజాగా.. అస్సో సీఎం హిమంత బిస్వ‌శ‌ర్మ‌.. తెలంగాణ‌కు వ‌చ్చారు. …

Read More »

ఎన్నికల కోసం కొత్త ప్లాన్?

వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతో చంద్రబాబునాయుడు సరికొత్త వ్యూహాన్ని వర్కవుట్ చేయబోతున్నారు. అంటే ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించినా ఎందుకనో లాంచ్ చేయలేదు. అందుకనే తొందరలోనే తన సరికొత్త వ్యూహాన్ని అమల్లోకి తేవాలని డిసైడ్ అయ్యారు. ఇంతకీ సరికొత్త ప్లాన్ ఏమిటంటే సేవామిత్ర అనే వ్యవస్ధను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని కుప్పంలో చంద్రబాబు ప్రకటించారు. ప్రతి వందమంది ఓటర్లకు ఒక యువకుడిని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. పార్టీలోకి యువత …

Read More »

జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్సే.. ఆఖ‌రి ఛాన్స్‌: CBN

రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పంలో మూడోరోజు పర్యటించిన ఆయన.. వైసీపీ నాయకుల వేధింపులు భరించలేక ఎస్సీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బెదిరింపు రాజకీయాలకు అలవాటు పడిన జగన్.. పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులతో పులివెందుల పంచాయతీ చేశారని ఆరోపించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్సే..ఆఖరి ఛాన్స్‌ కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌ను రెండేళ్లు వాయిదా వేసేందుకే.. జ‌గ‌న్ ప్రభుత్వం పదవీ విరమణ …

Read More »

అందుకేనా అమ‌రావ‌తి నినాదం!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన ర‌ఘురామ కృష్ణంరాజు తాజాగా మ‌రో బాంబు పేల్చారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న ఆయ‌న ఇప్పుడు త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌పున పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. పార్టీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ఘురామ‌పై అనర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ ఎంపీలు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. …

Read More »

పంజాబ్‌లో కాంగ్రెస్ మ‌ళ్లీ పాగా వేస్తుందా?

ఇదీ.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా వినిపిస్తున్న ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒక్క‌టే ఆ పార్టీకి ఆశాజ‌న‌కం గా మారింది. ఇక్క‌డైనా గెలుపు గుర్రం ఎక్కి.. రెండో ద‌ఫా అధికారం ద‌క్కించుకుంటే త‌ప్ప‌.. కాంగ్రెస్‌కు ప‌రువు, మ‌ర్యాద‌లు ద‌క్కేలా లేవ‌ని అంటున్నారు పరిశీల‌కులు. అయితే.. 2017లో ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొన్ని రోజులు స‌జావుగానే సాగినా.. త‌ర్వాత త‌ర్వాత‌.. సొంత నేత‌ల ప్ర‌త్యేక వివాదాల‌తో పార్టీ అధిష్టానానికి …

Read More »

ఈ ద‌ఫా ప‌వ‌న్ గెలుపు గ్యారెంటీ.. రాసిపెట్టుకోండి..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. వాస్త‌వానికి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వంటి కీల‌క నాయ‌కులు చేయించిన స‌ర్వేలో.. ప‌వ‌న్ ఖ‌చ్చితంగా గెలుస్తార‌ని.. అసెంబ్లీలో అడుగు పెడ‌తార‌ని పేర్కొన్నారు. కానీ, ఆయ‌న విశాఖ‌లోని భీమిలిలోను, ప‌శ్చిమ‌లోని భీమ‌వ‌రంలోనూ.. ప‌రాజ‌యం పాల‌య్యారు. దీంతో ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల ఆయ‌న‌పై ఐర‌న్‌లెగ్ అనే ముద్ర వేశాయి. అయితే.. ఇప్పుడు స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయని.. …

Read More »

ఒక్క సంఘటనతో టీఆరెస్ లో భారీ మార్పులు?

కొత్త గూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్రావు త‌న‌యుడు రాఘ‌వ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు సాగించిన అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తుండ‌డంతో పెను దుమార‌మే రేగుతోంది. వ్యాపారి రామ‌కృష్ణ ఆత్మ‌హ‌త్య‌కు రాఘ‌వ కార‌ణమంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌లు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉలిక్కి ప‌డేలా చేశాయి. ఈ వ్య‌వ‌హారంపై విచారం వ్య‌క్తం చేస్తున్న జ‌నాలు రాఘ‌వ‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతున్నారు. ఇప్ప‌టికే పార్టీ …

Read More »

నిరుద్యోగుల‌కు `జ‌గ‌న‌న్న హ్యాండ్‌!`

రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య‌.. నానాటికీ పెరుగుతూనే ఉంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యానికి రాష్ట్రంలో 8 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉన్న‌ట్టు అంచ‌నా వేశారు. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి పాద‌యాత్ర స‌మ‌యంలో వైసీపీ అధినేత‌గా.. జ‌గ‌న్  నిరుద్యోగుల‌కు కొన్ని హామీలు ఇచ్చారు. తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే 90 వేల ఖాళీ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు పూర్త‌యి నా.. కేవ‌లం వ‌లంటీర్లు, స‌చివాల‌య …

Read More »

అయ్య తాగుబోతు.. కొడుకు తిరుగుబోతు: MP అరవింద్

తెలంగాణలో ఇప్పుడు అధికార పక్షం వర్సెస్ బీజేపీ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం అంతా ఇంతా కాదన్నట్లుగా మారింది. నువ్వు ఒకటంటే నేనునాలుగు అంటా. నువ్వు నాలుగు అంటే నేను పది అంటానంటూ విరుచుకుపడుతున్న వైఖరి తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కిపోయేలా చేస్తోంది. ఒకవైపు తెలంగాణ అధికారపక్షంపై బీజేపీ నేతలు విరుచుకుపడుతుంటే.. వాటికి కౌంటర్లు ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ భారీ ప్రెస్ మీట్ పెట్టటమేకాదు.. ఆయన సైతం తనకున్న మాటల సత్తాను …

Read More »

చంద్రబాబు తొందరపాటు ?

తన సహజ స్వభావానికి విరుద్ధంగా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. వివిద సందర్భాల్లో ఈమధ్య చంద్రబాబు రియాక్టవుతున్న విధానం వల్లే చంద్రబాబు తొందరపడ్డారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఇదంతా ఏ విషయంలో అంటే కుప్పం పర్యటనలో పొత్తు గురించి బహిరంగంగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. ఎవరో కార్యకర్త జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు కదాని అడిగాడు. మామూలుగా అయితే ఆ మాటను చంద్రబాబు వినీ విననట్లు వదిలేసేవారే. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో …

Read More »