కరోనా దెబ్బకు ఈ ఏడాది అన్ని కార్యకలాపాలూ నిలిచిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు ఏవీ ఇప్పుడిప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు. చాలా తరగతులవి పరీక్షలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి తలెత్తింది. మార్చిలో టెన్త్, డిగ్రీ పరీక్షలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి ప్రభావం మొదలైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించడం.. దాన్ని పొడిగించుకుంటూ వెళ్లడంతో పరీక్షల నిర్వహణ సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో ముందు తెలంగాణలో పదో తరగతి …
Read More »వైసీపీలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరిక ఖాయమేనా?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ….ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచతమైన పేరు. గతంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా లక్ష్మీ నారాయణ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ…జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే, జనసేనాని మళ్లీ సినిమాలు చేయాలన్న నిర్ణయం నచ్చని లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారు. బీజేపీలో చేరేందుకు లక్ష్మీనారాయణ పావులు కదపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, …
Read More »ఏపీ డీజీపీ హైకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది?
కొన్నిసార్లు అంతే. వ్యవస్థలోని కొందరు చేసే తప్పులకు అత్యున్నత స్థానంలో ఉన్న వారు ఇరుకున పడుతుంటారు. తాజాగా అలాంటిదే ఏపీలో చోటు చేసుకుంది. తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర హైకోర్టుకు స్వయంగా హాజరు కావాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. రాష్ట్ర పోలీస్ బాస్ స్వయంగా కోర్టు హాజరై.. న్యాయమూర్తి ముందు సమాధానం చెప్పాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయాన్ని చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. రూల్ బుక్ లోని నిబంధనల్ని …
Read More »నిన్న రాంమాధవ్, నేడు కిషన్ రెడ్డి: జగన్పై బీజేపీ స్వరం మారుతోందా?
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ-వైసీపీ అంతర్గత మిత్రులు అనే విమర్శలు ఇతర పార్టీల నుండి వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ లోపాయికారి ఒప్పందం లేదా మద్దతు వల్లే జగన్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. జీవీఎల్ నర్సింహారావు వంటి బీజేపీ నేతల వ్యాఖ్యలు కూడా వైసీపీకి అనుకూలంగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి వారు …
Read More »తెలంగాణ టు ఏపీ.. వైకాపా ఎమ్మెల్యేకు కరోనా
కరోనా మహమ్మారికి చిన్నా పెద్దా.. రాజు పేద అని తేడాలేమీ ఉండట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులను ఆ వైరస్ పలకరించింది. ఏకంగా బ్రిటన్ ప్రధానే కరోనా బాధితుడిగా మారారు. మన దేశం విషయానికి వస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు దీని బారిన పడ్డారు. తమిళనాట ఓ ఎమ్మెల్యే సైతం కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి తలెత్తింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు …
Read More »సంచలనం.. కరోనా టెస్టు చేస్తే గర్భం బయటపడింది
ఉత్తరప్రదేశ్లో సంచలనం చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ బాలబాలికల సంరక్షణ గృహంలో కరోనా పరీక్షలు చేయగా.. అందులో 57 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ 57 మందిలో ఏడుగురు గర్భవతులని తేలడం సంచలనం రేపుతోంది. అంతే కాదు.. ఒక అమ్మాయికి హెచ్ఐవీ ఉన్నట్లు కూడా వెల్లడైంది. ఈ ఉదంతం ఆ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం దీనిపై దృష్టిసారించి విచారణ జరపాలని ఆదేశించే …
Read More »ట్రంప్ తీరుపై సుందర్ పిచాయ్ అసంతృప్తి
మహమ్మారి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికాకు వచ్చే వలసలదారులపై ట్రంప్ ఏప్రిల్ నుంచి 3 నెలల తాత్కాలిక నిషేధం విధించారు. వైరస్ వ్యాప్తి మరింత తీవ్రతరం కావడంతో తాజాగా ఆ నిషేధాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకే ట్రంప్ హెచ్1-బీ, హెచ్-4 …
Read More »డిప్యూటీ సీఎంగా అనిల్ కుమార్ యాదవ్?
తాజాగా ఏపీకి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన నాలుగు సీట్లను వైసీపీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మంత్రి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణతోపాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. దీంతో, ఖాళీ అయిన మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. ఖాళీ అయిన బీసీ వర్గానికి చెందిన మంత్రి పదవులను ఆ సామాజికవర్గానికే కేటాయించాలని జగన్ …
Read More »‘ఏపీలో అహంకార పాలన సాగుతోంది’
ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారుపై కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఇంత సూటిగా.. చురుకు తగిలేలా వ్యాఖ్యలు చేసిన నేతలు లేరనే చెప్పాలి. ఏపీకి చెందిన బీజేపీ నేతలు జగన్ సర్కారుపై విమర్శలు చేసినా కూడా ఇంత ఘాటుగా చేయలేదన్న మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు రాజ్యం కొనసాగుతోందని.. అవినీతి.. ఆరాచకం.. దౌర్జన్యాలు కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. ఏదైనా ప్రదర్శనలో పాల్గొన్నా.. సోషల్ మీడియాలో …
Read More »5 కోట్ల కంటే సందేశం గొప్పది
గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.5 కోట్లు, ఇంటి స్థలం, ఆయన భార్య సంతోషికి గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక రాజకీయ కోణం ఉన్నదని భావించిన వారు లేదా సోషల్ మీడియా, ప్రతిపక్షాల ప్రోద్భలం ఉందని భావించినప్పటికీ, ఏదేమైనా అంతకు మించి ఆర్మీలో …
Read More »ఢిల్లీ వెళ్తున్న రఘురామకృష్ణంరాజు, ఎవరితో మీటింగ్?
వైసీపీ తరఫున నరసాపురం నుండి గెలుపొందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు వివిధ సందర్భాల్లో పార్టీ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు అంశాల్లో ఆయన తన వైఖరిని సూటిగా చెప్పేస్తుండటంతో పార్టీకి, ఆయనకు మధ్య దూరం పెరుగుతోంది. ఇటీవల ఆయన మరో అడుగు ముందుకేసి తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. తనను చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తీవ్ర …
Read More »తెలంగాణకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు
భారత్ లో మహమ్మారి వైరస్ కేసులు నానాటికీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతుండడం కలవరపెడుతోంది. గత వారం రోజుల వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. ఈ ప్రాణాంతక వైరస్ పంజా విసురుతున్న తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో గత 10 రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా …
Read More »