సుప్రీంకోర్టు లాయర్లకే బెదిరింపు కాల్సు వస్తుండటం సంచలనంగా మారింది. ఖలిస్తాన్ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ నుండి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చాలామంది లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను కొందరు ఆందోళనకారులు అడ్డుకోవటం భద్రతా వైఫల్యమే అని తేలిపోయింది. అయితే లోపానికి కారణం ఏమిటి ? బాధ్యులెవరు ? అనే విషయమై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు …
Read More »నరసాపురంలో ఏం జరగబోతోంది ?
ఇపుడిదే విషయమై అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. చాలాకాలం తర్వాత నరసాపురం ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణంరాజు తన నియోజకవర్గంలో కాలు పెట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డితో చెడిన దగ్గర నుండి రఘురామ నియోజకవర్గంలో పెద్దగా తిరిగిందే లేదు. ఆ మధ్య ఒకసారి హైదరాబాద్ కు వచ్చిన ఎంపీపై సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విచారణ సందర్భంగా ఎంత గోల జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. …
Read More »యూపీ పీఠం ఎవరిదో చెప్పిన తాజా సర్వే..
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా అభివర్ణిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తికరం అంశంగా మార్చటం తెలిసిందే. ఎన్నికలు జరుగుతున్నది ఐదు రాష్ట్రాల్లోనే అయినప్పటికీ.. అందరి చూపు మాత్రం ఉన్నది దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ (యూపీ) ఫలితం మీదనేనని చెప్పాలి. ఈ రాష్ట్రంలో వచ్చే ఫలితం జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా …
Read More »పుష్ప సినిమాపై వైసీపీ నేత అభ్యంతరం
సినిమాల విషయంలో ఒకప్పుడు జనాలు ఎంతో ఉదారంగా ఉండేవాళ్లు. సినిమాను సినిమాలాగే చూసేవారు. నిజంగా అభ్యంతరకంగా ఉన్న విషయాల మీద కూడా పెద్దగా వివాదాలు రాజేసేవారు కాదు. కానీ ఇప్పుడు జనాలు మరీ సున్నితంగా తయారైపోయి.. ప్రతి చిన్న విషయం మీదా రాద్దాంతం చేస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియా ప్రతిదాన్నీ బూతద్దంలో చూపించి చిన్న వివాదాల్ని ఇంకా పెద్దవి చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా పాటల్లో …
Read More »అలా అయితే సినిమాలు వాయిదా వేసుకోండి: పేర్ని నాని
మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ పెట్టడం.. సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడం.. అలాగే సెకండ్ షోలు రద్దు చేయడం తెలిసిందే. ఓవైపు తెలంగాణలో ఇలాంటి ఆంక్షలేమీ లేకపోగా.. ఏపీలో మాత్రం థియేటర్లను టార్గెట్ చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా ఆంక్షలు పెడుతున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఐతే తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమేదీ …
Read More »పండగ పూట.. రోడ్డెక్కనున్న టీడీపీ
పెద్ద పండగ సంక్రాంతి పూట ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రోడ్డెక్కనుంది. ప్రజల కోసం నిరసన బాట పట్టనుంది. ఏపీ ప్రభుత్వంపై ప్రజల కోసం యుద్ధం చేయనుంది. ఏపీలో నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ‘‘ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి’’ అనే నినాదంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చందబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక వైసీపీ డిఫెన్స్లో పడిందని అన్నారు. …
Read More »మోడీ పంజాబ్ టూర్ భగ్నం.. మరో కుట్ర?
పంజాబ్లో ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాల కారణంగా.. ఆయన పర్యటన నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. ఇక, ఇప్పుడు ఈ అంశంపై జరుగుతున్న దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. మోడీ పర్యటనను భగ్నం చేయడం వెనుక.. వేర్పాటు వాద.. సిక్కు సంస్థ ఖలిస్థానీ ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే దర్యాప్తును నిలిపివేయాలంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం సంచలన వ్యాఖ్యలు చేసింది. …
Read More »ఇదేం న్యాయం జగనన్నా?
సంక్రాంతి ముంగిట.. ఏపీ ప్రబుత్వం తీసుకున్న నిర్ణయం.. సానుభూతి పరులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. సీఎం జగన్ ఆలోచనలోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల వివాదం కొనసాగుతూనేఉంది. సినిమా నిర్మాణాలకు సంబంధం లేకుండా.. అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధర ఉండాలనే నిర్ణయానికి తోడు.. సినిమా టికెట్లను 1970ల స్థాయికి దింపేశారంటూ.. నెటిజన్లు ఫైరవుతున్నారు. దీనివల్ల క్వాలిటీ దెబ్బతింటుందని కూడా అంటున్నారు. ఈ విషయంపై …
Read More »టీడీపీ యంగ్ టైగర్.. ప్లాన్ చేంజ్?
రాబోయే ఎన్నిలకు సంబంధించి శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీలో పెద్దమార్పులే జరగబోతున్నాయట. టీడీపీ యంగ్ టైగర్ గా క్రేజ్ అందుకుంటున్న శ్రీకాకుళం ఎంపీ ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో లేరని సమాచారం. నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. మరి ఎంపీ సీటును కాదని అసెంబ్లీకి ఎందుకు పోటీ చేయాలని కింజరాపు అనుకుంటున్నారనే విషయంలో క్లారిటి లేదు. …
Read More »షర్మిల పార్టీ గురించి బొత్స షాకింగ్ కామెంట్స్
అధికార వైసీపీలో ఒక్కొక్కళ్ళు వైఎస్ షర్మిల పార్టీపై మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు మంత్రులు, సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా షర్మిల గురించి మాట్లాడటానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే రెండుసార్లు కామెంట్లు చేశారు. మిగిలిన వారిని మీడియా అడిగినా మౌనంగా సమాధానంగా చెప్పేవారు. తాజాగా మంత్రి బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ షర్మిల ఏపీలో పార్టీ పెట్టినా తమకొచ్చే నష్టం ఏమీలేదన్నారు. ఇప్పటికే …
Read More »చంద్రబాబుకు జనసేన చాలెంజ్
ఒకవైపు జనసేనతో పొత్తుకు చంద్రబాబునాయుడు లవ్ ప్రపోజల్ పంపితే రిటర్న్ లో జనసేన చంద్రబాబునాయుడుకు షరతులు విధిస్తున్నది. జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము చంద్రబాబుకుందా అంటు చాలెంజ్ చేశారు. 2014లో రాష్ట్రం కోసం పవన్ భేషరతుగా చంద్రబాబుకు మద్దతిచ్చి ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని బొలిశెట్టి గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో భేషరతుగా పవన్ కు మద్దతిచ్చి ముఖ్యమంత్రిని …
Read More »జగన్ ఇమేజ్.. వైసీపీని కాపాడుతుందా?
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ రాజకీయ వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్(పీకే) పని చేశారు. ఆ ఎన్నికల్లో జగన్ ఇమేజ్ కు తోడు పీకే వ్యూహాలు పనిచేశాయి. ముఖ్యంగా ఒక్క ఛాన్స్.. పాదయాత్ర వంటివి వైసీపీకి ప్లస్ అయ్యాయి. గత ఎన్నికల్లో జగన్ వేవ్ తుఫానులా కొనసాగడంతో ప్రతిపక్ష పార్టీలు అడ్రస్ కోల్పోయాయనే చెప్పాలి. వైసీపీకి ఏకంగా 151 సీట్లు రాగా, టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. జనసేనకు ఒక్క …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates