దళితుల సాధికారత కోసమే దళిత బంధు పథాకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ఈ పథకాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని గులాబీ నేతలు కూడా చెబుతున్నారు. తెలంగాణలో అన్ని పార్టీల నేతలు దళిత బంధు పథాకాన్ని స్వాగతించారు. అయితే అమలుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. దళిత బంధు పథకాన్ని ఎన్నికల స్టంట్అని కూడా విమర్శించారు. ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈ పథకాన్ని కేసీఆర్ ప్రకటించారు. …
Read More »ఈ సారి మేనిఫెస్టో ఇలా వద్దు సార్.. జగన్ కు మంత్రి సలహా
వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖను చూస్తున్న ఓ మంత్రి తాజాగా నేరుగా ముఖ్యమంత్రితోనే ఫైరయ్యారనే వ్యాఖ్యలు వైసీపీ నేతల మధ్య గుసగుసగా సాగుతున్నాయి. “ఈ సారి మేనిఫెస్టో ఇలా వద్దు సార్!!” అంటూనే.. మీరు హామీలు ఇచ్చి.. మౌనంగా ఉంటారు.. డబ్బులు తేలేక మేం ఛస్తున్నాం!! అంటూ.. ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారట. పేరు చెప్పేందుకు ఎవరూ సాహసించడం లేదు కానీ.. ఆ మంత్రి మాత్రం సీఎంపైనే ఫైరయ్యారనేది …
Read More »బాబుకు జ్ఞానోదయం.. మళ్లీ మళ్లీ కుప్పం టూర్ !
తెలుగు దేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పటికీ జ్ఞానోదయమైందా? ఇన్ని రోజులుగా తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని పట్టించుకోని ఆయన ఇప్పుడు దానిపై ప్రత్యేక దృష్టి సారించారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీని దెబ్బ కొట్టిన వైసీపీ మంచి ఫలితాలు సాధించింది. దీంతో బాబు సొంత నియోజకవర్గంలోనే టీడీపీకి దెబ్బ పడింది. మరోవైపు వైసీపీ కూడా …
Read More »కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే!
రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా దాని వెనక ఓ పరమార్థం ఉంటుందని అంటారు. తమ రాజకీయ ప్రయోజనాల కోణంలోనే ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగానే మాట్లాడుతారు. అందుకే ఏవరైనా నాయకుడు ఏదైనా మాట్లాడితే దాని వెనక ఇంకేం అర్థం ఉందో అనే వెతకాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇక రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అంతటి వ్యక్తి ఏవైనా వ్యాఖ్యలు చేశారంటే వాటి …
Read More »పవన్ టార్గెట్ ఎవరు ? క్లారిటీ వచ్చేస్తుందా ?
ఇపుడిదే అంశంపై జనసేన+బీజేపీలో చర్చ మొదలైంది. ఎందుకంటే ఈనెల 31వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంకు వెళుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితి నాయుకులు ఫ్యాక్టరీ దగ్గరే సభ ఏర్పాటు చేశారు. ఉక్కు పరిరక్షణ సమితి నేతల రిక్వెస్టు మీద పవన్ సభలో పాల్గొనేందుకు విశాఖ వెళుతున్నారు. సభలో పాల్గొంటున్నారంటేనే ప్రభుత్వాలపై విరుచుకుపడాలి. ఇక్కడ ప్రభుత్వాలంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ లేదా …
Read More »ప్రపంచం కాపాడలేదా- అక్కడ ఆకలితో పిల్లలు చనిపోతున్నారా ?
తాలిబన్ల అధికారంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో ఆకలి చావులు పెరిగిపోతున్నాయా ? వరల్డ్ ఫుడ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం అవుననే అర్ధమవుతోంది. దేశంలోని 3.9 కోట్ల మంది జనాభాలో సుమారు 2.3 కోట్లమంది రోజుకు ఒక పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. వీరిలో అత్యధికులు పేదలు, వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం. మూడు వారాల క్రితం పశ్చిమ కాబూల్ లోని ఓ ఇంట్లో రోజుల వ్యవధిలో 8 మంది …
Read More »షర్మిలతో వైసీపీ నేతల వరుస భేటీలు
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రకు ఊహించిన అతిథులు వస్తున్నారు. వారు చుట్టం చూపు వచ్చిపోవడం లేదు. పాదయాత్ర తీరుతెన్నులను ప్రజల్లో వస్తున్న ఆధరణను గమనిస్తున్నారు. పాదయాత్రపై ఆరా తీసిస్తున్నారు. ఆదివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, షర్మిలను కలిసి వెళ్లారు. సోమవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. వీరిద్దరూ సీఎం జగన్కు షర్మిలకు అత్యంత సన్నిహితులు. రెండు రోజుల వ్యవధిలో సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి పాదయాత్రలో ఉన్న షర్మిలతో భేటీ …
Read More »కాంగ్రెస్ లో పీకే… తూచ్ !
కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. సముద్రంలో ఈదుకుంటూ ఒడ్డుని చేరుకునేదెవరో ? ఎప్పటికీ ఈదుతునే ఉండేదెవరో, ఈదలేక మధ్యలోనే ముణిగిపోయేదెవరో ఎవరు చెప్పలేరు. దశాబ్దాల తరబడి పార్టీలో ఉన్నవారికే అధిష్టానం పల్స్ ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు. అలాంటిది రాజకీయ వ్యూహకర్తగా పాపులరైన ప్రశాంత్ కిషోర్ (పీకే) పార్టీలో చేరి వెంటనే అందలం ఎక్కేయాలని అనుకున్నారు. అయితే ఇపుడా ఆశ నెరవేరేట్లు కనబడటం లేదు. తాజాగా ఢిల్లీ వర్గాల …
Read More »హరీష్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కష్టమేనా ? తమ గెలుపుపై కేసీయార్ అండ్ కో లో అనుమానాలు పెరిగిపోతున్నాయా ? తాజాగా నియోజకవర్గంలో ప్రకటించిన తాయిలాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ తరపున ప్రచారం చేసిన మంత్రి హరీష్ రావు విచిత్రమైన హామీ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే టీఆర్ఎస్ అభ్యర్ధి గెలిస్తే రైతులు తీసుకున్న రుణాన్ని …
Read More »ఢిల్లీ పర్యటన.. పార్టీకి చంద్రబాబు ఇస్తున్న సందేశమేంటి?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను ఆయన కలిశారు. ఏపీలో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులను.. అధికార పార్టీ దూకుడును కూడా ఆయన వివరించారు. మొత్తంగా రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనను పెట్టుకున్న చంద్రబాబు.. తన సహజ ధోరణిలో.. కేంద్రంలోని పెద్దలకు ఏపీపై ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. సహజంగా చంద్రబాబు చేసే ఢిల్లీ …
Read More »ఎమ్మెల్యేని గంటల తరబడి వెయిట్ చేయించిన కలెక్టర్
ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలన్నా.. సంక్షేమ పథకాలు చేరువ కావాలన్నా.. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ రెండు వ్యవస్థలు సక్రమంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తేనే ఏ కార్యక్రమమైన విజయవంతం అవుతుంది. కానీ ఓ కార్యక్రమానికి కలెక్టర్ ఆలస్యంగా వచ్చారని చెప్పి ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోవడం.. ఎమ్మెల్యే వెళ్లిపోయిందని కలెక్టర్ కూడా ఆ కార్యక్రమాన్ని ఆరంభించకుండనే వెనుదిరిగితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. …
Read More »జగన్ రెండేళ్ల పాలనపై పుస్తకం: చంద్రబాబు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రెండున్నరేళ్ల వైసీపీ పాలనపై తాము రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను తొక్కేస్తున్న తీరు సహా.. పోలీసు వ్యవస్థను గుప్పిటలో ఉంచుకుని..రాజ్యాంగాన్ని సైతం ధిక్కరిస్తున్నతీరును రాష్ట్రపతికి చంద్రబాబు వివరించారు. పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీలు.. మహిళా నేతలతో భారీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates