ఎల్జీ పాలిమర్స్ కు 1996లో చంద్రబాబే అనుమతులు ఇచ్చారంటూ ఈరోజు మధ్యాహ్నం జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకు తండ్రి దారిలో, ముఖ్యమంత్రి అయ్యాక తాత దారిలో నడుస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అడ్డొచ్చిన వారిపై అక్రమకేసులు బనాయించి తప్పించుకోవాలని చూస్తున్నారని.. చంద్రబాబు ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై ఎదురుదాడికి దిగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్సులో చంద్రబాబు …
Read More »కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటున్న బీజేపీ
ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వాలను అవమానించే విధంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని అంకెల గారడీగా పేర్కొంటున్న తెలంగాణ సీఎం …
Read More »161 మంది భారతీయుల్ని తిరిగి పంపుతున్న అమెరికా
మనోళ్లలో పలువురిని అగ్రరాజ్యం అమెరికా తిప్పి పంపేలా నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయుల్ని అక్కడి అధికారులు గుర్తించారు. అమెరికాలోని మెక్సికన్ సరిహద్దు ద్వారా దేశంలోకి అక్రమంగా చొరబడిన 161 మంది భారతీయుల్ని గుర్తించారు. అలాంటి వారిని అమెరికాలో ఉంచేందుకు వీలున్న న్యాయపరమైన అవకాశాలు తాజాగా ముగిశాయి. దీంతో.. వారిని భారత్ కు తిప్పి పంపనున్నారు. ప్రత్యేక విమానంలో ఈ 161 మందిని భారత్ కు పంపనున్నారు. …
Read More »ఖాళీ స్టేడియంలో ఐపీఎల్.. జరిగేదెప్పుడంటే?
మాయదారి రోగం కమ్మేసిన వేళ.. యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. ఎక్కడి వారక్కడే ఉండిపోవాల్సింది. జరగాల్సినవెన్నో వాయిదా పడిపోయాయి. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలు ఎవరికి వారుగా..తమకు తగినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రకటించిన మినహాయింపుల్లో భాగంగా.. ప్రేక్షకులు లేకుండా స్టేడియంలను వినియోగించుకోవచ్చన్న మాటతో కొత్త ఉత్సాహం పొంగి పొర్లుతోంది. నిజానికి అన్ని బాగుంటే.. ఈపాటికి ఐపీఎల్ సీజన్ షురూ కావటం.. యావత్ దేశం.. ఆ జోష్ …
Read More »తిరుమల దర్శనం.. ఏం చేస్తున్నారంటే?
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న ఆలయాల్లో తిరుమల ఒకటి. ఇక్కడి శ్రీ వేంకటేశ్వరుడిని దేశవ్యాప్తంగా భక్తులు ఎలా కొలుస్తారో.. ఆయన దర్శనం కోసం ఎలా తపిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ వేలాది మందితో కిక్కిరిసి ఉండే తిరుమల ఆలయం రెండు నెలలుగా మూతబడి ఉంది. కరోనా ప్రభావం తిరుమల మీదా పడింది. దర్శనం ఆపేశారు. ఐతే లాక్ డౌన్ నిబంధనలు నెమ్మదిగా సడలిస్తున్న నేపథ్యంలో ఆలయంలోకి భక్తుల్ని …
Read More »ఇండియా.. లక్ష కరోనా కేసులు
ఆ దేశంలో ఏకంగా లక్ష ప్లస్ కరోనా పాజిటివ్ కేసులట.. ఒక్క రోజులో అన్ని వేల కేసులట.. వందల్లో మరణాలట.. అంటూ నెల కిందట వేరే దేశాల గురించి వార్తలు చదువుకునే వాళ్లం. ఐతే ఇప్పుడు ఇండియానే ఆ స్థితికి వచ్చేసింది. ఇండియాలో కరోనా కేసుల సంఖ్య సోమవారం లక్ష మార్కును టచ్ చేసేసింది. కొన్ని రోజులుగా సగటున రోజుకు 3-4 వేల కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం …
Read More »మోదీపై కేసీఆర్ ఫైరింగ్… ప్యాకేజీపై సంచలన వ్యాఖ్యలు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోమారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తనదైన రేంజిలో ఫైర్ అయ్యారు. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో రెండో భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీపై గడచిన రెండు, మూడు రోజులుగా సైలెంట్ గానే ఉన్న కేసీఆర్…సోమవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో …
Read More »జగన్ పాలన ఎలా వుంది.. జేడీ లక్ష్మినారాయణ
ఏపీ ముఖ్యమంత్రికి అరుదైన వ్యక్తి నుంచి ప్రశంసలు వచ్చాయి. ఆయన ఎవరో కాదు… జగన్ సీబీఐ కేసులను డీల్ చేసిన అప్పటి సీబీఐ జేడీ… లక్ష్మినారాయణ. జగన్ హామీల అమలులో మాట తప్పడం లేదని జేడీ జగన్ పై ప్రశంసలు కురిపించారు.అంతే కాదు, మరో అరుదైన సందర్భం గురించి వెల్లడించారు జేడీ. బ్యూరోక్రసీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జేడీ లక్ష్మినారాయణ ప్రస్తుతం క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. జనసేనలో చేరి …
Read More »మడ అడవుల్లోనూ కోర్టు జోక్యం – నరకొద్దు !
జగన్ ఆలోచనలకు హైకోర్టు నుంచి అడగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా మడ అడవులు ధ్వంసం చేయడంపై కొందరు మత్స్యకారులు హైకోర్టులో పిటిషను వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు వెంటనే మడ అడవుల ధ్వంసాన్ని ఆపేయాలని సూచించింది. నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం వెంటనే కౌంటరు దాఖలు చేయాలని ఆదేేశించింది. కొద్ది రోజలుగా మడ అడవుల నరికివేతపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కాకినాడ …
Read More »తెలంగాణకు వరాలు ఇచ్చి హైదరాబాద్కు షాకిచ్చిన కేసీఆర్
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనల అమలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. తన అధ్యక్షతన ప్రగతిభవన్లో నిర్వహించిన కేబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో కేసీఆర్ వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అన్ని జోన్లను గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ సందర్భంగా తెలంగాణకు వరాలు ఇచ్చిన కేసీఆర్ హైదరాబాద్ విషయంలో మాత్రం ఆంక్షలు …
Read More »తెలంగాణలో తొలి ప్రయోగం.. పాజిటివ్ లను ఇంట్లో ఉంచేసి చికిత్స
ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే.. చిన్నపాటి పొరపాటుకే భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి. మందు లేని మాయదారి రోగానికి గురైతే.. వెంటనే ఆసుపత్రికే తరలించాల్సిందే. ఇటీవల ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పాజిటివ్ లు వచ్చిన వారిని ఆసుపత్రిలోనే కాదు.. ఇంట్లో ఉంచి కూడా చికిత్స చేసేందుకు వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ విధానాన్ని తెలుగురాష్ట్రాల్లో ఇప్పటివరకూ అమలు చేసింది లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రం …
Read More »ఇండియాను కదిలిస్తున్న ఆ ఫొటో వెనుక కథ
ఒక ఫొటో.. ఇండియాలో లాక్ డౌన్ కష్టాలకు అద్దం పడుతోంది. వలస కార్మికుల దయనీయ స్థితిని కళ్లకు కడుతోంది. లాక్ డౌన్ గురించి ఎవరు ఏం రాయాలన్నా దానికి సపోర్ట్గా ఆ ఫొటోను వాడుతున్నారు. సోషల్ మీడియాలో వలస కార్మికుల బాధల్ని చూపిస్తూ పెడుతున్న ఫొటోల్లో అది కచ్చితంగా ఉంటోంది. ఇంటికి చేరే మార్గం దొరక్క ఫోన్లో ఏడుస్తూ మాట్లాడుతున్న ఓ నడి వయస్కుడికి సంబంధించిన ఫొటో అది. దాని …
Read More »