Political News

కేసీఆర్‌ పై సెటైర్లు వేస్తున్న ఏపీ మంత్రులు

ఏపీలోనూ టీఆర్‌ఎస్ పార్టీని పెట్టాలని అక్కడి నుంచి వేలాదిగా ఆహ్వానాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో పార్టీ పెట్టాలని తాము గెలిపించేందుకు సిద్ధంగా ఉండామని ఏపీ ప్రజలు తనను కోరుతున్నారని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఏపీలో కూడా అమలు చేయాలని కోరుతున్నారని కేసీఆర్ ప్రకటించి కలకలం రేపారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. …

Read More »

కేబినెట్‌లో గంజాయి ప్ర‌స్తావ‌న లేన‌ట్టే!!

రాష్ట్రాన్ని ప్ర‌స్తుతం కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉంటే.. అది గంజాయే! తాజాగా తూర్పుగోదావ‌రి స‌హా.. అనంత‌పురంలోనూ గంజాయిని పోలీసులు పెద్ద మొత్తంలో ప‌ట్టుకున్నారు. అదేస‌మ‌యంలో పెళ్లి స‌హా వివిధ శుభ‌కార్యాలకు పిలిచే ఆహ్వాన ప‌త్రిక‌లమాటున కూడా పెద్ద ఎత్తున మాద‌క ద్ర‌వ్యాల‌ను త‌ర‌లిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఇవ‌న్నీ..ఏపీ కేంద్రంగానే జ‌రుగుతున్న‌ట్టు ఇత‌ర రాష్ట్రాల పోలీసులు మ‌రోసారి కూడా చెప్పారు. అయితే.. ఇంత కీల‌క విష‌యంపై కేబినెట్ …

Read More »

ఢిల్లీలో బాబుక‌న్నా ముందే.. వైసీపీ చ‌క్క‌బెట్టేస్తోందిగా..!

చంద్ర‌బాబు క‌ద‌ల‌డానికి ముందే.. వైసీపీ ఢిల్లీని చుట్టేస్తోంది! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజం. ఇటీవ ల టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి.. చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అధికార-విప‌క్ష పార్టీల మ‌ధ్య చెల‌రేగిన మాట‌ల యుద్ధం.. అనేక రూపాల్లోకి మారింది. బంద్‌-నిర‌స‌న‌, దీక్ష‌-నిర‌స‌న దీక్ష‌.. అంటూ.. రెండు పార్టీలూ.. యుద్ధం ప్ర‌క‌టించుకున్నాయి. ఇక‌, ఈ విష‌యాన్ని.. ఢిల్లీకి తీసుకు వెళ్తాన‌ని చెప్పిన‌.. చంద్ర‌బాబు.. అన్నంత ప‌నీ చేశారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న …

Read More »

‘టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టారు’

ఏపీ ప్రభుత్వంపై, వైసీపీ అధినేత, సీఎం జగన్ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎయిడెడ్ పాఠశాలల విలీనం వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని, ఆ విషయంలో బడికి వెళ్లే విద్యార్థులు కూడా జగన్ పై గుర్రుగా ఉన్నారని రఘురామ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ నేత పట్టాభిపై దాడి విషయంలో రఘురామ సంచలన ఆరోపణలు …

Read More »

మంగళవారం మరదలు.. షర్మిలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వ్యక్తిగత దూషణలు, విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. కొందరు నేతలు పొరపాటున నోరుజారితే…మరికొందరేమో అధికారం ఉంది కదా అన్న ధీమాతో వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ నేత, మంత్రి నిరంజన్ రెడ్డి….వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. మంగళవారం మరదలు అంటూ షర్మిలనుద్దేశించి నిరంజన్ రెడ్డి చేసిన …

Read More »

సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు షాక్

మనదేశంలోని రాజకీయ నాయకుల్లో చాలామంది పలురకాల కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుండగా, మరికొందరు ఆర్థికపరమైన, అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారు. పరిమిత సంఖ్యలో కోర్టులుండడం…అపరిమిత సంఖ్యలో కేసులున్నాయి. దీంతో, పొలిటిషియన్లపై ఉన్న కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో, సదరు రాజకీయ నాయకులపై విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటోంది. ఆ విచారణ పెండింగ్ లో ఉండగానే చాలా మంది నేతలు…ఒకటికి రెండుసార్లు సాధారణ …

Read More »

సీఎం జ‌గ‌న్‌తో అక్కినేని నాగార్జున భేటీ.. ఏం చ‌ర్చిస్తారు?

సినీ హీరో.. అక్కినేని నాగార్జున స‌హా.. ప‌లువురు ముఖ్య నిర్మాత‌లు.. నేడు సాయంత్రం 3-5 గంట‌ల మ‌ధ్య ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో భేటీ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఈ బృందం చేరుకుంది. హీరో అక్కినేని నాగార్జునతోపాటు.. ముఖ్య‌ నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి. కూడా రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడ బయల్దేరిన అక్కినేని నాగార్జున …

Read More »

మోడీ ఇరుక్కున్నట్లేనా ?

సుప్రింకోర్టు చర్యతో ప్రధానమంత్రి నరేంద్రమోడిలో టెన్షన్ మొదలైనట్లే. కేంద్రప్రభుత్వ వైఖరితో సంబంధంలేకుండా , మోడీ ఆలోచనలను ఏమాత్రం పట్టించుకోకుండా సుప్రింకోర్టు స్వతంత్రంగా వ్యవహరించింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి ప్రముఖుల మొబైళ్ళను ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలపై దర్యాప్తుకు సుప్రింకోర్టు త్రిసభ్య కమిటి వేసింది. దేశ అత్యున్నత న్యాయవ్యవస్ధ స్వతంత్రంగా వ్యవహరించటం కేంద్రప్రభుత్వానికి మింగుడుపడటంలేదు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి దేశంలోని వందలమంది ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించిందనే అంశం …

Read More »

బాబు మిస్స‌యిపోతున్న మైలేజీలు!!

Chandrababu

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు పుంజుకోవాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌లు లేదా.. ఏదైనా ఛాన్స్ వ‌స్తే.. ఇప్ప‌టికిప్పుడు జ‌రిగే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తు న్నారు. నిజ‌మే.. ఏ పార్టీకి అయినా.. అంతిమ ల‌క్ష్యం అధికార‌మే. అయితే.. దీనిని ద‌క్కించుకునేందుకు.,. గ‌తంలో మాదిరిగా.. పేప‌ర్ ప్ర‌క‌ట‌న‌లు.. వార్త‌లు.. ప్ర‌చారం వంటివి వ‌ర్కువ‌ట్ కాద‌ని.. గ‌త ఎన్నిక‌ల్లోనే తేలిపోయింది. సో.. నిత్యం ప్ర‌జ ల్లో ఉండాలి.. వారి …

Read More »

తెలంగాణ‌లో కొత్త‌పార్టీ.. వెనుక ఎవ‌రున్నారు?

ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. డాక్టర్ పుంజాల వినయ్ నేతృత్వంలో మరో కొత్త పార్టీ రాబోతోంది. హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్‌లో మద్దతుదారులతో వినయ్ భేటీ అయ్యారు. సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే డిమాండ్‌తో కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వినయ్ ప్రకటించారు. డాక్టర్ పుంజాల వినయ్ కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ తనయుడు. డిసెంబర్‌లో కొత్త పార్టీ పేరును వినయ్‌కుమార్ ప్రకటించనున్నారు. …

Read More »

వైసీపీకి క‌లిసి వ‌స్తున్న మూడు విష‌యాలు.. !

ఏపీ అధికార పార్టీకి క‌లిసి వ‌స్తున్న అంశాలు ఏంటి? వ‌చ్చే ఎన్నికల్లో పార్టీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న అంశాలు ఏంటి? అనే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దీనికి నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. మూడు విష‌యాలు వైసీపీకి క‌లిసి వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు. ఈ మూడు అంశాల‌ను బ‌లంగా తీసుకువెళ్తే.. ఇక‌. వైసీపీకి తిరుగు లేద‌ని అంటున్నారు. అవేంటంటే ఒక‌టి.. జ‌గ‌న్ నాయ‌క‌త్వం.. పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అయింది. నిజానికి ఎంతో …

Read More »

బీజేపీలో చేరనున్న వీవీఎస్ లక్ష్మణ్ ?

టీమిండియా మాజీ క్రికెటర్‌, తెలుగు తేజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ గురించి క్రికెట్ ప్రేమికులకు, క్రీడాకారులకు పరిచయం అక్కర లేదు. భారత జట్టులో చాలాకాలం పాటు కీలక ఆటగాడిగా కొనసాగిన లక్ష్మణ్…ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లతో జట్టుకు చరిత్రాత్మక విజయాలనందించాడు. ఆసీస్ పై టెస్టులో జట్టు ఫాలో ఆన్ ఆడుతున్న క్లిష్ట సమయంలో ఈ వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్ మన్ తన సొగసరి షాట్లకతో చేసిన డబుల్ సెంచరీ చరిత్ర …

Read More »