తెలంగాణ మంత్రి, సాక్షాత్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు.. హరీష్రావుకు.. భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్కు ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బలమూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 42 మంది అభ్యర్థులు నామినేషన్ …
Read More »బుచ్చయ్య కోపం.. ఎవరిమీద.. మనసు విప్పిన సీనియర్ నేత
టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఎన్టీఆర్ హయాం నుంచి రాజకీయ చక్రం తిప్పుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి విషయం.. టీడీపీలో ఎప్పుడూ హాట్ టాపిక్గానే నడుస్తోంది. గతంలో అన్నగారి హయాంలో ఆయన చెంతన చేరిన బుచ్చయ్య.. అన్నగారి టీంగా గుర్తింపు పొందారు. పార్టీలో తలెత్తిన సంక్షోభ సమయంలో మెజారిటీ నాయకులు.. చంద్రబాబుకు జైకొట్టారు. అయితే. ఆసమయంలో లక్ష్మీపార్వతి వర్గంగా ఉన్న బుచ్చయ్య.. అనంతర పరిణామాలతో తిరిగి బాబు గూటికి …
Read More »బుట్టా రేణుకకు మళ్లీ అవకాశం!
2019 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి గద్దెనెక్కిన జగన్ వచ్చే ఎన్నికల్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ సీట్లనూ వైసీపీ భారీగా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలపై జగన్ ఇప్పటి నుంచే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ అభ్యర్థులను కూడా ఎక్కువ సంఖ్యలో …
Read More »నెచ్చెలి వచ్చేస్తోంది!
తమిళనాడు రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో డీఎంకే చేతిలో ఓటమిపాలై నిరాశలో కూరుకుపోయిన అన్నాడీఎంకే శ్రేణుల్లో తిరిగి ఉత్సాహం రానుందా? దివంగత ముఖ్యమంత్రి జయలలిత హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకువచ్చేందుకు ఆమె నెచ్చెలి మళ్లీ పార్టీలోకి రానుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళ మనసు మార్చుకున్నారు. …
Read More »కాపు కాయడానికి పవన్ ప్రయత్నాలు
ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసి దారుణ పరాజయాన్ని మూట గట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల కోసం ప్లాన్ మార్చినట్లే కనిపిస్తున్నారు. ఈ మధ్య ఆయన కాపు జపం ఎత్తుకోవడమే అందుకు నిదర్శనమని రాజకీయ నిపుణులు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సొంత కాపు సామాజిక వర్గం మద్దతుతో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. కాపు …
Read More »కాంగ్రెస్ ఇప్పటికి కళ్లు తెరిచిందా?
అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో పార్టీలో వేగంగా మారుతున్న పరిణామాలు.. పెరుగుతున్న అసమ్మతి గళం.. సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత.. పార్టీలో అంతర్గత కలహాలు.. పార్టీ భవిష్యత్పై కార్యకర్తల్లో ఆందోళన.. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను చక్కదిద్ది పార్టీని ఓ గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ ఎట్టకేలకు సిద్ధమైంది. ఆలస్యంగా కళ్లు తెరిచిన ఆ పార్టీ అధిష్థానం అక్టోబర్ 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించింది. పార్టీ అధ్యక్ష …
Read More »టీడీపీకి గంటా గుడ్ బై.. పక్కా ప్లానింగ్ తో ?
ఏపీలోని రాజకీయ నేతల్లో చాలామంది అయితే రాజకీయ పార్టీతో వారి పేరు ముడిపడి ఉంటుంది. వ్యక్తిగతంగా వారికున్న బలం ఏమిటన్నది అంత స్పష్టంగా కనిపించదు. కానీ.. గంటా శ్రీనివాసరావు మాత్రం అందుకు భిన్నంగా. ఆయనకు పార్టీ ఏదైనా.. ఆయన గెలుపు మాత్రం ఖాయమని చెబుతారు. ఇప్పటివరకు ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే.. కాంగ్రెస్.. ప్రజారాజ్యం.. తెలుగుదేశం.. ఇలా ఏ పార్టీలో చేరినా.. ఆయన వరకు ఆయన ఎన్నికల్లో గెలుపు మాత్రం …
Read More »లోకేష్కు డ్రగ్స్ దొరక్క ఎండిపోయాడు-కొడాలి నాని
మంత్రి కొడాలి నాని చాన్నాళ్ల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఎప్పట్లాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ మీద తనదైన శైలిలో విరుచుకుపడిపోయారు నాని. ఉత్తరాదిన వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడటం, అందులో ఏపీ అధికార పార్టీ వైకాపాకు చెందిన వ్యక్తులున్నట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ గట్టిగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో …
Read More »మోడీపై పెరిగిపోతున్న ఒత్తిడి
తన మంత్రివర్గంలోని ఓ సహాయ మంత్రిని తప్పించే విషయంలో నరేంద్ర మోడిపై ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోతోంది. వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో రైతుల మరణాలు తదనంతర పరిణామాల నేపథ్యంలో సహాయ మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలంటు డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా రెండు డిమాండ్లపైనే రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయి. మొదటిదేమో సహాయ మంత్రి కొడుకు, వివాదానికి మూల కారకుడైన ఆశిష్ …
Read More »తొందరలోనే మరో సంక్షోభం తప్పదా ?
దేశ కాల పరిస్థితులను బట్టి చూస్తుంటే విద్యుత్ సంక్షోభం తప్పేట్లు లేదు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెంచుకునే అవకాశం లేకపోవడంతో వినియోగాన్ని తగ్గిచుకోవాలంటు ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. అలాగే పరిశ్రమలకు, వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ లో కోతలు కూడా మొదలైపోయాయి. ఈ సంక్షోభం ఏ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. ఇప్పటికే ఏపీ, తమిళనాడు, …
Read More »వైసీపీ కోసం.. 150 మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లు
వారంతా ఎంతో కష్టపడి.. జేఈఈ చదివారు. లక్షలు ఖర్చు పెట్టి రాత్రనక.. పగలనక.. కోచింగ్ తీసుకుని అడ్వాన్స్డ్ పాసయ్యారు. ప్రఖ్యాత ఐఐటీల్లో చోటు సంపాయించుకున్నారు. అందునా.. ముంబాయి ఐఐటీ వంటి సంస్థల్లోనూ చదువుతున్నారు. అయితే.. ఇప్పుడు ఇలాంటివారిలో చాలా మంది రోడ్డున పడుతున్నారు! అదేంటి అనుకుంటున్నారా? ఏపీ సీఎం జగన్ తన ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తను అమలు చేస్తున్న సంక్షేమం.. ఇతర పథకాలు.. వంటివి తనను …
Read More »బద్వేలు ఉప ఎన్నిక.. జనసేన ఇంకో ట్విస్ట్
ఆంధ్రప్రదేశ్లో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే గుంతోటి వెంకటసుబ్బయ్య ఈ మార్చిలో చనిపోవడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఎన్నిక జరగబోతోంది. వెంకటసుబ్బయ్య స్థానంలో ఆయన భార్య డాక్టర్ సుధనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ చనిపోయినపుడు వారి కుటుంబ సభ్యులను బరిలోకి నిలిపితే.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates