కొన్ని కొన్ని ఆశ్చర్యంగానే ఉంటాయి. నమ్మడానికి కూడా ఒకింత ఇబ్బందిగానే ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే అతి పెద్ద జాతీయ పార్టీ బీజేపీలో కనిపిస్తోంది. కొన్నాళ్ల కిందట వరకు.. ఈ పార్టీలోని నాయకులు వాజపేయి నుంచి అడ్వాణీ వరకు.. అందరూ కూడా.. బీజేపీని చూసి ఓటేయండి.. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలను చూసి గెలిపించండి.. అని పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఆ సేతు హిమాచలం అందరూ కూడా ఇదే నినాదం …
Read More »అమరావతిపై సుప్రీ తాజా ఆదేశం
ఏపీ రాజధాని అమరావతిపై అటు సుప్రీం కోర్టు ఇటు హైకోర్టు ఏకకాలంలో విచారణ జరిపాయి. అమరావతి విషయంపై కొందరు పిటిషన్లు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. మరికొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం రెండు కోర్టుల్లోనూ.. ఈ కేసులు విచారణకు రావడం గమనార్హం. అమరావతి భూముల కోనుగోలు వ్యవహారంపై గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను తదనంతర ప్రభుత్వాలు సమీక్షించవచ్చా? లేదా? అన్న అంశం చాలా పెద్దదని సుప్రీం తెలిపింది. దీనిపైన పూర్తి …
Read More »రుషికొండపై సీఎం జగన్కు రిలీఫ్
విశాఖపట్నంలోని రుషికొండను తవ్వేస్తున్నారని.. అక్కడ జరుగుతున్న తవ్వకాలను అడ్డుకోవాలని.. కోరుతూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం.. విచారణకు స్వీకరించేదిలేదని స్పష్టం చేసింది. దీంతో సీఎం జగన్కు ఒకింత రిలీఫ్ దక్కగా.. ఎంపీ రాజు గారికి మాత్రం భారీ షాక్ తగిలినట్టయింది. అయితే, విచారణ విషయంలో హైకోర్టుకు పూర్తి అధికారాలు ఉన్నాయని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. రుషికొండపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ …
Read More »పాల్ను మించిన కాంగ్రెస్ నేతలు
చెప్పేవాడు చిరంజీవి అయితే.. అన్న సామెతను తలపిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నాయకులు. నానాటికీ తీసికట్టుగా మారుతున్న కాంగ్రెస్ పరిస్థితిని గాడిలో పెట్టేందుకు.. కాడి మోసేందుకు ముందుకు రాని కాంగ్రెస్ నాయకులు.. పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చేస్తుందని.. బరిలోకి దిగితే తమను ఆపడం బ్రహ్మకు సైతం సాధ్యం కాదని.. ఉత్తర కుమార ప్రగల్భాలను మించిన కామెంట్లను దంచికొడుతూ.. కేఏ పాల్ను మించిపోతున్నారు. ఇటీవల మునుగోడు ఉప పోరులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు …
Read More »ఆ ఒక్క విషయంలో బాబు దూకుడు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తమ్ముళ్లతో సమీక్షలు పూర్తి చేశారు. సంఖ్యాబలం బాగానే ఉంది. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే ఆయన సమీక్షలు పూర్తి చేయడం చరిత్రలోనే తొలిసారి. గతంలో ఎప్పుడూ కూడా ఈ రేంజ్లో చంద్రబాబు సమీక్షలు చేసింది లేదు. సో.. ఇప్పుడు ఆయన క్షేత్రస్థాయిపై దృష్టి పెట్టారు. దీనిని అందరూ స్వాగతిస్తున్నారు. అయితే, పాడిందే పాట …
Read More »AP లో అంతే.. కోడిగుడ్లు కాకులు ఎత్తుకెళ్లాయట..
వైసిపి నేత, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన వ్యాఖ్యలతో ప్రసన్నకుమార్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన విమర్శలతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన ప్రసన్నకుమార్ రెడ్డికి వింత అనుభవం ఎదురయింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు …
Read More »హైదరాబాద్.. ఐటీ.. అదే పాట పాడిన చంద్రబాబు
దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ -1గా ఎదగడానికి పునాది వేసింది టీడీపీనేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్లెయిమ్ చేసుకున్నారు. తెలంగాణను శాసించే స్థాయికి టీడీపీ ఎదగాలని ఆకాంక్షించారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టెక్నాలజీలో చూస్తే తెలుగువాళ్లు బాగా రాణిస్తున్నారని కొనియాడారు. నాయకత్వాన్ని పెంచిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. వెనుకబడిన తెలంగాణ ఒక్క నిర్ణయంతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో …
Read More »జగన్-పవన్-మోడీ.. ముహూర్తం ఖరారు?!
ఏపీ పొలిటికల్ హిస్టరీలో ఫస్ట్టైం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్-సీఎం జగన్లు ఒకే వేదికను పంచుకోనున్నారు. రాజకీయంగా కత్తులు నూరుకునే ఈ ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో విశాఖలో జరగనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇది అధికారిక కార్యక్రమమే అయినప్పటికీ.. పవన్కు ‘ప్రత్యేక ఆహ్వానం’ అందినట్టు తెలుస్తోంది. దీంతో ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొనాలని.. కేంద్రం నుంచి పవన్కు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో …
Read More »అనంతలో మరో చిచ్చు.. టీడీపీని బాగుచేసేవారేరీ..?
ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే.. టీడీపీకి కంచుకోట. ఇక్కడ అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అనేక మంది మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఒకప్పుడు జిల్లాను శాసించిన నేతలు కూడా ఇప్పుడు అనంతపురంలోనే ఉన్నారు. అయితే, ఇప్పుడు వారివల్ల ఏం ప్రయోజనం అనే మాట వినిపిస్తోంది. తాజాగా కళ్యాణ దుర్గంలో తమ్ముళ్లు కొట్టుకున్నారు. ఆధిపత్య రాజకీయాలు.. మా మాటే నెగ్గాలనే పంతాలు వంటివి ఇక్కడ టీడీపీని బజారున పడేస్తున్నాయి. …
Read More »ఇప్పటంలో విచిత్రమైన ఫ్లెక్సీలు
ఇప్పటం.. ఆంధ్రప్రదేశ్లో అటు ఇటుగా 200 ఇళ్లున్న చిన్న గ్రామం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఈ గ్రామం వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చిలో జనసేన పార్టీ ప్లీనరీకి తమ పొలాలు ఇచ్చారన్న కారణంతో ఆ పార్టీ మద్దతుదారుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో వాటిని కూలగొట్టారన్న ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో …
Read More »జనసేన మౌనం.. ఛాన్స్ మిస్ చేసుకుంటోందా..?
రాజకీయాల్లో పార్టీలకు కానీ, నాయకులకు కానీ అసలు అవకాశం రావడమే కష్టం. అవకాశం వచ్చిందా.. వెంటనే దానిని అందిపుచ్చుకుని.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నాయకులు, పార్టీలు ప్రయత్నించిన సందర్భాలు అనేకం. మరీ ముఖ్యంగా అంకురంగా ఉన్న పార్టీలు.. అయితే ఎప్పుడెప్పు డు చాన్స్ వస్తుందా? అని ఎదురు చూస్తుంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాయి. ఇప్పుడు ఏపీలో జనసేన పార్టీకి కూడా గొప్ప ఛాన్స్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి …
Read More »లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు అరెస్ట్
కొద్ది నెలల క్రితం వెలుగు చూసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆప్ మంత్రి మనీష్ సిసోడియా చుట్టూ అల్లుకున్న ఈ స్కామ్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు వైసిపి కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆయన బంధువుల పేర్లు కూడా వినిపించాయి. విజయ్ సాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates