ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇక్కడి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టికెట్లపై ఆశలు పెంచుకున్న నేతలు తమకు అనుకూలమైన దారులను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్కు చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులతోపాటు అసంతృప్తివాదులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారు అధికంగా ఉండటం, ఇప్పటికే తమకే అభ్యర్థిత్వాలు ఖాయమని సిట్టింగ్ ఎమ్మెల్యేలు …
Read More »జగన్ సర్.. కడప కార్యకర్తల ఘోష.. వినిపిస్తోందా?
ఏపీ అధికార పార్టీ వైసీపీలో కార్యకర్తలు ఘోష పెడుతున్నారు. తమను పట్టించుకోవడం లేదని..వాడుకుని గాలికొదిలేశారని వారు గగ్గోలు పెడుతున్నారు. దీంతో వైసీపీలో కార్యకర్తల కల్లోలం.. ఆక్రోశం.. స్పష్టంగా కనిపిస్తోంది. అందునా.. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనే ఈ పరిస్థితి ఉండడం మరింతగా పార్టీని డోలాయమానంలో పడేస్తోంది. సీఎం జగన్ సొంత గడ్డ పులివెందులలో ఇటీవల జరిగిన ప్లీనరీలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాం. సీఎం సార్కు …
Read More »గెలిచిన మేకపాటి సింపతీ.. విక్రమ్ విజయం!
నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ.. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తంగా 20 రౌండ్లు లెక్కింపు కొనసాగగా.. ప్రతి రౌండ్లోనూ విక్రమ్రెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగారు. ఆది నుంచీ ఆధిక్యంలో …
Read More »నేపాల్ కూడా భారత్ భూమిని కబ్జా చేసిందా ?
భారత్ భూభాగాన్ని కబ్జా చేయాలని ఒకవైపు దాయాది దేశం పాకిస్తాన్, మరోవైపు డ్రాగన్ దేశం చైనా 24 గంటలు 365 రోజులూ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పై రెండు దేశాలు వివిధ సందర్భాల్లో వేలాది కిలోమీటర్లను ఆక్రమించేశాయి. పీవోకే అంటే పాక్ ఆక్యుపెయిడ్ కాశ్మీర్ రూపంలో సుమారు 2500 కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్ తన కబ్జాలో దశాబ్దాలుగా అట్టే పెట్టేసుకున్నది. పై రెండు దేశాల దురాక్రమణలు అందరికీ తెలిసిందే. అయితే …
Read More »విరాళాలు సరే మద్దతేది ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. పవన్ తల్లి పార్టీకి లక్ష రూపాయల విరాళమిచ్చారు. అలాగే మరో లక్షన్నర రూపాయలు ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు అందించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు పవన్ జిల్లాల పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. కష్టాల్లో ఉన్నవారిని ఆర్ధికంగా ఆదుకోవటం నిజంగా మంచిపనే. ఈ మధ్యనే పవన్ సోదరుడు నాగబాబు పిల్లలు, …
Read More »అమరావతి భూముల అమ్మకం.. ప్లాన్ సిద్ధం చేసిన జగన్ సర్కారు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో ఏదో ఒక విధంగా నిధులను సేకరించేందుకు అన్ని దారులను వినియోగించుకుంటోంది జగన్ సర్కారు. ఈ క్రమంలో సర్కారు నిధుల సేకరణకు రాజధానిలో ఉన్న భూములను విక్రయించేం దుకు జగన్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించింది. ఎకరానికి రూ.10 కోట్ల చొప్పున రూ.2480 కోట్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వేలం ద్వారా భూముల విక్రయానికి …
Read More »జగన్ వ్యాపార భాగస్వామి.. సుశీల్ మంత్రి అరెస్టు
ఏపీ సీఎం జగన్ వ్యాపార భాగస్వామి.. దక్షిణ భారతేదశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరైన మంత్రి డెవలపర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ మంత్రి ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ ఆరోపణల కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అనంతరం ఆయనను ఈడీ కోర్టులో ఆయనను ప్రేవేశపెట్టగా…పది రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. …
Read More »వైసీపీకి పృథ్వీ తలపోటు
2019 ఎన్నికలకు ముందు కమెడియన్ పృథ్వీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ప్రత్యర్థి పార్టీలపై ఒక రేంజిలో రెచ్చిపోయి కామెంట్లు చేయడం.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని ఆయనకు కట్టబెట్టడం.. కానీ ఓ మహిళతో సరస సంభాషణ సాగించడంతో ఆయన పదవి ఊడిపోవడం తెలిసిందే. వైసీపీలో వేరే నేతల మీద కూడా ఇలాంటి ఆరోపణలున్నా, వాళ్లూ వివాదాల్లో చిక్కుకున్నా.. వారిపై మాత్రం చర్యలు చేపట్టకుండా పృథ్వీని …
Read More »పీలేరులో మాజీ సీఎం కిరణ్ తమ్ముడికి ఈ సారి ఛాన్స్..!
రాజకీయాల్లో మార్పు సహజం. అది ఎప్పుడు ఎలాగైనా.. మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి చర్చే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మార్పు ఖాయమనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. మాజీ ముఖ్యమంత్రి, పీలేరు మాజీ ఎమ్మెల్యే.. నల్లారి కిరణ్కుమార్ రెడ్డి.. ఇక్కడ ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడంతోపాటు.. స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి నివేదికలు కూడా తెప్పించుకున్నారని చర్చ జరుగుతోంది. …
Read More »బీఆర్ఎస్.. ప్రకటన వాయిదా.. వ్యూహం మార్చిన కేసీఆర్
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దె దింపే వరకు నిద్రపోను అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ క్రమంలో తాను జాతీయ పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారనే సంకేతాలు పంపించారు. దీనికి సంబంధించి ‘బీఆర్ ఎస్’ అంటే.. భారత రాష్ట్ర సమితి పేరును కూడా ఆయన ఖరారు చేశారనివార్తలు వచ్చాయి. ఇక, ఈ నెల ఆఖరులోనే ఆయన ప్రకటన చేస్తారని కూడా ప్రగతి భవన్ వర్గాల నుంచి …
Read More »బాబును కొట్టండి.. ధైర్యముంటే నరకండి: వైసీపీ ఎమ్మెల్యే పిలుపు
“సమస్యలకు మూలం టీడీపీ నాయకుడు.. చంద్రబాబు. ఆయన కనిపిస్తే.. కొట్టండి.. మీకు ఇంకా ధైర్యం ఉంటే.. నరికేయండి. ఆయన వల్లే.. రాష్ట్రం నాశనం. గిరిజనుల జీవితాలు నాశనం” అని.. వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తీవ్ర దుమారానికి ఆయన తెరదీశారు. రాష్ట్రంలో గిరిజనుల సమస్యలపై కొందరు గిరిజన మహిళలు.. ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆయన సహనం కోల్పోయారు. చంద్రబాబు వల్లే.. ఏ పనీ ముందుకు …
Read More »తెలంగాణాలో పోటీకి రెడీ అవ్వండి – పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. తెలంగాణాలోని నేతలతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పోటీచేయటానికి అందరు సిద్దంగా ఉండాలని పిలుపిచ్చారు. నేతలకు, కార్యకర్తలకు అవసరమైన రాజకీయ శిక్షణా శిబిరాలను నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తెలంగాణాను పక్కనపెట్టేస్తే అసలు ఏపీలోనే పార్టీ నిర్మాణం జరగలేదు. పార్టీ ఏర్పాటై పదేళ్ళయినా ఇంతవరకు గ్రామస్ధాయినుండి రాష్ట్రస్ధాయివరకు అసలు పార్టీ పూర్తిస్ధాయి కమిటిలనే నియమించలేదు. పార్టీ కమిటీలను నియమించటం పవన్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates