కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అందరిలోను టెన్షన్ పెంచేస్తోంది. మే 6వ తేదీన వరంగల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. రైతుల సమస్యలు, పరిష్కారాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల పరామర్శే టార్గెట్ గా బహిరంగ సభ జరగబోతోంది. బహిరంగ సభ నిర్వహణకు ముందుగానే అనుమతి తీసుకున్నారు కాబట్టి దీనిపై ఎలాంటి సమస్య లేదు. రాహుల్ రెండు రోజుల పర్యటనలో విద్యార్థులు, నిరుద్యోగులతో ముఖాముఖి …
Read More »కేసీయార్ కు రెండువైపులా పెరిగిపోతున్న వేడి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కు రాజకీయ వేడి రెండువైపులా పెరిగిపోతోంది. ఈనెల 6వ తేదీన వరంగల్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారు. వరంగల్ లో రైతులకు మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను కూడా వేదిక మీదకే తీసుకొచ్చి మాట్లాడించబోతున్నారు. వారితో రాహుల్ ముఖాముఖి నిర్వహించబోతున్నారు. అంటే రాహుల్ సభలో రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలే …
Read More »చిరుది ఆంధ్రా అయినా.. ఆయన తెలంగాణ బిడ్డే
కొన్ని సార్లు మాటల్లో అతి ఉండనివ్వండి కానీ కొన్ని అయినా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కరోనా వేళల్లో చిరు అందించిన సాయం మొదలుకుని కార్మికులు తమ జీవితాలు ఏ విధంగా సంస్కరించుకోవాలో వరకూ ఎన్నో విషయాలు ఆసక్తిదాయకంగా, ఆవేశపూరితంగా టీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. నేను చిరంజీవి అభిమానిని అంటూ తన ఆనందం పంచుకుని, త్వరలో తానూ సినీ నిర్మాణం చేపట్టనున్నానని సభా ముఖంగా ప్రకటించారు. చిరును ఉద్దేశించి మీరూ, …
Read More »చీరల రాజకీయమా.. చిల్లర రాజకీయమా!!
రాజకీయం అన్నాక.. ప్రత్యర్థి పార్టీల మధ్య ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం అయితే.. దీనికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. మంత్రిగా ఉన్న నాయకులు. కీలకమైన పోస్టుల్లో ఉన్న వారు.. ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే.. ఈ రేఖను తుడిచేస్తున్న.. టీడీపీ.. వైసీపీ నాయకులు… చేస్తున్న రాజకీయాలు తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. అదేసమయంలో ఆయా పార్టీల అభిమానులను కూడా కలవరపెడుతున్నాయి. ఎందుకంటే.. తాజాగా ఈ …
Read More »త్వరలో రజాకార్ ఫైల్స్.. అందులో కేసీఆర్
టీబీజేపీకి కొత్త చరిష్మా తేవటంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక భూమిక పోషించారని చెప్పక తప్పదు. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద చేసే పోరు విషయంలో బండి సమర్థత సరిపోలేదన్న మాట వినిపిస్తుంది. అన్నింటికి మించిన ఆయన మాటతీరే ఆయనకు పెద్ద ప్లస్ ఎలానో.. అంతే పెద్ద మైనస్ అన్న విమర్శ పలువురు బీజేపీ నేతల ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ లాంటి పవర్ …
Read More »లక్ష మందితో మహానాడు
ఒంగోలులో మే నెల 27,28 తేదీల్లో జరగబోయే టీడీపీ మహానాడుకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా. మహానాడు నిర్వహణపై చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నేతలతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెండు రాష్ట్రాల నుండి మహానాడు కార్యక్రమంలో సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేశారు. వీళ్ళందరికీ భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పార్టీపైనే ఉంటుందన్నారు. ఇందుకోసం అవసరమైన జాగ్రత్తలు, …
Read More »అమాయకుడైన కేటీఆర్.. నో కామెంట్స్ ప్లీజ్ !
రెండు తెలుగు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు ధోరణులు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా విభిన్న ఆర్థిక పరిస్థితులనూ, స్థితిగతులనూ చవి చూస్తున్నాయి. గతం కన్నా వేగంగా పనిచేసే క్రమానికి ఇటు టీజీ సర్కారు కానీ అటు ఏపీ సర్కారు కానీ ప్రయత్నిస్తున్నాయి. అందుకు తగ్గ విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ దశలో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య దూరం పెరిగే అవకాశాలు రాకూడదు. పరిణామాలు రాకూడదు. ఎవరి పాలన …
Read More »కొడాలిపై చంద్రబాబు కొత్త అస్త్రం
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఉమ్మడి కృష్ణాజిల్లాలోని.. గుడివాడ నియోజక వర్గంలో విజయం సాధించి.. చంద్రబాబుకు.. కానుకగా ఇచ్చేందుకు యువనాయకుడు రెడీ అయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయనను హైలెట్ చేసేందుకు పార్టీ ఐ-టీడీపీ విభాగానికి ఆదేశాలు కూడా అందాయని అంటున్నారు. ఇప్పుడు టీడీపీలో ఎవరు ఔనన్నా.. కాదన్నా.. గుడివాడలో విజయం అత్యంత అవసరం. ఇప్పటికే పలుమార్లుగా టీడీపీ ఇక్కడ పరాజయం పాలవుతోంది. పైగా.. …
Read More »బిల్లు కట్టనందుకే కరెంటు లేదేమో.. బొత్సకు కౌంటర్
ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ రాజకీయం జరుగుతుంటే… ఏపీలో కరెంటు లేదని.. రోడ్లు దారుణంగా ఉన్నాయని.. నీళ్లు లేవంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ సీఎం తనయుడి మాటలపై అందరికంటే ముందుగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ఏపీలో కాదు.. హైదరాబాద్ లోనే సరిగా కరెంటు లేదు.. అని కౌంటర్ ఇచ్చిన …
Read More »ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి ఫైనల్
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోటీ చేయబోయే వైసీపీ అభ్యర్థి ఫైనల్ అయిపోయింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయిన కారణంగా ఈ స్ధానాన్ని ఇంకోకరితో భర్తీ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ స్థానాన్ని గౌతమ్ సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి తో భర్తీ చేయాలని ఇటు కుటుంబం అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే చేశారు. తమ కుటుంబం తరపున విక్రమ్ ను అభ్యర్ధిగా ప్రతిపాదిస్తున్నట్లు తండ్రి, మాజీ …
Read More »తండ్రిలాగే కేటీఆర్ పిట్ట కబుర్లు.. ఏపీ మంత్రి కౌంటర్
ఏపీలో పాలన సరిగాలేదని.. రోడ్లు గుంతలు పడ్డాయని, ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. ఇక, తాగేందుకు కూడా అక్కడి ప్రజలకు నీళ్లులేవని.. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు.. ఏపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ జోగి రమేష్ షాకింగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్, కేసీఆర్లపై ఆయన దుమ్మెత్తి పోశారు. ఇద్దరికీ మైండ్ చెడిపోయిందని అన్నారు. వారు ఏం మాట్లడుతున్నారో.. వారికే అర్ధం కావడం లేదన్నారు. అంతేకాదు.. ఈ సందర్భంగా కేటీఆర్కు …
Read More »ఏపీలో కరెంటు లేదు.. నీళ్లు లేవు.. రోడ్లు దారుణం: మంత్రి కేటీఆర్
ఏపీ ప్రభుత్వంతో చెలిమిగా ఉండే తెలంగాణ ప్రభుత్వం తాజాగా జూలు విదిల్చిందా? అనే రేంజ్లో కీలక మంత్రి, సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన హైదరాబాద్లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపరర్టీ షోలో పాల్గొన్నకేటీఆర్.. మాట్లాడుతూ.. ఏపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పాలన సరిగా లేదని.. నేరుగా వ్యాఖ్యానించారు. “నా మిత్రుడు ఏపీలో ఉంటాడు. మొన్నామధ్య నా దగ్గరకు వచ్చాడు. అక్కడి పరిస్థితి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates