Political News

ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లకు జైలు శిక్ష..

ఒక కేసు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు సాధారణ జైలుశిక్షతో పాటు.. జరిమానాను విధిస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఊహించని రీతిలో వచ్చిన ఈ తీర్పునకు వెంటనే అప్పీలుకు వెళ్లారు. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. సింగిల్ జడ్జి తీర్పును ఆరు …

Read More »

ప్రభుత్వానికి చేతకావడం లేదు, మీదే బాధ్యత – ప్రజలతో పవన్

రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై విచారణను హైకోర్టే సూమోటోగా తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. మహిళలపై అత్యాచారాలు ఆగని పక్షంలో జనాల్లో భయం పెరిగిపోతుందన్నారు. అందుకనే అత్యాచార ఘటనలను కోర్టే విచారణకు స్వీకరిస్తే జనాల్లో కాస్త ధైర్యం వస్తుందన్నారు. ఈ పద్ధతిలో హైకోర్టు చొరవ చూపించి ప్రభుత్వానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం ఆపలేకపోతోందన్నారు. ఈ విషయాన్ని …

Read More »

2 ల‌క్షల రుణ మాఫీ.. రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ‘వరంగల్ డిక్లరేషన్‌’ ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. చేసే అభివృద్ది పనుల గురించి ప్రసంగించారు. తెలంగాణ అంటే తమకు ఆత్మగౌరవమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రేవంత్‌… రైతుల కుటుంబాలను కేసీఆర్‌ ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 …

Read More »

పొత్తుల గురించి ఎవరు మాట్లాడినా ఔట్‌: రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్‌

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ఆ పార్టీ నేత‌ల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. పొత్తుల విష‌యంలో కాంగ్రెస్‌లో ఎవ‌రూ నోరు మెద‌పొద్ద‌ని గ‌ట్టిగానే చెప్పారు. ఇలా ఎవ‌రు మాట్లాడినా.. పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు.. టీఆర్ ఎస్‌, బీజేపీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగే నాయ‌కుల‌కు కూడా పార్టీలో చోటు లేద‌న్నారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్‌.. ఆ సాంతం వాడి …

Read More »

కేసీఆర్ క‌రుణ ద‌క్కేది ఎవ‌రికి? రాజ్య‌స‌భ రేసులో కొత్త ముఖాలు

టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ క‌రుణ కోసం.. నేత‌లు త‌హ‌త‌హలాడుతున్నారు. ఆయ‌న త‌మ‌ను క‌రుణించాల‌ని.. నేత‌లు దేవుళ్ల‌ను మొక్కుతున్నారు. దీనికి కార‌ణం.. త్వ‌ర‌లోనే మూడు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు ఉండ‌డమే! ఈక్ర‌మంలో కేసీఆర్‌ ఇప్పటికే మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. 2018 ఏప్రిల్‌ 3న బండా ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా పరిణామాల అనంతరం పార్టీ అధినేత కేసీఆర్‌.. …

Read More »

పొత్తుల‌పై చంద్ర‌బాబు సంకేతాలు.. ఏమ‌న్నారంటే!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. రాజ‌కీయ పొత్తుల‌పై తొలిసారి పెద‌వి విప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు అన్ని పార్టీలూ క‌లిసి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌జా ఉద్య‌మం నిర్మించాల‌ని.. దీనికి టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని తేల్చి చెప్పారు. “ఏపీలో ప్ర‌జా ఉద్య‌మం రావాలి. ఈ ప్ర‌జా ఉద్య‌మానికి టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంది. ఈ విష‌యంలో టీడీపీ ఎన్నిత్యాగాలు చేసేందుకైనా సిద్దం. ఇప్ప‌టికే మాతో క‌లిసి ప‌నిచేసేందుకు సీపీఐ సిద్ధంగా …

Read More »

పీకే పాదయాత్రకు మాత్రమే పరిమితమా ?

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తన రాజకీయ భవిష్యత్తును ఆవిష్కరించారు. మీడియాతో మాట్లాడుతు రాజకీయపార్టీ పెట్టే ఆలోచనేదీ తనకు లేదని స్పష్టంగా ప్రకటించారు. అయితే పనిలోపనిగా పాదయాత్ర మాత్రం చేయబోతున్నట్లు చెప్పారు. జన్ సురాజ్ పేరుతో అక్టోబర్ 2వ తేదీ నుంచి బీహార్ లో సుమారు 3 వేల కిలోమీటర్ల పాదయాత్రకు పీకే రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న జన్ సూరజ్ వేదికే భవిష్యత్తులో రాజకీయ …

Read More »

ఉత్తరాంధ్రకు ఛాయిస్ ఇచ్చిన చంద్రబాబు

క్విజ్ లో పార్టిసిపెంట్ కు ఛాయిస్ ఇచ్చినట్లే చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర జనాలకు ఛాయిస్ ఇచ్చారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం రాజధానిగా కావాలా ? లేకపోతే విశాఖపట్నం అభివృద్ధి కావాలా ? అని ప్రశ్నించారు. ఛాయిస్ ఇస్తే ఎవరైనా విశాఖను రాజధానిగా కావాలనే అనుకున్నారేమో.. కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని డెవలప్ చేస్తానని, విశాఖను కూడా అభివృద్ధి చేసే …

Read More »

జాతీయ మీడియా దృష్టికి చేరిన ఏపీ హోంమంత్రి కామెంట్లు

రేపల్లె రైల్వే స్టేషన్లో వివాహితపై అత్యాచార ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. మద్యం మత్తులో వివాహితపై అత్యాచారానికి ఒడిగ‌ట్ట‌డ‌మే కాకుండా ఆమె భర్తపై దాడికి‌ దిగారు. అయితే, అత్యాచారానికి గురైన బాధితురాలి విష‌యంలో అన్నివ‌ర్గాల నుంచి సానుభూతి వ్య‌క్త‌మ‌వుతుండ‌గా, ఏపీ హోంమంత్రి తానేటి వ‌నిత చేసిన కామెంట్లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అత్యాచారం ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగిన ఘ‌ట‌న కాద‌ని, ఆ స‌మ‌యంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌తో అప్ప‌టిక‌ప్పుడు …

Read More »

ఆ రేప్ లు చేసింది టీడీపీ వారే:జగన్

కొద్ది రోజులుగా ఏపీలో వరుస గ్యాంగ్ రేప్ ఘటనలు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, పదో తరగతి పరీక్షల పేపర్లు వరుసగా లీక్ అవుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే టెన్త్ పేపర్ల లీక్ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. పదో తరగతి పరీక్ష పేపర్లను నారాయణ, చైతన్య స్కూల్ నుంచి లీక్ చేయించారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ రెండు పేపర్లు నారాయణ …

Read More »

యాదాద్రి పనులు మరీ ఇంత నాసిరకమా ?

ముఖ్యమంత్రి కేసీయార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయిస్తున్న యాదాద్రి పనుల డొల్లతనం ఒక్కసారిగా బయటపడింది. బుధవారం కురిసిన వర్షానికి ఆలయం లోపలంతా నీళ్ళు నిండిపోయింది. ఆలయానికి వెళ్ళే ప్రధాన రోడ్డు కుంగిపోయింది. ఆలయంలోని గదుల్లోకి, హాళ్ళలోకి కూడా పెద్ద ఎత్తున నీరుచేరిపోయింది. ప్రసాదాలుండే గదులు, భక్తుల క్యూలైన్లు, విశ్రాంతి తీసుకునే గదులు కూడా నీళ్ళతో నిండిపోయింది. రోజులో కొద్దిసేపు కురిసిన గట్టి వర్షానికే యాదాద్రి లోపలా, బయట పరిస్థితి ఇంత …

Read More »

‘రాహుల్ గాంధీ ఎక్కడికి పోతే అక్కడ కాంగ్రెస్ గల్లంతు’

గ‌త కొద్దికాలంగా బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ అన్న‌ట్లుగా తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణ‌లో రాజ‌కీయం రూట్ మారిన‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ యువ‌నేత రాహుల్ గాంధీ త్వ‌ర‌లో తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ తాజాగా నేరుగా స్పందిస్తున్నారు. చోటామోటా నేత‌లు కాకుండా ఏకంగా ముఖ్య నేత‌లే కాంగ్రెస్ నాయ‌కుడి ప‌ర్య‌ట‌న‌ను టార్గెట్ చేశారు. …

Read More »