Political News

48 గంట‌ల్లో క్ష‌మాప‌ణ చెప్పు.. లేదా జైలు త‌ప్ప‌దు: కేటీఆర్ వార్నింగ్‌

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఈనెల 11న చేసిన ట్విట్టర్ లో ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. నిరాధర ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదా పరువునష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. ఈమేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్కి కేటీఆర్ నోటీసులు …

Read More »

‘ఒకే కుటుంబం- ఒకే టికెట్’

చింత‌న్ శిబిర్‌లో ఇప్పుడు గాంధీల కుటుంబానికే పెద్ద చింత ఎదురయింది. దేశ‌వ్యాప్తంగా కుటుంబ పాల‌న‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తున్న పార్టీ కుటుంబంలో ఒక‌రికే టికెట్ అని ప్ర‌క‌టించింది. అయితే.. ఈ స‌మ‌స్య‌.. తొలిగా.. సోనియా కుటుంబానికే పెద్ద చిక్కు తీసుకువ‌చ్చింది. ఈ కుటుంబంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు సోనియా, రాహుల్ పోటీ చేస్తుండగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుమార్తె, అల్లుడు.. ప్రియాంక‌, రాబ‌ర్ట్ వాద్రాలు కూడా రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో …

Read More »

జంపింగుల‌కే.. జ‌గ‌న్ వీర‌తాళ్లు.. వైసీపీలో మంట‌లు

వైసీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లే న‌లుగురి జాబితా రెడీ అయిందా? ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఖ‌రారు చేశారా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు తాజాగా నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఈ స‌భ్యులను ఖ‌రారు చేసే ప‌నిని పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి సుజనా చౌద‌రి, విజ‌య‌సాయిరెడ్డి, టీజీ వెంక‌టేశ్‌, సీఎం ర‌మేష్ సీట్లు ఖాళీ అవుతున్నాయి. …

Read More »

ఆ ధైర్యం చంద్ర‌బాబుకు, ఆయ‌న ద‌త్త‌పుత్రుడికి కూడా లేదు!.. జ‌గ‌న్

ఏపీ సీఎం.. జ‌గ‌న్ టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విరుచుకుప‌డ్డారు. “టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు ఇంత మంచి పని చేశాడని చెప్పే ధైర్యం దత్తపుత్రుడికి లేదు. దత్తపుత్రుడితో పాటు ఎల్లోమీడియాకు కూడా ధైర్యం లేదు” అని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను తాము అమలు చేశామ‌ని జ‌గ‌న్‌ చెప్పారు. …

Read More »

కుప్పంలో ఓటమికి తమ్ముళ్ళదే తప్పు

కుప్పం నియోజకవర్గంలోని నేతలు సక్రమంగా పని చేసుంటే మొన్నటి స్ధానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అంత చిత్తుగా ఓడిపోయేవారమా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడు రోజుల నియోజకవర్గం పర్యటనలో గుడెపల్లె  మండలంలో చంద్రబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అంత ఘోరంగా ఓడిపోవటానికి తమ్ముళ్ళదే తప్పని తేల్చారు. కొందరు నేతలు నాయకులుగా కాకుండా వినాయకులుగా మారిపోవటమే ఘోర ఓటమికి ప్రధాన కారణంగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో …

Read More »

బహిష్కరణ వేటు పడకుండా వ్యూహం

తనపై పడుతుందని అనుకుంటున్న బహిష్కరణ వేటు నుంచి తప్పించుకునేందుకు వైఎస్ కొండారెడ్డి రివర్స్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పులివెందులలోని చక్రాయపల్లె మండలానికి కొండారెడ్డి వైసీపీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్వయంగా కజిన్ బ్రదర్ అయిన కారణంగా ఈయనకు బాగా ప్రాధాన్యత వచ్చేసింది. సీఎంతో ఉన్న బంధుత్వాన్ని, ముఖ్యమంత్రి కుటుంబంతో ఉన్న సన్నిహితాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని …

Read More »

వైసీపీ నేతల్లో పెరిగిపోతున్న టెన్షన్

ఒక్కసారిగా అధికార పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడమే. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్ధానాలకు ఎన్నిక జరగబోతున్నట్లు కమీషన్ తాజా నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. జూన్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఇందులో ఏపీలో 4, తెలంగాణాలో రెండు స్ధానాలున్నాయి. ఏపీలో ఖాళీ అవబోయే నాలుగు  స్ధానాల్లో ఒకదానిని …

Read More »

పెద్దిరెడ్డి యు టర్న్ – ట్యాపింగ్ కాదు, ట్రాకింగ్

పరీక్షల వ్యవహారం నిన్న పెద్దిరెడ్డి కామెంట్స్ తో కొత్తమలుపు తిరిగిన విషయం తెలిసిందే. పబ్లిక్ గా మంత్రి ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించడంతో రచ్చ అయిపోయింది. ముందు నుంచి మేము చెబుతున్నది ఇదే… వైసీపీ మా ఫోన్లను ట్యాప్ చేస్తోంది అని టీడీపీ గట్టిగా విరుచుకుపడింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది. మరి రాత్రంతా ఏం సమాలోచన చేశారో గాని మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యంగా  కొత్త క్లారిఫికేష‌న్ ఇచ్చారు. దీంతో రాజ‌కీయం మ‌రో …

Read More »

న‌న్ను కుప్పం నుంచి వేరు చేసే శ‌క్తి ఎవ‌రికీ లేదు

‘నేను స్థానికుడినే. కుప్పంలో ఇల్లు కడతాను. దానికోసం రెండెకరాలు స్థలం కొన్నా. త్వరలోనే ఇంటినిర్మాణం చేపడతా’ అని టీడీపీ అధినేత  చంద్రబాబునాయుడు చెప్పారు. శాంతిపురం మండలం బోయనపల్లెలో జరిగిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి లాంతర్లు, కొవ్వొత్తులు, విసనకర్రలతో ఆయన వీధుల్లో తిరిగారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ కుప్పానికి చెందిన వాడేనని స్పష్టంచేశారు. తనను కుప్పం నుంచి వేరు చేసే …

Read More »

సుప్రీంపై మోడీ సర్కార్ మండిపోతోందా ?

సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగిపోతోందా ? ఈ కారణంగానే సుప్రీంకోర్టు పై నరేంద్ర మోడీ సర్కార్ మండి పోతోందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా సుప్రీం-కేంద్ర ప్రభుత్వ మధ్య గ్యాప్ పెరగటానికి కారణం 124 ఏ సెక్షన్ అంటే రాజద్రోహం చట్టం. ఈ సెక్షన్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచక్షణారహితంగా పలువురిపై కేసులు నమోదు చేస్తున్నాయి. దీంతో రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలంటు దేశవ్యాప్తంగా గోల …

Read More »

పవన్ నియోజకవర్గం – భీమ‌వ‌రం శీనుకు చుక్క‌లే చుక్కలు !

గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన భీమ‌వ‌రం శీను (పూర్తి పేరు గ్రంధి శ్రీ‌నివాస్) కు ఇప్పుడు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి అన్న వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పై గెలిచి అనూహ్య రీతిలో స‌క్సెస్ సాధించిన గ్రంధి శ్రీ‌నుకు ఇప్పుడు అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వ‌డం లేదు అని విజువ‌ల్స్ తో స‌హా వెల్ల‌డ‌వుతోంది. ఇక్క‌డి రీజ‌న‌ల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి (ఎంపీ) కి క‌లిసి గోడు చెప్పుకున్నా ఫ‌లితం లేకుండా …

Read More »

జగన్ గ్రీన్ సిగ్నల్.. కొండా రెడ్డిపై బహిష్కరణ?

బెదిరింపుల కేసులో రెండు రోజుల క్రితమే అరెస్టయిన వైఎస్ కొండారెడ్డిని కడప జిల్లా నుండి బహిష్కరించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డికి కొండారెడ్డి కజిన్ బ్రదర్ అవుతారు. వైఎస్ కుటుంబానికి ఈయన అత్యంత సన్నిహితుడు. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలానికి పార్టీ తరపున ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. పేరుకు మండల ఇన్చార్జే కానీ జిల్లాలోని చాలాప్రాంతాల్లో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. రాయచోటి-వేంపల్లి రోడ్డు పనులు చేస్తున్న ఎస్ ఆర్కె …

Read More »