కోనసీమ ప్రాంతంలోని అమలాపురంలో మంగళవారం చోటు చేసుకున్న విధ్వంసం వెనుక పక్కా ప్లాన్ ఉందని తెలుస్తోందని మంత్రి విశ్వరూప్ తెలిపారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యేల ఇళ్లకు పక్కా ప్రణాళికతోనే నిప్పు పెట్టారని ఆయన అన్నారు. కీలక నేత అనుచరులే నిప్పు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురం ముట్టడికి.. కేవలం 406 మంది పోలీసులతో భద్రత నిర్వహించారు మూడు వేలకు పైనే ఆందోళనకారులు వచ్చినట్లు గుర్తించామని …
Read More »జగనన్న బస్సు అదిగో! ఫలితం ఏమౌతుందో !
రాజకీయాలన్నవి రిజల్ట్ ఓరియెంటెడ్. మంచి జరిగితే ఓ మాట, చెడు జరిగితే నాలుగు మాటలు వినిపించడం వెరీ కామన్. ఇవేవీ లేకుండా పరిణామాలను అంగీకరించడం విశ్లేషించడం వివరించడం అన్నవి జరగని పని! రేపటి నుంచి సామాజిక న్యాయభేరి పేరిట జగన్ క్యాబినెట్ కు చెందిన బీసీ, ఎస్టీ మంత్రులు బస్సు యాత్ర చేయనున్నారు. శ్రీకాకుళం నుంచీ యాత్ర ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. బీసీలను ఆదుకుంటున్న ప్రభుత్వం …
Read More »డెడ్ బాడీ డోర్ డెలివరీ.. వైసీపీ హయాంలోనే: పవన్ ఫైర్
కులాల మధ్య ఘర్షణ రావణకాష్ఠం లాంటిదని.. కులాల గొడవలు జరిగితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కోనసీమ ఘటనకు వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. ఇలాంటి వారి ఉచ్చులో పడవద్దని మనవి చేస్తున్నానన్నారు. వైసీపీ నేతలు గొడవలు తగ్గించే ప్రయత్నం చేయాలని కోరారు. సజ్జల వంటి పెద్దల అనుభవం కులాల మధ్య …
Read More »మాట నిలబెట్టుకున్న సీఎం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని సీఎంగా బాధ్యతలు తీసుకోకముందే ప్రకటించారు. అవినీతికి పాల్పడిన వారు తమ పార్టీ వారే అయినా మంత్రులైనా సరే ఉపేక్షించేది లేదని అప్పట్లోనే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సీన్ కట్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలవుతోంది. హఠాత్తుగా మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింగ్లాను …
Read More »కాంగ్రెస్ సీరియస్ గానే రెడీ అవుతోందా?
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే రెడీ అవుతున్నట్లుంది. పార్టీలో పునరుత్తేజం నింపటానికి అధినేత్రి సోనియాగాంధీ మూడు కమిటిలను నియమించారు. రాజస్ధాన్లోని ఉదయపూర్లో మొన్న మూడు రోజులు జరిగిన చింతన్ శిబిర్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల తర్వాత సీరియస్ గానే కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే మూడు కమిటీలు నియమించింది. మొదటిదేమో రాజకీయ వ్యవహారాల కమిటీ, రెండోదేమో టాస్క్ ఫోర్స్. ఇక మూడో కమిటీ …
Read More »AP: బిగుసుకుంటున్న పెన్షన్ వివాదం
ఉద్యోగుల పెన్షన్ వివాదం మళ్ళీ బిగుసుకునేట్లుంది. గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్) విధానం అమలుకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఇదే సమయంలో ఓల్డ్ పెన్షన్ స్కీం(ఓపీఎస్) మాత్రమే అమలు చేయాలని ఉద్యోగుల సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రులతో జరిగిన చర్చలు ఫెయిలయ్యాయి. ఓపీఎస్ అమలు సాధ్యం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంగా ప్రకటించేశారు. ఈ విషయాన్ని గతంలో కూడా సజ్జల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటు …
Read More »వైసీపీ కాన్ఫిడెన్స్ ఆ 70 సీట్లకే.. పరిమితమా!
వచ్చే ఎన్నికలకు, నడుస్తున్న పరిణామాలకూ మధ్య పొంతన అయితే ఉంది. పొత్తులు లేదా ఒప్పందాలు అన్నవి ఇప్పటికిప్పుడు తేలేవి కావు. కానీ జనసేనాని ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని చెప్పడంతో వైసీపీ మరింత వివాదాన్ని పెంచింది. ఓ నాయకుడు గెలిచినా, ఓడినా జగన్ ఇమేజ్ ఏమీ పెరిగిపోదు కానీ, పవన్ లాంటి లీడర్లను ఓడిస్తే మాత్రం ఆయనకు ఓ విధంగా ప్లస్ కానుంది. మాట్లాడే నాయకులలో కొందరు మరీ అతిగా …
Read More »కేటీఆర్ కాబోయే ప్రధాని: దావోస్లో ప్రశంసల జల్లు
ఇంకో 20 ఏళ్లలో కేటీఆర్ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని ఆశా జడేజా మెత్వాణీ వ్యాఖ్యానించారు. సుస్పష్టమైన లక్ష్యం, దానిని అర్థంచేసుకునేలా వ్యక్తీకరించగల నేర్పు ఉన్న ఇలాంటి యువ రాజకీయనాయకుడిని తాను చూడలేదని ఆమె పొగిడారు. తెలంగాణ బృందం అద్భుతంగా రాణిస్తోందని ఆమె మెచ్చుకున్నారు. సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులను గుర్తుచేశారని ప్రస్తావించారు. భవిష్యత్లో బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. …
Read More »దావోస్లో పక్కరాష్ట్ర సీఎం ఈగలు తోలుకుంటున్నారు!: పువ్వాడ
“ప్రపంచ ఆర్థిక ఫోరం జరుగుతున్న దావోస్లో మంత్రి కేటీఆర్ అడుగు పెట్టగానే రాష్ట్రంలో పెట్టుబడులకు అంతర్జాతీయ సంస్థలు ఎగబడుతుంటే.. పక్క రాష్ట్రాల సీఎంలు ఈగలు తోలుకుంటున్నారు..” అని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులో రూ. కోటి 10 లక్షలతో నిర్మించిన గిరిజన భవనాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ నామాతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం.. రఘునాథపాలెం మండలంలో “స్కూల్ …
Read More »‘కోనసీమ’ లో రాజకీయ మంటలు: అమలాపురం తగలబడింది
ఏపీ అట్టుడుకుతోంది. రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. కోనసీమ జిల్లా అమలాపురం ఆందోళనలతో అట్టుడికింది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు …
Read More »మీ బియ్యంతో వైసీపీ నేతల రైస్ మాఫియా: చంద్రబాబు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన లేఖ రాశారు. తమిళనాడు పీడీఎస్ బియ్యంతో వైసీపీ నేతల చేతుల్లో ఉన్న ఏపీ రేషన్ రైస్ మాఫియా చేస్తున్న అక్రమాలపై వివరించారు. ఏయే రూట్లల్లో రేషన్ రైస్ మాఫియా అక్రమంగా తరలిస్తోందనే విషయాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్కు రాసిన లేఖకు జత చేశారు. తమిళనాడులోని పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని …
Read More »నీ బిడ్డ పెళ్లికి డబ్బులు ఇచ్చా.. రేవంత్పై మంత్రి మల్లా రెడ్డి ఫైర్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తనపై చేసిన ఆరోపణలను మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు. రేవంత్ రెడ్డికి బ్లాక్ మెయిల్ చేయడం అలవాటుగా మారిందని విరుచుకుపడ్డారు. టీడీపీలో ఉన్ననాటి నుంచి రేవంత్రెడ్డి బెదిరింపులకు గురిచేస్తూ.. డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. భూములు చట్టబద్ధంగానే కొన్నానని… లీగల్గా వెళ్లి రేవంత్ను జైలుకు పంపిస్తానని మంత్రి హెచ్చరించారు. రేవంత్ బిడ్డ పెళ్లికి తానే డబ్బులు ఇచ్చానని… యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates