జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అహర్నిశలూ కృషి చేస్తామని చెప్పారు. విధ్వంసకర పాలనను అరికట్టేందుకు అవసరమైతే.. ప్రత్యర్థి పార్టీలతోనూ, శతృవులతోనూ కలుస్తామని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అవసరాన్ని బట్టి.. ప్రజల సమస్యలను బట్టి.. ఒక్కొక్కసారి శతృవులతోనూ కలిసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని పవన్ …
Read More »తోకపార్టీగా మిగిలిపోవటం ఖాయమా?
వామపక్షాల్లో పోరాట స్పూర్తి తగ్గిపోయినట్లే ఉంది. ఎప్పుడైతే పెద్ద పార్టీలతో పొత్తులు పెట్టుకోవటం మొదలుపెట్టారో అప్పుడే వామపక్షాల పతనం మొదలైంది. అధికారంలో ఉండే కాంగ్రెస్, టీడీపీ లేదా టీఆర్ఎస్ తో పొత్తులకు అర్రులు చాచారో అప్పటినుండే ప్రజాసమస్యలపై పోరాటాలను పక్కనపెట్టేశారు. ఎంతసేపు అధికారంలో ఉన్నపార్టీతో లాలూచీ రాజకీయాలు, లాబీయింగ్ తో వ్యక్తిగత లబ్దికి పాకులాడటం మొదలుపెట్టారో అప్పుడే జనాల్లో కూడా వామపక్షాలపై నమ్మకం పోయింది. ఇపుడు ఇదంతా ఎందుకంటే మునుగోడు …
Read More »కేసీఆర్ ఎందుకు వెనకాడినట్లు?
అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే మునుగోడు ఉప ఎన్నిక బహిరంగ సభ జరిగింది. ఈ సభలో స్వయంగా కేసీఆర్ పాల్గొన్నారు. ఎటూ బహిరంగ సభకు వస్తున్నారు కాబట్టి అభ్యర్ధిని ప్రకటిస్తారని అందరు ఎదురుచూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసేశారు. పావుగంట సేపు మాట్లాడిన కేసీయార్ అభ్యర్ధి గురించి అసలు ఏమీ ప్రస్తావించలేదు. టీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించమన్నారే కానీ పలానా అభ్యర్ధిని పోటీలోకి దింపుతున్నట్లు చెప్పలేదు. అభ్యర్ధిని పరిచయం చేయటానికి …
Read More »చంద్రబాబు వైఖరితో తమ్ముళ్ల తర్జన భర్జన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరితో తమ్ముళ్లు తర్జన భర్జన పడుతున్నారా? అసలు పార్టీలో ఏం జరుగుతోందో కూడా తెలియడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు.. ప్రస్తుతం చంద్రబాబు నియోజకవర్గాల వారీగా.. నాయకులతో సమీక్షలు చేస్తున్నారు. వరుసగా సాగుతున్న ఈ పరిణామాలతో నియోజకవర్గాల్లో పార్టీ నేతలు హుషారుగా ఉన్నారు. ఎందుకంటే.. ఈ సమీక్షల్లో చంద్రబాబు.. కొందరికి టికెట్లు ఖరారు చేస్తున్నారనే వార్తలు రావడమే. అది కూడా.. …
Read More »ఈడీ కాకపోతే.. బోడీ తెచ్చుకో..: KCR
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు. నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో కేసీఆర్ మాట్లాడారు. ”నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోంది. మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు వచ్చింది. మరో ఏడాది ఆగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ప్రగతిశీల …
Read More »రాజధాని ఎఫెక్ట్.. ఆ మూడు స్థానాల్లో టీడీపీ
ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయ పవనాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో గుంటూరులో వైసీపీ హవా జోరుగా సాగింది. వాస్తవానికి రాజధాని అమరావతి ఏర్పాటుతో తమకు తిరుగులేదని అనుకున్న టీడీపీకి ఇక్కడ చాలా దెబ్బ తగిలింది. కీలకమైన మంగళగిరి నుంచి పోటీ చేసిన టీడీపీ అధినేత చంద్ర బాబు కుమారుడు నారా లోకేష్ కూడా ఇక్కడ పరాజయం పాలయ్యారు. దీంతో ఇంత చేసినా.. తమకు ఈ పరిస్థితి వచ్చిందేంటని.. టీడీపీ ఖంగుతింది. …
Read More »వారసత్వ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి: పవన్
జనసేన అధినేత పవన్ నోట ఇప్పటి వరకు రాని కొత్త వ్యాఖ్య ఒకటి వచ్చింది. ఏపీ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అంతేకాదు.. అన్న జగన్.. తనకు అవకాశం ఇవ్వలేదని.. చెల్లెలు మరో రాష్ట్రంలో పార్టీ పెట్టారే తప్ప.. తమ ప్రాంతం ప్రజల కష్టాలను మాత్రం విస్మరించారని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. పద్యం పుట్టిన రాయలసీమ నేలలో …
Read More »లైన్ దాటిన ఉద్యోగసంఘాల నేత
ఉద్యోగుల సమస్యలపైన ప్రభుత్వంతో మాట్లాడటం, వాటిని పరిష్కరించేట్లుగా చేయటమే ఉద్యోగసంఘాల నేతల పని. అంతేకానీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఉద్యోగులకు, ప్రజలకు పిలుపివ్వటం కాదు. ఇపుడీ టాపిక్ ఎందుకంటే ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి లైన్ దాటారు కాబట్టే చెప్పుకోవాల్సొస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశం రెడ్డి మాట్లాడుతు ప్రజలకు మంచిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జడ్జీలపై …
Read More »టీఆర్ఎస్ కొత్త తీరు.. ఛోటా నేతలకు భారీ ధర!
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ అధికారపక్షం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తోంది. తమకున్న అధికార బలాన్ని ప్రదర్శించటమే కాదు.. ధనబలాన్ని చూపేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇందులో భాగంగా సరికొత్త ఎత్తులకు తెర తీస్తోంది. మొత్తంగా తెలంగాణలో సరికొత్త రాజకీయాన్ని టీఆర్ఎస్ పరిచయం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ ఉప పోరు ఫలితం.. తెలంగాణ భవిష్యత్తు రాజకీయాల్ని ప్రభావితం చేసే వీలు ఉండటంతో తమ ప్రత్యర్థులైన బీజేపీ.. కాంగ్రెస్ …
Read More »రాహుల్ కీలక నిర్ణయం తీసుకున్నారా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే అధ్యక్ష పదవికి దూరంగా ఉండాలనట. నిజానికి పార్టీకి అధ్యక్షపగ్గాలు తీసుకోవాలని రాహుల్ అనుకుంటే దాన్ని వ్యతిరేకించేంత సాహసం చేసేవాళ్ళు పార్టీలో ఎవరు ఉండరు. అయితే 2019లోనే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ వదులుకున్న విషయం అందరికీ తెలిసిందే. వరుసగా రెండుసార్లు పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తు …
Read More »షాతో చంద్రబాబు.. తెలంగాణ మీటింగ్?
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబునాయుడు భేటీ అవుతున్నారా ? మీడియా రిపోర్టుల ప్రకారం అవుననే అనుకోవాలి. 21వ తేదీన మునుగోడులో బహిరంగసభలో పాల్గొనేందుకు అమిత్ షా వస్తున్నారు. ముందుగా ప్రకటించి అమిత్ పర్యటన ప్రకారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుని నేరుగా మునుగోడుకు వెళ్ళాలి. అక్కడ బహిరంగసభ చూసుకుని ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి హైదరాబద్ చేరుకోవాలి. హైదరాబద్ లో కొందరు నేతలతో కాసేపు మాట్లాడుకుని ఢిల్లీకి వెళ్ళిపోతారు. …
Read More »ఎంఎల్ఏ అల్లుడు ఎలా చనిపోయారు?
రాయదుర్గం వైసీపీ ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి చనిపోయాడు. అమరావతి పరిధిలోని తాడేపల్లి మండల కేంద్రంలోని ఒక అపార్టుమెంటు ఫ్లాటు 101లో మృతుడు ఉంటున్నాడు. మృతుడి తండ్రికి ఒక నిర్మాణ సంస్ధ ఉంది. రాంకీ కంపెనీ వర్కులను ఈ నిర్మాణసంస్ధ సబ్ కాంట్రాక్టుకు తీసుకుని పనులు చేయిస్తుంటుంది. జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో వర్కులు జరుగుతున్నాయి. ఈ మధ్య కొన్ని రాష్ట్రాల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు అందలేదని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates