తప్పులు చేయటం తర్వాత తీరిగ్గా దిద్దుకోవటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. గతంలో ప్రభుత్వం నియమించిన స్మార్ట్ సిటి ఛైర్మన్లతో ఇపుడు రాజీనామాలు చేయించటం ఇందులో భాగమే. తనకు లేని అధికారాలను చేతుల్లోకి తీసుకోవటం లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం తర్వాత సమస్య ఎదురైతే తల పట్టుకోవటం మామూలైపోయింది. దేశంలోని కొన్ని నగరాలను, పట్టణాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్నింటిని స్మార్ట్ సిటి …
Read More »పోలవరం ఆగిందా ? కారణం ఇదే !
పోలవరం నిర్మాణం పూర్తి అన్నది తమతోనే సాధ్యం అని వైసీపీ చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇసుక తరలింపునకు సంబంధించి రెండు పెద్ద కంపెనీల మధ్య రగులుతున్న రగడను నివారించే, నిలువరించే ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్ మాత్రమే చేయగలరు. ఇదే దశలో కేంద్రం నుంచి వచ్చే నిధులు తరువాత పనులు వీటిపై కూడా జగన్ ఒక్కరే తేల్చగలరు.కానీ ఆగిపోయిన పనుల ఊసెత్తితే వైసీపీ …
Read More »పెగాసస్పై వైసీపీ దూకుడేలా? తేడా వస్తే దెబ్బే!
ప్రత్యర్థి పార్టీ నాయకులపై ఆరోపణలు వస్తే వెంటనే రంగంలోకి దిగి పట్టు సాధించాలని అధికార పార్టీలు అనుకోవడం రాజకీయాల్లో సాధారణమే. ఇక ఏపీలో అయితే ప్రతిపక్ష టీడీపీని ఖాళీ చేయాలనే లక్ష్యంతో ఉన్న వైసీపీ.. బాబును దెబ్బ కొట్టే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు పెగాసస్ వ్యవహారంలో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు పెగాసస్ …
Read More »ఎంత రెచ్చగొట్టినా.. బాబు పొత్తులతోనే!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. పొత్తులకు ఏదో అవినాభావ సంబంధం ఉందనేది విశ్లేషకుల మాట. ఎన్నికల వస్తే చాలు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే సంప్రదాయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ వస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మరణానంతరం బాబు ఒంటరిగా ఎన్నికల బరిలో దిగే పరిస్థితే లేకుండా పోయింది. 2019లో పైకి ఒంటరిగానే పోటీ చేసినట్లు కనిపించినా.. రహస్యంగా జనసేనతో పొత్తు పెట్టుకున్నారని …
Read More »వంశీకి టికెట్ ఇచ్చారో.. అంతే సంగతి
2019 ఎన్నికల్లో విజయం తర్వాత టీడీపీని కాదని వైసీపీకి మద్దతుగా నిలబడ్డ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇబ్బందులు తప్పేలా లేవు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం.. ఒకవేళ ఎన్నికల్లో నిలబడ్డా వైసీపీ తరపున గెలవడం అంత సులభంగా కనిపించడం లేదు. గన్నవరంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ వర్గం వంశీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. వంశీ చేరికతో గన్నవరంలో వైసీపీ వర్గాలు భగ్గుమన్నాయి. …
Read More »ఢిల్లీకి రేవంత్.. సీనియర్లకు చెక్ పెట్టేందుకేనా?
తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం ఓ వైపు తాను ప్రయత్నాలు చేస్తుంటే.. తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ నేతలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా సపరేటుగా సమావేశాలు పెట్టుకుంటున్న సీనియర్లపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్ను కలిసి సీనియర్ నేతల వైఖరిపై రేవంత్ ఫిర్యాదు చేస్తారని సమాచారం. ఇటీవల …
Read More »చినజీయర్తో గ్యాప్ లేదు.. కేసీఆర్
చినజీయర్ స్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య కొంతకాలంగా గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ముచ్చింతల్లో నిర్వహించిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ముచ్చింతల్ కార్యక్రమానికి ముందు నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంపై కేసీఆర్ సీరియస్గా రియాక్టయ్యారు. ‘‘చినజీయర్తో నాకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్తో గ్యాప్ పై స్పందించాల్సిన అవసరం …
Read More »పెగాసస్పై తగ్గేదేలే.. ఏపీ అసెంబ్లీ సంచలన నిర్ణయం
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న పెగాసస్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. పెగాసెస్పై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. పెగాసెస్పై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఏపీలో పెగాసస్ స్పై వేర్ కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న పశ్చిమ్బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్లతో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. పెగాసెస్ స్పైవేర్ ఏపీ ప్రభుత్వం …
Read More »పెగాసస్పై ఎలాంటి విచారణకైనా సిద్ధం : నారా లోకేష్
పెగాసస్పై ఎలాంటి విచారణకైనా సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. బాబాయ్ వివేకా హత్య, మద్యం మరణాలపైనా విచారణ కమిటీ వేయగలరా? అని ముఖ్యమంత్రి జగన్ కు ఆయన సవాల్ విసిరారు. పెగాసస్పై పశ్చిమ బెంగాల్ సీఎం మమత అసెంబ్లీలో మాట్లాడారనే దానిపై స్పష్టత లేదన్నారు. పెగాసెస్ సాఫ్ట్వేర్ను తాము కొనలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు సమాధానం ఇచ్చారని గుర్తు …
Read More »కేంద్రానికి తెలంగాణ ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తా
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్రానికి తెలంగాణ ఉద్యమం ఎలా ఉంటుందో రుచి చూపిస్తామన్నారు. దీనికి కారణం.. ధాన్యం. కేంద్రం ధాన్యం సేకరణపై అంగీకరించకపోతే తెలంగాణ ఉద్యమ పంథాలో పోరాడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం మంత్రులు, ఎంపీల బృందం కేంద్రమంత్రిని కలుస్తారని… అక్కడ సానుకూల స్పందన రాకుంటే… పెద్దఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడతామని ప్రకటించారు. కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే …
Read More »జగ్గారెడ్డికి అధిష్ఠానం షాక్.. వాట్ నెక్ట్స్?
అంతా అనుకున్నట్లే అయింది. టీ కాంగ్రెస్ లో వర్గ పోరు ముదిరి పాకాన పడింది. విమర్శలు.. ప్రతి విమర్శలతో పార్టీ పరువు బజారున పడింది. రేవంతుపై ఆది నుంచీ అసంతృప్తిగా ఉన్న సీనియర్లకు పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రేవంత్ అంటే అగ్గిమీద గుగ్గిలం అవుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డికి అధిష్ఠానం జలక్ ఇచ్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. పార్లమెంటు ఇన్చార్జి బాధ్యతల నుంచి …
Read More »పెగాసస్ : ఏబీ వెంకటేశ్వర్లు ఇచ్చిన క్లారిటీ ఇదే!
వైసీపీ ఆరోపిస్తున్న విధంగా పెగాసస్ సాఫ్ట్వేర్ ను అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిందా అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూపీ లాగుతుండగా తాజాగా సీన్లో కి అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ వచ్చి తన దైన వివరణ ఒకటి ఇచ్చారు. ప్రభుత్వమే కాదు ఏ ప్రయివేటు సంస్థ కూడా సంబంధిత నిఘా సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసిన దాఖాలాలు ఏవీ లేవని కూడా పదే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates