Political News

తుమ్మ‌ల‌ను టార్గెట్ చేసిన ష‌ర్మిల …!

వైఎస్‌. ష‌ర్మిల తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ పార్టీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లోనూ సెగ‌లు రేపుతోంది. ఇటు అన్న ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉంటే అటు ష‌ర్మిల మ‌రో తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో పార్టీ పెట్టి ఏం చేస్తారు ? అన్న‌ది చాలా ఆస‌క్తిగా ఉంది. కొత్త పార్టీ ఏర్పాట్ల‌లో ఉన్న ష‌ర్మిల‌… ఏప్రిల్ 9న ఖ‌మ్మం జిల్లాల్లో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ఈ స‌భ …

Read More »

సాయిరెడ్డికి ఢిల్లీలోనూ ప‌రువు పాయే..

ఏదో ఒక ర‌కంగా సానుభూతి పొందాల‌ని.. ప్ర‌తిప‌క్షం టీడీపీని బ‌ద్నాం చేయాల‌ని కొన్నాళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్న వైసీపీ ఎంపీ.. ఉత్త రాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌.. జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌య‌త్నాలు ఏ ఒక్క‌టీ ఫ‌లించ‌డం లేదు. పైగా ఆయ‌నకే అవి తిరిగి ఎఫెక్ట్‌గా మారుతున్నాయి. తాజాగా సాయిరెడ్డి చేసిన మ‌రో ప్ర‌య‌త్నం ఉత్తుత్తిదేన‌ని.. అన‌వ‌స‌రంగా ఆయ‌న త‌మ స‌మ‌యం వృథా చేస్తున్నార‌ని.. పార్ల‌మెంట‌రీ స్థాయీ సంఘ‌మే ఆరోప‌ణ చేయ‌డం …

Read More »

సోమిరెడ్డి టీడీపీని గెలిపిస్తాడా ?

తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీని గెలిపించే బాధ్యత చంద్రబాబునాయుడు ఓ సీనియర్ నేతపై ఉంచారు. ఇంతకీ ఆయనెవరయ్యా అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గెలుపు బాధ్యతను సోమిరెడ్డికి అప్పగించినట్లు చంద్రబాబు ప్రకటించగానే పార్టీలో అందరు ఆశ్చర్యపోయారు. కారణం ఏమిటంటే సోమిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి దాదాపు పాతికేళ్ళవుతోంది. 1999లో చివరిసారిగా నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచారు. ఆ తర్వాత నుండి ప్రతి ఎన్నికలోను …

Read More »

తాడిపత్రిని కేస్ స్టడీగా తీసుకుంటాడా ?

మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ రాష్ట్రమంతా తుడిచిపెట్టుకుపోయింది. మంచి బలమైన క్యాడర్ ఉన్న టీడీపీకి ఇలాంటి పరిస్ధితి వస్తుందని ఎవరు ఊహించుండరు. లీడర్లు ఎంతమంది పోయినా పర్వాలేదు, క్యాడర్ మాత్రం పార్టీతోనే ఉందని చంద్రబాబు చాలాసార్లే చెప్పుంటారు. అలాంటి క్యాడర్ ఇప్పుడు పార్టీతోనే ఉందా లేదా అనే అనుమనాలు పెరిగిపోతున్నాయి. 75 మున్సిపాలిటిలకు ఎన్నికలు జరిగితే 74 చోట్ల వైసీపీ స్వీప్ చేసేసింది. 98 శాతం మున్సిపాలిటిల్లో కనీసం సగం వార్డులను …

Read More »

జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు లైన్ క్లియ‌ర్‌.. జ‌గ‌న్ ఫిర్యాదులు బుట్ట‌దాఖ‌లు..

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు లైన్ క్లియ‌ర్ అయింది. సుప్రీం కోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఆయ‌న వ‌చ్చే నెల‌లో బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. అయితే.. జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ‌పై ఏపీ సీఎం జ‌గ‌న్‌ చేసిన ఫిర్యాదు కొన్నాళ్ల కింద‌ట దేశ‌వ్యాప్తంగా తీవ్ర‌స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించింది. జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ కుటుంబంపై సీఎం జ‌గ‌న్ ఏకంగా సుప్రీం సీజే బాబ్డేకు ఫిర్యాదు చేశారు. దీనిపై అంత‌ర్గ‌తంగా విచార‌ణ జ‌రిపిన సుప్రీ కోర్టు ధ‌ర్మాస‌నం.. …

Read More »

బీజేపీపై మండిపోతున్న నెటిజన్లు

‘ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వం’.. ఇది తాజాగా కేంద్ర హోంమంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటులో చేసిన ప్రకటన. దీనికి బదులుగా నెటిజన్లు ‘బీజేపీకి ఓట్లు వేయం’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రివర్సు పోస్టులు పెడుతున్నారు. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వం-బీజేపీకి ఓట్లు వేయం అని పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడుపుతున్నారు నెటిజన్లు. పనిలో పనిగా నరేంద్రమోడి పైన కూడా నెటిజన్లు విపరీతంగా మండిపోతున్నారు. మోడి సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం …

Read More »

విశాఖకు కొత్త రూపు.. జగన్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

తాను అనుకున్నది అనుకున్నట్లు చేయటం కోసం మహా మొండిగా పని చేసే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తాజాగా తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు. తాను చెప్పిన మూడు రాజధానుల అంశంపై తాజాగా ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజధాని నగరంగా విశాఖను మార్చేందుకు వీలుగా.. ముందస్తు ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. విశాఖ రూపును సమూలంగా మార్చేసే పనిని తాజాగా చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం జగన్ సర్కారు …

Read More »

పౌర సన్మానం ఎందుకు చేయించుకున్నారు ?

‘ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వటం కుదరదు’ ..ఇది తాజాగా పార్లమెంటులో ఓ కేంద్రమంత్రి చేసిన ప్రకటన. నిజానికి ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో ఇంత స్పష్టంగా కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించటం బహుశా ఇదే మొదటిసారి. గతంలో కూడా హోదా విషయంలో అనేకసార్లు అనేకమంది కేంద్రమంత్రులు చెప్పినా ఏదో డొంకతిరుగుడుగానే చెప్పారు. హోదా విషయంలో నరేంద్రమోడి ఆలోచన ఏమిటన్నది జనాలందరికీ ఎప్పుడో అర్ధమైపోయింది. అయితే తాజాగా కేంద్రమంత్రి చెసిన ప్రకటన తర్వాత జనాలందరికీ …

Read More »

కాపుల‌పై మ‌న‌సుంటే.. జ‌గ‌న్‌కు ఇదే స‌రైన స‌మ‌యం!!

రాష్ట్రంలో కాపు సామాజిక వ‌ర్గం కొన్ని ద‌శాబ్దాలుగా త‌మ రిజ‌ర్వేష‌న్ అంశంపై పోరాటాలు చేసిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా చంద్ర‌బాబు పాల‌నా కాలంలో.. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నేతృత్వంలో రాష్ట్ర‌వ్యాప్తంగా కాపు సామాజిక వ‌ర్గం త‌మ రిజ‌ర్వేష‌న్ల‌ను తేల్చాల‌ని.. డిమాండ్ చేస్తూ.. అనేక రూపాల్లో ఉద్య‌మించింది. ఈ క్ర‌మంలో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు.. బీసీ సామాజిక‌వ‌ర్గానికి అమ‌లు చేస్తున్న 50 శాతం రిజ‌ర్వేష‌న్‌పై మ‌రో ఐదు శాతం కాపుల‌కు అమ‌లు చేస్తామ‌ని.. …

Read More »

మోడీ చేతులెత్తేశారు.. జ‌గ‌న్‌-కేసీఆర్‌లు కొట్టుకోవాల్సిందే!

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. అనేక విష‌యాల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య ఉప్పు-నిప్పుగా ఉన్న ప‌రిస్థితి తెలిసిందే. ప్ర‌ధానంగా నీటి స‌మ‌స్య‌, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ బ‌కాయిలు, విద్యుత్ ఉద్యోగుల స‌మ‌స్య‌(ఇది కొంత ప‌రిష్కార‌మైనా.. ఇప్ప‌టికీ పూర్తిగా ప‌రిష్కారం కాలేదు), హైద‌రాబాద్‌లోని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు.. ఇలా అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. అయితే.. ఏపీలో రెండు ప్ర‌భుత్వాలు మారినా.. తెలంగాణ‌లో మాత్రం విభ‌జ‌న త‌ర్వాత నుంచి ఒకే ప్ర‌భుత్వం కేసీఆర్ నేతృత్వంలో కొన‌సాగుతోంది. …

Read More »

ఎంపీ రామ్మోహన్ భావోద్వేగ ప్రసంగాన్ని విన్నారా?

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు.. నినాదం బాగానే ఉన్నా.. కేంద్రంలోని మోడీ సర్కారు అమ్మేయాలని డిసైడ్ అయ్యింది. విశాఖ ఉక్కు ప్రస్తావన వచ్చినంతనే.. నష్టాలు వస్తున్నాయి.. విలువైన ప్రజల పన్ను మొత్తాల్ని ఎందుకు వేస్ట్ చేయటం అంటూ కేంద్రం చెబుతున్న మాటల్లోని అసత్యాన్ని కళ్లకు కట్టేలా చెప్పటమే కాదు.. విశాఖ ఉక్కు అమ్మకంపై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంలోని డొల్లతనాన్ని సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ప్రసంగించారు ఏపీ ఎంపీ రామ్మోహన్ …

Read More »

ఏపీ కొత్త ఎస్ ఈసీ కూడా రెడ్డేనా?

ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ నూత‌న ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హారం మ‌రోసారి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వైఖ‌రిని తేట‌తెల్లం చేస్తోంద‌ని అంటున్నారు ప‌రి శీల‌కులు. ప్ర‌స్తుతమున్న రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ రమేష్ కుమార్ ప‌ద‌వి కాలం ఈ నెల 31తో ముగియ‌నుంది. ఈ నేపథ్యంలో కొత్త క‌మిష‌న‌ర్ ఎంపిక ప్ర‌క్రియ‌ను సీఎం జ‌గ‌న్ ప్రారంబించారు. ఇప్ప‌టికే ఆయ‌న ఈ ప‌ద‌వి కోసం.. ముగ్గురి పేర్ల‌తో కూడిన నివేదిక‌ను గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌కు పంపించారు.గ‌వ‌ర్న‌ర్ ఆమోద …

Read More »