Political News

విమానాలకూ మిడతల ముప్పు…

భారత్ లోని పలు రాష్ట్రాల్లోని పంటపొలాలపై మిడతల దండు స్వైర విహారం చేసి తీవ్ర నష్ట కలిగించిన సంగతి తెలిసిందే. ఓ వైపు తెలంగాణకు మిడతల దండు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో…తాజాగా మిడతల సెగ విమానాలకూ తాకింది. వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం పైలట్లు, ఇంజినీర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. కీలకలమైన ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని …

Read More »

బీజేపీ వర్సెస్ వైసీపీ… నిమ్మగడ్డతో ఇక మొదలైనట్టేనా

ఏపీ హైకోర్టులో వరుసగా జగన్ సర్కారు నిర్ణయాలను కొట్టేస్తూ తీర్పులు రావడం చూస్తూనే ఉన్నాం. ఈ వ్యవహారంలో ఏకంగా సీఎం తరఫు నుంచే కులం రంగు పులుముకుంది. ఆ తర్వాత అధికార పార్టీ నేతలు అదే బాటలో నడిచారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తప్పించడంపై హైకోర్టు జగన్ సర్కారును తప్పు పడుతూ తుది తీర్పు ఇచ్చింది. ఆయన్ని తొలగించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌ను …

Read More »

హైకోర్టు తీర్పుపై జగన్ సర్కారుకు పీకే ట్వీట్ పంచ్

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు న్యాయస్థానాల్లో వరుస పెట్టి ఎదురుదెబ్బలు తుగులుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగిస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవటం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే సమయంలో నిమ్మగడ్డ కులం మీద జగన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. ఒక ఉన్నతాధికారి మీద అధికారపక్షం స్పందించిన తీరు …

Read More »

బిగ్ బ్రేకింగ్.. ఏపీ సీఈసీ రీఎంట్రీ

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు హైకోర్టు మరో పెద్ద షాక్ ఇచ్చింది. వివాదాస్పద రీతిలో పదవి నుంచి తప్పించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేుష్ కుమార్‌ను తిరిగి ఆ పదవిలో నియమించాలని ఆదేశఆలు జారీ చేసింది. రమేష్ కుమార్‌ను తప్పించడం కోసమే జగన్ సర్కారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నియామకం, పదవీకాలం విషయమై కొత్తగా రూపొందించిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో …

Read More »

టీటీడీ ఆస్తుల అమ్మకంపై సంచలన నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 50 ఆస్తుల వేలం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయంగా పెను దుమారం రేగింది. దీంతో, ఆ ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై నిషేధం విధించాలని టీటీడీ బోర్డు తీర్మానించింది. ఆన్ లైన్లో జరిగిన టీటీడీ …

Read More »

మరో పుల్వామా ఎటాక్.. త్రుటిలో తప్పింది

ఒకప్పటితో పోలిస్తే గత పదేళ్లలో ఇండియాలో ఉగ్రవాద దాడులు బాగా తగ్గాయి. ముఖ్యంగా 2014లో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక సామాన్య జనాలపై ఉగ్రవాద దాడులు దాదాపు లేవనే చెప్పాలి. ఐతే గత ఏఢాది మాత్రం పుల్వామాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఒకేసారి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతిగా భారత సైన్యం దీటుగా స్పందించింది. ఉగ్రవాదుల మీద భీకర దాడులు చేపట్టింది. సర్జికల్ స్ట్రైక్స్, ఇతర …

Read More »

ప్రత్యేక హోదా వస్తుంది – జగన్

ఏపీలో గత ఎన్నికలకు జగన్ తీసుకున్న అతి ముఖ్యమైన నినాదాల్లో ఒకటి ప్రత్యేక హోదా. ఈ విషయం గురించి తొలి రెండు నెలలు మాత్రమే కొంత చర్చ జరిగింది. మోడీని కలిసినపుడు ఆయనకు ఎక్కువ సీట్లు ఉన్నాయి. మనం డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేము, రిక్వెస్ట్ చేసుకోవాలి అని జగన్ అప్పట్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. ఆ తర్వాత పార్టీ ఆ విషయం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. దీంతో స్పెషల్ …

Read More »

జగన్ పాలనపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు జరిగి ఏడాది గడిచినా జగన్ పాలన గురించి ఇంతవరకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పెద్దగా ఎక్కడా కామెంట్లు చేయలేదు. చేసినా అవి మామూలు స్పందనలే. అయితే మొదటి సారి బాలకృష్ణ జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అరాచక పాలన ఐదేళ్లుండదన్నారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన పార్టీ రాష్ట్రంలో ఏం చేస్తుందో అందరూ చూస్తున్నారని బాలయ్య అన్నారు. బాలృష్ణ …

Read More »

హైకోర్టు జడ్జిలపై ఆ వ్యాఖ్యలకు ఎలాంటి శిక్షలంటే?

నిర్లక్ష్యం.. అంతకు మించిన తెంపరితనం వెరసి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలోనూ.. వీడియో క్లిప్పులతో విరుచుకుపడిన వైనం సంచలనంగా మారింది. ఇంత తీవ్రస్థాయిలో హైకోర్టు జడ్జిల మీద ఘాటు వ్యాఖ్యలతో పాటు.. అభ్యంతరక.. అసభ్యపదజాలంతో చేసిన వ్యాఖ్యల నేరం రుజువైతే ఎలాంటి శిక్షలు ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏపీ హైకోర్టు ఫుల్ బెంచ్ కొలువుతీరి.. తమపై సోషల్ మీడియాలో చేస్తున్న విపరీత ప్రచారంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం …

Read More »

బోరు బావిలో విషాదం.. ఇది మరీ దారుణం

బోరు బావిలో మూడేళ్ల బాలుడు.. బోరు బావిలో రెండేళ్ల పాప.. ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం. ప్రతిసారీ ఆ మాత్రం జాగ్రత్త ఉండదా.. బోరు బావులు పూడ్చాలి లేదా వాటి మీద ఏమైనా అడ్డం పెట్టాలి అన్న జ్ఞానం ఉండదా.. అనుకుంటాం. కానీ మళ్లీ ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. వందల కేసుల్లో ఒకటీ అరా మినహాయిస్తే ఇలాంటి సందర్భాల్లో పిల్లల ప్రాణాలు నిలవడం కష్టమే. తాజాగా మెదక్ జిల్లా …

Read More »

ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు అంత నష్టమా?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా నడుస్తున్న నీటి లొల్లి తెలిసిందే. తమకు హక్కుగా వచ్చే వాటిని తప్పించి.. తమకు సంబంధం లేని వాటాను వినియోగించుకోవాలన్న ఆలోచన లేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం చెబుతున్న సీమఎత్తిపోతలకు సంబంధించి సీఎం కేసీఆర్ ధీమా మరోలా ఉంది. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడతామని.. ఏపీ సర్కారు ఏం చేస్తుందో తాము నిశితంగా …

Read More »

ఇండియాలో కరోనా.. ఇంకో 20 రోజులకు ఏం జరగబోతోంది?

ఇండియాలో తొలి కరోనా కేసు నమోదయ్యాక.. లక్ష కేసుల మార్కును అందుకోవడానికి రెండు నెలలకు పైగా సమయం పట్టింది. కానీ గత పది రోజుల వ్యవధిలో కేసులు 60 వేల దాకా ఉండటం గమనార్హం. దీన్ని బట్టి కరోనా వ్యాప్తి మే నెలలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐతే దేశంలో కరోనా వ్యాప్తి విషయంలో ఇది పతాక స్థాయి కాదని అంటున్నారు నిపుణులు. ముందుంది ముసళ్ల పండగ …

Read More »