Political News

హైదరాబాద్ కు మోడీ.. ఢిల్లీకి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోపాన్ని భరించటం చాలా కష్టం. ఆయన ఒకసారి ఆగ్రహించటం మొదలు పెడితే..దాన్ని అక్కడితో ఆపరు. ఆయన ఆ పనిని నిరంతరం చేస్తూనే ఉంటారు. ఆయన అనుగ్రహం ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో.. ఆగ్రహం అంతటి వేదనకు కారణమవుతుంటుంది. గడిచిన కొన్నేళ్లుగా ఆయన పట్టిందల్లా బంగారంగా మారటం.. కాలం ఆయనకు అనుకూలంగా ఉండటంతో ఆయనేం చేసినా.. ఆయనకు మేలు చేస్తుంటే.. ఆయన ప్రత్యర్థులకు మాత్రం ఇక్కట్లను తెచ్చి పెడుతోంది. …

Read More »

ఒకవైపు తండ్రి, మరోవైపు కొడుకు

చంద్రబాబునాయుడుతో పాటు నారా లోకేష్ కూడా జనాల్లోకి వచ్చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలుపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గడచిన 15 రోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఏ జిల్లాకు వెళ్ళినా ముందు పార్టీ నేతలతో, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. తర్వాత చిన్నపాటి సభలు, రోడ్డుషోలు నిర్వహిస్తున్నారు. తన పర్యటనలో అన్నీ ప్రాంతాలను టచ్ చేసేట్లుగా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. ఒకవైపు చంద్రబాబు పర్యటన జరుగుతుండగానే మరోవైపు లోకేష్ కూడా …

Read More »

కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌.. ఎవ‌రిని క‌ల‌వ‌నున్నారు.. ఏం చేయ‌నున్నారు ?

జాతీయస్థాయి పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ హస్తినకు చేరుకున్నారు. దేశ రాజకీయాలపై మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిసారించిన వేళ.. జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి నేతలతో చర్చలు జరిపిన గులాబీ బాస్ ఈ సారి జాతీయస్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతోనూ సమావేశం …

Read More »

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పోటీ చేస్తాం: ప‌వ‌న్ క‌ళ్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే రాష్ట్ర ఎన్నిక‌ల్లో తాము పోటీ చేస్తున్న‌ట్టు తెలిపారు. అంతేకాదు.. మొత్తంగా 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తెలంగాణలోని చౌటుప్పల్ లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న ఇక్క‌డ‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త సైదులు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్యకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన …

Read More »

కేంద్రంపై పోరుకు కేసీఆర్ చేతికి సుప్రీం ‘అస్త్రం’!

కొంతమంది రాజకీయ అధినేతలకు కాలం ఎప్పుడూ కలిసి వస్తూనే ఉంటుంది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలాంటిది మరికాస్త ఎక్కవనే చెప్పాలి. గడిచిన కొంతకాలంగా కేంద్రంలోని మోడీ సర్కారు మీద అదే పనిగా విరుచుకుపడుతున్న కేసీఆర్ సర్కారు.. ఎప్పటికప్పుడు కొత్త అస్త్రాల్ని తన అమ్ముల పొదిలో సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రాలు కట్టే పన్నులతో కేంద్రం పెత్తనం ఏమిటన్న ప్రశ్నతో పాటు.. పంచాయితీలకు నేరుగా నిధులు చెల్లించటం …

Read More »

రెండేళ్ల ముందే ఏపీ రాజ‌కీయం వేడెక్కేసిందే…!

రాష్ట్రంలో రాజకీయాలు తీవ్ర‌స్థాయిలో వేడెక్కాయి. అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, ఇటు అధికార పార్టీ వైసీపీ కూడా.. తీవ్ర‌స్థాయిలో రాజకీయాలు చేస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను చూస్తుంటే.. ఇప్పుడు.. రాష్ట్రం లో ఎన్నిక‌లు ఏమైనా జ‌రుగుతున్నాయా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగేందుకు ఇంకా రెండు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది. అయితే.. ఇప్ప‌టి నుంచి ప్ర‌తిప‌క్ష టీడీపీ ప్ర‌జ ల్లో ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది. గ‌తంలో వైసీపీ కూడా ప్ర‌తిపక్షంగా …

Read More »

అడ్రస్ లేని మాజీ మంత్రి

ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో మాజీ మంత్రి అడ్రస్ ఎక్కడా కనబడలేదు. చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లా పర్యటనలో సీనియర్లందరూ కనిపించారు కానీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాత్రం ఎక్కడా కనబడలేదు. అఖిలకు చాలాకాలంగా పార్టీతో గ్యాప్ కంటిన్యూ అవుతోంది. అఖిల అనేక కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అఖిల దంపతులు, తమ్ముడు భూమా జగద్విఖ్యాత రెడ్డి పై దాడులు, ఫోర్జరీ, కిడ్నాప్, హత్యా …

Read More »

డోన్ అభ్యర్ధిని ప్రకటించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత మెల్లమెల్లగా అభ్యర్ధులను ప్రకటించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధులను ఇప్పటినుండే రెడీ చేస్తున్నారు. ఇంతముందుగా అభ్యర్ధులను ప్రకటించటం నిజానికి చంద్రబాబు మనస్తత్వానికి విరుద్ధం. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతో తన పద్దతిని మార్చుకున్నారు. అప్పట్లో కూడా లోక్ సభ ఉప ఎన్నికలకు సుమారు నాలుగు మాసాలకు ముందే అభ్యర్ధిని ప్రకటించేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇపుడు మొదలైన బాదుడే బాదుడు కార్యక్రమంలో …

Read More »

జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా.. బీసీలు మా వెంటే: టీడీపీ

గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతల్ని ప్రజలు తరిమికొడుతున్నందుకే.. బీసీ మంత్రులు బస్సు యాత్ర చేప‌డుతున్నార‌ని టీడీపీ విమ‌ర్శించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా.. బీసీలంతా టీడీపీ పక్షానే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు “బాదుడే బాదుడు” స్పందనతో జగన్ బీసీ జపం అందుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అమలు చేసిన ఎన్నో బీసీ …

Read More »

యువతలో పౌరుషం ఎందుకు రావటంలేదు ?

యువత, పేదల కోసమే తాను ప్రజలముందుకు వస్తున్నట్లు చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రజలకు జరిగే నష్టం నివారించటానికి, భవిష్యత్తరాల కోసమే తాను పోరాడుతుంటే యువతలో ఎందుకు పౌరుషం రావటంలేదంటు మండిపడ్డారు. యువత ముందుకు రావాలని తన పోరాటంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు గట్టిగాకోరారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాలో పర్యటించారు. 72 ఏళ్ళ వయసులోను తాను చురుగ్గా పనిచేస్తుంటే యువతలో మాత్రం పౌరుషం కనిపించటంలేదన్నారు. శ్రీలంక ప్రధానమంత్రిగా పనిచేసిన …

Read More »

తెలంగాణ ప్ర‌జ‌లు ఓటేస్తే.. సీఎం అయ్యారా? జ‌గ‌న్ సార్‌..

వైసీపీ ప్ర‌భుత్వంపై ఎవ‌రైనా విమ‌ర్శుల చేస్తే.. కుట్ర‌లు అంటున్నారు. వారిని ఏకేస్తున్నారు. కొంద‌రు నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత మాటా అనేస్తున్నారు. నీచులు, ప్ర‌జ‌లు ఛీకొట్టారు.. అయినా.. బుద్ధి రాలేదు. అందుకే మాపై ప‌డి ఏడుస్తున్నారు.. అంటూ.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. క‌ట్ చేస్తే.. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను సొంత పార్టీ నేత‌లే.. విమ‌ర్శిస్తున్నారు. గ‌తంలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వంటివారు తీవ్రంగా విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. స‌రే! …

Read More »

గ‌డ‌ప‌లో అవ‌మానం…యాత్ర అందుకేనా !

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం పేరిట వైసీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం మ‌ధ్య‌లోనే ఆగిపోనుంది అన్న వార్త ఒక‌టి వెలుగు చూస్తోంది.ఎందుకంటే రెండు నెల‌ల పాటు పార్టీ నాయ‌కుల‌ను క్షేత్ర స్థాయిలో ఉంచి ఇంటింటి స‌ర్వే చేయించినా ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా రావ‌ని తేలిపోయింద‌ని, వాస్త‌వాలు మాట్లాడే ప్ర‌జ‌ల దగ్గ‌ర త‌రుచూ అవ‌మానాలే ఎదురవుతున్నాయ‌ని వైసీపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ని టీడీపీ అంటోంది. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు లేనేలేవ‌ని తేలిన నిమిషాన విప‌క్షం దాడులు …

Read More »