చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు గుర్తింపు లభించే టైమ్ వచ్చింది. కీలకమైన వైసీపీ అనుబంధ విభాగాల సమన్వయకర్త బాధ్యతలు ఆయనకు అప్పగించారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త విజయసాయి రెడ్డికి ఆయన సహాయకుడిగా వ్యవహరిస్తారు. చెవిరెడ్డి హార్డ్ కోర్ జగన్ అభిమాని, జగన్ కోసం చెవి కోసుకుంటారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చెవిరెడ్డిపై అనేక కేసులు పెట్టింది. నెలకోసారి అరెస్టు కూడా అయ్యేవారు. అంత జరిగినా చెవిరెడ్డి భయపడలేదు. …
Read More »నాకు-మానాన్నకు సంబంధం లేదు: వైసీపీ ఎమ్మెల్యే
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలో తన తండ్రి వసంత నాగేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఖండించారు. తన తండ్రి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయంతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. “నాకు-మానాన్నకు రాజకీయంగా సంబందం లేదు. ఆయన నోటికి తాళం వేయలేను” అని అన్నారు. అయితే, తన తండ్రిగా ఆయనను ఎప్పుడు గౌరవిస్తానన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను …
Read More »ఎమ్మెల్యే ఎన్నికలు.. టీడీపీకి నకిలీ ఓటర్ల భయం..!
త్వరలోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. సీమ ప్రాంతంలో ఉపాధ్యాయ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు కూడా రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికలను అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ పాలనకు ఇది గీటు రాయి అని భావిస్తున్న వైసీపీ నాయకులు.. ఈ ఎన్నికల్లో తమ మద్దతు దారులను గెలిపించాలని చూస్తోంది. ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయితే.. వైసీపీపై పట్టు …
Read More »ప్రజా ఉద్యమాల బాటేది.. బాబూ!
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.. ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు సంకల్పం. ఇది మంచిదే. పార్టీ అధినేతగా, మరోసారి అధికారంలోకి రావాలని అనుకోవడం తప్పేమీకాదు. అయితే, దీనికి సంబంధించి వేసుకుంటున్న బాటలే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. 14 సంవత్సరాలు అధికార పక్ష నాయకుడిగా(సీఎం), 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇంకా సెంటిమెంటునే నమ్ముకుని ముందుకు సాగడంపై పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. విజన్ ఉన్న …
Read More »సర్పంచుల వెనుక ఆ కీలక నేత ఉన్నారా? వైసీపీ ఆరా!
రాష్ట్రంలో సర్పంచులు తీవ్ర ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి మద్దతు దారులుగా ఉండి.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దక్కించుకున్న సర్పంచులు.. ఇప్పుడు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. తమకు న్యాయం చేయడంలేదని, తమ చేతిలో చిల్లిగవ్వకూడా ఉండడం లేదని.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తు్న్నారు. నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం మరింత జోరు పెరిగింది. చాలా మంది సర్పంచులు నేరుగా …
Read More »సాయిరెడ్డి సెల్ పోయింది.. అనేక సందేహాలు?!
ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీలో కీలక నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి సెల్ఫోన్ పోయినట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21 నుంచి సెల్ఫోన్ కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో సెల్ఫోన్ పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు …
Read More »ఎమ్మెల్యేలను జగన్ నమ్మడం లేదా?
ఏపీ సీఎం జగన్.. తన పార్టీ ఎమ్మెల్యేలను విశ్వసించడం లేదా? తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను వైసీపీ ఎమ్మెల్యేలు సమర్ధవంతంగా తిప్పి కొట్టడం లేదని ఆయన భావిస్తున్నారా? అంటే, తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి సమయం చాలా ఎక్కువగానే ఉంది. దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. అయితే, ఈలోగానే అధికార పార్టీ అధినేత ఎన్నికలపై దృష్టి పెట్టేశారు. నిజానికి ప్రతిపక్షాలు …
Read More »‘ఎంజీఆర్.. ఎన్టీఆర్.. జగన్’
సభ ఏదైనా.. సమావేశం ఎలాంటిదైనా సీఎం జగన్ ఇటీవలకాలంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరిజిల్లాలోని నరసాపురంలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన జగన్.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షణ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాజకీయ వేదికగా మారేశారు. ఈ సందర్భంగా జగన్.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయమంటే జవాబు దారీతనమన్న జగన్.. …
Read More »చంద్రబాబు చేతిలో తాజా రిపోర్ట్.. తమ్ముళ్లలో టికెట్ ఫీవర్
వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని పక్కాగా నిర్ణయించుకుని, ఆదిశగానే అడుగులు వేస్తున్న చంద్రబాబు.. తాజాగా మరోసారి తమ్ముళ్ల పరిస్థితిని, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేయించుకుని సర్వే రిపోర్టును తెప్పించుకున్నట్టు టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వకూడదో ఇక, కుండబద్దలు కొట్టినట్టు ఆయన నిర్ణయించేస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో టికెట్పై ఆశలు పెట్టుకున్న చాలా మందికి వస్తుందో రాదో అనే ఫీవర్ పట్టుకోవడం గమనార్హం. …
Read More »ఏపీలో వందేళ్ల తర్వాత.. ఈ క్రెడిట్ జగన్దే బ్రో!
వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఏపీలో దాదాపు చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వే ప్రారంభమైంది. వాస్తవానికి గత ఏడాది ట్రయల్ రన్గా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. కొందరికి హక్కు పత్రాలు మంజూరు చేశారు. తొలిదశలో 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తి అయింది. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో …
Read More »జగన్ సర్ శ్రీకాకుళం టూర్.. జుట్టుపీక్కుంటున్న జనాలు!
పై ఫొటో చూశారుగా! ఇది చూస్తే ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఏ దేశాధినేతో వస్తున్నారు.. ఆయనకు అత్యంత పటిష్ఠ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోంది అనుకుంటున్నారా? కానీ.. ఇది ఏపీ సీఎం కోసం చేస్తున్న ఏర్పాట్లు. ఆయన పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి .. ఎక్కడికక్కడ దుకాణాలు రెండు రోజుల ముందే మూయించేసి బారికేడ్లు కట్టేయించారు. పురుగును కూడా కదలనియ్యని రీతిలో ఏర్పాట్లు ఉండడం …
Read More »మీరు చెబుతున్నట్టు.. ఇవి తాటాకు చప్పుళ్లు కావేమో సర్!
తెలంగాణలో వరుస దాడులు. ఒక కేసు పోతే ఇంకొకటి. ఒక నేత చిక్కారులే అనుకుంటే మరో నేత. ఇలా వరుసగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణను చుట్టేస్తున్నాయి. అడ్రస్లు వెతుక్కుని మరీ వచ్చి దాడులు చేస్తున్నాయి. అయితే, ఈ దాడులను తాము ఏమాత్రం ఖాతరు చేసేది లేదని, కేంద్రంలోని నరేంద్ర మోడీ, బీజేపీ సర్కారు తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేది కూడా లేదని మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates