Political News

జాతీయ రాజ‌కీయాల‌పై దేవెగౌడ‌తో సీఎం కేసీఆర్ చ‌ర్చ‌లు

బెంగళూరు చేరుకున్న సీఎం కేసీఆర్ కు.. మాజీ సీఎం కుమారస్వామి, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. జాతీయ రాజకీయాలపై జేడీఎస్‌ నేతలతో చర్చిస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, జేడీఎస్ నేతలు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తో సహా పలువురు …

Read More »

క‌శ్మీర్ వేర్పాటు వాద నేత‌కు 112 ఏళ్ల జైలు శిక్ష‌

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జమ్ము కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు శిక్ష ఖరారయ్యింది. ఈ మేరకు రెండు కేసుల్లో యావజ్జీవ శిక్ష విధిస్తూ ఢిల్లీ పటియాల కోర్టు తీర్పును వెలువరించింది. మొత్తం ఏడు ఆరోపణలపై శిక్షలు విధించింది.  ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ‘ఉపా’ చట్టం కింద 7 ఆరోపణలపై పటియాలా హౌస్‌ ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. …

Read More »

జగన్ అంత ధైర్యం చేస్తారా?

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ అవసరం ఉందని వైసీపీ ప్రముఖ నేత విజయసాయిరెడ్డి అన్నారు. సొంతంగా తమ అభ్యర్ధిని రాష్ట్రపతిగా గెలిపించుకునేందుకు 4 శాతం ఓట్ల లోటు ఉందట. వైసీపీ మద్దతు లేకుండా మిగిలిన పార్టీలతో సంప్రదింపులు చేస్తే ఏమి చేయాలో అప్పుడు తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రయజనాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి మద్దతివ్వాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారట. గతంలో ఎస్సీ వ్యక్తి …

Read More »

కాంగ్రెస్ హ్యాపీయేనా?

తొందరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హ్యాపీగానే ఫీలవుతోంది. ఎందుకంటే రాజ్యసభలో తన బలాన్ని పెంచుకునే అవకాశం రాబోతోంది. దాదాపు ఎనిమిదేళ్ళుగా వరస ఓటములతో పార్టీ బాగా ఇబ్బందులు పడుతోంది. అందుకనే లోక్ సభ, రాజ్యసభలో పార్టీ బలం నానాటికి తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో రాజ్యసభలో పార్టీ బలం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకనే పార్టీ నాయకత్వం హ్యాపీగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఇపుడు …

Read More »

మ‌హానాడు టైమ్ : జెండాలు పీకేస్తే ఏమౌతుంది జ‌గ‌న్ ?

తెలుగుదేశం పార్టీ పండుగ మ‌హానాడుకు ఒంగోలు వేదికౌతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అన్నీ దాదాపు పూర్తయ్యాయి అని తెలుస్తోంది. ఈ నెల 27,28 తేదీల్లో జ‌రగ‌బోయే మ‌హానాడుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు వెళ్ల‌నున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగుంది కానీ ఒంగోలు ప‌ట్ట‌ణంలో ప‌సుపు పండ‌గ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన టీడీపీ జెండాల‌ను (ప్లాస్టిక్ జెండాల‌ను) మున్సిపాల్టీ అధికారులు తొల‌గించ‌డం అన్న‌ది పెద్ద వివాదంగా న‌మోదై ఉంది. ప్ర‌జా స్వామ్య దేశంలో …

Read More »

కోన‌సీమ ఘ‌ట‌న‌పై స‌న్నాయి నొక్కులు

ప‌చ్చ‌టి కోన‌సీమ‌లో రేగిన జిల్లా పేరుపై అసంతృప్తి జ్లాల‌లో త‌మ పాత్ర కించిత్తు కూడా లేద‌ని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి సన్నాయి నొక్కులు నొక్కారు. పాడిందే పాట‌గా.. పార్టీ నేత‌లు .. వ‌ల్లెవేసిన కామెంట్లనే ఆయ‌న కూడా ర‌న్నింగ్ కామెంట్రీగా వినిపించారు. అమలాపురంలో మంగళవారం జరిగిన దాడులు.. కుట్రపూరిత దాడులని  అనుమానం వ్యక్తం చేశారు.  మీడియాతో మాట్లాడుతూ విపక్ష నేతలవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలని తప్పికొట్టారు. కోనసీమ అల్లర్లకు వైసీపీనే …

Read More »

మోడీ టూర్… కేసీఆర్ మూడోసారి డుమ్మా!

తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం బెంగళూరుకు వెళ్లనున్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. దేవెగౌడ నివాసంలో లంచ్ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, …

Read More »

ప‌ద‌వి కోసం.. కాంగ్రెస్‌ను వ‌దిలేసిన క‌పిల్

రాజ‌కీయాల్లో నాయ‌కులు క‌క్కుర్తి ప‌డడం తెలుసుకానీ.. దాదాపు 70 ఏళ్లు పైబ‌డి.. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి.. ఇత‌ర ప‌దవులు కూడా ఒక‌టికి రెండు సార్లు అనుభవించేసిన నాయ‌కులు.. కూడా క‌క్కుర్తిప‌డ‌డ‌మే చిత్రంగా ఉంది. కేవ‌లం రాజ్య‌స‌భ సీటు కోసం.. సుదీర్ఘ కాలం రాజ‌కీయంగా ఆయ‌న‌కు అండ‌గా నిలిచిన కాంగ్రెస్‌ను వ‌దిలి పెట్టేశారు క‌పిల్ సిబ‌ల్.. దీంతో కాంగ్రెస్కు మరో సీనియర్ నేత షాక్ ఇచ్చిన‌ట్టు అయింది. మూడు ద‌శాబ్దాలకు పైగా …

Read More »

ఏపీ స‌ర్కారుపై మాజీ ఐపీఎస్ ధ్వ‌జం

రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. ఎక్క‌డిక‌క్క‌డ అధికార పార్టీ నేత‌లు చెల‌రేగుతున్న ప‌రిస్థితిపై.. పొరు గు రాష్ట్రాల‌నుంచి ఇప్ప‌టికే అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క‌రువ‌వుతున్నాయ ని మేధావులు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌హిళ‌ల‌కు, ఎస్సీల‌కు ఏపీలో ర‌క్ష‌ణ లేద‌ని.. ఇప్ప‌టికే ద‌ళిత సంఘాలు ఆందోళ‌నకు దిగిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం వీటికి విప‌క్ష నేత‌ల విమ‌ర్శ‌ల ఖాతాల్లోకి నెట్టేస్తోంది. పైగా..నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే.. …

Read More »

కోన‌సీమ క‌ల్లోలంలో మా పార్టీ నేత‌లు ఉన్నారు

కోన‌సీమ ప్రాంతంలోని అమలాపురంలో మంగ‌ళ‌వారం చోటు చేసుకున్న విధ్వంసం వెనుక పక్కా ప్లాన్ ఉందని తెలుస్తోందని మంత్రి విశ్వ‌రూప్ తెలిపారు.  మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యేల ఇళ్లకు పక్కా ప్రణాళికతోనే నిప్పు పెట్టారని ఆయ‌న అన్నారు. కీలక నేత అనుచరులే నిప్పు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురం ముట్టడికి.. కేవలం 406 మంది పోలీసులతో భద్రత నిర్వహించారు మూడు వేలకు పైనే ఆందోళనకారులు వచ్చినట్లు గుర్తించామ‌ని …

Read More »

జ‌గ‌న‌న్న బ‌స్సు అదిగో! ఫ‌లితం ఏమౌతుందో !

రాజ‌కీయాల‌న్న‌వి రిజ‌ల్ట్ ఓరియెంటెడ్. మంచి జ‌రిగితే ఓ మాట, చెడు జ‌రిగితే నాలుగు మాట‌లు వినిపించ‌డం వెరీ కామ‌న్. ఇవేవీ లేకుండా ప‌రిణామాల‌ను అంగీక‌రించ‌డం విశ్లేషించ‌డం వివ‌రించ‌డం అన్న‌వి జ‌ర‌గ‌ని ప‌ని! రేప‌టి నుంచి సామాజిక న్యాయ‌భేరి పేరిట జ‌గ‌న్ క్యాబినెట్ కు చెందిన బీసీ, ఎస్టీ మంత్రులు బ‌స్సు యాత్ర చేయ‌నున్నారు. శ్రీ‌కాకుళం నుంచీ యాత్ర ప్రారంభించ‌నున్నారు.  ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. బీసీల‌ను ఆదుకుంటున్న ప్ర‌భుత్వం …

Read More »

డెడ్ బాడీ డోర్ డెలివ‌రీ.. వైసీపీ హ‌యాంలోనే: ప‌వ‌న్ ఫైర్‌

కులాల మధ్య ఘర్షణ రావణకాష్ఠం లాంటిదని.. కులాల గొడవలు జరిగితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని జ‌న‌సేన అధినేత పవన్ క‌ళ్యాణ్‌ స్పష్టం చేశారు. కోన‌సీమ‌ ఘటనకు వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. ఇలాంటి వారి ఉచ్చులో పడవద్దని మనవి చేస్తున్నానన్నారు. వైసీపీ నేతలు గొడవలు తగ్గించే ప్రయత్నం చేయాలని కోరారు. సజ్జల వంటి పెద్దల అనుభవం కులాల మధ్య …

Read More »