Political News

‘జోష్’ త‌గ్గొద్దు.. ఏం చేస్తారో మీ ఇష్టం.. తాడేప‌ల్లిలో చ‌ర్చ‌..!

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ నివాసం తాడేప‌ల్లిలో అనేక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ ప‌రంగా ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. ఇక్క‌డే చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మంత్రులు.. పార్టీ నాయకులు కూడా ఇక్క‌డే స‌మావేశాల‌కు వ‌స్తున్నారు ఈ క్ర‌మంలో ఒక చిత్ర‌మైన విష‌యంపై సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌స్తుతం వైసీపీలో జోష్ నెల‌కొంద‌ని.. ఆ జోష్‌ను త‌గ్గ‌కుండా చూడాల‌ని అన్నారు. దీనికి నాయ‌కులు స్పందిస్తూ.. ప్లీన‌రీ …

Read More »

ఇప్పుడు ఈ యాత్ర బెట‌రేమో.. ప‌వ‌న్ స‌ర్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా ఉమ్మ‌డి తూర్పు గోదావరి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. ఈ యాత్ర ఆయ‌న ముందుగానే షెడ్యూల్ చేసుకున్న టూర్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జిల్లాలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను క‌ల‌వ‌నున్నారు. వారిని ఓదార్చి రూ.ల‌క్ష చొప్పున సాయం అందించ‌నున్నారు. అయితే.. ప‌వ‌న్ టూర్‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న యాత్ర ముందుగానే షెడ్యూల్ చేసుకున్న‌ది. అయితే.. అదేస‌మ‌యంలో …

Read More »

‘ఇది.. జ‌గ‌న్ అహంకారానికి నిద‌ర్శ‌నం’

ఏపీ సీఎం జ‌గ‌న్ వైఖ‌రిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫైర‌య్యారు. విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారానికి నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డ్డారు. అంబేడ్క‌ర్ పేరును తొల‌గించిన మీరు.. ఆయ‌న‌కు ఆరాధ్యులా..? ఆయ‌న‌కు నివాళుల‌ర్పించే అర్హ‌త మీకుందా? అని వ్యాఖ్యానించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం” కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ వంటి ఉన్నత …

Read More »

కొడాలికి జ‌న‌సేనే మొగుడా..?

మాజీ మంత్రి కొడాలి నానికి ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ క‌న్నా.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ నుంచే తీవ్ర సెగ త‌గులుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి గుడివాడ నియోజ క‌వ‌ర్గంలో ఐదు సార్లుగా కొడాలి విజ‌యం సాధిస్తున్నారు. దీంతో త‌న‌కు తిరుగేలేద‌ని ఆయ‌న అంటున్నారు . ఒక‌వేళ టీడీపీ నాయ‌కులు ఎవ‌రైనా మాట్లాడితే.. దానిని త‌ప్పుబ‌డుతున్నారు. అంతేకాదు.. చంద్ర‌బాబుపై నోరు పారేసుకుంటున్నారు. బండ బూతులు తిడుతున్నారు. …

Read More »

కొత్త జిల్లాల‌కు 100 రోజులు.. జ‌నాల‌కు ఒరిగిందేంటి?

చెప్పాడంటే చేస్తాడంతే! అనే నినాదంతో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను కొనియాడే ఆ పార్టీనాయ‌కులు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ఇప్పుడు పెద్ద చిక్కు వ‌చ్చింది. జ‌గ‌న్ చెప్పిన‌ట్టే.. రాష్ట్రంలోని 13 జిల్లాల ను 26 జిల్లాలుగా మార్చారు. ఈ క్ర‌మంలో కొన్ని వివాదాలు.. విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. లెక్క చేయ‌కుండా జిల్లాల విభ‌జ‌న‌చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఈ జిల్లాల విభ‌జ‌న‌కు 100 రోజులు పూర్తయ్యాయి. ఇంత వ‌ర‌కుబాగానే ఉంది. …

Read More »

సర్వేలతో మైండ్ సెట్ మారుతుందా ?

తెలంగాణాలో రాజకీయపార్టీల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. సర్వే ఫలితాలంటు ఏ పార్టీకి ఆ పార్టీ జనాల మైండ్ సెట్ మార్చుందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లున్నాయి. మొదటేమో ఆరా సంస్ధ సర్వే అంటు ఒకటి వెలుగుచూసింది. ఇందులో టీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని జోస్యం చెప్పింది. ఓట్ల శాతం తగ్గిపోతుందటకానీ అధికారం మాత్రం టీఆర్ఎస్ దే అని చెప్పింది. దాంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు మండిపడ్డారు. తర్వాత మరో సంస్ధ …

Read More »

తొందరలోనే జగన్ ‘ప్రజాదర్బార్’

ప్రతిరోజు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో మమేకం అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ ప్రారంభించబోతున్నారు. తన క్యాంపు కార్యాలయంలోనే ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సీఎం కార్యాలయం ఉన్నతాధికారులు చేస్తున్నారు. పరిస్ధితులన్నీ కుదిరితే ఈ నెలాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదట్లోనే ప్రజాదర్బార్ కు శ్రీకారం చుట్టాలని జగన్ డిసైడ్ అయ్యారట. జనాలతో పాటు ప్రజా ప్రతినిధులు, నేతల నుండి వివిధ సమస్యలపై వచ్చే వినతులను పరిశీలించి …

Read More »

మద్యం షాపులను ప్రభుత్వం వదిలించుకుంటోందా ?

తొందరలోనే మద్యం షాపులను ప్రభుత్వం వదిలించుకోబోతోందనే ప్రచారం మొదలైంది. గతంలో ఉన్నట్లే షాపులన్నింటినీ మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకే అప్పగించేయాలని జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో డిసైడ్ అయ్యిందట. ఇంతటి కీలక నిర్ణయానికి కారణం ఏమిటంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవటమేనట. ప్రస్తుతం మద్యం ద్వారా ఆదాయం బాగానే వస్తున్నా అనుకున్నంత స్ధాయిలో రావటం లేదని ఉన్నతాధికారులు బాధపడిపోతున్నారట. ప్రస్తుతం మద్యం ద్వారా ఏడాదికి సుమారు రు. 25 …

Read More »

రోజాకు షాక్.. మన పార్టీని నమ్ముకుని అప్పులపాలయ్యామని ఫ్లెక్సీ

వైసీపీ కీల‌క నాయ‌కురాలు.. ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు సొంత పార్టీ నేత‌ల నుంచే భారీ సెగ త‌గిలింది. అది కూడా ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలో ఆమెను కొంద‌రు నిల‌దీశారు. తాము వైసీపీలో ఎప్ప‌టి నుంచో ప‌నిచేస్తున్నామ‌ని.. అయితే.. త‌మ‌కు పార్టీని న‌మ్ముకున్నందుకు అప్పులు మిగిలాయ‌ని.. బాధితులు తీవ్ర ఆవేద‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో ఫ్లెక్సీలు ప్ర‌ద‌ర్శించి.. నిర‌స‌న తెలిపారు. దీంతో మంత్రి రోజాకు ఏం …

Read More »

ఏపీ బీజేపీ నోటికి తాళం

రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌కు పెద్ద స‌మ‌స్య వ‌చ్చింది. ఏ గ‌ట్టునుండాలో తెలియ‌క నాయ‌కులు స‌త‌మ‌తం అవుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌ల‌ను, మంత్రులను.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇష్టానుసారం గా విమ‌ర్శించిన‌.. బీజేపీ రాష్ట్ర నేత‌ల‌కు ఇప్పుడు ఒక్క‌సారిగా పాలుపోని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రోవైపు.. టీడీపీ విష‌యంలోనూ నాయ‌కులు ఏం చేయాల‌నే విష‌యంపై త‌ర్జ‌న భర్జ‌న ప‌డుతున్నారు. వైసీపీని విమ‌ర్శిస్తున్న క్ర‌మంలోనే త‌ర‌చుగా.. టీడీపీపైనా బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము …

Read More »

టీడీపీ వ‌ర్సెస్‌ వైసీపీ.. స‌ర్వే ఫైట్‌..!

ఏపీలో మ‌రో వివాదం.. రెండు ప్ర‌ధాన పార్టీల‌నూ కుదిపేస్తోంది. అదే.. స‌ర్వే రిపోర్టు. తాజాగా సెంట‌ర్ ఫ‌ర్ నేష‌న‌ల్ స్ట‌డీస్ అనే సంస్థ‌.. ఒక స‌ర్వే నిర్వ‌హించింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ముఖ్య‌మంత్రుల ప్రోగ్ర‌స్‌పై.. ఈ సంస్థ రెండు రోజుల కింద‌టే స‌ర్వే రిపోర్టు ఇచ్చింది. దీనిలో దేశంలోని 25 మంది ముఖ్య‌మంత్రుల ప‌నితీరుకు మార్కులు వేసింది. తొలిస్థానంలో ఒడిసా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఉన్నారు. దీనిపై ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం …

Read More »

ఎంపీ అర్వింద్ కాన్వాయ్ మీద దాడి.. వాహనం ధ్వంసం

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంతకంతకూ బలపడుతోందని.. అధికార టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు మొదలైనట్లేనన్న వాదన అంతకంతకకూ పెరుగుతున్న వేళ.. దానికి సాక్ష్యంగా ఇటీవల విడుదలైన సర్వేలు చెబుతున్న వేళ.. అనూహ్యంగా ఆ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నేత ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనం మీద దాడి జరిగిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకిలా జరిగింది? ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? దాడి చేసే వరకు విషయం ఎందుకు …

Read More »