Political News

‘కేసీఆర్ బతికే ఉన్నాడు.. ఏం కానీయుడు..’

తియ్యటి మాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా గురించి దేశ ప్రజలకు.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు పెద్దగా తెలీని వేళలో.. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటల క్లిప్పులు గడిచిన కొద్దినెలలుగా వాట్సప్ గ్రూపుల్లో తరచూ షేర్ కావటం తెలిసిందే. చాలా సింఫుల్ వైరస్ అన్నట్లుగా తేల్చేయటమే కాదు.. ఉష్ణోగ్రతలు కాస్త పెరగ్గానే.. కరోనా వైరస్ తోక ముడిచి …

Read More »

జగన్ ఇంటర్వ్యూ- అమరావతిపై తన ఆలోచన చెప్పేసిన జగన్

ఉద్యమాల పేరుతో ఎన్ని రోజులు ఆందోళనలు చేసినా, ప్రతిపక్షాలు ఎన్ని డిమాండ్లు చేసినా ఉపయోగం ఉండదనే అనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి డెసిషన్ చూస్తే అందరికీ ఇదే విషయం అర్ధమైపోయింది. హిందుస్ధాన్ టైమ్స్ కు జగన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వికేంద్రీకరణే తమ ఫైనల్ నిర్ణయంగా స్పష్టం చేశారు. వికేంద్రీకరణ అనే తమ నిర్ణయం నుండి వెనక్కు తగ్గేది లేదని జగన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఎవరెన్ని …

Read More »

క్వీన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా?

మిగిలిన రాజకీయ అధినేతల వ్యూహాలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో.. ఆ మాటకు వస్తే.. నిత్యం చూసే రాజకీయ ఎత్తులకు భిన్నంగా మోడీషాల వ్యూహాలు ఉంటాయని చెప్పాలి. ఏపీలోని ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఆ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఎంపీ రఘురామను సంధించటం.. తాజాగా మహారాష్ట్రలో తమకు ఏ మాత్రం పొసగని సేన సర్కారుకు షాకులిచ్చే పెద్ద పనిని బాలీవుడ్ క్వీన్ కంగన చేతుల్లోకి తీసుకున్నారా? అన్న …

Read More »

జగన్ మనసు మారిందా?

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంపై కొంత కాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మాతృభాషలోనే విద్యనభ్యసించాలనుకునే వారికి ఆ అవకాశం ఇవ్వాలని, ఇంగ్లిషు మీడియం వల్ల పిల్లలు మాతృభాషను మరచిపోయే ప్రమాదముందని విపక్షాలు, మేధావులు గగ్గోలు పెడుతున్నాయి. అయితే, ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే ఇంగ్లిషు మీడియం తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ చర్చ ఇలా కొనసాగుతున్న దశలోనే కేంద్రం 5వ తరగతి వరకు మాతృభాష …

Read More »

లోకేష్ వార్నింగ్.. 40 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలుకు

తెలుగుదేశం యువ నేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడి త‌న‌యుడు నారా లోకేష్‌ నెమ్మ‌దిగా దూకుడు పెంచుతున్నారు. ఒక వైకాపా నేత హ‌త్య కేసులో చిక్కుకుని.. ఇటీవ‌లే బెయిల్ మీద బ‌య‌టికి వ‌చ్చిన తెదేపా నేత కొల్లు ర‌వీంద్ర‌ను బుధ‌వారం లోకేష్ ప‌రామ‌ర్శించారు. ఆయ‌న వెంట దేవినేని ఉమా స‌హా ప‌లువురు తెదేపా అగ్ర నేతలు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా అధికార పార్టీ నేత‌ల్నుద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు …

Read More »

జంపింగుల కంటే.. ఉన్నోళ్ల‌తోనే బాబుకు మంట‌!

Chandrababu

టీడీపీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబుకు ప్ర‌స్తుత రాజ‌కీయాలు క‌లిసి రావ‌డం లేదా? ఆయ‌న అనుకుంటున్న‌ది ఒక‌టి, పార్టీలో జ‌రుగుతున్న‌ది మ‌రొక‌టి అనేలా పాలిటిక్స్ న‌డుస్తున్నాయా? క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక అజెండాతో ముందుకు సాగుతున్నా.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న ఇమేజ్‌ను పెంచుకోలేక పోవ‌డానికి కార‌ణాలు ఏంటి? పోనీ.. సంస్థాగ‌తంగా పార్టీకైనా చంద్ర‌బాబు వ్యూహాలు మేళ్లు చేకూర్చ‌లేక‌పోవ‌డానికి రీజ‌నేంటి? అనే అంశాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. దీనికి ప్ర‌ధాన …

Read More »

జ‌గ‌న్ అవాక్కయ్యే మాట చెప్పిన ప‌వ‌న్‌

దేవాలయాలు, మత విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు ఏవైనా చాలా సున్నితమైన అంశాలు. వీటి విష‌యంలో ఒక‌రికి అనుకూలంగా కొంద‌రికి వ్య‌తిరేకంగా ఉండ‌టం రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎంత మాత్రం మంచిది కాదు. అయితే, ఏపీలో గత కొద్ది నెలలుగా వరుస క్రమంలో జరుగుతున్న ఘ‌ట‌న‌లు కొత్త చ‌ర్చ‌కు తెర‌తీస్తున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి, వినాయకుడు, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసిన విధానం, విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు …

Read More »

2021లో కేటీఆర్ పట్టాభిషేకానికి భారీ ప్లానింగ్?

తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ లో ఇప్పుడు రెండు అంశాల మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. అందులో ఒకటి జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఒకటి కాగా.. మంత్రి కేటీఆర్ కు పట్టాభిషేకాన్ని ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతానికి భిన్నంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వీలుగా కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో.. గులాబీ …

Read More »

ఏపీపై మరో బ్యాడ్ రిమార్క్

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో కొద్ది రోజుల నుంచి రోజుకు దాదాపుగా పది వేల కేసులకు పైగా నమోదవడం కలవరపెడుతోంది. మరోవైపు, దేశంలో సంభవిస్తోన్న కరోనా మరణాల్లో 70 శాతం కరోనా మరణాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర , కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు, దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల విషయంలోనూ ఈ ఐదు రాష్ట్రాల నుంచే 62 …

Read More »

జాబ్ మార్కెట్ పై షాకింగ్ సర్వే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా ఎంత దారుణ పరిస్థితి నెలకుందన్న విషయం తెలిసిందే. దేశీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయటమే కాదు.. జాబ్ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక సర్వే రిపోర్టు బయటకు వచ్చింది. మ్యాన్ పవర్ గ్రూపు ఎంప్లాయ్ మెంట్ ఔట్ లుక్ సర్వే ఒకటి వెల్లడైంది. ఇందులో పేర్కొన్న వివరాలు షాకింగ్ గా మారాయి. కరోనా నేపథ్యంలో దేశీయంగా …

Read More »

అట్టుడికిన అంతర్వేది…మంత్రులకు చేదు అనుభవం

తూర్పు గోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో అగ్నిప్రమాదం ఘటన ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చారిత్రక రథం కాలిపోవడం కలచివేసింది. వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న అగ్నికుల క్షత్రియుడు, అలయ నిర్మాత కోపనాతి కృష్ణమ్మ నిర్మించిన ఈ రథం ప్రమాదంలో కాలి బూడిద కావడం భక్తులను ఆవేదనకు గురిచేసింది. ఉత్సవ రథం కాలిపోయిన ఘటనపై విచారణ జరపాలని విశాఖ శారదా …

Read More »

పీవీకి భారతరత్న తీర్మానం… వ్యతిరేకించిన ఎంఐఎం

తెలంగాణలో మిత్రపక్షాలుగా కొనసాగుతోన్న టీఆర్ఎస్, ఎంఐఎంలపై కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలు చాలా సందర్భాల్లో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఐం అధినేత అసదుద్దీన్ ఒవైసీల మధ్య గట్టి బంధం ఉందని, అందుకే ఒవైసీపై ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. దీనికి తగ్గట్టుగానే కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒవైసీ వంతపాడుతుంటారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటారు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఆంక్షలు …

Read More »