Political News

జగన్‌ ‘నవ్వులు’ పవన్ ఎటకారం మామూలుగా లేదుగా

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు.. దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈ మధ్య జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడుతున్నారు. ప్యాకేజీ అంటూ వాగితే చెప్పు తెగుతుంది అంటూ వైసీపీ నేతల్ని ఉద్దేశించి నెల కిందట తీవ్ర పదజాలంతో ఘాటైన వ్యాఖ్యలు చేసిన దగ్గర్నుంచి పవన్ ఫైర్ మామూలుగా ఉండట్లేదు. మంచి పాయింట్లు పట్టుకుని.. జగన్ సహా ముఖ్య నేతల తీరును …

Read More »

వ‌రుస కాంట్ర‌వ‌ర్సీల‌తో ఒంట‌రైపోయిన వైసీపీ నేత‌…!

వ‌రుస వివాదాలు.. వైసీపీలో కీల‌క నాయ‌కుడిని ఏకాకి చేస్తున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న‌కు పార్టీ అధిష్టానం కూడా దూరంగా ఉంటోంద‌ని అంటున్నారు. ఇక‌, జిల్లాలో అయినా.. నాయ‌కుల‌కుఆయ‌న‌కు అస‌లు ప‌డ‌డం లేద‌ని చెబుతున్నారు. ఆయ‌నే మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస‌రావు. తాజాగా ఆయ‌న‌ను పార్టీలోని జిల్లా బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. త‌ర్వాత ఆయ‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీనికి కార‌ణం వ‌రుస వివాదాలేన‌ని అంటున్నారు లోక‌ల్ నాయ‌కులు. …

Read More »

పవన్ ఇలా చేస్తే.. వైసీపీ త‌డిగుడ్డ వేసుకుని ప‌డుకోవచ్చు

వ‌చ్చే 2024 ఎన్నిక‌లు హాట్ గురూ.. అంటూ ప్ర‌చారంలో ఉన్నా తాజాగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, మార్పులు చూస్తే.. మ‌రోసారి వైసీపీకి అధికారం బంగారుప‌ళ్లెంలో పెట్టి అందిస్తున్నారే! అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు వస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తానంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ గ‌త కొన్నాళ్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇది జ‌ర‌గాలంటే.. క‌మ్యూనిస్టులు చెబుతున్న‌ట్టు అన్ని పార్టీలు …

Read More »

ఆ మంత్రికి టికెట్ ఇవ్వొద్దు.. వైసీపీలో ముస‌లం

ఏపీలో ఎన్నిక‌ల‌కు ఏడాదిన్నర స‌మ‌యం ఉండ‌గానే అధికార పార్టీలో అస‌మ్మ‌తి రాజుకుంది. సిట్టింగు ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మంత్రుల విష‌యంలో ప‌లు చోట్ల వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా శ్రీకాకులం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌మ్ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుపై వైసీపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. రానున్న ఎన్నికల్లో అప్పలరాజుకు టికెట్ ప్రకటిస్తే తప్పకుండా ఓడిస్తామని అసమ్మతి నాయకులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు తీర …

Read More »

బాబాయికి గుండెపోటు, కోడిక‌త్తి డ్రామాలు నాకు రావ్‌! : ప‌వ‌న్

తాజాగా మంగ‌ళ‌గిరిలో ప‌ర్య‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పాల‌క‌ వైసీపీనేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ను ప్ర‌స్తావించారు. బ‌హుశ‌.. ప‌వ‌న్ ఇటీవ‌ల కాలంలో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. “క‌త్తుల‌, గొడ్డ‌ళ్లు, బాడిత‌లు ఉప‌యోగించే వాళ్లం కాదు మేం. మేం క‌ష్టాన్ని న‌మ్ముకున్నాం. మీ లాగా.. పాపం వైఎస్ వివేకానంద‌రెడ్డిగారిని.. క‌త్తులు గొడ్డ‌ళ్లు, బాడిత‌లు ఉప‌యోగించి హ‌త్య చేయించ‌లేదు” అని …

Read More »

జ‌గ‌న్‌ BirthDay వేడుకలు.. ఇక వీరిని ఆపలేం

kodali

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఇన్నాళ్ల‌కు సీఎం జ‌గ‌న్ గొప్ప అవ‌కాశం ఇచ్చార‌ని అంటున్నారు నాని అనుచ‌రులు. అదేంటంటే.. వ‌చ్చే నెల 21న సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు ఉంది. ఆ రోజుతో జ‌గ‌న్‌కు 50 ఏళ్లు పూర్త‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే జ‌గ‌న‌న్న స్వ‌ర్ణోత్సవ సంబ‌రాలు పేరిట పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పండ‌గ వాతావ‌ర‌ణంలో ప్ర‌భుత్వ‌మే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఇక‌, పుట్టిన రోజు నాడు, …

Read More »

‘ఆఖ‌రుకు క‌ట్ డ్రాయ‌ర్ ఫ్యాక్ట‌రీని కూడా వ‌ద‌ల్లేదు జ‌గ‌న్‌’

వైసీపీపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రం నుంచి అనేక ఫ్యాక్ట‌రీలు వైసీపీ ప్ర‌భుత్వ దెబ్బ‌తో పొరుగు రాష్ట్రాల‌కు, పొరుగు దేశాల‌కు వెళ్లిపోతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆఖ‌రుకు క‌ట్ డ్రాయ‌ర్‌లు త‌యారు చేసే జాకీ సంస్థ కూడా ఇక్క‌డి వైసీపీ నేత‌ల‌కు లంచాలు, ముడుపులు ఇచ్చుకోలేక వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇది మీకు సిగ్గ‌ని పించ‌డం లేదా? అని సీఎం జ‌గ‌న్‌ను సూటిగా ప్ర‌శ్నించారు. …

Read More »

జగన్‌ వల్ల రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు

సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్న డబ్బులను ప్రజలు ఆపేయాలని చెప్పితే.. వెంటనే నిలుపుదల చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేన‌ని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న‌ పెద్ద రెల్లివీధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అందరూ సంతోషంగా …

Read More »

బొత్స డ‌మ్మీ .. ఆయ‌న వ‌ల్ల ఏమీ కాదు: ప‌వ‌న్

ఏపీ సీనియ‌ర్ మినిస్ట‌ర్, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి బొత్స డమ్మీ అయ్యార‌ని, ఆయ‌న వ‌ల్ల ఏమీ కావ‌ని, ఆయ‌న పై ఆశ‌లు కూడా పెట్టుకోవ‌ద్ద‌ని తూర్పు కాపు సామాజిక వ‌ర్గానికి ప‌వ‌న్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా తూర్పుకాపుల సమస్యలను అధిష్టానానికి చెప్పడం తప్ప చేసేదేమీ కనిపించడం లేదని …

Read More »

ఇలా మాట్లాడితే టీడీపీ కి చాలా నస్టం

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని చంద్ర‌బాబు నాలుగు అడుగులు ముందుకు తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తు న్నారు. ఆయ‌న‌కు తోడుగా త‌మ్ముళ్లు కూడా మరింత‌ ముందుకు తీసుకువెళ్లాల‌ని..బాబు పిలుపునిస్తున్నా రు. అయితే, కొంద‌రు మాత్రం చంద్ర‌బాబు లెక్క ప్ర‌కారం అంతో ఇంతో ముందుకు తీసుకువెళ్లే ప్ర‌య త్నం చేస్తుంటే ఎక్కువ మంది మౌనంగా ఉంటున్నారు. స‌రే.. మౌనంగా ఉన్నా ఫ‌ర్వాలేదు. కానీ, వీరిలో ఒక‌రిద్ద‌రు చేస్తున్న ప‌నులు పార్టీని న‌ల‌భై అడుగుల మేర‌కు వెన‌క్కి …

Read More »

కుల రాజకీయాన్ని కొత్తగా డీల్ చేసిన పవన్ 

ఏపీలో కుల రాజ‌కీయాలు పెరిగిపోయాయ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కులాలను వాడుకుని నేతలు ఎదుగుతున్నారు.. ఆడుతున్నారు తప్ప… కులాల్లోని ప్రజలు మాత్రం వెనకబడి పోతున్నారని అన్నారు.  సంఖ్యా బలం ఉన్న కులాలు ఐక్యతతో ఉంటే భవిష్యత్తులో రాష్ట్రం వారి చేతిలోనే ఉంటుందని తెలిపారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో తూర్పుకాపు సంక్షేమ సంఘం నాయకులతో పవన్ భేటీ అయ్యారు. బీసీ కులాలకు ఒక్కొక్క దానికీ ఒక్కొక్క …

Read More »

‘వైఎస్ క‌నుసైగ చేసి ఉంటే.. బాబు అప్పుడే అయిపోయేవారు!’

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ నాయ‌కుడు, అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును ఆయన ఇంట్లోనే చంపేసేవాడని వ్యాఖ్యానించారు. తమ ప్రాంతంలో హత్యా రాజకీయాలు జరిగితే.. మొదట చంద్రబాబు కొడుకునే టార్గెట్ చేస్తామని హెచ్చరించా రు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు పై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. …

Read More »