Political News

శ‌ప‌థం ప‌క్క‌కు పెట్టి అసెంబ్లీకి వచ్చిన చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 8నెలల తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో అడుగుపెట్టారు. అయితే, ఆయ‌న వ‌చ్చిన స‌భా స‌మావేశాల‌కు కాదు.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకొని ఓటువేసే నిమిత్తం సోమవారం ఆయన అసెంబ్లీకి వ‌చ్చారు. వాస్త‌వానికి గత నవంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తన సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ ‘ఈ ప్రభుత్వం గద్దె దిగేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోన’ని చంద్ర బాబు ప్రకటించారు. ఇక‌, …

Read More »

బీజేపీకి ఓటేసిన సీతక్క

ఔను.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్‌, సీత‌క్క‌.. అనుకున్న‌ది ఒక‌టైతే.. చేసిందిమ‌రొక‌టి. తాజాగా జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఆమె త‌డ‌బ‌డ్డారు. ఆది నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు, కేంద్ర పార్టీ అధిష్టానం కూడా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు ఓటేయాల‌ని ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లు ఆయా రాష్ట్రాల‌కు తిరిగి మ‌రీ.. సిన్హాకు ఎలా ఓటేయాలో కూడా నేర్పించారు. ఎందుకంటే.. బీజేపీ అభ్య‌ర్థికి …

Read More »

టీడీపీలో మంగ‌ళ‌గిరి హాట్ టాపిక్‌!

తెలుగు దేశం పార్టీ నాయ‌కుల మ‌ధ్య ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం హాట్‌టాపిక్‌గా మారింది. చాలా మంది నాయ‌కులు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్నారు. దీంతో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం కాన్సెప్ట్‌.. టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. మ‌రి ఇంత‌కీ ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ యువ నాయ‌కుడు లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ.. ఆయ‌న …

Read More »

క్లౌడ్ బ‌ర‌స్ట్‌.. కేసీఆర్ మిలీనియం జోక్‌: బండి సంజ‌య్‌

భారీ వర్షాల వెనక విదేశీ కుట్ర ఉందనడం… క్లౌడ్ బ‌రస్ట్ అని వ్యాఖ్యానించ‌డం.. ఈ శతాబ్దపు జోక్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సీఎంను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలగడంతోపాటు ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలన్నారు. సీఎం చేసిన కామెంట్లు …

Read More »

ఎన్నికలకు జనసేన ఎంతవరకు సిద్ధం ?

వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరేయటం ఖాయమట. 2024 ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండపేటలో ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి తలా లక్ష రూపాయలు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జనసేన ధ్యేయమన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వంద తప్పులను భరిస్తాం, సహిస్తామని హెచ్చరించారు. తర్వాత ప్రభుత్వం తాటతీయటం ఖాయమన్నారు. వచ్చే …

Read More »

మోడీకి అంత దైర్యముందా ?

‘ఉచితపథకాలు దేశాభివృద్ధి చాలా ప్రమాదకరం’ ..ఇది తాజాగా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య. మోడీ చెప్పిన దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ విషయాన్ని ఆర్ధిక, సామాజిక రంగాల నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు. ఈమధ్యనే ఉచిత పథకాలపై కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తంచేసింది. కానీ ఉచిత పథకాల హామీలు లేకుండా ఏపార్టీ అయినా ఎన్నికలకు వెళ్ళగలుగుతుందా ? మిగిలిన పార్టీల సంగతిని పక్కన పెట్టేద్దాం …

Read More »

విలీనం.. జ‌న‌సేన.. కొన్ని వాస్త‌వాలు..!

అవును.. ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చకు జ‌న‌సేన తెర‌దీసింది. తాజాగా గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టించిన జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో సుదీర్ఘ ఉప‌న్యాసం ఇచ్చారు. ఈ క్ర‌మంలో వైసీపీ స‌ర్కార‌పై విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాలంటే.. మేలు కావాలంటే.. త‌మ ను ఎన్నుకోవాల‌ని.. ఆయ‌న సూచించారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న పార్టీని విలీనం …

Read More »

మేమేమ‌న్నా.. డ‌బ్బులు ప్రింట్ చేస్తున్నామా?: బొత్స

ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. విదేశీ ఉన్నత విద్య పథకాన్నినిలుపుదల చేశారన్న విపక్షాల విమర్శలను మంత్రి బొత్స ఖండించారు. అమెరికా వెళ్తా అనగానే డబ్బులు ఇచ్చేస్తామా? అని ఆయన ప్రశ్నించారు. మెరిట్ విద్యార్థులకే విదేశీ విద్య ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ విధానమని వెల్లడించారు. “ఎవ‌రో వ‌స్తారు. అమెరికా వెళ్తామంటారు.. డ‌బ్బులు ఇచ్చేస్తామా? ప్ర‌భుత్వం ఏమ‌న్నా.. డ‌బ్బులు ముద్రిస్తోంద‌ని అనుకుంటున్నారా?” అని ఆయ‌న ఫైర‌య్యారు. విదేశీ …

Read More »

వ‌చ్చే నెలే ముహూర్తం.. జ‌గ‌న్ వ్యూహం ఇదే..!

అనుకున్న‌ది సాధించ‌డ‌మే త‌ప్ప‌.. వెన‌క్కి వెళ్లే మ‌న‌స్త‌త్వం.. రాజ‌కీయాల్లో చాలా మందికి ఉండ‌దు. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో అయితే.. ఇది మ‌రింత ఎక్కువ‌. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్న‌ది సాధించారే త‌ప్ప‌.. ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌లేదు. ఒక‌టి రెండు హామీలు మిన‌హా.. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేసేందుకు వ్యూహాలు వేసుకుని.. అవ‌స‌ర‌మైతే.. అప్పులు చేసైనా కూడా.. ముందుకు సాగుతున్నారు. ఈ …

Read More »

ద‌ద్ద‌రిల్లిన ‘సీఎం స‌ర్ గుడ్ మార్నింగ్‌’

సీఎం సార్‌ గుడ్‌ మార్నింగ్‌.. అంటూ జనసేన కార్యకర్తలు, నాయకులు రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లు వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో హోరెత్తిపోయింది. రోడ్లన్నీ ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా ఏమాత్రం ప్యాచ్‌ వర్క్‌లు కూడా వేయలేక పోయారని ధ్వజమెత్తారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్‌, పలువురు నాయకులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. గోతుల రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారని …

Read More »

కేంద్రం ప‌రువు తీయండి.. ఎంపీల‌కు కేసీఆర్ ఆదేశం

తెలంగాణ‌పై కేంద్రం చూపుతున్న వివ‌క్ష‌ను ఏకేయాల‌ని.. పాయింట్ల వారీగా.. కేంద్రం ప‌రువు తీయాల‌ని.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గే ప్ర‌శ్నే లేద‌న్నారు. విష‌యం ఏదైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. అడుగ‌డుగునా అడ్డు ప‌డాల‌ని సూచించారు. ప్రగతిభవన్‌లో నిర్వ‌హించిన టీఆర్ ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ స‌మావేశానికి హాజరయ్యారు. ఈ నెల …

Read More »

ఎవ‌రివైపు నిల‌బ‌డ‌తారో తేల్చుకోండి: ప‌వ‌న్

తూర్పుగోదావరి జిల్లా చైతన్యవంతమైనదని.. రాష్ట్రంలో మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యమవుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన కౌలు రైతు భరోసాయాత్రలో భాగంగా.. కోనసీమ జిల్లా మండపేటలో ఆత్మహత్య చేసుకున్న 52 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్‌ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత …

Read More »