Political News

తిరుపతిలో పోటికి బిజెపి రెడీ

ఖాళీ అయిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటి చేయటానికి బిజెపి రెడీ అవుతోంది. వైసిపి ఎంపి బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యం కారణంగా ఈమధ్యనే మరణించారు. దాంతో ఎప్పుడో ఒకపుడు తిరుపతి లోక్ సభకు ఉపఎన్నికలు తప్పవు. ఇదే విషయమై బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన సమావేశమైన పదాదికారులు, జిల్లాల అధ్యక్షులు నిర్ణయించారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బిజెపి తరపున అభ్యర్ధిని పోటికి దింపి గెలిపించుకోవాలని సమావేశం …

Read More »

కేసీఆర్ అర్థం చేసుకున్న భారతదేశం !

థర్డ్ ఫ్రంట్… భారతదేశ రాజకీయాల్లో అపరిపక్వమైన కల. ఇప్పటికే ఈ దిశగా ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నం విజయవంతం కాలేదు. కాంగ్రెస్ గానీ, బీజేపీ గాని లేకుండా మరో ఫ్రంట్ ఇంతవరకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. కర్ణుడి చావుకి శతకోటి కారణాలు అన్నట్టుంది ఈ వ్యవహారం. ఎన్నిసార్లు విఫలం అయినా… ఈ థర్డ్ ఫ్రంట్ పై ఎవరికీ ఆశ చావలేదు. అయితే జాతీయ రాజకీయాల్లో తాజాగా కొత్త …

Read More »

షాతో జగన్ భేటీ… ఏపీలో సీబీఐ దూకుడు పెరుగుతుందా?

నవ్యాంధ్ర వ్యవహారాలకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ సీఎం హోదాలో ఢిల్లీలో అడుగుపెట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగానే సాగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీని ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం నారా …

Read More »

రూ.4వేలకే స్మార్ట్ ఫోన్…రిలయన్స్ మరో సంచలనం?

కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ….చాలామంది ప్రజల అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిపెట్టిన ఘనత రిలయన్స్ ధీరూభాయ్ అంబానీదే. తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన ముకేశ్ అంబానీ….జియో జీ భర్ కే అంటూ కారుచౌకగా మొబైల్ డేటాతో పాటు ఫీచర్ ఫోన్ ను సామాన్యులకు అందించారు. టెలికాం రంగంలో జియో దెబ్బకు తట్టుకోలేక చాలా టెలికాం కంపెనీలు నష్టాలను చవిచూశాయి. జియో 4జీ సేవల ధాటికి మిగతా కంపెనీలు కుదేలయ్యాయి. వచ్చే ఏడాది …

Read More »

డిక్లరేషన్ పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా:నాని

కలియుగ దైవం అయిన తిరుమల వెంకన్న ఆలయంలోకి ప్రవేశించే అన్యమతస్థుల డిక్లరేషన్ వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో, ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తిరుమలలో డిక్లరేషన్ అనే అంశంపై చర్చ జరగాలని, వేరే గుళ్లలో …

Read More »

రాజ‌ధానిపై వ్యూహం మార్చేద్దాం.. బాబు తాజా ప్లాన్‌!

రాజ‌ధాని విష‌యంపై వ్యూహం మార్చాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు టీడీపీలో చ‌ర్చ న‌డుస్తోంది. దీనిపై ఇప్ప‌టికే అనేక రూపాల్లో యుద్ధం చేసిన బాబు.. ఒక‌ర‌కంగా అస్త్ర స‌న్యాసం చేసేశారు. మూడు రాజ‌ధానుల విష‌యంలో అమ‌రావ‌తి రైతుల‌ను, ప్ర‌జ‌లను, మ‌హిళ‌ల‌ను, యువ‌త‌ను కూడా ఆయ‌న ప్ర‌భావితం చేశారు. ఎక్క‌డెక్క‌డో ఉన్న వారిని కూడా ఏక‌తాటిపైకి తెచ్చారు. ప్ర‌భుత్వంపైనా.. మ‌రీ ముఖ్యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పైనా బాబు వ్యూహాత్మ‌కంగా ఎదురుదాడి చేయించారు. ఈ క్ర‌మంలో రాజ‌కీయాల్లో …

Read More »

అచ్చెన్న చేతికి ఏపీ టీడీపీ, 27న కార్యవర్గం !

మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో అయినా ఏపిలో తెలుగుదేశంపార్టీ పరుగులు పెడుతుందా ? ఎందుకంటే అచ్చెన్నను ఏపికి చంద్రబాబునాయుడు అధ్యక్షునిగా నియమించారు. 27 న అధికారికంగా ప్రకటిస్తారు. అచ్చెన్న నియామకంపై చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బాగా దూకుడు స్వభావం ఉన్న అచ్చెన్నను అధ్యక్షునిగా చంద్రబాబు అంగీకరిస్తారా ? అనే చర్చ కూడా జరిగింది. అయితే ఇఎస్ఐ కుంభకోణంలో అరెస్టవ్వటం అందులోను ఈయన బిసి …

Read More »

తమిళ ప్రేక్షకుల్ని దువ్వుతున్న తెలుగు హీరో

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. ఈ సినిమా అతడికి చాలానే అవకాశాలు తెచ్చిపెట్టింది. అతను ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ‘హిప్పి’ అనే సినిమా కూడా చేశాడు. ఆ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కాస్త పరిచయం అయ్యాడు. ఇప్పుడు తమిళంలో ఓ భారీ చిత్రంలో అతను కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఆ చిత్రమే.. వాలిమై. తమిళ బడా హీరోల్లో ఒకడైన …

Read More »

జ‌గ‌న్-కేసీఆర్‌ల మ‌ధ్య మ‌రింత దూరం.. పెరుగుతుందా?

ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య స్నేహం ముందుకు సాగాలంటే.. స‌ఖ్య‌త‌, సానుకూల‌త‌లు చాలా ముఖ్యం. కాదు.. నా దారి నాదే.. నాదూల నాదే.. అంటే.. ఎవ‌రిదారి వారిదే అవుతుంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వ‌స్తోందంటే.. ఏపీ-తెలంగాణ‌ల మ‌ధ్య అన్న‌ద‌మ్ముల బంధం, స్నేహం కొన‌సాగాల‌నుకునే వారికి ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌తిబంధ‌కాలు వ‌స్తూనే ఉన్నాయి. “రాష్ట్రాలుగా విడిపోదాం.. అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉందాం” అన్న నాయ‌కులు గ‌డిచిన ఐదేళ్ల‌పాటు క‌త్తులు నూరుకున్నారు. దీంతో ఏపీ-తెలంగాణ‌ల …

Read More »

జ‌గ‌న్ నిర్ణ‌యాలు.. రైతులను దూరం చేస్తాయా? ఓ చ‌ర్చ‌!

రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా ఎవ‌రు అధికారంలోకి రావాల‌న్నా.. అన్న‌దాతల ఓటు బ్యాంకు కీల‌కం. స‌మాజంలో ఎన్ని వృత్తులు ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్ని ఉద్యోగాలు ఉన్న‌ప్ప‌టికీ.. వ్య‌వ‌సాయం.. వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌పై ఆధార‌ప‌డిన వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. దీంతో ఎన్నిక‌ల్లో వ్య‌వ‌సాయ రంగం చూపించే ప్ర‌భావం ఎక్కువ‌. 2014లో రైతుల‌కు రుణ‌మాఫీ చేసేది లేద‌న్నందుకే.. తాము అధికారంలోకి రాలేక‌పోయామ‌ని.. స్వ‌యంగా వైసీపీ అధినేత, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ అనేక సంద‌ర్భాల్లో …

Read More »

బాప‌ట్ల‌లో ఫ‌లించిన బాబు వ్యూహం.. వైసీపీకి దీటుగా అడుగులు

ఏమాటకామాటే చెప్పుకోవాలి. టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు వ్యూహాలు వేస్తే.. వాటికో ప్ర‌త్యేకత ఉంటుంది. వ్య‌తిరేక‌త‌ను కూడా అనుకూలంగా మార్చుకోగ‌ల నైపుణ్యం ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇటీవ‌ల కాలంలో మ‌రీ ముఖ్యంగా గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న వేసిన కొన్ని వ్యూహాలు విఫ‌ల‌మ‌య్యాయి. అలాగ‌ని.. బాబుకు అస‌లు వ్యూహాలే ప‌న్న‌డం రాద‌ని అనుకోలేం. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణే.. గుంటూరు జిల్లా బాప‌ట్ల అసెంబ్లీ …

Read More »

టీడీపీలో ద‌క్క‌ని ప్రియార్టీ.. ఆ యువ నేత‌కు వైసీపీలో ద‌క్కుతోందే!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణాలు ఎదుర‌వుతాయో.. నాయ‌కులు సైతం చెప్ప‌లేని ప‌రిస్థితి నేటి రాజ‌కీయాల్లో నెల‌కొంది. ఒక పార్టీలో నేత డ‌మ్మీ కావొచ్చు.. మ‌రో పార్టీలో అదే నాయ‌కుడు తురుపు ముక్క కావొచ్చు. వారి వారి వ్యూహాలు.. వ్యక్తిగ‌త అజెండాలు ఒక పార్టీలో ప‌నిచేసే అవ‌కాశం లేక‌పోవ‌చ్చు.. అలాగ‌ని అస‌లు ఆ నేత‌ల‌నుప‌క్క‌న పెట్ట‌డానికి కూడా వీలు లేదు. ఎందుకంటే అదే నేత‌ల‌ను మ‌రో పార్టీ చ‌క్క‌గా వినియోగించుకోవ‌చ్చు. ఈ …

Read More »