Political News

రాజగోపాల్ చెప్పినట్లే జరుగుతోందా?

మునుగోడు ఎంఎల్ఏగా రాజీనామా చేసేటపుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏదైతే చెప్పారో ఇపుడు అదే జరుగుతోందా ? కేసీఆర్ వైఖరి చూస్తుంటే జనాలు అవుననే అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన మూడేళ్ళుగా తన నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం తాను ఎన్ని ప్రతిపాదనలు అందించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రాజగోపాల్ ఆరోపించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనపుడు ఇక ఎంఎల్ఏగా ఉండి ఉపయోగం ఏమిటని అన్నారు. తాను రాజీనామా చేస్తే అన్నా కేసీఆర్ …

Read More »

చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌పాటే..

రాజ‌కీయాల్లో రోజుల‌న్నీ.. ఒకే విధంగా ఉండ‌వు. నిన్న ఉన్న‌ట్టుగా ఈ రోజు.. ఈ రోజు ఉన్న‌ట్టు రేపు కూడా ఉండే అవ‌కాశం లేదు. ఈ విష‌యాన్ని నాయ‌కులు గ్ర‌హించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా.. త‌మ త‌మ విధానాల‌ను మార్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. రాష్ట్రంలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మాత్రం ఇలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. పార్టీ అధినేత  చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నా.. నాయ‌కులు పెడ‌చెవిన పెడుతున్నారు. …

Read More »

మోడీ భయపడుతున్నారా?

బీజేపీలో సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ తో బలమైన బంధాలు కలిగిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అంటే నరేంద్ర మోడీ భయపడుతున్నారా ? పార్టీలో జరిగిన తాజా పరిణామాలు చూసిన తర్వాత సర్వత్రా అదే చర్చ జరుగుతోంది. మొదటి నుండి గడ్కరీ అంటేనే మోడీ కాస్త దూరంగా ఉంటున్నారు. తన మంత్రివర్గంలో గడ్కరీని దూరంగా పెట్టింది లేదు. అలాగని నెత్తినెక్కించుకున్నదీ లేదు. మొత్తం మంత్రివర్గంలో మోడీ తర్వాత అమిత్ షా దే …

Read More »

కేసీఆర్ మీద కేసు పెట్టే ధైర్యముందా?

ఒక వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు వస్తే ఏం చేయాలి ? ఆ ఆరోపణలపై అధ్యయనం చేయాలి. అవినీతి జరిగిందని అనుమానమొస్తే శాఖాపరమైన విచారణ జరిపించాలి. అవినీతి నిర్ధారణైతే వెంటనే సదరు వ్యక్తిపై కేసు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టాలి. మామూలుగా జరిగే విధానమిదే. మరిప్పుడు అలాంటిదేమీ లేకుండా డైరెక్టుగా సంబంధిత శాఖ మంత్రే ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిర్ధారిస్తే ఏమి చేయాలి ? వెంటనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై …

Read More »

అప్పుల్లో కొట్టుమిట్టాడే టాప్ 5 రాష్ట్రాలు

ఆర్థికంగా దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న శ్రీలంక దేశాన్ని బూచిగా చూపిస్తూ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్న ప్రభుత్వాల్ని దెబ్బ తీసేందుకు వీలుగా చేస్తున్న ప్రచారంలో పస లేదన్న విషయం తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఏపీ అధికారపక్షం అనుసరిస్తున్న విధానాల కారణంగా పెద్ద ఎత్తున అప్పులు అవుతున్నాయని.. రాష్ట్రం మరో శ్రీలంక మాదిరి మారుతుందంటూ చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్న విషయం తాజా నివేదిక …

Read More »

వైసీపీ.. పవన్ అదిరిపోయే ట్వీట్!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇటు ఆవేశ‌పూరిత ప్ర‌సంగాలు.. డైలాగులే కాదు.. అటు సోష‌ల్ మీడియా లోనూ దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. రాజ‌కీయంగా ఆయ‌న సంధించే చిన్న‌చిన్న విష‌యాలు.. సంచ‌ల‌నంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ప్ర‌జావ్య‌తిరేక ప్ర‌భుత్వ విధానాల‌పై చురుక్కు-చ‌మక్కు అనిపించేలా.. ప‌వ‌న్ సంధించే కార్టూన్లు.. కామెంట్లు.. అదిరిపోయే రేంజ్‌లో వైర‌ల్ అవుతుంటాయి. నెటిజ‌న్ల నుంచి లైకులు ప‌డేలా చేస్తుంటాయి. స‌మ‌యానికి త‌గిన విధంగా ప‌వ‌న్ స్పందించే తీరుకు.. …

Read More »

టీ-కాంగ్రెస్‌లో `రెడ్ల లొల్లి`.. త‌ప్పెవ‌ర‌ది?

కంచే చేను మేసినచందంగా మారిపోయింది.. తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితి అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. కాంగ్రెస్‌ను కాపాడుతు్న్న‌ది.. కాపాడింది.. కాపాడాల్సింది.. తామే అని తెలిసి కూడా.. కీల‌క మైన రెడ్డి సామాజిక వ‌ర్గం త‌మ‌లో తాము.. కొట్లాడుకొనుడు చూస్తే.. ఇక‌, పార్టీ ప‌ని అంతే! అనే మాటే వినిపి స్తుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్ర విబ‌జ‌న‌కు ముందుకు.. త‌ర్వాత కూడా.. కాంగ్రెస్ పార్టీకి రెడ్డి వ‌ర్గం ద‌న్నుగా ఉంది. ఆది …

Read More »

మోడీ కోట‌రీలో అనూహ్య మార్పు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కోట‌రీ-ఈ మాట వినేందుకు ఒకింత ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది ప‌చ్చినిజం. కేంద్రంలో మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఒక్క ఒక్క అడుగు ముందుకు వేసి.. త‌న‌కు అనుకూలంగా ఉండేవారిని మంత్రి ప‌ద‌వుల్లో నియ‌మించుకున్నారు. త‌ర్వాత‌.. కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఏ ఒక్క‌రైనా త‌న‌కు వ్య‌తిరేకంగా స్వ‌రం విప్పుతార‌ని కానీ.. ఎవ‌రైనా.. త‌న‌కు ఎదురు తిరుగుతార‌ని.. కానీ భావిస్తే.. ముందుగానే వారిని ఏరివేసే క్ర‌తువును ప్రారంభించారు. …

Read More »

ఉచిత ప‌థ‌కాలు.. పార్టీల ఇష్ట‌మే: సుప్రీం కోర్టు

ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీలు ప్ర‌జ‌ల‌కు/ ఓట‌ర్ల‌కు ఇచ్చే ఉచిత ప‌థ‌కాల హామీలు.. సంక్షేమ ప‌థ‌కాల వాగ్దానాల‌పై సుప్రీం కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఉచిత తాయిలాలపై హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిలువరించలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పారు. ప్రజలకు సంక్షేమాన్ని అందజేయవలసిన కర్తవ్యం ప్రభుత్వాలకు ఉందని చెప్పారు. బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణలో తమ వాదనలను …

Read More »

ఒకే వేదిక‌పైకి బాబు, ప‌వ‌న్‌?

మారుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా నాయ‌కులు కూడా మారతున్నారు. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మార్పు త‌థ్య‌మంటూ.. త‌ర‌చుగా నాయ‌కులు ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తాన‌న్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. దానికి అనుగుణంగానే చ‌క్రం తిప్పు తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో టీడీపీ అనూహ్యంగా బీజేపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఈ ప‌రిణామం త‌ర్వాత ఏపీలోను.. అటు ఢిల్లీలోనూ రాజకీయాలు …

Read More »

ఆ విష‌యంలో మోడీని జ‌గ‌న్ ఒప్పించేనా!

ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా..ఏపీలో సంక్షేమ ప‌థ‌కాలు.. ఉచిత ప‌థ‌కాల‌ను విస్మ‌రించే ప్ర‌య‌త్నం కానీ.. సాహ‌సం కానీ.. ఏ ఒక్క పార్టీ చేసే అవ‌కాశం లేదు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అయితే.. ఏకంగా.. సంక్షేమాన్నే ఎన్నిక‌ల మంత్రంగా ప‌ఠిస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి లేకున్నా.. త‌మ‌ను త‌మ ప్ర‌భుత్వాన్ని సంక్షేమ ప‌థ‌కాలే ఆద‌రిస్తాయ‌నే విధంగా సీఎం జ‌గ‌న్ స‌హా వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వేల కోట్ల …

Read More »

ఈసారి కూడా లోకేష్‌ ఓట‌మి ఖాయం: ఏపీ మంత్రి

పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఓర్వలేకపోతున్నా రని, అందుకే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు. బుధవారం ఉదయం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాటలకు, …

Read More »