తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులు ప్రారంభించారు. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఇవి ఏపీలోనే ఉంటాయి. కానీ, కేంద్రం అజమాయిషీలోనే పనిచేస్తాయి. అంటే ఇవి కేంద్ర ప్రాజెక్టులు అన్నట్టు లెక్క! నిజ్జంగా నిజం. కానీ, ఏపీకి ఏదో ఇస్తున్నామని.. ఏపీని వెలిగిపోయేలా చేస్తున్నామని మాత్రం ప్రధాని కలరింగ్ ఇస్తుండడం గమనార్హం. ఇంతకీ మోడీ ఏం ఇచ్చారు.. ఏపీకి ఎంత ప్రయోజనం చూద్దాం.. ప్రాజెక్టు: …
Read More »మోడీ-పవన్.. బాబు-రామోజీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజుల నుంచి కీలకమైన మలుపులు తిరుగుతున్నాయి. జనసేనాని విశాఖపట్నం పర్యటన తర్వాత చంద్రబాబు ఆయన్ని కలవడం రాజకీయంగా వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. పవన్ను జగన్ సర్కారు విశాఖలో తీవ్రంగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు విజయవాడకు వెళ్లడం.. ఇద్దరూ కలిసి విలేకరులతో కలివిడిగా మాట్లాడడం చర్చనీయాంశం అయింది. ఇది తెలుగుదేశం, జనసేన పొత్తుకు సంకేతమని అందరూ భావించారు. కొన్ని రోజులు …
Read More »ఏపీలో సైలెంట్.. తెలంగాణలో వైలెంట్
ఏపీలో ప్రధాని పర్యటించారు.కానీ, ఇక్కడ అవినీతి కానీ, ఇక్కడ ప్రభుత్వ దూకుడు కానీ, కుటుంబ పాలన కానీ, ఆయనకు మచ్చుకైనా కనిపించలేదు. కానీ, ఇలా విశాఖ నుంచి తెలంగాణ గడ్డపై అడుగు పెట్టారో లేదో.. వెంటనే మోడీకి అవినీతి కనిపించింది. కుటుంబ పాలన కనిపించింది.. అంతకు మించి చాలానే కనిపించాయి. దీంతో నెటిజన్లు.. ఏపీలో సైలెంట్.. తెలంగాణలో వైలెంటా.. మోడీ జీ వాటీజ్ దిస్? ! అని కామెంట్లు కుమ్మరిస్తున్నారు. …
Read More »సీఎం జగన్ పై ఫిర్యాదుల పరంపర
విశాఖకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. బీజేపీ కోర్ కమిటీ భేటీలో పాల్గొనటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన దాదాపు తొంభై నిమిషాల పాటు పార్టీ నేతలతో భేటీ కావటమే కాదు.. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలపై చర్చతో పాటు.. ఏపీసర్కారు మీదా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీదా కంప్లైంట్లు చేసిన వైనం తెలిసిందే. ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతల్లో ముగ్గురు నేతలు కీలక భూమిక …
Read More »తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోస్తాం: మోడీ
తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేరు ఎత్తకుండానే సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోస్తామని వ్యాఖ్యానించారు. వాస్తవానకి ఏ నాయకుడైనా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతారు. కానీ ఉన్న ప్రబుత్వాన్ని కూలదోస్తామని ఎవరూ చెప్పరు. కానీ, మోడీ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా విశాఖ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యకర్తలను …
Read More »పవన్పై ఏపీ పోలీసుల కేసు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ పోలీసులు కేసు పెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్లో పోలీసులు శుక్రవారం ఈ కేసు నమొదు చేసినట్టు తెలుస్తోంది. పవన్పై IPC 336, రెడ్విత్ 177MV యాక్ట్ కింద కేసు నమోదు చేయడంగమనార్హం. ఈ క్రమంలో ఆయనకు 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు. అయితే, ఆయన ప్రస్తుతం విశాఖలోనే ఉన్నారు. దీంతో విశాఖకు వెళ్లి నోటీసులు ఇవ్వాలా..? …
Read More »లోకేశ్ పాదయాత్ర.. ఆ రెండే లక్ష్యమా?
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. మాజీ మంత్రి నారా లోకేశ్ పై వచ్చిన విమర్శలు అన్ని ఇన్ని కావు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేకపోయిన వైనం.. ఆయన సామర్థ్యంపై కొత్త సందేహాలకు తెర తీసింది. ప్రత్యక్ష రాజకీయాలతో చట్టసభలకు ఎంట్రీ ఇవ్వని లోకేశ్.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవితో మంత్రిగా బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. అయితే.. చినబాబుకు సామర్థ్యం లేదని.. ఆయన రాజకీయాల్లో …
Read More »కోర్ మీటింగ్ లో మోడీ చెప్పింది ఇదేనా?
ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతలతో కోర్ భేటీ నిర్వహించటం తెలిసిందే. శనివారం పలు కార్యక్రమాల్లోపాల్గొనేందుకు వచ్చిన ఆయన.. ఒక పూట ముందుగా అంటే.. శుక్రవారం సాయంత్రానికి విశాఖకు చేసుకున్న ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కావటం.. అనంతరం ఏపీ బీజేపీ నేతలతో కూడిన కోర్ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు. దాదాపు గంటన్నర పాటు సాగిన …
Read More »మోడీతో భేటీ.. పవన్ ఏం చెప్పారు?
మిత్రుడే అయినా ఎనిమిదేళ్లుగా ప్రధానమంత్రి మోడీకి గుర్తుకు రాని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రెండు.. మూడు రోజుల క్రితం గుర్తుకు రావటం.. అది కూడా తన ఏపీ రాష్ట్ర పర్యటన సందర్భంగా కావటం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇదే విశాఖ నుంచి ఈ మధ్యన వచ్చిన పవన్.. పోలీసుల సూచన మేరకు తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. తాజాగా అదే పోలీసులు ఆయనకు ఎలాంటి ఇబ్బందికర సీన్ ఎదురు …
Read More »బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అలా చేయకూడదట!
తమ్ముడు తనవాడైతే.. అన్నట్టుగా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారం అంటున్నారు ప్రజాస్వా మ్య వాదులు. ఎన్నికలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం స్వయంప్రతిపత్తి(అటానమస్) ఉన్న ఎన్నికల సంఘానిదే. అయినంత మాత్రాన.. ప్రజలకు అసలు సమాచారం అందించకూడదు.. ఏమీ చెప్పకూడదు అనే విశేష అధికారాలను వినియోగించడం.. టీఎన్ శేషన్ వంటి నిఖార్సయిన అధికారి ఉన్నప్పుడు కూడా చేయలేదు. కానీ, ఇప్పుడు మాత్రం తనకు ఉన్న విశేషాధికారాల పేరిట కేంద్ర ఎన్నికల …
Read More »బీజేపీ.. బ్రహ్మస్త్రంగా మోడీ బ్రాండ్
కొన్ని కొన్ని ఆశ్చర్యంగానే ఉంటాయి. నమ్మడానికి కూడా ఒకింత ఇబ్బందిగానే ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే అతి పెద్ద జాతీయ పార్టీ బీజేపీలో కనిపిస్తోంది. కొన్నాళ్ల కిందట వరకు.. ఈ పార్టీలోని నాయకులు వాజపేయి నుంచి అడ్వాణీ వరకు.. అందరూ కూడా.. బీజేపీని చూసి ఓటేయండి.. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలను చూసి గెలిపించండి.. అని పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఆ సేతు హిమాచలం అందరూ కూడా ఇదే నినాదం …
Read More »అమరావతిపై సుప్రీ తాజా ఆదేశం
ఏపీ రాజధాని అమరావతిపై అటు సుప్రీం కోర్టు ఇటు హైకోర్టు ఏకకాలంలో విచారణ జరిపాయి. అమరావతి విషయంపై కొందరు పిటిషన్లు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. మరికొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం రెండు కోర్టుల్లోనూ.. ఈ కేసులు విచారణకు రావడం గమనార్హం. అమరావతి భూముల కోనుగోలు వ్యవహారంపై గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను తదనంతర ప్రభుత్వాలు సమీక్షించవచ్చా? లేదా? అన్న అంశం చాలా పెద్దదని సుప్రీం తెలిపింది. దీనిపైన పూర్తి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates