Political News

మమతకు షాక్ తప్పదా ?

క్షేత్రస్ధాయిలో జరగుతున్న పరిణామాల కారణంగా చాలామందిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపేమో పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ తో సుప్రింకోర్టులో దాఖలైన కేసుపై విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో బెంగాల్లో గొడవలు జరిగాయని, చాలామంది ఆస్తులను, ప్రాణాలను కోల్పోయారని, అత్యాచారాలు కూడా జరిగినట్లు హైకోర్టు నిర్ధారించింది. సో జరుగుతున్నదంతా చూస్తుంటే ఎప్పుడో రోజు మమత బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టేస్తారేమో అనే అనుమానాలు …

Read More »

ఈ సీటును మైనార్టీల‌కు ఫిక్స్ చేసిన బాబు ?

తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆ పార్టీ తరఫున ఎందరో ముస్లిం నాయకులు ఉంటారు. ఇక ఉత్తరాంధ్రాలో తీసుకుంటే విశాఖలో పెద్ద ఎత్తున్ ముస్లింలు ఉన్నారు. వారిలో మెజార్టీ ముస్లింలు విశాఖ సౌత్ లో ఉన్నారు. ఈ సీటు వారికి ఒక విధంగా కంచుకోట అని చెప్పాలి. గతంలో టీడీపీ విశాఖ వన్ గా ఈ స్థానం ఉన్నపుడు మాజీ …

Read More »

జగన్ సర్కారుతో మళ్లీ పవన్‌కు పంచాయితీనే

కొన్ని నెలల కిందట ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజైనపుడు ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లలో టికెట్ల రేట్ల విషయమై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. కొత్త సినిమాలకు టికెట్ల రేట్లు పెంచి అమ్మడం, అదనపు షోలు వేసుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే కానీ.. ఇంకే సినిమాకూ లేని విధంగా ఈ సినిమాకు మాత్రమే ఆ విషయంలో నియంత్రణ తీసుకొచ్చారు అధికారులు. థియేటర్ల మీద దాడులు చేసి దశాబ్దం కిందటి రేట్లతో టికెట్లు అమ్మించారు. మరీ …

Read More »

టీఆర్ఎస్‌లో ఈ నేత‌ల పొలిటిక‌ల్ రూటు ఎటో ?

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ గ‌త ఏడేళ్లుగా ఎంతో మందిని న‌యానో… భయానో పార్టీలో చేర్చేసుకుంటోంది. ప‌ద‌వులు కావాల‌న్న వారికి ప‌ద‌వులు… కాంట్రాక్టులు కావాల‌న్న వారికి కాంట్రాక్టులు.. లొంగ‌ని వారిపై అనేక ఒత్తిళ్లు.. పార్టీ కండువా క‌ప్ప‌డానికి టీఆర్ఎస్ ఇవే ప్ర‌ధాన అస్త్రాలుగా మార్చుకుంది. పార్టీలోకి వ‌చ్చాక కొద్ది నెల‌ల పాటు వీరిని అందలం ఎక్కించ‌డం.. ఆ త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా ప‌క్క‌న పెట్టేయ‌డం కూడా గులాబీ పార్టీలో కామ‌న్ అయిపోయింది. …

Read More »

ఫేక్ కరోనా సర్టిఫికెట్ తో టోకరా.. అఖిల ప్రియ భర్తపై మరో కేసు

మాజీ మంత్రి అఖిలప్రియ కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ఆమె భర్త కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆమె భర్త భార్గవ్ రామ్ పై మరో కేసు నమోదైంది. నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో భార్గవ్‌ రామ్‌తోపాటు ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డిపై నకిలీ కొవిడ్‌ సర్టిఫికెట్‌ కేసు నమోదయింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా నకిలీ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కిడ్నాప్‌ కేసులో నిందితులుగా …

Read More »

వైసీపీలో ఫుల్లు జోష్

వైసీపీ నేతల్లో ఫుల్లు జోష్ కనబడుతోంది. ఈనెల 8వ తేదీన కొన్ని వందలమందికి ఒకేసారి పదవీ యోగం పట్టబోతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు డైరెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయటానికి జగన్మోహన్ రెడ్డి కసరత్తు కూడా పూర్తిచేసేశారట. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఛైర్మన్, డైరెక్టర్ పోస్టులు కలిపి సుమారు 850 వరకు భర్తీ అవనున్నాయట. జగన్ లెక్కప్రకారం ప్రతిజిల్లాకు సగటున 45 పదవులు దక్కాలట. …

Read More »

తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల డేటా తీసిన జగన్

కొద్ది రోజులుగా తెలుగురాష్ట్రాల మధ్య జల జగడాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఒక రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టులపై మరో రాష్ట్రం ఫిర్యాదు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణపై తెలంగాణా ప్రభుత్వం కేంద్రానికి, సీడబ్ల్యూసీతో పాటు కృష్ణా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి)లకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఇదే విధంగా తెలంగాణాలోని అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలపై ఏపి కూడా నరేంద్రమోడి, జలవనరుల శాఖతో పాటు అనేక …

Read More »

జగన్ తప్పు చేస్తున్నాడా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానంగా ఉంది. తెలుగురాష్ట్రాల మధ్య జల వివాదాలు పెరిగిపోతున్న సమయంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలనే డిమాండ్ పెరిగిపోతోంది. ప్రస్తుత సమస్యపై అఖిలపక్ష సమావేశం పెట్టడం ప్రభుత్వానికే మంచిది. అఖిలపక్ష సమావేశంపెట్టి వాస్తవాలను వివరించటం, మద్దతు కూడగట్టడం అధికారపార్టీకి చాలా అవసరం. రాష్ట్రంలో సమస్యలు వచ్చినపుడు రాజకీయపార్టీల్లో ఎవరిది పై చేయి అనే విషయాన్ని తేల్చుకోవచ్చు. కానీ పొరుగు రాష్ట్రంతో అదీ కావాలనే వివాదం …

Read More »

రాజకీయాల్లోకి రానన్న హిమాన్షు.. నెటిజన్ల ట్రోల్స్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు తాను రాజకీయాల్లోకి రానంటూ స్పష్టం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. కాగా… హిమాన్ష్ చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. తాను రాజ‌కీయాల్లోకి రాన‌ని.. జీవితంపై త‌న‌కు ఎన్నో క‌ల‌లు ఉన్నాయ‌ని.. ఎన్నింటినో సాధించాల్సి ఉంద‌ని హిమాన్ష్ చెప్పాడు. కాగా.. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. అస‌లు …

Read More »

జ‌గ‌న్‌తో ఢీ అంటే ఢీ.. మ‌రింత దూకుడు పెంచిన కేసీఆర్‌

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్ని జ‌ల‌వివాదాలు.. మ‌రో టర్న్ తీసుకున్నాయి. ఈ వివాదాన్ని స‌ర్దుమ‌ణిగేలా చేయాల‌ని.. తెలంగాణ స‌ర్కారు భావించ‌క‌పోగా.. ఏపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌పై మ‌రింత రెచ్చిపోతోంది. ఏపీ స‌ర్కారును మ‌రింత ఇర‌కాటంలోకి నెడుతూ.. త‌న ఒంటెత్తుపోక‌డ‌ల‌తో.. ప‌క్కా వ్యూహాల‌తో ముందుకు సాగుతోంది. గ‌డిచిన వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వాట‌ర్ ఇష్యూలు వీరంగం వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేసీఆర్ అనూహ్య నిర్ణ‌యం …

Read More »

హరీష్ కి కూడా నా గతే పడుతుంది.. ఈటల

టీఆర్ఎస్ అగ్రనేత, ఆర్ధిక మంత్రి హరీశ్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో తనపై అవాకులు చెవాకులు మాట్లాడిస్తున్నారని ఈటల ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని రాజేందర్ విమర్శించారు. తాను వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, తనపై కేసీఆర్ కుట్రలు చేశాడని ఈటల ఆరోపించారు. వారి అబద్ధాల పత్రిక, ఛానల్‌లో పదేపదే …

Read More »

వైసీపీ ఎంపీ పై ఐటీ కన్ను..!

వైసీపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పై ఐటీ అధికారుల కన్ను పడింది. ఆయనకు చెందిన ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఐటీ విభాగానికి చెందిన దాదాపు 15 మంది అధికారులు అయోధ్య రామిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలోని రాంకీ గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు గ్రూప్ అనుబంధ సంస్ధల …

Read More »