తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు మునుగోడు ఉపఎన్నిక.. మరోవైపు ముందస్తు ఎన్నికల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోన్న నేపథ్యంలో.. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన మాజీమంత్రి తుమ్మల.. ముందస్తు ఎన్నికల గురించి కార్యకర్తలకు చూచాయగా సిగ్నల్స్ ఇచ్చారు. కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని.. ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చని తుమ్మల వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానన్న తుమ్మల.. ఈసారి …
Read More »ఆ తప్పు ఎవరు చేశారో.. జగన్ చెప్పాలి
పోలవరంపై టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ విమర్శించారు. ప్రజలు నష్టపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, బావర్ వంటి అంతర్జాతీయ సంస్థలకు ఏమీ తెలియదా? అని ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల వచ్చిన నష్టానికి బాధ్యులెవరో నిర్థారించాలని, తప్పు ఎవరిదో సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబు చెప్పాలన్నారు. ఆనాడు డయాఫ్రమ్ వాల్ కట్టాలని చెప్పినోళ్లే.. ఇప్పుడు …
Read More »వైసీపీ మాకు శాశ్వతం కాదు.. : వైసీపీ ఎమ్మెల్యే
వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఒకవైపు.. తీవ్రస్థాయిలో పొలిటికల్ సెగ రాజుకుంది. అధికార పార్టీలో కీలక నాయకులు.. పక్క చూపులు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా..వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదో.. అనే భావన ఉన్నవారు.. ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో రాజకీయాలు మరింత వేడిగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు.. మరింత మంటపుట్టిస్తున్నాయి. కాపు సామాజిక వర్గం ఎక్కువగా …
Read More »కొరివితో తల గోక్కుంటున్న వైసీపీ
రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మామూలే. ఐతే ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసేటపుడు అన్నిసార్లూ గుడ్డిగా ఎదురు దాడి చేయకూడదు. ప్రతి విషయాన్నీ తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూడకూడదు. విషాదంతో, ఎమోషన్లతో ముడిపడ్డ విషయాలను వివాదం చేయాలని చూస్తే బూమరాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేస్తున్నది ఆ కోవలోకే వచ్చేలా ఉంది. ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి మరణం మీద వివాదం రాజేయాలని …
Read More »హమ్మయ్య.. మునుగోడుకు మోక్షం వచ్చిందే!
కొన్ని కొన్ని సార్లు చిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ఎంకి పెట్టి.. సుబ్బిచావు.. అన్నట్టుగా.. కొన్ని కొన్ని కార్యాకారణ సంబంధాలతో ముడిపడి కొనసాగుతాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటన తెరమీదికి వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తాజాగా పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలోకి చేరడానికి ముహూర్తం కూడా ఖాయం చేసుకున్నారు. ఇది రాజకీయ దుమారానికి దారితీసిన విషయం …
Read More »ఎన్టీఆర్ కుమార్తె మరణంపై సాయిరెడ్డి ట్వీట్
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి. విజయసాయిరెడ్డిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆయన మార లేదు.. అని వ్యాఖ్యలు కుమ్మరిస్తున్నారు. అంతేకాదు.. కొందరు అయితే.. మరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. తాజాగా అన్నగారు ఎన్టీఆర్ కుటుంబం లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ప్రజలు సానుభూతి వ్యక్తం చేశారు. అన్నగారి చిన్న కుమార్తె ఉమామహేశ్వరి.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. …
Read More »వైసీపీకి 30 సీట్లకు మించి రావని సర్వేలో తేలిందా?
35.. 50.. 70.. ఈ అంకెలు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని కలవరపెడుతున్నాయి. ఒక్క జగనే కాదు.. వైసీపీ పెద్దలందరూ హడలి పోతున్నారు. ఎందుకంటే ఇవి అంకెలు కాదు, వైసీపీ జాతక ఫలితాలు అంట. ఏంటా ఈ అంకెలు అంటే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓ సర్వే ప్రకారం.. వైసీపీకి 30 సీట్లు కన్నా ఎక్కువ రావని తేలిందట. వైసీపీ సొంత సర్వేలో తేలిన ఈ ఫలితం గోప్యంగా ఉంచుదాం అనుకునేలోపే …
Read More »వైసీపీకి ఓటేయకపోతే పాపం తగులుతుంది: మంత్రి
ఏపీలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న ‘గడప-గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల నాయకులు సర్దిచెప్పి ముందుకెళ్తుండగా.. మరికొన్నిచోట్ల ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల మీరు టీడీపీ పార్టీకి చెందినవాళ్లు కదా.. మీకెందుకు పనులు చేయాలని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఈ గడపగడప కార్యక్రమం అత్యంత రభసగా మారుతోంది. అయితే …
Read More »ఉమా మహేశ్వరి మృతిపై వైసీపీ రాజకీయం
ఈ కలికాంలో రాజకీయాలు ఇంతకన్నా దిగజారవు అనకున్న ప్రతిసారి అంతకు పది రెట్లు దిగజారిపోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయాలలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం…కానీ, వ్యక్తిగత విమర్శలు మాత్రం కచ్చితంగా ఖండించదగ్గవే. తాజాగా ‘హూ కిల్డ్ పిన్ని’ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ట్రెండింగ్ చేస్తున్న ఓ హ్యాష్ ట్యాగ్ నేటి రాజకీయాలు ఎంతకు దిగజారాయో అద్దం పడుతుంది. సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో …
Read More »కోమటిరెడ్డి రాజీనామా.. చివరకు ఏమన్నారంటే!
అనుకున్నదే జరిగింది. గడిచిన నెల, రెండు నెలలుగా.. తీవ్రస్థాయిలో చర్చకు దారితీసిన.. ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఉప ఎన్నిక జరిగితేనే నిధులు వస్తాయని అంటున్నారని, సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏ పార్టీలో …
Read More »జీసస్ క్రిస్టియనే కాదు: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్…ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈయన గురించి పరిచయం అక్కర లేదు. క్రైస్తవ మత ప్రబోధకుడిగా దాదాపు 200 దేశాల్లో ‘మత ప్రచారం’ చేస్తున్నానని చెబుతుంటారు పాల్. ఇక, ఏపీ, తెలంగాణలో ప్రజా శాంతి పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించిన పాల్…తానే కాబోయే సీఎం నంటూ ప్రతి ఎన్నికల ముందు హడావిడి చేస్తూ కావాలసినంత కామెడీని కూడా పండిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా …
Read More »బెజవాడ టీడీపీలో అయోమయం
బెజవాడ టీడీపీలో అయోమయం పెరిగిపోతోంది. ఒకవైపు కేశినేని చిన్ని పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు ఎంపీ కేశినేని నానియే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ చేస్తారంటు ఆయన మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. దాంతో అసలిద్దరిలో వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసేది ఎవరనే విషయంలో పార్టీలోనే అయోమయం పెరిగిపోతోంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇద్దరు కూడా స్వయానా అన్నదమ్ములు కావటమే. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కావటంతోనే ఇద్దరిలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates