రాజకీయాల్లో పార్టీల అధిష్టానాలు ప్రయోగాలు చేయడం అనే ప్రక్రియ సర్వసాధారణం. ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా మార్పులను సంతరించుకుంటూ.. ముందుకు సాగకపోతే.. పార్టీల ఉనికికే ప్రమాదం పొటమరిల్లే పరిస్థితి రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోనూ ఉంది. అందుకే ఎప్పటికప్పడు నవీకరణకు పార్టీలు ప్రధాన ప్రాధాన్యం ఇస్తున్నాయి. రాష్ట్రంలో మరింత భిన్నమైన రాజకీయ వాతావరణం ఉంది. యువ నాయకుడు, వైసీపీ అధినేత జగన్ సీఎంగా ఉన్నారు. ఆయన మంత్రివర్గం సహా పార్టీలోనూ దాదాపు …
Read More »టీడీపీకి ఊహించని షాక్.. గద్దె రాజీనామా
తెలుగుదేశంపార్టీకి ఊహిచని షాక్ తగిలింది. ఎన్టీయార్ పార్టీని పెట్టినప్పటి నుండి పనిచేస్తున్న సీనియర్ నేత గద్దె బాబూరావు ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. బాబూరావు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంఎల్ఏగా పనిచేశారు. ఒకసారి ఎంఎల్సీగా పనిచేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గద్దె విజయనగరం జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరు. అలాగే ఉత్తరాంధ్రలోని పార్టీ బీసీ నేతల్లో కీలకంగా ఉంటున్నారు. అలాంటిది హఠాత్తుగా గద్దె పార్టీకి రాజీనామా …
Read More »ఎన్డీఏకు హ్యాండిచ్చిన అకాలీదళ్ … వైసిపి జాయినవుతుందా?
కేంద్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఇంతకాలం నమ్మకమైన భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చేసింది. వారం రోజుల క్రితం అకాలీదళ్ ఎంపి హరిసిమ్రత్ కౌర్ తన మంత్రిపదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లుకు నిరసనగానే ఆమె కేంద్రమంత్రిగా రాజీనామా చేశారు. అప్పటి నుండి ఎన్డీఏలో అకాలీదళ్ ఎంతకాలం కంటిన్యు అవుతుందనే విషయంపై …
Read More »జనసేన కాస్ట్లీ సైనికులు
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే రూ. 500 చెల్లించాలని డిసైడ్ చేశారు. నిజానికి పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బు చెల్లించాలంటే కష్టమేనేమో. ఎందుకంటే పార్టీ సభ్యత్వానికి రూ. 500 చెల్లించటం బహుశా ఏ పార్టీలోను లేదేమో. మరి ఏ పార్టీలోను లేని విధంగా జనసేనలోనే ఎందుకు పెట్టినట్లు ? ఎందుకంటే సభ్యత్వం తీసుకున్న వాళ్ళంతా కచ్చితంగా భవిష్యత్తుల్లో …
Read More »తనను కేసీఆర్ ట్రాప్ చేశారంటున్న డీఎస్
తెలంగాణ సీనియర్ రాజకీయ నేతగా సుపరిచితుడు..ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరించిన ఆయన ఆచితూచి అన్నట్లుగా మాట్లాడతారు. మిగిలిన వారి మాదిరి తొందరపడటం ఆయనకు అలవాటు ఉంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పుడేం మాట్లాడాలన్న విషయం మీద పక్కా క్లారిటీతో వ్యవహరించటం కనిపిస్తుంది. తాను అన్న మాటల్ని.. అనలేదని.. మీడియాలో తప్పుగా రాసిందన్న ఆరోపణలు డీఎస్ దగ్గర కనిపించవు. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ స్థానం నుంచి అనూహ్యంగా …
Read More »మరో రెండ్రోజుల్లో నాపై దాడి జరగొచ్చు: రఘురామ
కొద్ది రోజులుగా వైసీపీ సర్కార్, సీఎం జగన్ లపై నర్సాపురం ఎంపీ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే పలు విమర్శలు గుప్పించిన రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కూడా కోరారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు, రఘురామ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు …
Read More »విశాఖ విచిత్రం – రామురామంటున్నారు ఆ ఇద్దరు !
వినటానికి విచిత్రంగానే ఉన్న పార్టీలోనే ఈ చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో జిల్లా మొత్తం మీద టిడిపి గెలిచింది వైజాగ్ నగరంలో మాత్రమే. నగరంలోని నాలుగు సీట్లనూ తెలుగుదేశంపార్టీ గెలిచింది. అంటే నగరంలో పట్టున్నట్లు తమ్ముళ్ళు నిరూపించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల తర్వాత రాజకీయంగా టిడిపిలో చాలా మార్పులొచ్చేశాయి. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్రలో కూడా పార్టీ నేతల్లో చీలిక …
Read More »తిరుపతిలో ఇలా చేద్దాం.. చంద్రబాబు అదిరిపోయే ఐడియా!
రాష్ట్రంలో ఉప ఎన్నికకు అవకాశం ఉన్న తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎలా ముందుకు సాగుతుంది? ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఎవరికి అవకాశం ఇస్తుంది? అనే విషయాలు ఇటీవల చర్చకు వస్తున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ ఒంటరి పోరు సాగించాల్సి వచ్చినప్పుడు.. ఈ సీటును సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి ఇచ్చారు చంద్రబాబు. అయితే, ఆమె ఓడిపోయారు. ఇక.. ఇప్పుడు ఏం చేయాలి? …
Read More »పొలిటికల్ పోరులో జనసేన వెనుకబడిందా?
పొలిటికల్ మీటర్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వెనుకబడిందా? గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని పుంజుకునేందుకు ఇతర పక్షాలు ప్రయత్నించిన రీతిలో పవన్ ప్రయత్నించలేదా? పైగా మిత్ర పక్షం బీజేపీతోనూ ఆయన కలివిడిగా ఉండలేక పోతున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. దేవాలయాలపై జరుగుతున్న ఘటనలను టీడీపీ, బీజేపీలు తమకు అనుకూలంగా మార్చుకుని.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించడంతోపాటు.. …
Read More »సంకేతాలు వచ్చేశాయ్.. మాగంటి లైన్ క్లియర్ ?
ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో కీలక నేతగా చక్రం తిప్పుతున్న మాజీ ఎంపీ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం, విస్తృత పరిచయాలు ఉన్న మాగంటి కుటుంబంలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయా యి. ఆయన సైకిల్ దిగుతున్నారనే ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకున్నా.. అలాంటివన్నీ.. బూటకమని, వెబ్ మీడియాకు పనీపాటా లేకుండా రాతలు రాస్తోందని ఈసడించుకున్న టీడీపీలోని ఓ వర్గం.. తాజాగా వెలువడుతున్న సంకేతాలతో షాక్కు గురవుతోంది. అజాత శతృవుగా పేరు తెచ్చుకున్న మాగంటి …
Read More »చంద్రబాబు అడుగుజాడల్లో జగన్ .. గుణపాఠం నేర్చుకోలేదా ?
అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబునాయుడు అడుగుజాడల్లోనే నడుస్తున్నాడా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు చేసిన దానికి జగన్ ఇపుడు చేస్తున్న దానికి కాస్త తేడా ఉన్నా మొత్తం మీద రిజల్టయితే ఒకటే. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదూ. అదేనండి టిడిపి నేతలను వైసిపిలోకి చేర్చుకునే విషయం గురించే ఇదంతా. నిజానికి టిడిపి నేతలను వైసిపిలో చేర్చుకోవాల్సిన అవసరం జగన్ కు ఎంతమాత్రం లేదనే …
Read More »మేం టీఆర్ఎస్ లా కాదు…హరీశ్ కు బాలినేని కౌంటర్
కేంద్రం చేపట్టిన విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విద్యుత్ సంస్కరణలకు ఏపీ వంటి కొన్ని రాష్ట్రాలు సుముఖంగా ఉండగా తెలంగాణతోపాటు మరి కొన్ని రాష్ట్రాలు విముఖంగా ఉన్నాయి. ఆ సంస్కరణలకు అనుగుణంగా ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకుగాను స్మార్ట్ మీటర్లు బిగించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆ విషయంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన …
Read More »