Political News

భారత్‌కు పొంచి ఉన్న మరో వైరస్ గండం

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో, చేస్తోందో చూస్తూనే ఉన్నాం. కొంచెం ముందుగా మేల్కొని భారత్‌లోకి అంతర్జాతీయ ప్రయాణాల్ని ఆపేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. ఇంతగా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేది. ఇన్ని కోట్ల మంది రోడ్డు పాలయ్యేవాళ్లు కాదు. కానీ దాని తీవ్రతను గుర్తించడంలో చాలా దేశాల్లాగే భారత్ కూడా విఫలమైంది. అందుకు భారీ మూల్యమే …

Read More »

టిడిపి, వైసిపిపై బిజెపి కేసులు పెడుతుందా ?

తమపై ఉద్దేశ్యపూర్వకంగా దుష్ర్పచారం చేస్తున్న తెలుగుదేశంపార్టీ, వైసిపిలపై సైబర్ చట్టాల క్రింద కేసులు పెట్టాలని బిజెపి డిసైడ్ చేసింది. తమ పార్టీతో పాటు నేతలపై పై పార్టీలు కావాలనే వాట్సప్, వెబ్ సైట్ల ఆధారంగా బురద చల్లుతున్నట్లు బిజెపి నేతలు మండిపడుతున్నారు. అటువంటి దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. ఇటీవల కాలంలో మిషన్ ఏపి పేరుతో వాట్సప్ లో ఏర్పడిన ఓ గ్రూపు ద్వారా …

Read More »

జగన్ దెబ్బకు కార్పొరేట్ స్కూళ్ళకు గ్రహణమేనా ?

ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతంపై జగన్మోహన్ రెడ్డి పెట్టిన దృష్టి కారణంగా కార్పొరేట్ స్కూళ్ళకు గ్రహణం మొదలైనట్లే ఉంది. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ళ నుండి సుమారు 2.5 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరారు. అలాగే ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు 70 వేల మంది విద్యార్ధులు ప్రైవేటు బాటను వీడి ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరారు. ఈ సంఖ్య ముందుముందు మరింతగా పెరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. …

Read More »

బోర్లు వేస్తున్నారు సరే…మరి వీటిని మరచిపోతే ఎలాగ ?

రాష్ట్రప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రైతులను ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ‘వైఎస్సార్ జలకళ’ అనే పథకాన్ని ప్రారంభించారు. రైతులను ఆదుకునేందుకు ఎన్ని పథకాలు పెట్టినా, ఎంత డబ్బు ఖర్చుచేసినా తక్కువనే చెప్పాలి. తాజాగా మొదలైన పథకంలో భాగంగానే నాలుగు సంవత్సరాల్లో 2 లక్షల బోర్లు వేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బోరు వేసిన చోట నీళ్ళు పడకపోతే ప్రభుత్వమే మరో చోట బోరు వేయిస్తుందని హామీ ఇచ్చింది. ఈ …

Read More »

కీల‌క ప‌థ‌కాల‌కు బ్రేకులు.. జ‌గ‌న్ ముందున్న వ్యూహం ఏంటి?

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం జ‌రుగుతోంది. కీల‌క ప‌థ‌కాలు నిలిచిపోయాయి. ఏం చేయాలన్నా.. ఎక్క‌డ ఎలాంటి బ్రేకు ప‌డుతుందో.. ఎటు వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు చుట్టుముడ‌తాయోన‌ని పార్టీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. నిజానికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి.. ఏడాదిన్నర పూర్త‌యినా.. ఆయ‌న సంక‌ల్పించిన ప‌థ‌కాల‌న్నీ ప‌రిపూర్ణంగా అమ‌లులోకి వ‌చ్చి ఉంటే.. ఇది ప‌దేళ్ల పాల‌న‌తో స‌మాన‌మ‌ని మేధావులు అంటున్నారు. కానీ, అలా సాగ‌డం లేదు.. కొన్ని …

Read More »

అనంత‌పురం టీడీపీలో కాల్వ మార్కు!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి కంచుకోట‌గా ఉన్న జిల్లాల్లో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న జిల్లా అనంత‌పురం. గ‌త ఏడాది జ‌గ‌న్ సునామీలోనూ ఈ జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో సైకిల్ ప‌రుగులు తీసింది. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ధ‌ర్మ‌వ‌రం స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌లో నాయ‌కులు జంప్ చేసేశారు. దీంతో ఇక్క‌డ పార్టీని చ‌క్క‌దిద్ద‌డం అత్యంత అవ‌స‌రం. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. తాజాగా అనంత‌పురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం జిల్లా ఇంచార్జ్‌గా మాజీ మంత్రి …

Read More »

పురందేశ్వ‌రిలో అసంతృప్తి సెగ‌.. రీజ‌న్ ఏంటి?

రాజ‌కీయాల్లో నేత‌ల‌కు చిత్ర‌మైన మ‌న‌స్త‌త్వం ఉంటుంది. ఎలాంటి గుర్తింపు లేన‌ప్పుడు.. త‌మ‌కు అస‌లు గుర్తింపే లేద‌ని వాపోతారు. ఇన్నాళ్ల‌యినా.. పార్టీ మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోలేదు.. అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తారు. పోనీ..పార్టీలు ఏదో ఒక ప‌ద‌వి ఇస్తే.. దాంతో సంతృప్తి చెందే నేత‌లు కూడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఎంత క‌ష్ట‌పడినా ఇంతే గుర్తింపా? అని అని నోరెళ్లబెట్టే నాయ‌కులు కూడా క‌నిపిస్తున్నాయి. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అనే …

Read More »

బాబు నెక్ట్స్ టార్గెట్ ఏంటి? టీడీపీలో చ‌ర్చ‌

రాష్ట్రంలో టీడీపీని గాడిలోకి పెట్టేందుకు.. తిరిగి పుంజుకునేలా చేసేందుకు పార్టీ అధినేత చంద్ర‌బాబు వేసిన అడుగులు ప్ర‌శంస‌నీయంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీకి పార్ల‌మెంట‌రీ జిల్లాల కమిటీల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు.. ఇంచార్జ్‌ల‌ను నియ‌మించ‌డం కూడా మంచి ప‌రిణామ‌మేన‌ని అది కూడా ఎన్నిక‌లు ముగిసిన ఏడాదిన్న‌ర స‌మ‌యంలోనే చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంపై సీనియ‌ర్లు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, ఇదొక్క‌టే స‌రిపోద‌ని.. పార్టీని క్షేత్ర‌స్థాయిలో ప‌రిపుష్టం చేసేందుకు మ‌రింత‌గా ముందుకు …

Read More »

అమరావతి పోరాటంలోకి అశ్వినీద‌త్‌

సినీ నిర్మాత‌, పార్ట్ టైం పొలిటీషియ‌న్ కూడా అయిన అశ్వినీద‌త్ తెలుగుదేశం పార్టీకి గ‌ట్టి మ‌ద్ద‌తుదార‌న్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది అధికారంలోకి వ‌చ్చిన వైకాపా స‌ర్కారు అమ‌రావతి నుంచి రాజ‌ధానిని విశాఖ‌ప‌ట్నానికి త‌ర‌లించ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఓవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి రైతుల కోసం పోరాడుతుంటే అత‌డి అన్న‌య్య‌ మెగాస్టార్ చిరంజీవి వెళ్లి ఏపీ సీఎం జ‌గ‌న్‌ను కల‌వ‌డాన్ని అశ్వినీద‌త్ త‌ప్పుబ‌ట్టిన సంగ‌తి గుర్తుండే …

Read More »

హేమంత్‌ను చంపే వరకు అన్నం తిననని..

పరువు హత్యల కథలు చాలా విన్నాం, ఐతే అగ్ర కులానికి చెందిన ఓ అమ్మాయి.. వేరే కులం అబ్బాయితో వెళ్లిపోయినపుడు ఆమె తండ్రి పగతో రగిలిపోయి దారుణాలకు ఒడిగట్టిన ఉదంతాల్ని పరిశీలిస్తే.. అమ్మాయి తల్లి చాలా వరకు ఇలాంటి దారుణాన్ని వ్యతిరేకించినట్లే వెల్లడవుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో తండ్రి కూతురిని కాదనుకున్నప్పటికీ.. తనతో తల్లి చాటుగా మాట్లాడే ప్రయత్నం చేయడం, కూతురు అల్లుడు బాగుండాలని కోరుకోవడం సహజం. సినిమాల్లో చూసినా, బయట …

Read More »

టిడిపిని ప్రతిపక్షంగా బిజెపి గుర్తించటం లేదా ?

రాష్ట్ర రాజకీయాల్లో విచిత్రమైన పరిస్ధితి కనిపిస్తోంది. వైసిపి అధికారపార్టీ అయితే టిడిపి ప్రధాన ప్రతిపక్షమన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బిజెపి+జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ప్రతిపక్షాల క్రిందే లెక్క. ఓట్లు, సీట్లు లెక్క తీసుకుంటే వీటిల్లో దేనికి కూడా ప్రతిపక్ష హోదా దక్కదు. కానీ వాటితో సంబంధాలు లేకుండా ప్రతిపక్షం ప్రతిపక్షమే అంటే మాత్రం పై పార్టీలన్నీ లెక్కలోకి వస్తాయి. ఇటువంటి నేపధ్యంలోనే బిజెపి నేతల తాజా ప్రకటనలను చూస్తే …

Read More »

నాడు బాబు-నేడు జ‌గ‌న్: వ్యూహం ఒక‌టే పైచేయి ఎవ‌రిది?

ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేయ‌డం అనేది రాజ‌కీయాల్లో కామ‌నే. అయితే, ఈ విష‌యంలో వ్య‌క్తిగ‌తంగా కూడా టార్గెట్లు చేసుకోవ‌డం, పార్టీ అధినేత‌లే.. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించాల‌ని అనుకోవ‌డం, ఒక‌రిని ఓడించాల‌ని మ‌రొక‌రు భావించ‌డం వంటివి.. వైసీపీ-టీడీపీల్లో క‌నిపిస్తున్న ప‌రిణామం. సాధార‌ణంగా.. ఒక పార్టీకి చీఫ్‌గా ఉన్న‌వారిని ఓడించేందుకు ఇత‌ర పార్టీలు సాధార‌ణంగా ప్ర‌త్యేకంగా ల‌క్ష్యాన్ని పెట్టుకోవు. రాజ‌కీయంగా దూకుడు అనేది వేరే శైలిలో ఉంటుంది. కానీ, గ‌త ఐదేళ్ల‌కాలంలో చంద్ర‌బాబు …

Read More »