ఏపీలో రోడ్ల దుస్థితిపై ప్రజల నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పైగా రోడ్ల దుస్థితిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఎదురు దాడి చేయిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజల నుంచి వచ్చే విమర్శలను మాత్రం ప్రభుత్వం ఆపలేక పోతోంది. నాయకులు ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు రహదారుల దుస్థితిపై నిలదీస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ …
Read More »మరింత పెరిగిన గ్యాప్.. కేసీఆర్ పై గవర్నర్ హాట్ కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళసైల మధ్య మరింత గ్యాప్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు అంతర్గతంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని గవ ర్నర్.. రుసరుస లాడుతున్నారు. ఇక, ఆమె గవర్నర్గా కాకుండా.. మోడీ ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేస్తున్నా రనేది కేసీఆర్ భావన. కౌశిక్రెడ్డి వ్యవహారం నుంచి ఇలా.. ఇరు పక్షాల మధ్య దుమారం కొనసాగుతూనే ఉంది. ఇక, రాష్ట్ర హైకోర్టు …
Read More »నిజాలు తెలియాలంటే జగన్ చేయాల్సిన పనేంటి ?
అధికారంలో ఉన్న పార్టీ పై జనాల్లో అసంతృప్తి మొదలవ్వటం సహజం. ఏ ప్రభుత్వం కూడా నూటికి నూరుశాతం జనాలను సంతృప్తి పరచటం సాధ్యం కాదు. సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో అనర్హులకు లబ్ధి అందటం, అర్హులకు అందకపోవటం లాంటివి చాలా సహజం. ఇలాంటి వాటాని ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటే సర్దుబాట్లు చేసుకుని వెళుతుంటుంది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన కూడా జనాల్లో అసంతృప్తి మొదలైంది. మరి జరిగిన …
Read More »జైలుకు వెళ్లి వచ్చిన వారు నీతులు చెబుతారా? : కోమటిరెడ్డి
కాంగ్రెస్ అసమ్మతి మునుగోడు ఎమ్మెల్యే , తెలంగాణకు చెందిన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రెండు విషయాలను క్లియర్గా చెప్పేశారు. తాను పార్టీ మారుతున్నట్టు.. బీజేపీ కండువా వేసుకుంటున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించినట్టే ఖండించి.. సమయం వచ్చినప్పుడు.. పార్టీ మారితే తప్పులేదని చెప్పేశారు. అదేసమయంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. జైలుకు వెళ్లివచ్చిన నేతలతో నీతులు చెప్పించుకునే(ఓటుకు నోటు కేసులో) పరిస్థితిలో తాను లేనని వ్యాఖ్యానించారు. …
Read More »‘జనసైన్యం’ తెలుసుకోవాల్సిన నిజం ఇదే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక లక్ష్యం పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కిం చుకుని అధికారంలోకి రావాలని ఆయన నిర్ణయానికి వచ్చారు. పొత్తులు ఉంటాయా.. ఉండవా.. అనే విషయాన్ని పక్కన పెడి తే.. ఏ రాజకీయ పార్టీకైనా ఉండాల్సిన లక్ష్యం అధికారమే కాబట్టి.. ఆయన పెట్టుకున్న లక్ష్యాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ లక్ష్య సాధనకు కలిసి వచ్చేవారేరీ? అనేదే ఇప్పుడు ప్రశ్న. …
Read More »జగన్కే అభిమానులం.. పార్టీ మారను..
వైసీపీ నాయకుడు.. సీనియర్ పొలిటీషియన్.. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత.. మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో తనపైనా.. తన కుటుంబం పైనా జరుగుతున్న రాజకీయ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను, తన కుటుంబం.. తన సొదరులు కూడా.. వైసీపీ అధినేత, సీఎం జగన్కు అభిమానులమేనని ఆయన చెప్పుకొచ్చారు. తమ కుటుంబంపై వస్తున్న వార్తలను ఇప్పటికైనా కట్టిపెట్టాలన్నారు. గత కొన్నాళ్లుగా.. మాగుంట వ్యవహార …
Read More »రాష్ట్రపతి ఏ చీర కట్టుకోవాలో.. వాళ్లే నిర్ణయిస్తారట!!
నిజంగానే ఇది ఇప్పటి వరకు దేశంలో చాలా మంది తెలియని అతి పెద్ద రహస్యం. ముఖ్యమంత్రులు, ప్రధానులు.. ఏం తినాలో.. ఎటు వైపు వెళ్లాలో.. ఎక్కడ పర్యటించాలో.. వంటివాటిని మాత్రమే అదికారులు నిర్ణయిస్తారని.. ముందుగా.. కొన్ని పదార్థాలపై టెస్టులు కూడా చేస్తారని తెలుసు. కానీ.. రాష్ట్రపతి విషయంలో వీటికి అదనంగా కూడా కొన్ని నిర్ణయాలు అధికారులే తీసుకుంటారనే విషయం.. ఇప్పుడే వెలుగు చూసింది. రాష్ట్రపతి ఏం మాట్లాడాలో.. ముందుగానే రాష్ట్రపతి …
Read More »విలీన మండలాలపై..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో పోలవరం విలీన మండలాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ సర్కారుపై విలీన మండలాల ప్రజలకు నమ్మకం లేదని.. అందుకే వారు తెలంగాణలో కలిసిపోవాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 14 రోజులుగా కరెంట్, నీరు లేక వరద బాధిత ప్రజలు నరకం చూస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో గోదావరి వరదలతో రెండు వారాలుగా ప్రజలు నరకం చూస్తున్నారని అన్న బాబు.. విలీన మండలాల్లో …
Read More »టీడీపీ, జనసేన ఏమి చేస్తాయో ?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి క్లారిటీతో ఉన్నారు. అందుకనే ముగ్గురు అభ్యర్ధులను కూడా ప్రకటించేశారు. మరి ప్రతిపక్షాలు ఏమి చేస్తాయి ? ప్రతిపక్షాలంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రమే అనుకోవాలి. ఎందుకంటే మిగిలిన పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ ఉన్నాయంటే ఉన్నాయంతే. వచ్చే మార్చిలో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ద్వారా భర్తీ చేయాల్సిన మూడు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరాంధ్రలోని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం …
Read More »కేసీయార్ కు ఏపీ బుల్లెట్ ప్రూఫ్
తెలంగాణ సీఎం కేసీయార్ ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఆంధ్రప్రదేశ్ లో రెడీ అవుతున్నాయి. విజయవాడకు సమీపంలోని వీరపనేనిగూడెంలో ఇవన్నీ సిద్ధమవుతున్నాయి. కేసీయార్ భద్రతా చర్యల్లో భాగంగా 8 వాహనాలను బుల్టెట్ ప్రూఫ్ చేయించాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డిసైడ్ చేసింది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కారణంగా వీలైనంత తొందరలో అత్యంత రక్షణగా ఉండే వాహనాలను వెంటనే రెడీ చేయాలని పోలీసులు ఉన్నతాధికారులు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా 8 …
Read More »ఆ సలహాదారుపై జగన్ గుస్సా.. అప్పాయింట్మెంట్ నై!
ఏపీ సీఎం జగన్.. సుమారు 36 మందిని ఏరికోరి సలహాదారులుగా నియమించుకున్న విషయం తెలిసిం దే. వీరిలో తనసొంత మీడియాలో పనిచేసే ఉన్నతస్థాయి ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే.. వీరికి అప్పగించిన పనివిషయంలో వారు సక్సెస్ కాలేక పోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న కథనాలను.. లేదా.. వ్యతిరేకతను అరికట్టేందుకు.. లేదా తగ్గించేందుకు వీరు ప్రయత్నాలు చేయలేక పోతున్నారనేది సీఎం జగన్ ఆవేదనగా ఉందని.. వైసీపీ వర్గాలు ముఖ్యంగా తాడేపల్లిలోని కీలక …
Read More »మీడియా లో కంగారూ కోర్టులు నడుస్తున్నాయ్: జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్
టీవీ ఛానెల్లలో చర్చలు, సామాజిక మాధ్యమాల్లో ‘కంగారూ కోర్టు’ల నిర్వహణ దేశ ప్రజాస్వామ్యానికి హానికరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.మీడియా చర్చలు న్యాయవ్యవస్థ పనితీరు, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయన్నారు. మీడియా వ్యక్తం చేస్తున్న పక్షపాత అభిప్రాయాలు, ప్రత్యేక ఎజెండాతో నడిచే చర్చలు భారత ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి వేసేలా చేస్తున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తంచేశారు. మీడియా ప్రచారం చేస్తున్న ఏకపక్ష అభిప్రాయాలు ప్రజలను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates