ఎంపీని చెప్పుతో కొడతానన్న కవిత

తెలంగాణ‌లో మ‌ళ్లీ రాజ‌కీయ ర‌చ్చ ప్రారంభ‌మైంది. బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ చేసిన కామెంట్లు తీ వ్ర వివాదానికి దారితీశాయి. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కాంగ్రెస్ పార్టీలో చేరేందు కు స‌మాయ‌త్తం అయ్యారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో క‌విత తీవ్ర‌స్థాయిలో స్పందించారు. ఎక్కువ త‌క్కువ మాట్లాడితే నిజామాబాద్ చౌర‌స్తాలోనే చెప్పుతో కొడ‌తా! అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

మీడియాతో క‌విత‌ మాట్లాడుతూ.. పనితీరు, ప్రవర్తన ఈ రెండూ అర్వింద్‌కు లేవన్నారు. మూడున్నరేళ్లలో కేవలం 60 ప్రశ్నలు మాత్రమే అడిగారన్నారు. తాను కాంగ్రెస్‌లో చేర‌తాన‌న్న అర్వింద్ వ్యాఖ్య‌ల‌పై కవిత భావోద్వేగానికి లోనయ్యారు. గద్గద స్వరంతో మాట్లాడారు. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్‌ లో అర్వింద్ ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మోసం చేశాడని రైతులు ఆరోపిస్తున్నారన్నారు. బాండ్‌పేపర్‌ రాసిచ్చిన అర్వింద్‌పై.. ఫిర్యాదు చేస్తామని రైతులు అంటున్నారన్నారు.

“అర్వింద్‌ పై పోటీ చేసిన అభ్యర్థిగా నేనే ఆయన పై ఫిర్యాదు చేస్తా. నేను కాంగ్రెస్‌లోకి వెళ్తానని అసత్యాలు ప్రచారం చేశారు. నా పుట్టుక, బతుకు తెలంగాణ. నేను ఏనాడూ వ్యక్తిగత దూషణలకు పోలేదు. అర్వింద్‌ వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు మానుకోవాలి. ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. నోటికొచ్చినట్లు మాట్లాడితే మెత్తగా తంతాం. నోరు అదుపులో పెట్టుకోకుంటే అర్వింద్‌ను తరిమికొడతాం” అన్నారు.

“కొట్టి చంపుతం బిడ్డ.. రాజకీయం చెయ్‌.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు. అర్వింద్‌ ఎక్కడ పోటీ చేసినా.. వెంటబడి ఓడిస్తా. పసుపుబోర్డ్‌ తేలేని అర్వింద్‌… రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. బాధతో మాట్లాడుతున్నాను.. ప్రజలు తప్పుగా భావిస్తే క్షమించాలి” అని క‌విత‌ పేర్కొన్నారు.