Political News

కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే టైం వచ్చేసిందా?

మనం ఎంత అనుకున్నా.. కొన్నిసార్లు మనకు అంచనా లేని అంశాలు కొన్ని చోటు చేసుకుంటుంటాయి. పరిస్థితులన్ని తమకు అనుకూలంగా ఉన్నాయని.. తమకు తిరుగులేదన్న భావన ప్రభుత్వాల్లో ఉంటుంది. అయితే.. ఊహించని విధంగా చోటు చేసుకునే పరిణామాలతో.. అప్పటివరకు ఉన్న అన్ని అంశాల ప్రాధామ్యాలు ఇట్టే మారిపోతుంటాయి. కరోనా టైంలో రెండు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేయటం ద్వారా.. యావత్ తెలుగు ప్రజలంతా తనను చూసేందుకు.. తన మాటల్ని వినేలా …

Read More »

ట్యాపింగ్ పాపం జగన్కు తెలీదు.. టైమిస్తే మరిన్ని చెబుతాడట

ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ఏపీ అధికారపక్షానికి చెందిన ఆయన.. సొంత పార్టీ మీదనే ఆయన విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెడుతున్నారు. నిత్యం ఏదో ఒక అంశం మీద స్పందించే ఆయన.. తాజాగా ఏపీని ఊపేస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ అంశంపై రియాక్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభుత్వం తక్షణం స్పందించి బాధ్యులపై చర్యలు …

Read More »

తప్పు చేసినట్లు తెలిస్తే చాలు వేటు వేసేస్తున్న సోము

ఆదర్శాలు వల్లించటం ఎవరైనా చేస్తారు. అందులోనూ రాజకీయ నేతల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మాటల్లో కనిపించే పదును చాలామంది నేతల చేతల్లో కనిపించదు. తాజాగా ఆ విషయంలో తనను వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వని రీతిలో వ్యవహరిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇటీవల పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టిన ఆయన.. తప్పు చేసిన వారు సొంత పార్టీ వారైనా అస్సలు ఉపేక్షించటం లేదు. ఇటీవల కాలంలో …

Read More »

2020 – గణేష్ మండపాల్లేని వినాయక చవితి

వినాయకచవితి సమీపిస్తున్న నేపథ్యంలో కొద్దిరోజులుగా ఈ సారి వినాయక చవితి ఉత్సవాలు ఉంటాయా లేదా? అని పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చకు ప్రభుత్వం చెక్ పెట్టేసింది. హైదరాబాదీలకు వెరీవెరీ స్పెషల్ అయిన వినాయకచవితి… కళను కూడా కరోనా పోగొట్టేసింది. గణేష్ పండగ వస్తే పదిరోజుల పాటు గణపతి బప్ప మోరియా అంటూ మారుమోగే నినాదాలు ఈసారి వినలేం. ఎవరిళ్లలో వారు వినాయక చవితి జరుపుకోవాలంటూ…. ప్రభుత్వం అధికారికంగా చెప్పేసింది. కరోనా …

Read More »

ఏపీలో తగ్గిన కరోనా కేసులు… టెస్టులూ తగ్గాయిగా

ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్… ఏపీలో కూడా తనదైన శైలి విశ్వరూపం చూపుతోంది. రోజుకు 10 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్న తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అంతేనా… దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో పదో వంతుకు పైగా కేసులు ఏపీలో నమోదైనవే కావడం గమనార్హం. అలాంటిది ఇప్పుడు ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టుగా కనిపిస్తోంది. రోజూ క్రమం తప్పకుండా ప్రభుత్వం విడుదల చేస్తున్న బులెటిన్ …

Read More »

కోర్టులను తప్పుపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం

వైసీపీ నేతలు మరి తెలిసి చేస్తున్నారో, తెలియకచేస్తున్నారో గాని… పదేపదే కోర్టులను ఇబ్బంది పెట్టేలా, కోర్టులను ఆక్షేపించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 70 సార్లు కోర్టుల్లో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా కేవలం 14 నెలల సమయంలోనే ఇన్ని దెబ్బలు తగిలాయి. ఇక ఇటీవల వరుసగా రంగుల విషయంలో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో వార్నింగ్ లు కూడా వచ్చాయి. రమేష్ కుమార్ కేసు కారణంగా …

Read More »

హీరో రామ్ డేరింగ్… కులంపై సంచలన ట్వీట్

బెజవాడలో కోవిడ్ ట్రీట్ మెంట్ సెంటర్ కొనసాగుతున్న స్వర్ణ పాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం… క్రమంగా కుల జాడ్యంగా మారిపోతున్న వైనం ఆసక్తికరంగా మారింది. రమేశ్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ ఓ కులానికి చెందిన వారని, ఆయన పేరు చివరన చౌదరిని చేరుస్తూ పలు పత్రికల్లో కథనాలు వస్తున్న వైనమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. ఇలాంటి తరుణంలో రమేశ్ సోదరుడి కుమారుడు హీరో రామ్… ఇటీవలే …

Read More »

జడ్జిలతో జగన్ తీరు అలానా? – ఆర్కే రాతలతో కొత్త చర్చ

మీడియా యజమానిగా వ్యవహరిస్తూ.. ప్రతి వారాంతంలో తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ చేయటం ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు అలవాటైన విషయమే. తాజాగా ఆయన రాసిన కొత్త పలుకులోని అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పటికే ఆర్కే తీరుపై కత్తులు నూరుతున్నాయి జగన్ వర్గం. ఇటీవల కాలంలో ఆ పత్రికలో వచ్చిన కథనాలు ఏపీలో పెను సంచలనంగా మారటం.. వీటిపై ఏపీ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. …

Read More »

పాపం జ‌గ్గారెడ్డి..ఆయ‌నే బ‌క‌రా చేసేశాడు

కాంగ్రెస్ పార్టీలో పైర్‌బ్రాండ్ నేత‌గా సుప‌రిచితుడు అయి, అనంత‌రం అధికార టీఆర్ఎస్ పార్టీ పెద్ద‌ల భ‌‌జ‌న కార్య‌క్ర‌మంలో మునిగిపోయిన జ‌గ్గారెడ్డి సొంత పార్టీ నేత‌ల‌కే షాకిచ్చిన సంగ‌తి తెలి‌సిందే. అయితే, పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమారెడ్డిని మాత్రం ఆయ‌న అవ‌కాశం వ‌చ్చిన‌పుడు స‌మ‌ర్థించేవారు పొగిడేవారు. తాజాగా ఆయ‌న‌కు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రూపంలో షాక్ త‌గిలింది. అది కూడా ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా విష‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఒక్క ఆర్టీసీ స‌మ్మె …

Read More »

రేవంత్‌కు కొత్త షాకివ్వ‌బోతున్న కేసీఆర్‌

టీఆర్ఎస్‌ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్ రెడ్డి మ‌ధ్య ఉన్న రాజ‌కీయ విమ‌ర్శ‌ల యుద్ధం గురించి ప్ర‌త్యేకం‌గా ప‌రిచ‌యం అవ‌సరం లేదు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయ‌డంలో రేవంత్ ముందుంటారు. దాన్ని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తుంది. అయితే, తాజాగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు కేసీఆర్ స‌ర్కారుకు కీల‌క అవ‌కాశం దొరికింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే అవినీతి ఎమ్మార్వో …

Read More »

లోక్ సభ సభ్యులు రాజ్యసభలో.. రాజ్యసభ ఎంపీలు లోక్ సభలో?

వినేందుకు విచిత్రంగా అనిపిస్తుందా. కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఇలాంటి సిత్రమైన సీన్ భారత పార్లమెంటులో చోటు చేసుకోనుంది సుదీర్ఘకాలం పాటు సాగే కరోనాతో కలిసి సాగాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిస్తున్నారు. దీంతో.. వర్షాకాల సమావేశాలకు పార్లమెంటు సిద్ధమవుతుంది. నిండుగా కనిపించే సభను ఇప్పటిలా మాదిరి.. తొలిసారి కొత్త విధానంలో తీర్చిదిద్దేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. కరోనా వేళ.. తప్పనిసరిగా పాటించాల్సిన భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా …

Read More »

పేదలకు అండగా నిలిచే రూ.5డాక్టర్ ఇక లేరు

కొద్దిరోజుల క్రితం తమిళ హీరో నటించిన డబ్బింగ్ మూవీ ‘‘ఆదిరింది’’ (తమిళంలో మెర్సెల్) గుర్తుందా? అందులో రూ.5లకే వైద్యం అందించే పాత్ర ఉంది.. గుర్తుకు వచ్చిందా? రీల్ లో కనిపించే ఆ పాత్ర..రియల్ లైఫ్ లోని తిరువేంకటం అనే పెద్దాయన స్ఫూర్తిగా తీసుకున్నారు. అవకాశం లభిస్తే చాలు.. లక్షలకు లక్షలకు దండుకునే వైద్యులు మన చుట్టు ఉన్న రోజుల్లోనే కేవలం రూ.5లకే వైద్యాన్ని అందించే ఆయన తాజాగా కన్నుమూశారు. చెన్నైలోని …

Read More »