Political News

తండ్రి వ్యూహం కొడుకు దగ్గర మిస్సింగ్

క్షేత్రస్ధాయి నుండి అందుతున్న సమాచారాన్ని చూసిన తర్వాత అందరు ఇదే అనుకుంటున్నారు. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ అన్నీ సీట్లలోను ఒంటిరిగా పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేంత వరకు ఎన్డీఏ కూటమిలోనే ఎల్జేపీ కూడా ఉండేది. అయితే కూటమి అధినేత, ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ తో ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కు గొడవలు మొదలయ్యాయి. కారణాలు ఏవైనా …

Read More »

పార్టీ మారి ఈ మాజీ మంత్రి తప్పు చేశారా ?

అవుననే అంటున్నారు మద్దతుదారులు. కడప జిల్లాలోని జమ్మలమడుగులో కీలక నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి విషయం ఇపుడు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. జమ్మలమడుగు అంటేనే అందరికీ ముందు ఫ్యాక్షన్ రాజకీయాలే గుర్తుకొస్తాయి. ఇటువంటి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా టీడీపీలో బాగా పాపులరయ్యారు రామసుబ్బారెడ్డి. 2004 నుండి వరుసగా 2014 వరకు మూడుసార్లు పోటి చేసి ఓడిపోయినా పార్టీపై ఆధిపత్యానికైతే ఎదురులేకుండా పోయింది. అలాంటిది మొదటిసారి …

Read More »

రోజాకు పొలిటిక‌ల్ క‌ష్టాలు

వైసీపీ ఫైర్ బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు పొలిటిక‌ల్ క‌ష్టాలు తీర‌డం లేదు. ఒక‌టి వ‌దిలే ఒక‌టి ఆమెను ప‌ట్టిపీడిస్తున్నాయ‌ని అంటున్నారు ఆమె సానుభూతి ప‌రులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీలో నే ఎగ‌స్పార్టీతో ఎదురీత ఈదారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఓ రేంజ్‌లో దూకుడుగా ముందుకు సాగిన రోజా.. అసెంబ్లీ నుంచి ఏడాది పాటు స‌స్పెన్ష‌న్‌కు కూడా గుర‌య్యారు. జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా అసెంబ్లీలో …

Read More »

పాక్ లో రాజకీయ సంక్షోభం ?

ఎప్పుడూ అస్ధిరంగానే ఉండే దాయాది దేశం పాకిస్ధాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మళ్ళీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పాకిస్ధాన్ లో తాజాగా మొదలైన రాజకీయ సంక్షోభం చివరకు ఇమ్రాన్ మెడకే చుట్టుకుంటోంది. మొదటినుండి కూడా పాకిస్ధాన్ లో ప్రభుత్వాలపై సైన్యానిదే పెత్తనం అన్న విషయం తెలిసిందే. సైన్యాన్ని కాదని ఎవరు ఏమి చేయటానికి వీల్లేదు. పేరుకే ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి కానీ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం మాత్రం సైన్యం …

Read More »

మహారాష్ట్రలోకి సీబీఐకి నో ఎంట్రీ

గుర్తుందా కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐకి అనుమతి నిరాకరిస్తు అప్పట్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సేమ్ టు సేమ్ అదే పద్దతిలో మహారాష్ట్రలో కూడా సీబీఐ ఎంట్రీకి అనుమతిని నిషేధిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ ఏ కేసును కూడా టేకప్ చేసేందుకు లేదు. అయితే ఏదైనా కేసు విషయంలో సీబీఐ మహారాష్ట్రలోకి ఎంటర్ కావాలంటే కేవలం హైకోర్టు లేదా సుప్రింకోర్టు ఆదేశాలతో …

Read More »

రాజధాని అక్రమాలపై సీఐడి విచారణకు అనుమతించిన హైకోర్టు

మొత్తానికి అమరావతి రాజధాని కేంద్రంగా జరిగిన భూ అక్రమాలపై విచారణ జరపాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబునాయుడు హయాంలో అమరావతి రాజధాని నగరం కోసం సేకరించిన భూమిలో తుళ్ళూరులో పనిచేసిన ఎంఆర్వో సుధీర్ బాబు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అప్పటి ఎంఆర్వో మీద వచ్చిన ఆరోపణలపై సీఐడి తో విచారణ కూడా జరిపిస్తోంది. అయితే తనపై విచారణ జరపకుండా సుధీర్ హైకోర్టులో …

Read More »

జగన్ అనే నేను… మీరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఒప్పుకోను

భరత్ అనే నేను… సినిమాను ఏపీ సర్కారు ఫాలో అయిపోయింది. ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి అయిన వెంటనే వాహనదారులకందరికీ పెద్ద షాక్ ఇస్తాడు. లైసెన్సు లేకుండా బండి నడిపినా, నెంబర్ ప్లేటు లేకపోయినా చివరకు రాంగ్ రూట్ లో వెళుతున్న వాళ్ళకి గూబగుయ్యిమనిపించేంతగా ఫైన్లు వేస్తాడు. అదే పద్దతిలో ఇపుడు జగన్మోహన్ రెడ్డి కూడా వాహనదారులకు భారీ ఎత్తున జరిమానాలను విధించేట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా ట్రాఫిక్ …

Read More »

బిహార్ ఎన్నికల బరిలో అంతమంది క్రిమినల్సా?

బిహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నామినేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి రావటమే కాదు.. ఏ పార్టీ నుంచి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది చూసినప్పుడు షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. తొలిదశలో బరిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన 1064 మంది అభ్యర్థుల్లో ఏకంగా 328 మంది మీద క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. అంతేకాదు.. వీరిలో 56 మంది మీద ఐదేళ్లు.. …

Read More »

వైసీపీ.. టీడీపీల‌.. బీసీ రాజ‌కీయం.. మొగ్గెవ‌రికి?

రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు కామ‌న్‌. త‌ల‌త‌న్నే పార్టీకి తాడిత‌న్నేలా వ్యూహం వేయ‌డం.. ముందు కు సాగ‌డం, పైచేయి సాధించ‌డం రాజ‌కీయాల్లో త‌ర‌చుగా చూస్తేనే ఉన్నాం. పోక‌చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా! అనే రేంజ్‌లో పార్టీలు, నాయ‌కులు కూడా వీధి పోరాటాల‌కు దిగ‌డం కామ‌న్‌. ఇక‌, ఇప్పుడు అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీ రెండూ కూడా బీసీ ఓటు బ్యాంకు పై క‌న్నేశాయి. వాస్త‌వానికి ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేక‌పోయినా.. …

Read More »

విద్యాసంస్ధల విషయంలో ప్రభుత్వం చులకనైపోతోందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ నేపధ్యంలో మూతపడిన విద్యాసంస్దలను ఎలాగైనా తెరిపించాలన్న పట్టుదలతోనే ప్రభుత్వం జనాల్లో పలుచనైపోతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ కారణంగా మొన్నటి మార్చి నెలనుండి దేశమంతా లాక్ డౌన్లోకి వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా విద్యాసంస్ధలు కూడా మూసేశారు. ఏపిలో కూడా అప్పుడు మూసేసిన విద్యాసంస్ధలు మళ్ళీ ఇప్పటివరకు తెరుచుకోలేదు. కర్నాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో …

Read More »

కేంద్ర చట్టాన్ని సవాలు చేసిన పంజాబ్ ప్రభుత్వం..రాజీనామాకు రెడీ

అవును కేంద్రప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తెచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాన్ని పంజాబ్ ప్రభుత్వం సవాలు చేసింది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని నిండుసభలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పష్టంగా ప్రకటించారు. చట్టాన్ని అమలు చేసే విషయంలో కేంద్రం తమ ప్రభుత్వాన్ని రద్దు చేసినా పర్వాలేదు కానీ తమ రాష్ట్రంలో మాత్రం రైతు వ్యతిరేక చట్టాన్ని మాత్రం అమలు చేసేది లేదని తేల్చిచెప్పారు. …

Read More »

బీహార్లో ఎన్డీఏ కే పట్టం కడతారా ?

క్షేత్రస్ధాయిలో పరిస్దితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈనెల 28వ తేదీ నుండి వచ్చేనెల 10వ తేదీలోగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అనేక కూటములు, పార్టీలు పోటి పడుతున్నాయి. 243 అసెంబ్లీ సీట్లలో విజయం కోసం ఎన్ని కూటములు, పార్టీలు పోటి పడుతున్నా ప్రధానంగా అధికారంలో ఉన్న ఎన్డీఏ, ప్రధాన ప్రతిపక్షమైన యూపీఏ కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అందరు అంచనాలు వేస్తున్నారు. ఈ …

Read More »