తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్పై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రఘునందనరావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 40 ఎకరాల భూమిని అప్పనంగా 4 వేల కోట్లకుకొట్టేశారని.. రఘునందనరావు సంచలన ఆరోపణలు చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని కూడా ఆరోపించారు. అయితే.. రఘునందనరావు చేసిన ఈ వ్యాఖ్యలపై తోట …
Read More »ఏపీ అధికారులకు జైలు శిక్ష.. మళ్లీ బుక్కయ్యారుగా!
అదేం ఖర్మమో కానీ.. ఏపీ అధికారులు మళ్లీ కోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడడమే కాదు.. మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. ఈ సారి ఇద్దరు కీలక అధికారులకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానాలు కూడా విధించింది. ఆ ఇద్దరూ కూడా విద్యాశాఖకు చెందిన వారే కావడం గమనార్హం. ఒక్కొక్కరికీ నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ. 2000 చొప్పున హైకోర్టు జరిమానా విధించడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్ర …
Read More »బండి సంజయ్.. ఇలా మాట్లాడేంటి?
తెలంగాణలో బీజేపీ ఎదుగుదలలో బండి సంజయ్ పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు. ఆయన మాట తీరు, రాజకీయాల శైలి అందరికీ నచ్చకపోవచ్చు కానీ.. ఆ శైలితోనే పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు. బండి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టాక క్రమ క్రమంగా బలపడుతున్న సంగతి స్పష్టంగా కనిపిస్తోంది. ఐతే కొన్ని విషయాల్లో బండి మాటతీరు మరీ విడ్డూరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆయన మాటల్లో పూర్తిగా కామన్ సెన్స్ లోపిస్తుంటుంది. …
Read More »జీవో నెంబర్ 1 పై సుప్రీం కోర్టుకెందుకో…
టీడీపీకి వస్తున్న జనాదరణను చూసి ఏపీ సర్కారు జీవో నెంబర్ 1ను జారీ చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్ షోలు, సభలు సమావేశాలను నిర్వహించకుండా అడ్డుకునేందుకు ఈ జీవోను ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం తాను మాత్రం మొదటి రోజు నుంచే జీవోను తుంగలో తొక్కతూ ర్యాలీలు నిర్వహించింది. ఈ జీవో చట్ట విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన …
Read More »మోదీ ప్రసంగంలో ఎన్టీయార్ ప్రస్తావన
ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అనేక అంశాలు చర్చించారు. ఈ ఏడాది జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని పార్టీ శ్రేణులకు అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేసింది. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా నిర్ణయించారు. రెండో రోజున మోదీ స్పీచ్లో స్వర్గీయ ఎన్టీయార్ సేవలను ప్రస్తుతించడం మాత్రం హైలైట్. ప్రజాక్షేత్రంలో కింది స్థాయిలో ఎన్టీయార్ పోరాడి అధికారానికి వచ్చారని మోదీ గుర్తుచేశారు. నిత్యం ప్రజలతో …
Read More »పవన్ ముందు అలీ ఎంత…? వైసీపీ ఏం చేస్తోంది…!
వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే..జనసేన అధినేత పవన్పైనే పోటీ చేస్తానని సీనియర్ హాస్య నటుడు, వైసీపీ నాయకుడు, ప్రస్తుతం సోషల్ మీడియా విభాగానికి సలహాదారుగా వ్యవహరిస్తున్న అలీ ప్రకటించారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఇది సంచలన ప్రకటనే అనుకోవాలి. ఎందుకంటే.. ఆయనను రాజ్యసభకు పంపిస్తారని కొన్నాళ్లు చర్చ జరిగింది. అయితే.. అది జరగలేదు. ఈలోగా ఆయనను సలహాదారుగా నియమించారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు అలీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు …
Read More »బీఆర్ఎస్ సభ: కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న జగన్
ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా ఖమ్మంలో నిర్వహించటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయటం తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు బీఆర్ఎస్ నేతలు గడిచిన కొద్దిరోజులుగా భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. 70 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు వచ్చే వారు కూర్చోవటానికే 70 వేల …
Read More »ఆ నియోజకవర్గాల్లో గెలుపును రాసిపెట్టుకోవచ్చా.. టీడీపీ టాక్…!
వచ్చే ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175/175 సీట్లు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. దీనికి దీటుగా చంద్రబాబు కూడా.. 175 రాగం అందుకున్నారు. మేమేం తక్కువ అంటూ.. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం దక్కించుకునేందుకు తమ్ముళ్లు రెడీ కావాలని పిలుపునిచ్చారు. ఇది సాధ్యమేనన్నది చంద్రబాబు టాక్. అయితే.. ఈ క్రమంలో తాజాగా అసలు రాష్ట్రంలో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే నియోజకవర్గాలు ఎన్ని …
Read More »ఎన్టీఆర్ వర్ధంతి.. జగన్ ఇలా చేస్తున్నారు!
దివంగత మహానాయకుడు, తెలుగు వారి అన్నగారు.. ఎన్టీఆర్ వర్ధంతి ఈరోజు. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ.. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతిని ఆర్భాటంగా చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే.. అదే సమయంలో సీఎం జగన్ కూడా తనదైన శైలిలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరగకుండా.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఉమ్మడి …
Read More »నందమూరి కుటుంబానికి చంద్రబాబు ‘సంక్రాంతి’ కానుక..!
నందమూరి కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి కానుక ఇచ్చారా? ఆ కుటుంబంతో ఉన్న రాజకీయ అనుబంధాన్ని మరింత పెంచుకుంటున్నారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నేతలు. కీలకమైన గుడివాడ నియోజకవర్గం టికెట్ను నందమూరి కుటుంబానికి కన్ఫర్మ్ చేసినట్టు పెద్ద ఎత్తున టీడీపీలో చర్చసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు నందమూరి కుటుంబానికి ఈ కానుక ఇచ్చారని మీడియా వర్గాలకు సమాచారం అందింది. దీంతో టీడీపీ శ్రేణు్ల్లో ఉత్సాహం నెలకొంది. వచ్చే …
Read More »బండి సంజయ్కు ఫుల్ మార్క్స్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనూహ్యమైన ఆదరణ దక్కింది. ప్రధాని మోదీ స్వయంగా ఆయన్ను అభినందించడంతో పాటు ఆయన్ను చూస్తే వెంకయ్యనాయుడు గుర్తొస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. సోమవారం ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో బండి సంజయ్ తెలంగాణలో పార్టీ పనితీరును వివరించడమే కాకుండా తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి నివేదిక సమర్పించారు. దాంతో ప్రజాసంగ్రామ యాత్ర …
Read More »వైసీపీకి 40-50 సీట్లే.. ఆ ఎంపీగారి జోస్యం అదిరిందిగా!!
వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని.. వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ నాయకులకు లక్ష్మణ రేఖ, నిర్దిష్ట లక్ష్యం కూడా ఇచ్చారు. అంటే.. రాష్ట్రంలోని 175/175 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని జగన్ భావిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటికే ‘వైనాట్ 175’ నినాదంతో జగన్ ముందుకు సాగుతున్నారు. దీనిని నాయకులు కూడా నెమ్మదిగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు అదే వైసీపీ ఎంపీ.. రెబల్ నాయకుడు, కనుమూరి రఘురామకృష్ణరాజు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates