ఔను! ఇప్పుడు ఏపీ అధికారపార్టీలో ఎమ్మెల్యేలకు.. టికెట్ల దడ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటే.. అంత ఈజీయేమీ కాదని..సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజల మధ్య ఉండాలని.. వారి కష్టాలు తీర్చాలని.. వారి సమస్యలపై పోరాటం చేయాలని.. ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు.. నిత్యం గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. ఈ క్రమంలో నేతలకు సహజంగానే ఆందోళన కమ్మేసింది. అయితే కొందరు మాత్రం.. ఇంకా ఆలోచిస్తున్నారు. కానీ, వచ్చే …
Read More »Jr NTR – అమిత్ షా భేటీ.. కొడాలి నాని కామెంట్
హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు.. అమిత్ షా.. నోవాటెల్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఇది.. కేవలం అభినందన మీటేనని అంటుంటే.. విశ్లేషకులు సహా పలువురు రాజకీయ నేతలు మాత్రం హైదరాబాద్ లోని సెటిలర్లను తనవైపు తిప్పుకొనేందుకు బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్గా చెబుతున్నారు. అయితే.. దీనిపై తాజాగా …
Read More »భేటీలో ఏమి జరిగిందో ?
రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ ఊరికే కలవరు. ఇపుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా-జూనియర్ ఎన్టీయార్ మధ్య భేటీ ఇందుకే ఆసక్తిగా మారింది. ఆదివారం రాత్రి ఒక హోటల్లో వీళ్ళిద్దరు సుమారు 45 నిముషాలు విందు సందర్భంగా భేటీ అయ్యారు. వీళ్ళతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణా పార్టీ చీఫ్ బండి సంజయ్ కూడా ఉన్నారు. అయితే భోజనం అయిపోయిన తర్వాత అమిత్, జూనియర్ 20 నిముషాలు ఏకాంతంగా …
Read More »జగన్ ఢిల్లీ టూర్.. కీలక పరిణామాలు ఏంటి?
ఏపీ సీఎం జగన్ అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లారు. ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగానే.. ప్రధాని.. జగన్కు సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏం చర్చించుకు న్నారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కేంద్రం ఎలాంటి సంచలన నిర్ణయాలు కూడా లేవు. పైగా రాష్ట్ర పతిఉప రాష్ట్రపతి ఎన్నికలు కూడా ముగిసిపోయాయి. ఈ క్రమంలో జగన్ అవసరం కేంద్రానికి పెద్దగా లేదు. ఇక, జగన్కు …
Read More »ఇంతకీ పవన్ శతృవులెవరు?
తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకమాటన్నారు. అదేమిటంటే వైసీపీని ఓడించటానికి తన శతృవులతో కూడా కలుస్తానని. ప్రస్తుతం ఏపీ రాజకీయ పార్టీలను తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని మాత్రమే పవన్ శతృవుగా భావిస్తున్నారు. మరి జగన్ ని ఓడించటానికి అవసరమైతే శతృవుతో కూడా చేతులు కలుపుతానని అనటం ఏమిటి ? పవన్ కు జగన్ కాకుండా ఇంకా శతృవులున్నారా ? ఇపుడీ విషయంపైనే చర్చలు మొదలయ్యాయి. …
Read More »జగన్.. లిక్కర్ కింగ: కేంద్ర మంత్రి
రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రస్థాయిలో నిప్పు లు చెరిగారు. యువత జీవితాలతో ఆడుకునే గంజాయిపై సీఎం ఉక్కుపాదం మోపకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన జగన్కు జీఎస్టీ కంటే జేఎస్టీ ట్యాక్స్పైనే ఎక్కువ ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ అడ్డగోలుగా …
Read More »కేసీఆర్ రాజకీయం ఔట్: అమిత్ షా
తెలంగాణలోని మునుగోడు అభివృద్ధికి మోడీ సర్కారు కట్టుబడి ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మునుగోడులో నిర్వహించిన బీజేపీ సమరభేరిలో పాల్గొన్న అమిత్షా.. ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కాషాయ కండుపా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజగోపాల్రెడ్డిబీజేపీలో చేరడం అంటే ఒక నాయకుడు చేరినట్లు కాదని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇదే నాంది అని వివరించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ వచ్చి తీరుతుందని ఉద్ఘాటించారు. …
Read More »రామోజీతో భేటీ.. జూనియర్తో డిన్నర్..
తెలంగాణలోని కీలకమైన మునుగోడు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికలకు సంబంధించి.. నిర్వహించి సభ నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులతో భేటీ అవ్వాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మునుగోడు సభ ముగించుకున్న అమిత్షా కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. ఫిల్మ్సిటీలో రామోజీరావుతో అమిత్షా భేటీ అయ్యారు. మర్యాదపూర్వక భేటీనేనని బీజేపీ చెబుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో …
Read More »జగన్ భయపడేది ఒక్క నరేంద్ర మోడీకి మాత్రమే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో నివ్వెర పోయేలా రాజకీయాలు మారతాయని.. అన్నారు. తాజాగా ఆయన ఏపీలోని జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో జగన్ను గద్దె దింపే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలో అందరూ నివ్వెరపోయేలా పరిణామాలు ఉంటాయని తెలిపారు. విగ్రహాలు, రథాలు ధ్వంసంపై బీజేపీ పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. రాయలసీమ యాత్ర …
Read More »అవసరమైతే.. శతృవులతోనూ కలుస్తాం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అహర్నిశలూ కృషి చేస్తామని చెప్పారు. విధ్వంసకర పాలనను అరికట్టేందుకు అవసరమైతే.. ప్రత్యర్థి పార్టీలతోనూ, శతృవులతోనూ కలుస్తామని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అవసరాన్ని బట్టి.. ప్రజల సమస్యలను బట్టి.. ఒక్కొక్కసారి శతృవులతోనూ కలిసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని పవన్ …
Read More »తోకపార్టీగా మిగిలిపోవటం ఖాయమా?
వామపక్షాల్లో పోరాట స్పూర్తి తగ్గిపోయినట్లే ఉంది. ఎప్పుడైతే పెద్ద పార్టీలతో పొత్తులు పెట్టుకోవటం మొదలుపెట్టారో అప్పుడే వామపక్షాల పతనం మొదలైంది. అధికారంలో ఉండే కాంగ్రెస్, టీడీపీ లేదా టీఆర్ఎస్ తో పొత్తులకు అర్రులు చాచారో అప్పటినుండే ప్రజాసమస్యలపై పోరాటాలను పక్కనపెట్టేశారు. ఎంతసేపు అధికారంలో ఉన్నపార్టీతో లాలూచీ రాజకీయాలు, లాబీయింగ్ తో వ్యక్తిగత లబ్దికి పాకులాడటం మొదలుపెట్టారో అప్పుడే జనాల్లో కూడా వామపక్షాలపై నమ్మకం పోయింది. ఇపుడు ఇదంతా ఎందుకంటే మునుగోడు …
Read More »కేసీఆర్ ఎందుకు వెనకాడినట్లు?
అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే మునుగోడు ఉప ఎన్నిక బహిరంగ సభ జరిగింది. ఈ సభలో స్వయంగా కేసీఆర్ పాల్గొన్నారు. ఎటూ బహిరంగ సభకు వస్తున్నారు కాబట్టి అభ్యర్ధిని ప్రకటిస్తారని అందరు ఎదురుచూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసేశారు. పావుగంట సేపు మాట్లాడిన కేసీయార్ అభ్యర్ధి గురించి అసలు ఏమీ ప్రస్తావించలేదు. టీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించమన్నారే కానీ పలానా అభ్యర్ధిని పోటీలోకి దింపుతున్నట్లు చెప్పలేదు. అభ్యర్ధిని పరిచయం చేయటానికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates