విజయవాడ ఎంపీ కేశినేని నాని తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆయన ఎప్పుడు టీడీపీని తిడుతున్నారో.. ఎప్పుడు చంద్రబాబుతో కలిసి నడుస్తున్నారో.. అసలు ఆయన ఏం చేస్తున్నారో.. అర్థం కాక పార్టీ నాయకులు, ఆయన అనుచరులు కూడా తీవ్ర స్థాయిలో తర్జన భర్జన పడుతున్నారు. తాజాగా మరోసారి టీడీపీ అధిష్టానంపై నాని మండిపడ్డారు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదని, విజయవాడ టీడీపీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి …
Read More »మనోహర్ సక్సెస్ అవుతారా ?
ఇపుడు సమస్యంతా అటు తిరిగి ఇటుతిరిగి నాదెండ్ల మనోహర్కి చుట్టుకునేట్లుంది. తెలుగుదేశంపార్టీ-జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయమైపోయింది. ఇద్దరు అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించటమే మిగులుంది. దాని తర్వాత అంకం ఏమిటంటే పోటీచేసే సీట్లసంఖ్య తర్వాత ఆ నియోజకవర్గాలు ఏవనేవి. ఇక్కడే సమస్య మొదలవ్వబోతోంది నాదెండ్లకు. జనసేనలో పవన్ తర్వాత అంతటి ముఖ్యస్ధానం నాదెండ్లదే అనటంలో సందేహంలేదు. కాబట్టి ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలన్నా తిరుగులేదు. కానీ …
Read More »కేసీయార్ కు కుమారస్వామి షాకిచ్చారా ?
కర్నాటకలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తాజాగా బీజేపీ నేతలతో జేడీఎస్ ముఖ్యులు సమావేశమయ్యారట. కర్నాటక ఎన్నికల్లో ఎదురైన ఘోరపరాజయంతో జేడీఎస్ కుంగిపోయింది. దాన్నుండి బయటపడేందుకు బీజేపీతో చేతులు కలిపి ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమైంది. నరేంద్రమోడీ పరిపాలనను ప్రతిపక్షాలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ చీఫ్ దేవేగౌడ్ అభినందించారు. ఒడిస్సా రైలు దుర్ఘటనలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పాత్రలేదు కాబట్టి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని …
Read More »నారా లోకేష్.. మిషన్ రాయలసీమ.. పెద్ద ప్లానింగే !
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా ‘మిషన్ రాయలసీమ’ ప్రకటించారు. ప్రస్తుతం కడప జిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్.. ఇప్పటికే సీమలో కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాయలసీమ సమస్యలకు పరిష్కారం చూపుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామో వివరిస్తూ.. మిషన్ రాయలసీమ పేరుతో హామీల వరద పారించారు. ఇవీ.. హామీలు.. …
Read More »రెజ్లర్ పట్టుదలకు కేంద్రానికి మైండ్ బ్లాంక్
రెజ్లర్ల పట్టు దెబ్బకు కేంద్ర ప్రభుత్వం విలవిల్లాడిపోయింది. దాదాపు 50 రోజుల పాటు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లను వేరే దారి లేక చివరకు కేంద్ర మంత్రి చర్చలకు పిలిచారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు చర్చలు జరిపారు. వీళ్ళ డిమాండ్లలో చాలా వాటికి మంత్రి అంగీకరించటంతో ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇంతకీ వీళ్ళ డిమాండ్లు ఏమిటంటే తమను లైంగికంగా వేధిస్తున్న రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, …
Read More »కేసీయార్ లో అయోమయం పెరిగిపోతోందా ?
అధికార బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టికెట్ల విషయంలో కేసీయార్ ఒక్కోసారి ఒక్కోలాగ మాట్లాడుతున్నారు. ఒకసారేమో సిట్టింగులందరికీ మళ్ళీ టికెట్లిస్తానని ప్రకటించారు. టికెట్లు దక్కుతాయో లేదో అనే భయం వద్దని అందరికీ టికెట్లు గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. అందరు నియోజకవర్గాల్లో పర్యటించి గెలుపుకోసం పనిచేసుకోమని భరోసా ఇచ్చారు. దాంతో అందరు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే కొద్దిరోజులుగా మంత్రులు, ఎంఎల్ఏలతో …
Read More »చంద్రబాబు సీఎం కాదు.. ఇప్పుడు ఇంత ఖర్చు ఎందుకు?
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రస్తుతం ఎన్ఎస్జీ భద్రత ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా ఇటీవల కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యంగా ఢిల్లీలో ఇటీవల రాష్ట్ర పోలీసులు చంద్రబాబుకు భద్రత కల్పించారు. ఇదిలావుంటే, రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు పర్యటనలలో రాళ్లు విసురుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పటికి నాలుగు ప్రాంతా ల్లో చంద్రబాబు పర్యటనపై రాళ్లు కురిశాయి. ఇదంతా వ్యూహాత్మకంగా చేసిందేనని టీడీపీ …
Read More »టీడీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ కామెంట్స్
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని, జగన్ తన సర్కారును రద్దు చేసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నార ని.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జగన్ ఢిల్లీ పర్యటనలో(పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని పురస్క రించుకుని) ఉన్న సమయంలోనే ఈ వార్తలు హల్చల్ చేశాయి. అయితే.. తాజాగా ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ఊహాగానాలకు తెరదించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని …
Read More »వివేకా దారుణ హత్యలో నిందితులు ఊహించని ట్విస్ట్ ఇది
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయన దారుణ హత్యకు ముందు రాసిన లేఖ నిజాలు చెప్పనుంది. ఈ లేఖలో దాగిన నిగూఢ వేలిముద్రలున్నాయేమో గుర్తించడానికి దాన్ని నిన్హైడ్రిన్ పరీక్షకు పంపాలన్న సీబీఐ అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఆమోదం తెలిపింది. లేఖను పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపాలంటూ సీబీఐ దాఖలు …
Read More »నువ్వు నన్ను-నేను నిన్ను: బైడెన్-మోడీ రాజకీయం
ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికాకు, భారత్కు మధ్య కొన్ని కొన్ని విషయాల్లో సారూప్యత కనిపిస్తోంది. నువ్వు నన్ను పొడిగితే.. నేను నిన్ను పొగుడుతా! అన్న క్విడ్ ప్రోకో పొగడ్తలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే.. వాస్తవానికి అక్కడ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అదనపు అప్పు కోసం కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీంతో మొత్తానికి తంటాలు పడి …
Read More »ఏపీలో చీకట్లు.. కేసీఆర్ కు గట్టి కౌంటర్ పడాల్సిందేనట
ఎవరికి వారు వారి గొప్పల గురించి చెప్పుకోవటం తప్పేం కాదు. ఆ క్రమంలో ఎదుటోళ్ల మనసుల్ని గాయపరిచేలా.. చిన్నబుచ్చేలా మాట్లాడటంలో అర్థం లేదు. కాంగ్రెస్ అధినేత్రిగా వ్యవహరించిన సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన విభజన తీరులో ఏపీకి అన్యాయం.. తెలంగాణకు న్యాయం జరిగేలా చేయటం.. అదే విషయాన్ని పరోక్షంగా కేసీఆర్ తన మాటల్లో ప్రస్తావించటం తెలిసిందే. వాస్తవానికి ఒక రాష్ట్రాన్ని …
Read More »కాంగ్రెస్ ఊపందుకుంటోందా?
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో కాంగ్రెస్ మంచి ఊపుమీదుంది. సీనియర్ నేతలిద్దరూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరటం ఖాయమైపోయినట్లే. ఈ నెల 20 లేదా 25వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఆ సభకు పార్టీ అగ్రనేతలు రాహుల్ , ప్రియాంక గాంధీలను రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. పొంగులేటి, జూపల్లి పార్టీలో చేరిక సందర్భంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates