ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో గార్డెన్ సిటీ బెంగళూరు మహానగరం నీటి ఎద్దడితో విలవిలలాడుతోంది. 500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మహానగరానికి ఇప్పుడు ఎదురైన నీటి సమస్య ఎంత ఎక్కువగా ఉందంటే.. మహానగరంలోని టెకీలంతా ఇంటి బాట పట్టేసి.. వర్కు ఫ్రం హోం మొదలు పెట్టేశారు. అపార్టుమెంట్లు ఇప్పుడు ఖాళీ అయిన పరిస్థితి. జనాబా రీత్యా దేశంలో మూడో అతి పెద్ద నగరంగా పేరున్నప్పటికీ.. అందుకు తగ్గట్లుగా …
Read More »‘క్షమించండి.. నేనొక్కడినే వెళ్లి చేరిపోతా’
ఏపీ అధికార పార్టీ వైసీపీలో చేరిక విషయంపై కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా మరో లేఖ సంధించారు. ఆయన తాజాగా రాసిన లేఖ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నేను రమ్మన్నానని.. చాలా మంది వచ్చేందుకు రెడీ అయిపోయారు. అయితే, ఇంత మంది వస్తే.. అక్కడ(తాడేపల్లి) ఏర్పాట్లు చేసేందుకు ఇబ్బంది అవుతుందంట. అందుకే మీరెవరూ రావొద్దు.. నేనే వెళ్లి జాయిన్ అయిపోతాను. అని …
Read More »భలే ట్విస్ట్.. ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్లు విశాఖలో
భారతీయులే కాక ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూసే టోర్నీ.. ఇండియన్ ప్రిమియర్ లీగ్. అంతర్జాతీయ టోర్నీలు, సిరీస్లను మించి ఈ వార్షిక లీగ్కు ఆదరణ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఆదరణ ఉన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ 17వ సీజన్తో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఏటా ఏప్రిల్ మొదటి వారంలో మొదలయ్యే టోర్నీ.. ఈసారి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్చి 22నే ఆరంభం …
Read More »ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ దారుణ హత్య.. చెత్తకుప్పలో శవం
దేశం కాని దేశంలో తెలంగాణకు చెందిన మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను దారుణంగా చంపేసిన హంతకులు.. శవాన్ని చెత్తకుప్పలో పూడ్చి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ కు చెందిన మాదగాని బాల్ శెట్టిగౌడ్ కుమార్తె చైతన్య.. తన భర్త అశోక్ రాజ్ తో కలిసి విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలో గల …
Read More »పార్టీల్లో మార్పులు సరే.. కేడర్ కలిసివస్తుందా? బిగ్ డౌట్?
పార్టీకైనా కేడర్ అత్యంత కీలకం. నాయకులు పుట్టుకురావొచ్చు. కానీ, వారు కూడా కేడర్ నుంచే కొన్ని కొన్ని సందర్బాల్లో కనిపిస్తారు. లేదా వారసులు వస్తున్నారు. కానీ, కేడర్ను పుట్టించడం అనేది ఒక్కసారి కోల్పోయాక.. పార్టీలకు చాలా కష్టం. దీనిని పెంచుకునేందుకు నాయకులు ప్రయాసలు పడుతున్న విషయం తెలిసిందే. అందుకే .. ఇటీవల కాలంలో అన్ని పార్టీలూ.. కేడరే తమకు ప్రాణమని.. ప్రదానమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి.. …
Read More »రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాదీ మృతి
రెండేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తాజాగా ఘోరం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఒకరు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహ్మద్ అఫ్సాన్ (30) అనే యువకుడు ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అఫ్సాన్ మృతి విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. అఫ్సన్ ను హెల్పర్ ఉద్యోగం కోసం ఏజెంట్లు …
Read More »డార్లింగ్ అని పిలిస్తే..జైలుకేనట!
డార్లింగ్…..సాధారణంగా చాలామంది తమ స్నేహితులను, సన్నిహితులు, ప్రేమించేవారిని పిలిచే పిలుపు. ఇక, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ అని పేరుంది. ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ ని, కొంతమంది కో స్టార్స్ ని ప్రేమగా, అభిమానంగా డార్లింగ్, డార్లింగ్స్ అని సంబోధిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తో పాటు డార్లింగ్ అని పిలిచే చాలామందికి కోర్టు షాకిచ్చింది. అపరిచితులను డార్లింగ్ అని పిలవకూడదంటూ కలకత్తా …
Read More »బైబై జాబితాలో బైజూస్?
ఆన్లైన్ కోర్సులతో విద్యార్థులను ఆకట్టుకున్న బైజూస్ సంస్థ.. మూసేసేందుకు రెడీ అయిందా? ఇక, బైబై చెప్పడం ఒక్కటే మిగిలి ఉందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ సంస్థకు మూలిగేనక్కపై తాడిపండు పడిన చందంగా ఈ సంస్థలో భారీ పెట్టుబడి పెట్టిన ఆస్ట్రేలియాకు చెందిన గ్లోబల్ సంస్థ తన మొత్తం పెట్టుబడిని 98 శాతం వెనక్కి తీసేసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో ఇక, బైజూస్ …
Read More »ఆంధ్రా అబ్బాయి…అగర్తల అమ్మాయి
ఈ గ్లోబల్ జమానాలో ప్రేమలు రాష్ట్రాలే కాదు దేశాలే కాదు ఖండాలు దాటుతున్నాయి. స్వచ్ఛమైన ప్రేమ కోసం యువతీ యువకులు ప్రపంచపు సరిహద్దులు చెరిపేస్తున్నారు. ప్రేమకు కులమతాలు..జాతి..అడ్డుకావని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రా అబ్బాయి, అగర్తలా అమ్మాల ప్రేమ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఈ పెళ్లికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ …
Read More »ఏపీ రాజధాని అమరావతే.. రెండో మాటే లేదు..
“ఏపీ రాజధాని అమరావతే. దీనినే మేం అంగీకరిస్తున్నాం. ఇక్కడి రైతులకు మద్దతు ఇస్తున్నాం. మేం అన్ని విషయాలను గమనిస్తున్నాం“ అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీలో పర్యటించిన ఆయన విజయవాడలో బీజేపీ నేతలు నిర్వహించిన సమయన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలకమైన రాజధాని అంశంపై ఆయన ప్రధానంగా మాట్లాడారు. “ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధాని విషయంలో స్పష్టమైన సమాచారం …
Read More »కేజీ చికెన్ రూ.300 దాటేసింది.. .అసలు కారణమిదే!
చికెన్ ధర కొండకెక్కింది. చూస్తుండగానే కేజీ చికెన్ ధర రూ.300 దాటేసింది. ఎందుకిలా? అంటే.. ఒక్కసారిగా విరుచుకుపడిన అనేక సమస్యలు దీనికి కారణంగా చెప్పాలి. చికెన్ ప్రియులకు షాకిచ్చేలా మారిన ఈ ధరల దెబ్బకు జేబులు చిల్లులు పడుతున్నాయి. ఏపీలో పెరిగిన చికెన్ ధరల కారణంగా తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇటీవల కాలంలో ఏపీలో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. దీనికి తోడు వేసవి కాలం కావటంతో ఉత్పత్తి …
Read More »పరువు పోయింది.. అయినా అదే వరస
ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఒక ఎక్స్ట్రా ప్లేయర్ను మైదానంలో క్యాజువల్గా మందలించడం అతడి కెప్టెన్సీకే ఎసరు తేవడం.. తనతో ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) పెద్దలు అవమానకరంగా వ్యవహరించిన తీరుపై అతను పెట్టిన పోస్టు నేషనల్ లెవెల్లో దుమారం రేపింది. మైదానంలో సరిగా ఫీల్డింగ్ చేయకపోతేనో, ఇంకేదో తప్పు చేస్తేనో అప్పుడున్న ఆవేశంలో ఒక మాట అనడం మామూలే. విరాట్ …
Read More »