ఇప్పటి వరకు రాజకీయం కొన్ని రంగాలకే పరిమితమైంది. అయితే.. తాజాగా క్రికెట్లోనూ ఏపీ నేతల జోక్యం పెరిగిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ క్రికెట్ హనుమ విహారీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్తోపాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో ఏపీ నేతల పాత్ర పెరిగిపోయిందని హనుమ విహారీ వ్యాఖ్యానించాడు. ఏపీకి చెందిన ఓ రాజకీయ నేత(విజయసాయిరెడ్డి అనే ప్రచారం ఉంది) జోక్యం కారణంగా తాను తీవ్రంగా …
Read More »డ్రైవర్లు దిగారు.. రైలు వెళ్లిపోయింది
పంజాబ్లో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవరు లేని ఒక గూడ్స్ రైలు వంద కిలోమీటర్ల వేగాన్నందుకుని పట్టాల మీద దూసుకెళ్లగా అదృష్టవశాత్తూ ఆ మార్గంలో ప్రయాణికులున్న ఏ రైలూ రాకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అతి కష్టం మీద ఆ రైలుకు అడ్డుకట్ట వేసిన రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సంచలనం రేపిన ఈ ఉదంతం గురించి తెలుసుకుందాం పదండి. జమ్ము కశ్మీర్లోని కథువా రైల్వే స్టేషన్లలో 53 …
Read More »మీ ఆయనకు నెలనెలా 5 వేలు ఇవ్వండి: కోర్టు తీర్పు
“మీ ఆయనపై మీరు చేసిన ఆరోపణలు.. నిజం కాదని తేలిపోయింది. ఆయన మిమ్మల్ని హింసించడం కాదు.. మీరే ఆయనను మానసికంగా హింసించారు. దీనికి పరిహారంగా.. ఆయన కు నెలనెలా 5 వేల చొప్పున భరణం చెల్లించండి. ఇదే ఫైనల్“- అని ఓ భార్యకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో సదరు భార్య బిక్క మొహం వేసుకుని కోర్టునుంచి బయటకు వెళ్లిపోయింది. ఏం జరిగింది? వివాహితుల …
Read More »రైతు ఉద్యమం: పోలీసుల కాల్పులు.. ఒక రైతు మృతి
వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఇస్తున్న కనీస మద్దతు ధరలకు చట్ట బద్ధత కల్పించాలని.. రైతులకు, కూలీలకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. దేశ రాజధాని ఢిల్లీ చలోకు పిలుపునిచ్చిన రైతు ఉద్యమం… రక్త సిక్తమైంది. హరియాణ, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో యువ రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో రైతులు తిరగుబాటు చేశారు. చేతికి అందివచ్చిన వస్తువుతో పోలీసులపై దాడులు ముమ్మరం చేశారు. …
Read More »క్రికెట్ విరాట్ కోహ్లీ.. డీప్ఫేక్ వీడియో.. కలకలం!
డీప్ఫేక్ వీడియోలు ప్రముఖులను కలవరానికి గురి చేస్తున్నారు. ఈ బాధితుల్లో ప్రధాన మంత్రి నుంచి క్రీడాకారుల వరకు.. చివరకు నటుల వరకు ఎవరినీ ఫేక్ మాయగాళ్లు వదిలి పెట్టడం లేదు. కృత్రిమ మేథ సాయంతో రూపొందిస్తున్న ఈ డీప్ ఫేక్ వీడియోలపై సర్వాత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి సంబంధించిన డీప్ పేక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ బెట్టింగ్ యాప్ను …
Read More »పార్టీ సభ్యుడి కామెంట్లపై త్రిష సీరియస్
ఆ మధ్య సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ లియో సినిమాలో త్రిషతో నటించడం గురించి అభ్యంతరకరమైన కామెంట్లు చేసి దుమారం రేపడం చూశాం. ఆమెకు మద్దతుగా మాట్లాడినందుకు చిరంజీవి, ఖుష్భూ తదితరుల మీద కేసు పెట్టి కోర్టు చేత చీవాట్లు తిన్న ఘనత కూడా ఇతనికే చెల్లింది. అభిమానులతో సహా ఈ విషయంలో ప్రేక్షకులందరూ త్రిషకు పూర్తి మద్దతు తెలిపారు. పొన్నియిన్ సెల్వన్ నుంచి వరస అవకాశాలతో త్రిష బిజీగా …
Read More »నోట్ల కట్టలు.. కిలోల కొద్దీ బంగారం: లేడీ ఆఫ్ కరప్షన్
గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి వారి సేవలో తరించాల్సిన ఓ మహిళా అధికారి.. తన సంక్షేమం చూసు కున్నారు. అందిన కాడికి వసూలు చేసుకున్నారు. సహజంగా మహిళా అధికారులు అంటే.. లంచాలకు, ప్రలోభాలకు దూరంగా ఉంటారనే రికార్డులు ఉన్నాయి. కానీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి మాత్రం నిఖార్సయిన లంచావతారానికి ప్రతిరూపంగా నిలిచింది. సోమవారం ఆమె కార్యాలయంపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. 84 వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా …
Read More »సింహాలకు అక్బర్-సీత పేర్లు.. కోర్టుకెక్కిన వీహెచ్పీ
వీహెచ్పీ.. విశ్వహిందూపరిషత్. ఈ పేరు వింటే.. అంటే కూడా.. వివాదాలకు కేంద్రం. నచ్చకపోయినా.. ఇది నిజం. ఇప్పుడు మరోసారి ఇది నిజమైంది. సింహాలకు పేర్లు పెట్టడాన్ని.. వీహెచ్పీ నిరసిస్తోంది. అంతేకాదు.. కోర్టుకు కూడా వెళ్లింది. ఈ చిత్రమైన వివాదం.. ఫైర్బ్రాండ్ నాయకురాలు.. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఇదీ.. వివాదం! పశ్చిమ బెంగాల్లో అటవీ శాఖ అధికారులు రెండు సింహాలను ఎన్ క్లోజర్లో పెట్టారు. ఇది …
Read More »అప్పుడు ఉల్లి.. ఇప్పుడు వెల్లుల్లి.. పొలాలకు కెమెరాలు!
గత ఏడాది ఇదే సమయంలో ఉల్లిపాయల ధరలు ఆకాశానికి అంటాయి. కిలో 100 కు చేరుకున్నాయి. అయితే.. ఇప్పుడు నిత్యావసరాల్లోముఖ్యంగా కూరల్లో రుచి కలిగించే కీలకమైన వెల్లుల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో 550 వరకు చేరుకున్నాయి. దీంతో సాధారణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అయినా.. తప్పదు కదా.. అని అంతో ఇంతో కొని.. వాడుతున్నారు. ఈ ధరలు మరో నాలుగు మాసాల వరకు అంటే.. కొత్త పంట చేతికి ఇబ్బడి …
Read More »పీచు మిఠాయి అమ్మినా, తిన్నా నేరమే !
పీచు మిఠాయి. ఈ పదార్థం గురించి తెలియనివారు ఉండరు. తిననివారు అంతకన్నా ఉండరు. అయితే, ఇప్పుడు హఠాత్తుగా పీచు మిఠాయి వార్తల్లోకి వచ్చింది. రావడమే కాదు.. సంచలనంగా మారింది. అదేసమయంలో ప్రజల్లోనూ భయానికి కారణమైంది. దీనికి రీజన్.. పీచు మిఠాయి తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట! అంతే.. ఈ విషయం బయటకు రాగానే తమిళనాడు ప్రభుత్వం వెంటనే దీనిపై నిషేధం విధించింది. పీచు మిఠాయిని తయారు చేసినా.. …
Read More »ఢిల్లీ రణరంగం.. కళ్లు, కాళ్లు, చెవులు పోగొట్టుకున్న రైతన్నలు!
దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారులన్నీ.. యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ బారికేడ్లు, ఆధార్ కార్డుల వెరిఫికేషన్.. వాహనాల విస్తృత తనిఖీలతో పాకిస్థాన్ సరిహద్దులను దాదాపు మరిపిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చే కనీస మద్దతు ధరలకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని.. స్వామి నాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. పంజాబ్, హరియాణ, ఢిల్లీ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రభుత్వం మాత్రం వారిని ఎక్కడికక్కడ అడ్డుకునే …
Read More »సింహంతో సెల్ఫీ.. తర్వాత ఘోరం.. తిరుపతిలోనే!
సెల్ఫీ మోజు ఓ యువకుడుని అర్ధంతరంగా బలి తీసుకుంది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూపార్కుకు వచ్చిన ఓ యువకుడు.. అందరితోపాటు.. జంతు ప్రదర్శన శాలలో తిరిగాడు. ఇంతలో చుట్టుపక్కల ఉన్న జంతువులతో కొన్ని సెల్ఫీలు తీసుకున్నాడు. కానీ, చిత్రంగా ఏంటంటే.. ఆ కుర్రాడు వాటితో సంతృప్తి చెందలేదు. కొంత దూరంలో ఉన్న ‘లయన్ ఎన్ క్లోజర్’లోకి వెళ్లాడు. వాస్తవానికి లయన్ ఎన్ క్లోజర్లోకి ఎవరినీ అనుమతించరు. తాజాగా లయన్ ఎన్ క్లోజర్లోకి …
Read More »