Trends

ఐపీఎల్ ఫైనల్.. ఈ రెండు జట్లపైనే అందరి ఫోకస్

ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుతున్న వేళ, ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారుతోంది. అయితే అత్యద్భుత ఫామ్‌లో ఉన్న రెండు జట్లు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), ముంబై ఇండియన్స్ ఫైనల్లో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండూ తమ తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే, అభిమానుల కల నిజమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్‌సీబీ టేబుల్ టాపర్‌గా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 10 …

Read More »

IPL 2025: సెంచరీతో చుక్కలు చూపించిన 14 ఏళ్ళ వైభవ్

సూర్యవంశీ వైభవ్.. వయసు 14 సంవత్సరాల 32 రోజులు (2011 మార్చి 7).. బీహార్ కు చెందిన ప్లేయర్. అండర్ 14 ఆడాల్సిన సమయంలో అండర్ 19కి వెళ్లి హాట్ టాపిక్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ అతన్ని 1.1కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు IPL లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన 3వ మ్యాచ్ కే సెంచరీ పూర్తి చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు …

Read More »

యుద్ధ వాతావరణంలో భారత్ పవర్ఫుల్ డీల్

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, భారత రక్షణ వ్యూహానికి మరో భారీ బలం జతకానుంది. భారత్ సముద్ర పరిరక్షణ సామర్థ్యాన్ని పెంచే దిశగా ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం కుదిరింది. రఫేల్ మెరైన్ (Rafale Marine) యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి సుమారు రూ.63,000 కోట్ల విలువైన ఈ డీల్‌పై సోమవారం అధికారికంగా సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం, భారత నౌకాదళానికి 22 సింగిల్ …

Read More »

సెలబ్రిటీ షోల మీద పెహల్గామ్ ప్రభావం

తలుచుకుంటే చాలు మనసంతా బాధతో నిండిపోయే పెహల్గామ్ దుర్ఘటన తాలూకు విషాదం ఇప్పుడప్పుడే మనల్ని వీడిపోయేలా లేదు. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు నివాళిగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు జనం నుంచి మంచి మద్దతుని తీసుకొస్తున్నాయి. దీని ప్రభావం సెలబ్రిటీల షోల మీద తీవ్రంగా పడుతోంది. యుకెలో మే 4 మరియు 5 తేదీల్లో భారీ లైవ్ కన్సర్ట్ ఒకటి ప్లాన్ చేశారు. టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి. సల్మాన్ ఖాన్, …

Read More »

అమ్మానాన్నల పై ట్రాక్టర్ ఎక్కించి చంపేశాడు

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ పరిధిలోని నడుపూరి కల్లాలు గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు చేసిన దారుణం సభ్య సమాజాన్ని భయ కంపితులను చేస్తోంది. కనిపెంచిన తల్లిదండ్రులనే కడతేర్చిన ఇతడిని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదు. నవ మాసాలు మోసిన తల్లి ఓ వైపు, పెంచి పెద్ద చేసి ఓ ప్రయోజకుడిని చేసిన తండ్రి మరోవైపు… వారిద్దరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే… ఈ …

Read More »

మొబైల్ ఫోన్ సిగ్న‌ల్స్‌ ప్ర‌దాత.. రంగ‌న్ మృతి!

Kasturirangan death news

నేడు దేశంలో 60-70 శాతం మంది ప్ర‌జ‌లు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ల‌కు సిగ్న‌ల్స్ అందించే ఉప‌గ్ర‌హ ప్ర‌యోగాల‌కు.. ఆద్యుడు.. భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగాల్లోనే సువ‌ర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన క‌స్తూరి రంగ‌న్‌.. ఉర‌ఫ్ కృష్ణ‌స్వామి క‌స్తూరి రంగ‌న్ ఇక లేరు. 84 ఏళ్ల వ‌య‌సులో బెంగ‌ళూరులో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం.. 1 గంట‌కు ఆయ‌న క‌న్నుమూశారు. గ‌త కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న రంగ‌న్‌.. ఓ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. 1940, అక్టోబ‌రు …

Read More »

యూట్యూబ్ ఆదాయానికి కోత‌… సంచ‌ల‌న నిర్ణ‌యం?

అమెరికాకు చెందిన ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా మాధ్య‌మం యూట్యూబ్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. అన్ని దేశాల‌పై సుంకాలు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సొంత దేశానికి చెందిన యూట్యూబ్ ద్వారా.. విదేశీయులు.. భారీ ఎత్తున సొమ్ములు సంపాయిస్తున్నార‌ని.. త‌ద్వారా.. అమెరికాను అడ్డుపెట్టుకుని సంపాదిస్తున్నార‌ని.. ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు.  “ప్ర‌పంచ వ్యాప్తంగా నిరుద్యోగాన్ని త‌గ్గించ‌డంలో అమెరికా ప్ర‌త్యామ్నాయ …

Read More »

5 రోజులు గూగుల్ లో వెతికి మరీ భర్తను చంపేసింది

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య అందరిని ఉలిక్కిపడేలా చేసింది. 68 ఏళ్ల వయసులో ఉన్న భర్తను చంపటం ఒక ఎత్తు అయితే.. అందుకు అనుసరించిన కిరాతక తీరు అందరిలోనూ కొత్త ప్రశ్నలు తలెత్తేలా చేసింది. ఈ హత్యకేసులో కీలక నిందితురాలైన భార్య పల్లవి తీరుపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాల్ని గుర్తించారు. భర్తను చంపటానికి …

Read More »

పహల్గామ్‌ ఉగ్రదాడి.. TRF వెనకున్నది ఎవరు?

పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడి వెనుక ఉన్నది తామేనంటూ TRF (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ప్రకటించుకోవడంతో, ఈ సంస్థ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ దాడిలో 25 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో ‘టీఆర్ఎఫ్’ గురించి మరోసారి చర్చ మొదలైంది. అసలు ఈ టీఆర్ఎఫ్ ఎవరు? దీని వెనుక ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2019 ఆగస్టులో …

Read More »

బంగారం భ‌గ‌భ‌గ‌… రేట్లు తగ్గేది అప్పుడేనా??

ప‌సిడి ప‌రుగులు పెడుతోంది. క్షిప‌ణి వేగాన్ని మించిన ధ‌ర‌ల‌తో దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నిన్న  మొన్న‌టి వ‌ర‌కు 10 గ్రాముల ధ‌ర రూ.70-80 వేల మ‌ధ్య ఉంటే.. గ‌త నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.ల‌క్షకు చేరింది. కీల‌క‌మైన అక్ష‌య తృతీయను పుర‌స్క‌రించుకుని అంతో ఇంతో బంగారం కొనుగోలు చేయాల‌ని అనుకున్న వారికి ఉసూరు మ‌నిపిస్తూ.. మంగ‌ళ‌వారం నాటికి ఇది రూ.102000ల‌కు …

Read More »

ఫిక్సింగ్ వాదనలతో రాజస్థాన్ కలకలం.. అసలేమైంది?

ఐపీఎల్‌ 2025లో ఓ మ్యాచ్‌ ఫలితం చుట్టూ బిగుసుకున్న వివాదం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం చెందడం తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించాయి. గెలవాల్సిన మ్యాచ్‌ను ఎలా చేజార్చుకుంది? ఆఖరి ఓవర్లలో నడిచిన విధానం ఏమిటి? అనే సందేహాలతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక కన్వీనర్ జయదీప్ బిహానీ …

Read More »

సర్వమతాలను గౌరవించిన క్యాథలిక్ పోప్‌ కన్నుమూత

ప్రపంచంలోని 120 కోట్లకుపైగా క్రైస్తవులకు మతపరమైన మార్గదర్శకుడిగా నిలిచిన పోప్ ఫ్రాన్సిస్‌ ఇక లేరు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 గంటలకు ఆయన వాటికన్ నగరంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యుమోనియా, కిడ్నీ సంబంధిత అనారోగ్యాలతో పోప్‌ తీవ్రంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరిన ఆయన, 38 రోజుల చికిత్స అనంతరం ఇటీవలే డిశ్చార్జ్ …

Read More »