Trends

చైనా డీప్‌సీక్‌కు మరో చైనా మోడల్ పోటీ…

చైనాలో కృత్రిమ మేధస్సు (AI) పోటీ రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. టెన్సెంట్ తాజాగా విడుదల చేసిన హున్యూయాన్ టర్బో S మోడల్ దీన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ మోడల్ ప్రస్తుతానికి అత్యంత వేగంగా స్పందించగలిగే మోడల్‌గా టెన్సెంట్ ప్రకటించింది. ముఖ్యంగా డీప్‌సీక్ R1 వంటి మోడళ్లతో పోలిస్తే టర్బో S మరింత త్వరగా స్పందిస్తుందని కంపెనీ చెబుతోంది. గణితశాస్త్రం, లాజికల్ గా చెప్పడం వంటి విభాగాల్లో దీని …

Read More »

ఇక స్కైప్ వీడియో కాల్స్ లేనట్టే…

ఇప్పుడంటే వాట్సాప్ అందుబాటులో ఉంది కానీ, ఒకప్పుడు వీడియో కాల్స్ అనగానే స్కైప్ పేరే గుర్తుకు వచ్చేది. మొదట్లో వీడియో కాలింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులను తెచ్చిన స్కైప్‌కు ఇప్పుడు ముగింపు సమయం వచ్చినట్లు తెలుస్తోంది. పోటీ ప్రపంచంలో నిలవలేకపోతున్న స్కైప్ విషయంలో ఎన్నోసార్లు మైక్రోసాఫ్ట్ మెరుగుపరిచే ప్రయత్నాలు చేసినా, ఈసారి ఎలాంటి అప్‌డేట్ లేకుండా నేరుగా తెరమూసినట్లు అనిపిస్తోంది. మే నెల నుంచే స్కైప్ పూర్తిగా నిలిపివేయనున్నట్లు లేటెస్ట్ …

Read More »

అత్యంత ఎత్తైన రోడ్డుపై మంచు కింద చిక్కుకున్న 47 మంది

ఉత్తరాఖండ్ లో హిమపాతం భారీ ఉత్పాతాన్ని సృష్టించింది. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా పరిధిలోని మన పాస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్వహణలో ఉన్న ఈ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఓ పెను ప్రమాదం సంభవించింది. రహదారి మరమ్మతు పనుల్లో దాదాపుగా 57 మంది కూలీలు నిమగ్నమై ఉండగా.. హిమపాతం విరుచుకుపడింది. ఆ మంచు దెబ్బకు కార్మికులంతా చెల్లాచెదురు …

Read More »

ఇడ్లీ సాంబార్ అమ్మటం వల్లే గోవాకు విదేశీయులు రావట్లేదు

గోవాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారటంతో పాటు.. మరీ ఇంత అతి అవసరమా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన గోవా పర్యాటకానికి దెబ్బ పడిందని..గతంలో పోలిస్తే విదేశీ టూరిస్టులు రావటం తగ్గినట్లుగా పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. విదేశీ పర్యాటకులు రాకపోవటానికి కారణం.. బీచ్ …

Read More »

రోహిత్.. నెక్స్ట్ మ్యాచ్ కష్టమేనా?

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన సెమీఫైనల్ బెర్త్‌ను ఇప్పటికే ఖాయం చేసుకున్నా, లేటెస్ట్ గా ఒక విషయం జట్టును కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తొడ కండరాల గాయానికి గురైన కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో లీగ్ చివరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేనా? లేదా విశ్రాంతి తీసుకుంటాడా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. రెండు రోజుల విరామం అనంతరం బుధవారం భారత జట్టు తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. …

Read More »

రీల్స్ కోసం మరొక యాప్.. ఇన్‌స్టాగ్రామ్ స్ట్రాటజీ ఏంటి?

సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ షార్ట్ వీడియో ఫీచర్ ‘రీల్స్’ కోసం ప్రత్యేకంగా ఓ కొత్త యాప్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మెటా అధినేత అడమ్ మోస్సెరి తన సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఓ నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా, టిక్‌టాక్‌ భవిష్యత్తుపై అమెరికాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్‌ను మెటా ప్రణాళికాబద్ధంగా అమలు చేసే అవకాశముంది. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే రీల్స్ ద్వారా టిక్‌టాక్‌కు …

Read More »

ఫైనల్‌లో ఇండియాను ఓడిస్తానన్నావ్? ఇప్పుడేమైంది?

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోర పరాజయం ఎదురైంది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో 8 పరుగుల తేడాతో పరాజయం పాలవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఇబ్రహీం చాడ్రాన్ 177 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడటం ఆఫ్ఘనిస్తాన్ విజయంలో కీలకంగా మారింది. 325 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 317 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో వాళ్ల …

Read More »

వీడియో: 3 సెకండ్ల వ్యవధిలో ప్రమాదాన్ని తప్పించిన పైలెట్

ఇటీవలి కాలంలో అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా గత నెల రోజుల క్రితం మూడు విమాన ప్రమాదాలు అమెరికాను షాక్ కు గురి చేసింది. ఈమధ్య కాలంలో ఎప్పుడూ చూడనంత ప్రాణనష్టం కూడా జరిగింది. అయితే రీసెంట్ గా అమెరికాలోని చికాగో మిడ్వే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒక ప్రయాణికుల విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో అనుమతి లేకుండా …

Read More »

పిల్లల సాక్ష్యం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

న్యాయపరంగా పిల్లల సాక్ష్యం ఎంత వరకు నమ్మదగినదో అనే అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన హత్య కేసులో ఏడేళ్ల బాలిక ఇచ్చిన సాక్ష్యాన్ని న్యాయస్థానం ప్రామాణికంగా గుర్తించి, నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ కేసులో ముద్దాయి తన భార్యను హత్య చేసినప్పుడు చిన్నారి అక్కడే ఉండగా, ఆమె చెప్పిన వివరాలను తొలుత హైకోర్టు తోసిపుచ్చింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం చిన్నారి వాఖ్యలను పరిగణనలోకి తీసుకుని …

Read More »

భారత్‌లో ప్రమాద ఘంటికలు… టాప్-3లో స్థానం!

భారతదేశంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించిందని తాజా నివేదికల్లో వెల్లడైంది. 2024లో ఏకంగా 111 AQI స్కోర్‌తో భారత్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇక 140 AQIతో బంగ్లాదేశ్ తొలి స్థానంలో ఉండగా, 115 AQIతో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. దీనితో భారతదేశం కూడా అత్యంత కాలుష్య ప్రభావిత దేశాల జాబితాలో …

Read More »

పట్టుకుంటే ఊడిపోయే జుట్టు.. అసలు కారణమిదే..

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇటీవల ఊహించని పరిణామం సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది తల వెంట్రుకలు ఒక్కసారిగా రాలిపోవడం ప్రారంభమైంది. ఈ పరిస్థితి 18 గ్రామాల్లో 279 మందిని ప్రభావితం చేసింది. ఆడవారు, పిల్లలు, వృద్ధులు ఇలా అందరూ ఈ సమస్యతో సతమతమవుతుండగా, అసలు కారణం ఏమిటో అర్థం కాక కొన్నాళ్ళు ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రభావితుల తల వెంట్రుకలు, రక్త నమూనాలను …

Read More »

భూమిని ఢీకొట్టే గ్రహశకలం.. మరో క్లారిటీ ఇచ్చిన నాసా

ఇటీవల అంతరిక్ష పరిశోధకులు భూమి వైపుగా దూసుకొస్తున్న 2024 వైఆర్ 4 అనే గ్రహశకలాన్ని గుర్తించారు. ఈ గ్రహశకలం 2032లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా మొదట హెచ్చరించింది. దాని ప్రకారం, ప్రాథమిక విశ్లేషణలలో ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశాలు 3.1 శాతంగా ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ సమాచారం బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. తర్వాతి రోజుల్లో నాసా మరిన్ని పరిశీలనలు చేపట్టి, ముప్పు …

Read More »