ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి అయితే హైదరాబాద్ పోలీసులు అయితే చలానాలు వేయటం, లేదంటే పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారుల్ని ఆపి.. వారి చేత ఫైన్లను క్లియర్ చేస్తుంటారు. కానీ.. బెంగళూరు పోలీసులు కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఒక స్కూటర్ మీద ఏకంగా 311 కేసులు నమోదయ్యాయి. ఇంత భారీగా ట్రాఫిక్ నిబంధనల్ని …
Read More »చాట్ జీపీటీ-డీప్ సీక్లకు దూరం: కేంద్రం ఆదేశాలు!
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని కొన్ని అయితే.. ఇప్పటికే ఆ సేవలను అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలావుంటే.. నిన్న మొన్నటి వరకు చాట్ జీపీటీ అందరికీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దీనిని కొన్నాళ్లుగా వినియోగిస్తున్నారు కూడా. అయితే.. దీనికి పోటీగా చైనా తీసుకువచ్చిన డీప్-సీక్ ఇప్పుడు మరింత …
Read More »ట్రంప్ న్యూ ట్విస్ట్: గాజా భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలిచిన ట్రంప్, తాజాగా ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యపై సంచలన ప్రకటన చేశారు. గాజాను తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఆయన ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. పాలస్తీనియన్లకు పునరావాసం కల్పించిన అనంతరం గాజాపై నియంత్రణ సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో …
Read More »ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…
ఇండియా – పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లు అమ్మకానికి పెట్టిన క్షణాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయాయి. ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే 1.5 లక్షల మందికి పైగా ఫ్యాన్స్ …
Read More »దొంగోడి లవ్.. ప్రేయసికి గిఫ్ట్ గా రూ.3 కోట్ల ఇల్లు..
బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే దొంగను ఇటీవల మడివాళ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన అతడు తన చిన్నతనం నుంచే దొంగతనాలు చేస్తూ బడా క్రిమినల్గా మారాడు. అయితే అతడి కేసులో ఆసక్తికర అంశం ఏమిటంటే.. అతడు తన ప్రేయసి కోసం ఏకంగా రూ.3 కోట్ల విలువైన ఇల్లు నిర్మించడం. అంతేకాకుండా, …
Read More »‘2000 నోట్లు’ దాచేశారు.. లెక్కలు తీస్తున్న ఐటీ!
దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగి ఈ ఏడాది జూన్ – జూలై నాటికి.. తొమ్మిదేళ్లు అవుతుంది. అవినీతి, అక్రమాలు, లంచాలు, ఎన్నికల్లో ఓటర్ల కొనుగోలు ప్రక్రియలు వంటివాటికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో 2016 లో మోడీ ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత.. వాటి స్థానంలో మరింత పెద్ద నోట్లను తీసుకు వచ్చారు. అదే 2000 నోటు. వీటిపై తీవ్ర విమర్శలు రావడంతోపాటు.. అవినీతిమరింత పెరిగిందన్న నిఘా విభాగాల …
Read More »బ్రెజిల్లో రూ.40 కోట్లకు ఒంగోలు ఆవు
బ్రెజిల్లో జరిగిన ఓ అద్భుతమైన వేలం బహుళ దేశాల్లో చర్చనీయాంశమైంది. వేలంలో భారతీయ మూలాలున్న నెల్లూరు జాతికి చెందిన ఓ ఆవు ఊహించని రీతిలో అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. మినాస్ గెరైస్లో నిర్వహించిన ఈ వేలంలో, వియాటినా-19 అనే ఆవును ఏకంగా 4.8 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.40 కోట్లు) ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ ఘనతతో ఈ ఆవు గిన్నిస్ రికార్డుల పుటల్లో చోటు సంపాదించింది. వియాటినా-19 …
Read More »భారత అక్రమ వలసదారులకు అమెరికా హెచ్చరిక
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో భారతీయులను సైతం డిపోర్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా, తాజాగా అమెరికా రాయబారి ప్రతినిధి దీనిపై స్పష్టతనిచ్చారు. అక్రమ వలసలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేస్తోందని, దేశ సరిహద్దులను పటిష్టం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇకపై అమెరికాలో అక్రమంగా నివసించాలనుకోవడం ఎంతో ప్రమాదకరమని, అలాంటి వ్యక్తులను వెంటనే బయటకు పంపించే ప్రక్రియ …
Read More »గజదొంగ ప్రభాకర్ లైఫ్ స్టైల్ తెలిస్తే నోటమాట రాదంతే
బత్తుల ప్రభాకర్.. శనివారం రాత్రికి ముందు వరకు కూడా పోలీసు రికార్డుల్లో మాత్రమే ఫేమస్. ఎప్పుడైతే ప్రిజం పబ్ లో కాల్పులకు తెగబడ్డాడో.. ఒక్కసారిగా అందరి చూపు అతడి మీద పడింది. అతడి క్రిమినల్ హిస్టరీ గురించి ఆరా తీసిన పోలీసులు మొదలు.. అతడి గురించి వివరాలు తెలిస్తే కొద్దీ నోట మాట రాలేదంతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో 80కు పైగా కేసులు.. తప్పించుకొని తిరుగుతూ.. పోలీసులకు సైతం సవాలుగా …
Read More »మిస్టరీ స్పిన్ తో హిస్టరీ
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేలా తన మిస్టరీ స్పిన్ తో మాయ చేశాడు. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో మొత్తం 14 వికెట్లు తీసిన అతను, ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా చరిత్రకెక్కాడు. చివరి మ్యాచ్లో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో, …
Read More »భారతీయ రైల్వే సూపర్ యాప్… ఇది కదా కావాల్సింది!
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్ (SwaRail Superapp)’ పేరిట తీసుకురావబడిన ఈ యాప్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండడంతో సాధారణ వినియోగదారులు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుండదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లలో కేవలం వెయ్యిమందికి మాత్రమే టెస్టింగ్ కోసం అవకాశం కల్పించారు. ఈ యాప్ …
Read More »ఆ చేప రేటు 3.95 లక్షలు.. ఎందుకంటే…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో భారీ డిమాండ్ను సృష్టించింది. స్థానికంగా కుంభాభిషేకం రేవులో విక్రయించగా, ఓ వ్యాపారి దాన్ని ఏకంగా రూ. 3.95 లక్షలకు కొనుగోలు చేశాడు. సాధారణంగా పులస చేపకు ఎంత డిమాండ్ ఉంటుందో, ఆ స్థాయికన్నా ఎక్కువగా కచిడి చేపకు ఆదరణ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ చేప ప్రత్యేకత ఏమిటంటే, …
Read More »