Trends

ఒలా ఇంజనీర్.. 28 పేజీల సూసైడ్ నోట్‌

బెంగళూరులో ఒలా ఎలక్ట్రిక్‌లో పనిచేస్తున్న కె. అరవింద్ (38) అనే ఇంజనీర్ ఆత్మహత్య కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అరవింద్ చనిపోయే ముందు రాసిన 28 పేజీల సూసైడ్ నోట్‌లో, ఒలా ఫౌండర్ భావిష్ అగర్వాల్‌తో సహా తన ఉన్నతాధికారులు తనను మానసికంగా హింసించారని, డబ్బు విషయంలో దోచుకున్నారని ఆరోపించారు. దీంతో, కంపెనీలో హరాస్‌మెంట్ వల్లే తన సోదరుడు చనిపోయాడని అరవింద్ సోదరుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు అగర్వాల్‌తో పాటు …

Read More »

నిజామాబాద్‌లో ఎన్‌కౌంట‌ర్‌: రియాజ్ హ‌తం

తెలంగాణ‌లో దీపావ‌ళి వేళ తీవ్ర సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిజామాబాద్‌లో పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో కానిస్టేబుల్‌ను హ‌త్య చేసిన నిందితుడు రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. ఆత్మ ర‌క్ష‌ణ కోసం పోలీసులు ఈ కాల్పులు జ‌రిపినట్టు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి చెప్పారు. ఎన్ కౌంట‌ర్ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తం గా సంచ‌ల‌నం సృష్టించిన నేప‌థ్యంలో డీజీపీ స్పందించారు. నిజామాబాద్‌లోని ఆసుప‌త్రిలో రియాజ్‌ను వైద్య ప‌రీక్ష‌ల కోసం తీసుకువెళ్లామ‌న్నారు. అయితే.. …

Read More »

కొత్త మ్యాక్‌బుక్ ప్రో M5 ఎలా ఉందంటే..

యాపిల్ లేటెస్ట్ గా విడుదల చేసిన M5 మ్యాక్‌బుక్ ప్రో ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ కొత్త 14 అంగుళాల మోడల్, ఆన్ డివైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పనితీరును పెంచడానికి రూపొందించబడింది. ఇది గత సంవత్సరం వచ్చిన M4 మ్యాక్‌బుక్ ప్రోకు ఎంతవరకు అప్‌గ్రేడ్‌గా ఉంది, డిజైన్‌లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది. రెండు చిప్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసం AI …

Read More »

భారత పాస్‌పోర్ట్‌ డౌన్: ర్యాంక్ ఎంతంటే?

ప్రపంచంలోని పాస్‌పోర్ట్‌ల బలాన్ని కొలిచే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్స్‌లో భారత్ డౌన్ అయ్యింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది ఒక దేశ పౌరులు తమ సాధారణ పాస్‌పోర్ట్‌తో ఎంత స్వేచ్ఛగా ప్రపంచ దేశాలకు ప్రయాణించవచ్చో తెలియజేసే గ్లోబల్ ర్యాంకింగ్. ఇక గత ఏడాది 80వ స్థానంలో ఉన్న భారత పాస్‌పోర్ట్, ఈసారి ఏకంగా 5 స్థానాలు తగ్గి 85వ ర్యాంక్‌కు పడిపోయింది. భారతీయ పౌరులు ఇకపై వీసా …

Read More »

టీమ్ ఇండియా ఫాస్టెస్ట్ పేసర్స్.. ఏమైపోతున్నారు?

ప్రస్తుతం భారత జట్టులో బుమ్రా ఒక్కడే ప్రధాన బౌలర్ గా ఉన్నాడు. అతను గాయంతో గ్యాప్ ఇస్తే ఆ రేంజ్ లో భర్తీ చేసే బౌలర్ లేడు అనేది వాస్తవం. అర్షదీప్ ఉన్నా కూడా ఇంకా అతనికి అనుభవం రావాల్సి ఉంది. ఇక హర్షిత్ రానాను లక్కు మీద ఆడించడమే సరిపోతుంది. ఇక సిరాజ్ కూడా బుమ్రా రేంజ్ లో క్లిక్ కాలేదు. ముఖ్యంగా 150 స్పీడ్ తో అదరగొట్టే …

Read More »

స్వామీజీ కోసం కిడ్నీలు ఇస్తామంటున్న సెలబ్రెటీలు

​రాధాకృష్ణుల భక్తితో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శిష్యులను సంపాదించుకున్న ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌ జీ మహరాజ్‌ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఆయనకు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలియడంతో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోనే కాకుండా అంతటా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆయనకు తమ కిడ్నీలు దానం చేస్తామని పలువురు సెలబ్రెటీలు, సాధారణ భక్తులు ముందుకు రావడం వలన ఆయన పేరు …

Read More »

RCBతో కోహ్లీ ఆ కాంట్రాక్ట్ రద్దు… అసలు కథేంటి?

టీమిండియా కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి తప్పుకోబోతున్నారనే పుకార్లు ఈమధ్య క్రికెట్ ప్రపంచాన్ని ఉపేశాయి. ఈ రూమర్లకు కారణం, కోహ్లీ తన ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఉన్న ఒక కమర్షియల్ డీల్‌ను రిన్యూ చేయడానికి నిరాకరించడమే. ఈ వార్త రాగానే 2008 నుంచి ఆర్‌సీబీకి ఆడుతున్న ఈ లెజెండ్ ఐపీఎల్‌కు వీడ్కోలు చెబుతున్నారేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  ఇక ఆకాష్ …

Read More »

అక్కడ అంత్యక్రియల ఖర్చు రూ.4.15 కోట్లు.. అందుకే చేయకుండా..

చనిపోయిన వారిని భూమిలో పూడ్చడం లేదా దహనం చేయడం ప్రపంచమంతా పాటించే సంప్రదాయం. కానీ ఇండోనేషియాలోని ఒక తెగ మాత్రం ఈ సంప్రదాయాలకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది. ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్‌లో ఉన్న తొరాజా జాతి ప్రజలు చనిపోయిన వారిని తమ ఇంట్లోనే ఉంచుతారు, వారి మధ్యే జీవిస్తారు. ఈ విచిత్ర సంస్కృతి బయటివారికి వింతగా అనిపించినా, తమ దృష్టిలో మరణం అనేది ఒక గొప్ప ప్రయాణంలో మరో …

Read More »

“ఆ ఎలుకలు మా పెట్స్”: రెస్టారెంట్‌ ఓనర్ షాకింగ్ ఆన్సర్

మధ్యప్రదేశ్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు చేసిన తనిఖీల్లో వెలుగు చూసిన విషయాలు విని కళ్లు తేలేయాల్సిందే. అక్కడ వంటగదిలో కారుతున్న నూనె మరకలు, తెరిచి ఉంచిన ఆహారంపై వాలిన ఈగలు, పెరుగులో ఈదుతున్న కీటకాలు అధికారులను షాక్ అయ్యేలా చేశాయి. ఇంతటి అపరిశుభ్రతతో కూడిన ఆ కిచెన్‌లోకి అడుగు పెట్టిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు, ఏకంగా అక్కడ హాయిగా సంచరిస్తున్న ఎలుకలు కనిపించాయి. అక్కడ కనిపించిన ఎలుకల గురించి ఫుడ్ …

Read More »

బందీగా 738 రోజులు.. యుద్ధం దాటి వచ్చిన ప్రేమలు

​ప్రేమకు యుద్ధం కూడా అడ్డు కాదని చెప్పడానికి ఈ కథే ఒక నిదర్శనం. ఇజ్రాయెల్ జంట నోవా అర్గామణి, అవినాతన్ ఓర్‌ల కలయిక ప్రపంచాన్ని కదిలించింది. హమాస్ చెరలో సరిగ్గా 738 రోజులు (రెండు సంవత్సరాలు) బందీగా ఉన్న ఓర్‌.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా విడుదలైన 20 మందిలో ఒకరు. రయీమ్ క్రాసింగ్‌లో ఓర్‌ తన గదిలోకి అడుగు పెట్టగానే, గత ఏడాదే రెస్క్యూ …

Read More »

రోహిత్, కోహ్లీ వరల్డ్ కప్ కు ఉంటారా? గంభీర్ స్ట్రెయిట్ ఆన్సర్!

Kohli and Rohit Sharma

మొత్తానికి చాలా కాలం తరువాత టీమిండియా టెస్ట్ సీరీస్ లో క్లీన్ స్వీప్ విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-0తో గెలవడంతో కోచ్ గంభీర్ మరోసారి హైలెట్ అయ్యాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న ఏమిటంటే, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తు ఏంటి? ముఖ్యంగా, 2027 వన్డే వరల్డ్ కప్‌లో వారు జట్టు ప్లాన్స్‌లో ఉంటారా లేదా …

Read More »

రెండు ‘యాప్‌’లు.. బోలెడు అద్భుతాలు!

తెలివి ఎవరి సొంతం కాదు అన్నట్టుగా మన వారిలోనూ మంచి మంచి ఆలోచనలు ఉండడంతో పాటు దేశాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఆలోచనలు చేయగల యువత ఉన్నారని మరోసారి నిరూపితం అవుతుంది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు సృష్టించిన రెండు యాప్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచడంతోపాటు చర్చకు కూడా దారితీసాయి. ఇటీవల సుప్రీంకోర్టు సైతం కీలకమైన ‘అర‌ట్టై’ యాప్‌ను ప్రమోట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించింది. నిజానికి సుప్రీంకోర్టు ఎప్పుడు …

Read More »