ఆంధ్రప్రదేశ్ వాసులకు వర్షాల పరీక్ష ఇంకా పూర్తికాలేదట. బంగాళాఖాతం మీద వరుస అల్పపీడనాలు ఏర్పడటంతో రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు ప్రవేశించిన తొలి రెండు నెలల్లో పెద్దగా వర్షాలు రాకపోయినా, ఆ లోటు ఆగస్టులో పూడ్చాయి. ఇప్పుడు సెప్టెంబరులోనూ అదే ధోరణి కనిపిస్తోందని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇటీవల విశాఖపట్నం పరిసరాల్లో ఏర్పడిన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో భారీ …
Read More »స్పర్శ తెలియక పాము కాటుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
బెంగళూరులో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన అందరినీ షాక్కు గురి చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న 41 ఏళ్ల మన్జు ప్రకాశ్ తన ఇంటి వద్ద చెప్పులు వేసుకునే క్రమంలో పాముకాటు బారిన పడ్డాడు. అయితే అతనికి కాలి స్పర్శజ్ఞానం లేకపోవడంతో ప్రమాదాన్ని గుర్తించలేకపోయాడు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశ్ టీసీఎస్లో పని చేస్తున్నాడు. ఆ రోజు ఇంటికి వచ్చి చెప్పులు (crocs) బయటే ఉంచి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు. …
Read More »భారత్ తో చైనా – రష్యా.. అమెరికాకు దెబ్బె…
ప్రపంచ రాజకీయాల్లో శక్తి సమీకరణం మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తియాన్జిన్లో జరగబోతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశంలో భారత్, చైనా, రష్యా నాయకులు ఒకే వేదికపైకి రావడం అమెరికాకు పెద్ద సవాల్గా మారింది. ట్రంప్ సుంకాల దాడులు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఈ ముగ్గురి భేటీ ప్రాధాన్యం మరింత పెరిగింది. ఒక్కో దేశం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, బహుళ ధ్రువ ప్రపంచం కోసం కలిసి నిలబడుతున్నాయన్నది …
Read More »ఐఫోన్ 17 సిరీస్ ధరలు.. ఏ స్థాయిలో ఉంటాయంటే?
ప్రతి ఏడాది యాపిల్ కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ చేస్తే టెక్ ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఈసారి కూడా అదే పరిస్థితి. సెప్టెంబర్ 9న జరగబోయే యాపిల్ బిగ్ ఈవెంట్లో ఐఫోన్ 17 సిరీస్ను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. అయితే, ఈసారి ఫోన్లలో భారీ అప్గ్రేడ్లు రాబోతున్నాయనే కారణంగా ధరలు కూడా పెరగనున్నాయన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం, ఐఫోన్ 17 సిరీస్లో నాలుగు మోడల్స్ రాబోతున్నాయి.ఐఫోన్ …
Read More »PKL: కొత్త రూల్స్ తో కబడ్డీ.. ఈసారైనా క్లిక్కయ్యేనా?
ప్రొ కబడ్డీ లీగ్ (PKL) మొదటిసారి ప్రారంభమైనప్పుడు దేశమంతా ఫుల్ హంగామా క్రియేట్ చేసింది. టీవీ ముందు కూర్చున్నవాళ్ల నుంచి స్టేడియంల్లో కేకలు వేసినవాళ్ల వరకు అందరూ దీన్ని సెలబ్రేట్ చేశారు. కానీ కాలక్రమేణా ఈ క్రేజ్లో తగ్గుదల వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యూవర్షిప్ గణనీయంగా పడిపోయింది. ఇక నార్త్లో మాత్రం ఇంకా బాగానే ఆసక్తి కనిపిస్తోంది. ఈ సారి లీగ్ నిర్వాహకులు కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చారు. …
Read More »ట్రంప్ సీటుపై అడ్వాన్స్ ఫోకస్?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య విషయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న తరుణంలో అప్పుడే అడ్వాన్స్ గా ఫోకస్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అమెరికా రాజకీయ వాతావరణంలో కొత్త చర్చలకు కారణమయ్యేలా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాను ఎప్పుడైనా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై …
Read More »కొడుకు నిశ్చితార్థం.. రూమర్స్ కు తెరదించిన సచిన్
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగిందని ఇటివల పలు రకాల కథనాలు వైరల్ అయ్యాయి. అయితే ఇవి రూమర్స్ అని కూడా మరికొన్ని కామెంట్స్ వినిపించాయి. అయితే ఎట్టకేలకు సచిన్ అధికారికంగా ధృవీకరించారు. ఇంతకాలం ఊహాగానాలుగా మారిన ఈ విషయంపై ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ నోటి నుంచి క్లారిటీ రావడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. అర్జున్ తన స్నేహితురాలు సానియా చందోక్తో …
Read More »అమెరికాలో కొత్త బిల్లు.. గ్రీన్కార్డ్ హోల్డర్లలో ఆందోళన
అమెరికాలో వలసదారులకు షాక్ ఇస్తున్న కొత్త బిల్లు చర్చనీయాంశంగా మారింది. ఒకే ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ (DUI) కేసు ఉన్నా, అది ఏళ్ల క్రితం జరిగినదైనా, గ్రీన్కార్డ్ హోల్డర్లు లేదా వీసా కలిగిన వారిని డిపోర్ట్ చేసే అధికారం ఈ బిల్లుతో లభించనుంది. “Protect Our Communities from DUIs Act” అనే ఈ బిల్లు ఇప్పటికే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఆమోదం పొందింది. ప్రస్తుతం ఇది సెనేట్ …
Read More »పాక్ క్షేమం కోరి భారత్ హెచ్చరిక
భారత్ – పాక్ సంబంధాలు కఠినంగానే ఉన్నా, సహజ విపత్తుల సమయంలో మానవత్వం ముందు నిలబడుతుందని తాజా పరిణామం స్పష్టమైంది. జమ్మూకశ్మీర్లోని తావి నది ఉప్పొంగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా, ఆ వరద ముప్పు పాకిస్థాన్పై పడే అవకాశాన్ని గుర్తించి భారత్ ముందుగానే సమాచారం అందించింది. సింధూ నది జలాల ఒప్పందం నిలిచిపోయిన పరిస్థితుల్లోనూ, ఈ చర్య మానవతా దృష్టిలో ఒక సానుకూల సంకేతంగా …
Read More »డ్రీమ్ 11 డీల్ క్యాన్సిల్.. బీసీసీఐ ఏం చెప్పిందంటే?
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన డ్రీమ్ 11తో (Dream11) బీసీసీఐ ఒప్పందం రద్దయింది. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి గేమింగ్ కంపెనీలతో ఒప్పందాలు ఉండబోవని ఆయన ప్రకటించారు. దీంతో ఆసియా కప్ ప్రారంభానికి కొన్ని రోజులు ముందే స్పాన్సర్ ఖాళీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ సన్నిహిత …
Read More »వాట్సాప్-ఈమెయిల్లో తిడితే.. ఆ చట్టం వర్తించదు!
తిట్లు, బెదిరింపులు.. ఇప్పుడు నేరుగానే కాదు.. సోషల్ మీడియాలోనూ.. వస్తున్నాయి. గిట్టని వారిని తిట్టడం, బెదిరింపులకు దిగడం కోసం చాలా మంది సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. అయితే .. ఇలా తిట్టినా.. బెదిరింపులకు దిగినా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వర్తించబోదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని కేసులుగా నమోదు చేయడం అంటే.. పోలీసులను తిరిగి చదువు కునేందుకు పంపించాల్సిన పరిస్థితిలో ఉన్నారని అర్ధమవుతున్నట్టేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. …
Read More »కూకట్పల్లి బాలిక హత్య: వీడిన మిస్టరీ!
హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్పల్లి బాలిక సహస్ర (10) హత్య కేసులో కీలక విషయాలను వెల్లడయ్యాయి. నిందితుడు పెద్ద వయస్కుడు లేదా ప్రొఫెషనల్ క్రిమినల్ కాదు, పదో తరగతి చదువుతున్న బాలుడే హత్య చేశాడని దర్యాప్తులో బయటపడింది. ఈ సంఘటనతో సమాజం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. కానీ ఆ సమయంలో సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉండటంతో అతడిని చూసి భయపడ్డాడు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates