Trends

అమ్ముడవని ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు

ప్రత్యర్థి ఎవరైనా సరే.. భారత జట్టు మ్యాచ్ ఆడుతోందంటే క్రికెట్ ప్రపంచమంతా అటు వైపు చూస్తుంది. ఇక ఇండియన్ ఫ్యాన్స్ అయితే ఎలా ఊగిపోతారో తెలిసిందే. అందులోనూ మల్టీ నేషన్స్ టోర్నీల్లో ఇండియా ఆడుతుంటే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ బుధవారం నాడు ఆసియా కప్ టోర్నీలో భారత తన తొలి మ్యాచ్ ఆడినట్లు చాలామంది ఇండియన్ ఫ్యాన్స్‌కు తెలియని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. మామూలుగా ఆసియా కప్‌కు అభిమానుల్లో మంచి …

Read More »

ఒకేసారి 7 వేల మంది ఖైదీలు పరారీ

నేపాల్‌లో యువత నిరసనలతో ఇప్పటికే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ కల్లోలానికి తోడు దేశంలోని జైళ్లలోనూ అల్లర్లు చెలరేగాయి. భద్రతా సిబ్బందిపై దాడులు, నిప్పు పెట్టడం, గోడలు దాటడం వంటి ఘటనల మధ్య దాదాపు ఏడు వేల మంది ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకున్నారు. దీంతో సాధారణ ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. ఖాట్మాండూ, చిట్వాన్‌, దిల్లీబజార్‌, జాలేశ్వర్‌, కైలాలీ, నక్కూ వంటి జైళ్ల నుంచి పెద్ద ఎత్తున ఖైదీలు …

Read More »

UAEని జెట్ స్పీడ్ లో మడతపెట్టేసిన టీమిండియా

ఆసియా కప్‌ 2025లో భారత్‌ దుమ్మురేపే విజయంతో ప్రారంభించింది. దుబాయ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది. మొత్తం మ్యాచ్‌ రెండు గంటలకే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ కేవలం 57 పరుగులకే కుప్పకూలగా, భారత్‌ 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. యూఏఈ ఇన్నింగ్స్‌ పవర్‌ప్లేలో కొంత మెరుగ్గా ఆడినట్లు కనిపించినా, ఆరంభం తర్వాత పూర్తిగా కుప్పకూలిపోయింది. అలీషాన్‌ షరాఫు బౌండరీలు …

Read More »

కొత్త కారుతో నిమ్మకాయ తొక్కించబోయి…

ఇదొక అరుదైన సంఘటన.. భారీ ధర పెట్టి ఒక కొత్త కారు కొని శుభప్రదమనే ఉద్దేశంతో షోరూంలో నిమ్మకాయల్ని తొక్కించబోయిన ఓ మహిళ.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కారుతో సహా వచ్చి రోడ్డు మీద పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా.. అదృష్టవశాత్తూ సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు షోరూం సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన …

Read More »

నిర‌స‌న కారుల నిప్పు: మాజీ ప్ర‌ధాని భార్య స‌జీవ ద‌హ‌నం

నేపాల్‌లో జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు తీవ్ర రూపం దాల్చాయి. సోష‌ల్ మీడియాపై విధించిన నిషేధాన్ని వ్య‌తిరేకిస్తూ.. ప్రారంభమైన ఆందోళ‌న‌లు.. స‌ద‌రు నిషేధాన్ని ఎత్తి వేసిన త‌ర్వాత కూడా కొన‌సాగ‌డ‌మే కాకుండా.. మ‌రింత పేట్రేగుతున్నాయి. సైన్యం కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్నా.. దేశ‌వ్యాప్తంగా క‌ర్ఫ్యూ విధించినా.. ఆందోళ‌న కారులు ముఖ్యంగా యువ‌త ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. తాజాగా దేశ రాజ‌ధాని ఖ‌ఠ్మండూలోని మాజీ ప్ర‌ధాన మంత్రి ఝ‌ల‌నాథ్ ఖ‌నాల్ నివాసానికి నిప్పు పెట్టారు. లీట‌ర్ల …

Read More »

అమెరికా వీసా కొత్త నియమాలు… మనకు ఇబ్బందే!

అమెరికా విదేశాంగశాఖ తాజాగా నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాలకు సంబంధించిన కఠిన నిబంధన అమలు చేసింది. ఇప్పుడు దరఖాస్తుదారులు తమ స్వదేశంలో లేదా లీగల్‌ రెసిడెన్సీ ఉన్న ప్రదేశంలోనే వీసా ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకోవాలి. ఇంతకుముందు ఉన్నట్లుగా విదేశీ దేశాల్లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే అవకాశం ఇక లేదు. ఈ మార్పు భారతీయులకు అనేక ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్‌లో వీసా ఇంటర్వ్యూలు పొందడానికి ఎక్కువ సమయం పడుతోంది. …

Read More »

GST స్లాబ్స్… ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందంటే

జీఎస్టీ స్లాబుల్లో తగ్గింపుల వలన వాహనాల మార్కెట్‌లో ఊహించని మార్పులైతే కనిపిస్తున్నాయి. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న కొత్త రేట్లతో కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. దీని కారణంగా ప్రస్తుతం షోరూంల వద్ద ఖాళీ కుర్చీలు, బోసిన షోరూం హాల్స్‌ మాత్రమే కనిపిస్తున్నాయి. వినియోగదారులు కొత్త రేట్లు అమల్లోకి వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించుకోవడంతో వాహన వ్యాపారులకు తాత్కాలికంగా భారీ దెబ్బ తగిలింది. …

Read More »

మరణం తర్వాత జీవం.. ప్రకృతి ఒప్పుకుంటుందా?

మనిషి శ్వాస ఆగిపోతే కథ ముగిసినట్టేనా? శరీరం చల్లబడిపోతే అంతేనా? వైద్యశాస్త్రం మాత్రం ఈ ప్రశ్నలకు కొత్త సమాధానాలు వెతుకుతోంది. అందుకే మృత్యువుకి తలొగ్గకుండా మళ్లీ జీవితం ఇవ్వగలమనే ఆశతో పుట్టిన విధానమే ‘క్రయోనిక్స్’. గ్రీకు భాషలో “క్రయో” అంటే చలిని సూచిస్తుంది. అంటే శరీరాన్ని గాఢ శీతల వాతావరణంలో భద్రపరచి, భవిష్యత్తులో తిరిగి ప్రాణం పోయించాలనే ప్రయత్నం. అమెరికన్ ఫిజిసిస్ట్ రాబర్ట్ ఎటింగర్ యాభై ఏళ్ల క్రితం ఈ …

Read More »

మూడో భార్య కుతంత్రం.. బావిలో శవమై తేలిన భర్త

ఈమధ్య కాలంలో భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఎంతగా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవస్రం లేదు. ఇక రీసెంట్ గా  మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లా సకారియా గ్రామంలో చోటుచేసుకున్న ఒక దారుణం అందరినీ కుదిపేసింది. భార్యతోపాటు ఆమె ప్రేమికుడు, మరో సహాయకుడు కలిసి ఓ వ్యక్తిని క్రూరంగా హత్య చేసి శవాన్ని బావిలో పడేశారు. ఆ మృతదేహాన్ని గుర్తించింది అతని రెండో భార్య కావడం విషాదాన్ని మరింత పెంచింది. 60 ఏళ్ల …

Read More »

గిల్‌కి వన్డే కెప్టెన్సీ.. మరి రోహిత్ సంగతేంటీ?

భారత క్రికెట్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ను త్వరలోనే భారత వన్డే జట్టు కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం బలంగా ఉంది. ఈ నిర్ణయంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ ప్రయాణం ముగిసే దశకు చేరుకుంటుందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా రాబోయే ఆస్ట్రేలియా పర్యటన రోహిత్‌కి చివరి సిరీస్ కావచ్చని అనేక వర్గాలు భావిస్తున్నాయి. గిల్‌ ఇప్పటికే టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టీ20లోనూ వైస్ కెప్టెన్‌గా …

Read More »

భారత ఐటీ రంగానికి ట్రంప్‌ ముప్పు.. కేంద్రం ఏమంటోందంటే..

భారత్‌ ఐటీ రంగం విలువ దాదాపు 300 బిలియన్ డాలర్లు. 5.6 మిలియన్ల మందికి పైగా ఉద్యోగాలు ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నాయి. అమెరికాలో ట్రంప్‌ సర్కారు ఔట్‌సోర్సింగ్‌ సేవలపై టారిఫ్‌లు విధించవచ్చనే ప్రచారం వ్యాపిస్తోన్న వేళ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టంగా స్పందించారు. ఐటీ రంగాన్ని కాపాడేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. భారత ఐటీ సేవల రంగం దేశానికి పెద్ద ఎత్తున ఎగుమతి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. …

Read More »

బీసీసీఐ ఖజానా: ఎన్ని వేలకోట్లో తెలుసా?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతోంది. 2019లో బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.6,000 కోట్ల నిధి.. ఐదు సంవత్సరాల్లో మూడింతలు పెరిగి రూ.20,686 కోట్లకు చేరింది. క్రికెట్ ఆడకపోయినా, క్రికెట్ చుట్టూ తిరిగే వ్యాపారాలు బీసీసీఐని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బోర్డు 1,623 కోట్ల లాభం ఆర్జించింది. ఇది ముందు లాభం అయిన 1,167 కోట్లతో పోలిస్తే గణనీయమైన …

Read More »