Trends

50 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి అయిన ప్రభుదేవా

నృత్యదర్శకుడిగా పరిచయం అయి.. ఆపై నటుడిగా మారి.. చివరగా దర్శకుడు కూడా అయ్యాడు ప్రభుదేవా. అన్ని రకాలుగానూ అతను ప్రతిభ చాటుకున్నాడు. ప్రస్తుతం అతను నటుడిగా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూనే.. డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. అడపాదడపా కొన్ని పాటలకు నృత్యరీతులూ సమకూరుస్తున్నాడు. ప్రభుదేవా సినీ జీవితం ఎంత ఆసక్తికరమో.. వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తన మొదటి భార్య రమలతకు దూరమై.. నయనతారతో ప్రేమలో …

Read More »

కెనడాలో ఇందిర హత్యపై సంబరాలు.. ఇదేం ఆరాచకం?

ఒక దేశ ప్రధానిని దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ప్రదర్శిస్తూ.. దానికి ప్రతీకారం పేరుతో మరో దేశంలో ర్యాలీ నిర్వహించి.. సంబరాలు చేస్తే దాన్నేమనాలి? ఎలా రియాక్టు కావాలి? హింసను ప్రోత్సహించే వారు.. ఆరాచకాలకు మద్దతు పలికే వారు ఎవరైనా సరే.. తీవ్రంగా ఖండించాల్సిందే. అలాంటి వారిని ఏ మాత్రం ఉపేక్షించకూడదు. కెనడాలో చోటు చేసుకున్న ఒక ఆరాచక ఉదంతం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. దీని వివరాలు తెలిసినంతనే …

Read More »

16 వేల గుండె ఆపరేషన్లు చేసి, గుండె పోటు తో మృతి

ఆయ‌న యువ డాక్ట‌ర్‌. ప‌ట్టుమ‌ని నాలుగు ప‌దుల వ‌య‌సు పూర్తిగా నిండ‌నేలేదు. కానీ, ఆయ‌న ఈ దేశానికి ఎంతో మేలు చేశాడు. ఎక్క‌డ నుంచి ఎవ‌రు వ‌చ్చినా.. నాడి ప‌ట్టుకుని గుండె చ‌ప్పుడును లెక్క‌గ‌ట్టేవారు. ఈ క్ర‌మంలో కొన్ని వేల గుండెల చ‌ప్పుళ్లు విని.. ఆగిపోతున్న వాటికి ఊపిరి ఇచ్చి.. చ‌ప్పుడు చేసేలా ప్రాణాలు పోశాడు. కానీ… విధి బ‌లీయం. ఇన్ని వేల మంది గుండెల‌ను ఆగ‌కుండా చేసిన ఆయ‌న …

Read More »

ఒడిషా విషాదం.. కేటుగాళ్లు తయార్

ఒక పెద్ద ప్రమాదం, దాంతో పాటే విషాదం చోటు చేసుకున్నపుడు మానవత్వంతో స్పందించే వాళ్లు ఒకవైపు ఉంటే.. ఆ సమయంలోనూ దుర్మార్గంగా ఆలోచించి ప్రయోజనం పొందాలని చూసేవాళ్లు ఇంకోవైపు ఉంటారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటనదగ్గది ఇటీవల ఒడిషాలో చోటు చేసుకుంది. మూడు రైళ్లు ఒకదాంతో ఒకటి ఢీకొట్టిన ఈ ప్రమాదంలో దాదాపు మూడొందల మందిదాకా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఐతే …

Read More »

ఇవేం హత్యలు? ప్రియుడితో కలిసి మరో ప్రియుడ్ని లేపేసింది

మారుతున్న కాలానికి తగ్గట్లు చోటు చేసుకుంటున్న దారుణ హత్యల వివరాలు తెలిస్తే నోట వెంట మాట రాని పరిస్థితి. బంధాలు.. అనుబంధాల మీద కొత్త సందేహాలు పుట్టుకొచ్చేలా ఉంటున్న ఈ దారుణాల వివరాలు తెలిసినంతనే నోట మాట రాలేని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం పాతబస్తీలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో డెడ్ …

Read More »

ఒడిశా ఘోరంలో కరెంటు షాక్ తోనే 40 మంది చనిపోయారట

వందల మంది ప్రాణాల్ని తీసిన ఒడిశా విషాదానికి సంబంధించిన మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ ఘోర ఘటనలో మొత్తం 278 మంది మరణించగా.. అందులో 40 మంది కేవలం కరెంట్ షాక్ తో మరణించినట్లుగా అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు …

Read More »

షాకిచ్చే రిపోర్టు: గుండెపోటు ముప్పు ఆ రోజే ఎక్కువట

కరోనా ముందుకు భిన్నంగా మహమ్మారి తర్వాత నుంచి వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు ఎక్కువ కావటం.. అప్పటివరకు బాగా ఉన్నవారు.. అమాంతం మరణిస్తున్న ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ కావటం తెలిసిందే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా.. అప్పటివరకు అందరితో హ్యాపీగా ఉండి.. ఉన్నట్లుండి చోటుచేసుకునే కార్డిక్ అరెస్టుతో ప్రాణాలు విడుస్తున్న వైనాలకు సంబంధించిన వీడియోలు తెగ భయాన్ని.. కొత్త ఆందోళనను గురి చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? …

Read More »

రైలు ప్రమాదం.. చావు నుంచి తప్పించుకున్నవారు ఏం చెప్పారంటే..

దేశ చరిత్రలో ఘోర రైలు ప్రమాదంగా అభివర్ణిస్తున్న ఒడిశా దుర్ఘటనలో ఇప్పటివరకు 388 మంది మరణించగా.. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఒకేసారి.. ఒకే ప్రాంతంలో సెకన్ల వ్యవధిలో రెండు రైళ్లు ప్రమాదానికి గురి కావటం ఒక షాకింగ్ ఉదంతంగా చెప్పాలి. శుక్రవారం రాత్రి వేళలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో చావు ముంగిట వరకు వెళ్లి వచ్చిన ఒక కుటుంబం ఎలాంటి నష్టం జరగకుండా క్షేమంగా బయటపడింది. హావ్ డాకు …

Read More »

లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు

NRI TDP UK Team సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అంబరాన్ని ఆంటేలా అన్నగారి శతజయంతి సంబరాలు అన్నగారి జీవిత విశేషాలతో ఆహతుల్ని ఆకట్టుకున్నాయి..ఈ సందర్బంగా అన్నగారి విగ్రహావిష్కరణ మరియు 100 చదరపు అడుగుల కేక్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వినాయక శ్లోకంతో మొదలయిన కార్యక్రమం, అన్నగారితో అనుబంధం ఉండి పెద్దయనతో కలిసి పనిచేసిన లండన్ సీనియర డాక్టర్లు జ్యోతి ప్రజ్వలన …

Read More »

రైలు ప్ర‌మాదం.. నివేదిక‌ను ఇచ్చిన‌ట్టే ఇచ్చి దాచేశారుగా!

దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపిన ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై నిపుణుల బృందం చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పొరపాటుగా సిగ్నల్ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందని ప్రాథమిక రిపోర్ట్ తేల్చింది. ఈ మానవతప్పిదం కారణంగానే గూడ్స్ ట్రైన్ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశించిందని, 3 రైళ్లు ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని సీనియర్ అధికారులతో కూడిన నిపుణుల బృందం తేల్చిందని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. మరోవైపు ప్రమాదం …

Read More »

ప్రజలకు సీరియస్ సలహా ఇచ్చిన కేంద్ర మంత్రి

సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. కీలక సూచన చేశారు కేంద్ర టెలికం శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్. మొబైల్ ఫోన్లకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను అస్సలు ఎత్తొద్దని.. తెలిసిన నంబర్లకు మాత్రమే స్పందించాలని కోరారు. ఇటీవల కాలంలో టెలికం శాఖ తీసుకున్న చర్యలతో స్పామ్ కాల్స్.. సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు తగ్గినట్లుగా చెప్పిన ఆయన తాను చేసిన సూచనను సీరియస్ …

Read More »

ఇంతకు మించిన మానవత్వం ఇంకేంటి?

ఈ ఫోటోను చూసినంతనే.. ఒడిశా రైలు ప్రమాద వేళ.. తమ వారికి ఏమైందన్న ఆందోళనలో వెయిట్ చేస్తున్న వారిలా అనుకోవచ్చు. కానీ.. అది నిజం కాదు. వారంతా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు అవసరమైన రక్తాన్ని ఇచ్చేందుకు స్థానిక యువకులు క్యూ కట్టటమే కాదు.. గంటల కొద్దీ వెయిట్ చేయటం ద్వారా.. వావ్ ఒడిశా అనేలా చేశారు. నెమ్మదస్తులుగా.. వినయ విధేయతలతో ఉంటారన్న పేరు ఒడిశా ప్రజలకు ఉంటుంది. …

Read More »